mr palli police
-
చెవిరెడ్డి ధర్నాతో దిగొచ్చిన పోలీసులు
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పోరాటం ఫలించింది. తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పల్లి పోలీస్స్టేషన్ ఎదుట బుధవారం అర్ధరాత్రి వరకు ఆయన ధర్నా చేపట్టారు. భాస్కర్రెడ్డి ధర్నాతో దిగొచ్చిన పోలీసులు నాగభూషణం, సిసింద్రీపై ఐపీసీ 323, 120 బీ, ఐపీసీ రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన మీద దాడికి టీడీపీ నాయకులు కుట్ర చేయడం దారుణమని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరి డ్రైవర్లకి ఉద్యోగం ఇచ్చి నెల రోజులు అన్నం పెట్టానని.. తాను పెట్టిన అన్నం తిన్నవారే తనపై రెక్కీ నిర్వహించడం బాధకరమన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినందునే దాడి.. నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం పసుపు–కుంకుమ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్ కట్ చేయించారు. అధికారులు వారిస్తున్నా వినకుండా చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డికి పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, మహిళలపై రాళ్లు, కారం పొడి, స్వీట్ ప్యాకెట్లతో దాడి చేశారు. దాడిలో ఎమ్మెల్యేతో పాటు తిరుపతి వెస్ట్ డీఎస్పీ, ఎంఆర్ పల్లి సీఐ, ముగ్గురు మహిళలకు గాయాలు అయ్యాయి. పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సృహతప్పి కింద పడ్డారు. (చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై టీడీపీ నేతల రెక్కీ) -
చెవిరెడ్డికి రిమాండ్, కడప జైలుకు తరలింపు
-
చెవిరెడ్డికి రిమాండ్, కడప జైలుకు తరలింపు
చిత్తూరు : సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా 2013లో రామచంద్రాపురం మండలం అనుప్పల్లి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఎన్నికల నియామావళి ఉల్లంఘనగా పరిగణించి అప్పట్లో పోలీసులు చెవిరెడ్డిపై కేసు నమోదు చేశారు. రామచంద్రాపురం పోలీసులు గురువారం చెవిరెడ్డిని అరెస్ట్ చేసి వడమాలపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న ఆయనను పుత్తూరు కోర్టులో హాజరు పరచగా, 15 రోజులు రిమాండ్ విధించింది. అయితే బెయిల్పై ఈ రోజు ఉదయం చిత్తూరు సబ్ జైలు నుంచి విడుదల అయిన చెవిరెడ్డిని వెంటనే ఎంఆర్ పల్లి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. -
ఎమ్మెల్యే చెవిరెడ్డి మరోసారి అరెస్ట్
-
ఎమ్మెల్యే చెవిరెడ్డి మరోసారి అరెస్ట్
చిత్తూరు : చిత్తూరు జిల్లా వద్ద శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఆయన వడమాలపేట పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసులో బెయిల్పై బయటకు వచ్చారు. అయితే తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే చెవిరెడ్డిపై మరో కేసు ఉందంటూ ఆయనను ఎంఆర్ పల్లి పోలీసులు అరెస్ట్ చేసేందుకు వచ్చారు. నిరసనగా కార్యకర్తలతో చెవిరెడ్డి చిత్తూరు జిల్లా జైలు వద్ద ఆందోళనకు దిగారు. అయితే ఎంఆర్ పల్లి పోలీసులు మాత్రం ఆయనను బలవంతంగా అక్కడ నుంచి లాక్కెళ్లారు. చెవిరెడ్డి తన అనుచరులతో రాత్రివేళ సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో సెక్షన్ 147, 341, 448 కేసులను ఎంఆర్ పల్లి పోలీసులు నమోదు చేశారు. కాగా 2013లో రామచంద్రాపురం మండలం అనుప్పల్లి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఎన్నికల నియామావళి ఉల్లంఘనగా పరిగణించి అప్పట్లో పోలీసులు చెవిరెడ్డిపై కేసు నమోదు చేశారు. రామచంద్రాపురం పోలీసులు గురువారం చెవిరెడ్డిని అరెస్ట్ చేసి వడమాలపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న ఆయనను పుత్తూరు కోర్టులో హాజరు పరచగా, 15 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. వెంటనే చెవిరెడ్డి తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, పుత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సమయం మించిపోవటంతో చెవిరెడ్డి ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదల అయ్యారు. -
తిరుపతిలో సైకో వీరంగం
తిరుపతి: సైకోలు రెచ్చిపోతున్నారు. జనాభా ఉన్న ప్రతి చోటా తమ చేష్టలతో బెంబేలిత్తుస్తున్నారు. తాజాగా శనివారం ఉదయం తిరుపతిలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. దారిన పోయే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ క్రమంలో ఇద్దరి మహిళలపై దాడి చేశాడు. భయాందోళనకు గురైన బాధితులు, రెవెన్యూ సిబ్బంది ఫిర్యాదుతో ఎంఆర్ పల్లి పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు. ఆ సైకో మాత్రం తాను ప్రభుత్వం ఉద్యోగినంటూ పోలీసులతో వాదనకు దిగాడు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.