mp nandi yellaiah
-
ఎస్సీ వర్గీకరణ చేపట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు వీలుగా బడ్జెట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈమేరకు ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక వినతిపత్రం ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు వీలుగా జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన నివేదిక కేంద్ర కేబినెట్ వద్ద 9 ఏళ్లుగా పెండింగ్లో ఉందని గుర్తుచేశారు. అలాగే కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష గోయల్కు నంది ఎల్లయ్య మరో వినతిపత్రం ఇచ్చారు. గద్వాల–మాచర్ల రైల్వే లైన్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా నిర్మించాలని విజ్ఞప్తిచేశారు. వెనుకబడిన ప్రాంతాలైన నాగర్కర్నూలు, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేటలకు ఈ లైను ఉపయోగపడుతుందని గుర్తుచేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్కు నంది ఎల్లయ్య మరో విజ్ఞాపన పత్రం ఇచ్చారు. నాగర్కర్నూలు నియోజకవర్గ పరిధిలో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా వెనుకబడిన ప్రాంత నిరుపేద చిన్నారులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే కేంద్రీయ విద్యాలయ సీట్లలో ఎంపీ కోటాను 10 సీట్ల నుంచి 20 సీట్లకు పెంచాలని కోరారు. -
వర్గీకరణ కోసం మాదిగల ఎదురుచూపు
► ఎమ్మార్పీఎస్ దీక్షా శిబిరంలో ఎంపీ నంది ఎల్లయ్య న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాదిగ పల్లెలు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నాయని, మాదిగల ఆకాంక్షను గుర్తించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇక్కడి జంతర్మంతర్లో జరిగిన ఎమ్మార్పీఎస్ మహాదీక్ష 8వ రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ కోసం ఎలాంటి త్యాగానికైనా మాదిగ యువత సిద్ధంగా ఉన్నదని తెలిపారు. 2014లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పుడు మాదిగలు వర్గీకరణ ఫలాలు అనుభవిస్తుండేవారన్నారు. మాదిగజాతి ఆత్మగౌరవ చిహ్నంగా మంద కృష్ణ నిలిచారన్నారు. ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ మాట్లాడుతూ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి వర్గీకరణ కోసం తపిస్తున్నానన్నారు. ఉద్యమం అంతిమదశకు చేరిందని, అందరం ఐక్యంగా ఉండి వర్గీకరణను సాధించుకోవాలని టీపీసీసీ ఎస్సీసెల్చైర్మన్ ఆరేపల్లి మోహన్ పిలుపునిచ్చారు. 8 వరోజు దీక్షలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణతోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు పాల్గొన్నారు.