muddanuru
-
జమ్మలమడుగులో బాంబుల కలకలం
సాక్షి, కడప : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో నాటు బాంబులు బయటపడ్డ ఘటన కలకలం రేపుతోంది. ముద్దనూరు రోడ్డులోని ఓ ఖాళీ స్థలంలో లే అవుట్ వేసేందుకు భూమిని చదును చేస్తుండగా బక్కెట్లో నాటు బాంబులు బయటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాంబులను జాగ్రత్తగా వెలికి తీస్తున్నారు. ఇప్పటివరకూ 54 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ... జేసీబీతో భూమిని చదును చేస్తుండగా బక్కెట్లో నాటు బాంబులు బయటపడ్డాయి. వీటిని గతంలోనే భూమిలో పాతి పెట్టి ఉంటారని భావిస్తున్నామని, దీనిపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా వారం రోజుల క్రితం పొలం గట్లు కోసం తవ్వుతుండగా బాంబుల బయటపడిన విషయం తెలిసిందే. -
నగదు రహిత లావాదేవీలతో ఆర్థికాభివృద్ధి
– కలెక్టర్ కేవీ సత్యనారాయణ ముద్దనూరు: నగదు రహిత లావాదేవీలతో ఆర్థికాభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ పేర్కొన్నారు.సిండికేట్ బ్యాంకు దత్తత గ్రామమైన యామవరంను నగదు రహిత లావాదేవీల గ్రామంగా తీర్చిదిద్దడంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ప్రసంగిస్తూ నోట్ల రద్దుతో ఏర్పడిన విపత్కర పరిస్థితుల నుంచి కోలుకోవడానికి నగదు రహిత లావాదేవీల కోసం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ లిటరసీలో శిక్షణ, రూపే కార్డుల వినియోగం,స్వైప్మిషన్ల ఏర్పాటు తదితర మార్గాలను అనుసరిస్తున్నామన్నారు. జిల్లాలో 3,89,000 జన్ధన్ ఖాతాలున్నాయని, రూపే కార్డులు మంజూరు చేయడంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. యామవరం గ్రామాభివృద్ధిలో భాగంగా చెరువు మరమ్మతులు , శ్మశాన వాటికల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, సిమెంటు రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తాని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ నోట్ల రద్దుతో అవినీతి తగ్గుతుందన్నారు. సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సిండికేట్ బ్యాంకు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ మల్లికార్జునరావు, ఆర్డీవో వినాయకం, సిండికే ట్ బ్యాంకు జనరల్ మేనేజరు మోహన్రెడ్డి, డీజీఎం ఆశీర్వాదం, ఎఫ్జీఎంవో శర్మ, ఏజీఎంలు పాణిగ్రాహి, విశ్వనాథరెడ్డి, బ్రాంచి మేనేజరు ఓబులేసు, తహసీల్దారు రమ, ఎంపీడీవో మనోహర్రాజు, సర్పంచ్ లక్ష్మీకాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
నేటి విజయమ్మ పర్యటన వివరాలు
సాక్షి, కడప ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జనభేరి ఎన్నికల ప్రచారం శుక్రవారం నాడు ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ముద్దనూరులలో నిర్వహించనున్నట్లు ఆపార్టీ మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి పేర్కొన్నారు. ఉదయం 9.00 గంటలకు ఎర్రగుంట్లలో విజయమ్మ రోడ్డు షో చేపట్టనున్నారు. అనంతరం 11.00 గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని స్థానికంగా రోడ్డు షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. 3.00 గంటలకు జమ్మలమడుగు మున్సిపల్ పరిధిలోనూ, 6.00 గంటలకు ముద్దనూరులో రోడ్డు షో నిర్వహించనున్నట్లు శివశంకరరెడ్డి తెలిపారు. పర్యటనను జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.