Mugajivala
-
మూగజీవాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ రఘునాథపాలెం : వర్షాకాలంలో మూగజీవాల ఆరోగ్య విషయంలో పశు వైద్యులు అప్రమతంగా ఉండాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వేపకుంట్లలో రూ.7.5 లక్షలతో నిర్మాణం చేసిన గోపాల మిత్ర పశువైద్య శిబిరం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆర్.రమేష్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమల అభివద్ధికి కూడా ప్రభుత్వం కషి చేస్తుందని, ప్రభుత్వ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రోత్సాహకంగా లీటరుకు రూ.4 అందిస్తోందన్నారు. పాడి పశువుల ద్వారా మంచి అదాయం వస్తోందని, మేలుజాతి పాడి పశువులను పెంచి ఆర్థికంగా లాభాలను పొందవచ్చని తెలిపారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో పాడి గేదెలతోపాటు, గొర్రెలు, మేకలు పెద్ద మొత్తంలో ఉన్నాయని అందుకు అనుగుణంగా వైద్యులును ఏర్పాటు చేయాలని పశుసంవర్ధకశాఖ జేడీ రఘోత్తమరెడ్డికి సూచించారు. హరితహారంలో భాగంగా ప్రతి ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటాలన్నారు. ఇంకా సభలో ఎంపీపీ మాలోత్ శాంత, జెడ్పీటీసీ ఆజ్మీరా వీరునాయక్, ఏడీలు శ్రీనివాసరావు, జైన్, పశువైద్యాధికారి డాక్టర్ కిషోర్, ఎంపీటీసీ రెంటాల ధానయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుడు రావెళ్ల శ్రీనివాసరావు, ఆత్మ చైర్మన్ రామారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటరమణ, హనుమంతురావు, కోదండరాములు, వెంకటేశ్వర్లు, పశువైద్య సిబ్బంది ఆరోగ్య మిత్ర తదితరులు పాల్గొన్నారు. పశువైద్యశాల నిర్మాణానికి స్థలాన్ని దానంగా ఇచ్చిన దాత మంకెన నాగేశ్వరరావును ఎమ్మెల్యే, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధిలు ప్రత్యేకంగా అభినందించారు. -
మూగజీవాలను కాటేస్తున్న లెడ్
కొందుర్గు: పరిశ్రమల నుంచి విచ్చల విడిగా బయటకు వెలువడుతున్న లెడ్ మూగజీవాలను కాటేస్తోంది. సమీపంలోని పచ్చికను తిని నీళ్లు తాగిన పశువులు మృ త్యువాతపడుతున్నాయి. ఈ క్రమం లో ఈనెల 1వ తేదీన సమీప పొలాల రైతులకు చెందిన ఏడు పశువులు మృతి చెం దాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అ నుమతులు లేకున్నా మండలంలోని జి ల్లేడ్ గ్రామశివారులో ఓ పరిశ్రమ కొనసాగుతోంది. ఇక్కడ కర్బన పదార్థాలను మరిగించి లెడ్ను తయారుచేస్తున్నారు. పరిశ్రమ సమీపంలోని పొలాల్లో మేత మే యడంతో ఎల్కగూడాలో గతంలోనే ఏడు పశువులు మృతిచెందాయి. గుట్టుచప్పు డు కాకుండా జిల్లేడ్లో చెట్లపొదల మా టున లెడ్ తయారీకి మరో పరిశ్రమను నడుపుతున్నారు. ఈ పరిశ్రమ ఉదయం 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది. లెడ్ తయారీ ఇలా.. వాహనాల్లోని కాలిపోయిన బ్యాటరీల్లో ఉండే వ్యర్థపదార్థం, రాక్పౌడర్, బొగ్గు, ఇనుమును బాగా మరిగించి లెడ్ను తయారుచేస్తున్నారు. దీన్ని రాత్రికిరాత్రే హైదరాబాద్కు తరలిస్తున్నారు. పరిశ్రమలోని ఒక్కో బట్టీలో 25కిలోల బరువు ఉన్న మూడు లెడ్ కడ్డీలను తయారుచేస్తారు. ఇక్కడి నుంచి విషరసాయనాలు సమీపంలోని చెరువులు, బోరుబావుల్లోని నీళ్లల్లో ఇంకిపోతున్నాయి. ఈ నీటిని తాగిన పశువులు చనిపోతున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేనప్పటికీ పరిశ్రమ నిర్వహణ కోసం ట్రాన్స్కో అధికారులు ఓ సింగిల్ఫేస్ ట్రాన్స్ఫార్మర్ అమర్చారు. అంతేగాక వ్యవసాయబోరు నుంచి పరిశ్రమకు నీటిని వాడుకుంటున్నారు. ఇటు గ్రామపంచాయతీ, రెవె న్యూ, పరిశ్రమల శాఖ, అటు కాలుష్యం నియంత్రణ మండలి అధికారులు ప ట్టించుకోకపోవడంతో విచ్చలవిడిగా కా లుష్యం వెదజల్లుతూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. యజమానిపై చర్యలు తీసుకుని పరిశ్రమను సీజ్చేయాలని సమీప పొలాల రైతులు కోరుతున్నారు. మిల్లులో నమూనాల సేకరణ పర్యావరణ ఇంజనీర్ శ్రీలక్ష్మి నేతృత్వంలోని అధికారుల బృందం గద్వాల మండలం వీరాపురం స్టేజీ వద్ద ఉన్న మిల్లులను పరిశీలించింది. అక్కడి నుంచి నేరుగా కొండపల్లి క్రాస్రోడ్డులో ఉన్న రమ్య జిన్నింగ్ మిల్లుకు చేరుకున్నారు. ఫ్యాక్టరీలోకి వెళ్లిన అధికారుల బృందం జిన్నింగ్ మిల్లులో డీలింటింగ్ ప్రాసెస్ యూనిట్ల వద్దకు చేరుకొని అక్కడి నీటిలో నమూనాలు సేకరించారు. ఇదే సమయంలో ఫ్యాక్టరీలోకి మునిసిపల్ చైర్పర్సన్ బృందం వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంగా గొడవ ప్రారంభం కావడంతో అధికారులు ఫ్యాక్టరీ ముందుకు వచ్చేశారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న డీలింటింగ్కు సంబంధించిన నమూనాలపై నివేదికలు సిద్ధంచేశారు. సంతకాల కోసం మిల్లు యజమానిని పిలిచినా రాకపోవడంతో అధికారులు ఉన్నతాధికారులకు వాస్తవాలను నివేదిస్తామంటూ వెళ్లిపోయారు.