mori
-
ఆరంభ శూరత్వమే తప్ప అభివృద్ధి లేదు
-
వినూత్న రీతిలో మానవ, సహజ వనరుల వినియోగం
కాకినాడ సిటీ : సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో వినూత్న రీతిలో మానవ వనరులను, సహజ వనరులను వినియోగించామని కలెక్టర్ అరుణ్కుమార్ పేర్కొన్నారు. స్మార్ట్ గ్రామాల రూపకల్పనపై బుధవారం విజయవాడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించారు. మోరిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఇతర జిల్లాల కలెక్టర్లకు కలెక్టర్ వివరించారు. గ్రామంలో అన్ని కుటుంబాలకు ఫైబర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ అక్షరాస్యత కల్పించామన్నారు.పారిశుద్ధ్యం మెరుగుపర్చడం కోసం అన్ని గృహాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం, వ్యర్థ పదార్థాల సద్వినియోగం, ఆక్వాకల్చర్, వ్యవసాయం, జీడిపప్పు, చేనేత మగ్గాల వినియోగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి ఉత్పత్తులు పెంచామన్నారు. టక్కర్ మాట్లాడుతూ మోరి తరహాలో రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లోని 456 గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా రూపొందించనున్నట్టు తెలిపారు. డీఆర్డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, ఇ¯ŒSచార్జి డీపీఓ కుమార్ పాల్గొన్నారు. మార్చి 15కి పూర్తి చేయాలి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో మార్చి 15వ తేదీ నాటికి ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కోర్టు హాలులో డివిజనల్ పంచాయతీ అధికారులు, ఈఓపీఆర్డీలతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పన్నుల వసూలు, పారిశుద్ధ్యం, మీసేవా ద్వారా ఆ¯ŒSలై¯ŒS పౌరసేవల కల్పన, న్యూట్రీ గార్డె¯ŒSల అభివృద్ధిపై ఆదేశాలు జారీచేశారు. కాతేరు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, స్వాహాలకు పాల్పడిన స్పెషల్ ఆఫీసర్, కార్యదర్శులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని తొలగించాలని డీపీఓను ఆదేశించారు. పంచాయతీలలో ఇప్పటి వరకూ 19 శాతం ఆస్తి పన్ను వసూళ్లు జరిగాయని, వచ్చే నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. జిల్లా, మండల స్థాయిలో అమలవుతున్న ఈ ఆఫీస్ వ్యవస్థను గ్రామ పంచాయతీ స్థాయికి విస్తరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. డీపీఓ టీవీఎస్ గంగాధరకుమార్, డివిజ¯ŒS పంచాయతీ అధికారులు శర్మ, నాగలక్ష్మి, వరప్రసాద్, ఈఓఆర్డీలు పాల్గొన్నారు. -
‘బాబూ’ ఇదేమి ద్వంద్వ నీతి
‘మోరి’ సభకు విద్యాసంస్థల బస్సులు యువభేరికి బస్సులు పంపితే నోటీసులా కాకినాడ, సాక్షి ప్రతినిధి : ‘గురివింద తన నలుపెరగదన్న’ సామెత చందంగా ఉంది చంద్రబాబు సర్కార్ నీతి. తన సొంత సభలకు విద్యార్థులను పెద్ద ఎత్తున తరలించడం..విద్యా సంస్థలకు చెందిన బస్సులను య«థేచ్ఛగా వాడుకోవడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. ఇదే సమయంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం, విద్యార్థుల ఉజ్వల భవిత కోసం ప్రతి పక్షనేత నిర్వహించిన యువభేరి సదస్సుకు ఒక గంటపాటు విద్యార్థులు వెళ్లడం..బస్సులను అద్దెకు తీసుకోవడాన్ని మాత్రం తప్పుపడుతూ విద్యా సంస్థలకు నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా మారింది. ఇటీవల విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగ¯ŒSమోహ¯ŒS రెడ్డి నిర్వహించిన యువభేరికి విద్యార్థులు కళాశాల బస్సుల్లో పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కన్నుకుట్టిన చంద్రబాబు ఆయా కాలేజీల యాజమాన్యాలకు నోటీసులు ఇప్పించడం పట్ల ప్రజా స్వామ్యవాదులు ముక్కున వేలేసుకున్నారు. మరి దీనికేమంటారో... విజయనగరంలో యువభేరికి వచ్చిన కళాశాల బస్సులకు నోటీసులు ఇప్పించిన చంద్రబాబు మరి గురువారం జిల్లాలో మోరి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద కసరత్తే చేశారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సుల్లో తాను నిర్వహించే బహిరంగ సభకు జనాన్ని, ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలను తరలించేందుకు వినియోగించారు. రాజోలు, మలికిపురం, మామిడికుదురు, పి.గన్నవరం సహా కోనసీమలోని పలు మండలాల నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన బస్సుల్లో జనాన్ని తరలించారు. ఇందుకోసం ఆయా విద్యాసంస్థల యాజమాన్యంపై పలు శాఖల అధికారుల ద్వారా పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ ఏడాది రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించిన పలు సందర్భాలలో స్కూళ్లు బస్సులను వినియోగించారు. అటువంటిది ఈ నెలలో విజయనగరంలో జరిగిన యువభేరి సదస్సుకు కళాశాలలకు విద్యార్థులు స్వచ్ఛందంగా వెళ్లడాన్ని బాబు ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది.