Missing AirAsia plane
-
పిడుగులు పడటం వల్లే విమానం కూలింది?
జకర్తా: ఇండోనేసియా విమానం అదృశ్య ఘటనపై అన్వేషణ కొనసాగుతోంది. విమానం వెళ్లే మార్గంలో పిడుగులు పడటం వల్లే కూలిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. విమానం సముద్రంలో కూలిపోయి ఉండొచ్చని, విమాన శకలాలు సముద్రం అడుగు భాగాన పడి ఉండొచ్చని భావిస్తున్నారు. విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వైమానిక, నౌకా దళాల సాయంతో గాలిస్తున్నారు. ఇండోనేసియాతో పాటు ఆస్ట్రేలియా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. ఇండోనేసియా నుంచి ఆదివారం ఉదయం సింగపూర్కు బయల్దేరిన ఎయిర్ఆసియా విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 162 మంది ఉండగా.. వారిలో 149 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బంది ఇండోనేసియా వారే. -
'ఎయిర్ ఏషియా విమానం కూలిపోయి ఉండొచ్చు'
జకర్తా: కొత్త ఏడాది ముందు మరో ఘోర విషాదకర సంఘటన! అదృశ్యమైన ఎయిర్ ఏషియా ఏషియా విమానం కూలిపోయి ఉండొచ్చని ఇండోనేసియా ఉపాధ్యక్షుడు జుసఫ్ ఖల్లా చెప్పారు. ఆదివారం ఉదయం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం గాలింపు చర్యలకు ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జుసఫ్ ఖల్లా మాట్లాడుతూ.. విమానం కూలిపోయి ఉండొచ్చని, అయితే ఎక్కడ కూలిపోయిందన్న విషయం గురించి తన వద్ద సమాచారం లేదని చెప్పారు. విమానం కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఈ రోజు సాయంత్రం ఆపివేశారు. సోమవారం ఉదయం నుంచి మళ్లీ మొదలుపెడతారు. ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం-క్యూజెడ్8501 గగన తలం నుంచి అదృశ్యమైంది. 162 మందితో సురబయా నుంచి సింగపూర్ బయలుదేరిన విమానంతో కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఆదివారం ఉదయం 7.24 గంటలకు(స్థానిక కాలమానం) జకర్తా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. ఇదిలావుండగా, భారత్కు వెళ్లే విమాన సర్వీసులు షెడ్యూల్ ప్రకారం వెళతాయని ఎయిర్ ఏషియా యాజమాన్యం పేర్కొంది. విమానం అదృశ్యమైన ఘటన, భారత్కు వెళ్లే విమాన సర్వీసులపై ప్రభావం చూపబోదని చెప్పారు.