Municipal elections
-
కిరాయి రౌడీలకు మద్యం పట్టించి.. తునిలో రెచ్చిపోయిన టీడీపీ
-
టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి.. ఇదే రిపీట్ అవుతుంది: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: కూటమి నేతలు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా ఖూనీ చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఎన్నికల్లో బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై కేసులు పెట్టి బెదిరించారని మండిపడ్డారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అని ప్రశ్నించారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు రెచ్చిపోయారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారు. పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అరాచకం చేశారు. మా పార్టీ కౌన్సిలర్లపై కేసులు పెట్టించి బెదిరించారు. కిడ్నాప్ చేసి తమవైపు లాక్కున్నారు. మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులన్నీ వైఎస్సార్సీపీ నేతలే గెలిచారు. ఇప్పుడు ప్రత్యేకంగా వైఎస్ చైర్మన్గా టీడీపీ వారు ఉండటం వల్ల వారికి వచ్చే లాభమేంటి?.అధికారం ఉందనే అహంకారంతో పదవులను కైవసం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూటమి నేతలు నేర్పుతున్న పాఠాలు భవిష్యత్తులో అన్ని పార్టీలు అవలంభిస్తాయి. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?. నెల్లూరులో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ పోలీసులను అడ్డు పెట్టుకుని డిప్యూటీ మేయర్ను గెలిచారు. అసలు ఒక్క కౌన్సిలర్ని కూడా గెలవలేని టీడీపీ.. ఇప్పుడు వైస్ చైర్మన్లను గెలవాలని చూస్తోంది. దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా టీడీపీ మారింది. దొడ్డిదారిలో పదవులు పొందటం ద్వారా టీడీపీ ఏం సాధిస్తుంది?. ఇలా పదవులు పొందటం రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి వారికి ప్రజలే తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
టీడీపీ నేతల అరాచకం.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా
Municipal Elections Updates..👉ఏపీలో కూటమి నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఎన్నికల్లో బలం లేకపోయినా అధికారంలో ఉన్నారనే అహంకారంతో టీడీపీ నేతలు పోటీకి దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు.👉పాలకొండలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా. ఎన్నిక జరగకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు. 👉తుని వైఎస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. దీంతో, మూడోసారి వాయిదా పడినట్టు అయ్యింది. శాంతి భద్రతల సమస్య కారణంగా ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. 👉కాకినాడ..తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా టీడీపీ గుండాల దౌర్జన్యం. మున్సిపల్ చైర్మన్ సుధా బాలు ఇంటి వద్ద వేలాదిగా మోహరించిన పచ్చ గుండాలు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన పది మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్లోకి వెళ్లారు. కోరం లేకపోవడంతో ఎన్నిక జరగకుండా పచ్చనేతలు అడ్డుకుంటున్నారు. ఎన్నికలు సజావుగా జరపాలని హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న టీడీపీ నేతలు. ఇక.. టీడీపీ నేతలకు పోలీసులు వంతపాడుతున్నారు. దీంతో, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించనున్నారు. టీడీపీ నాయకులు యనమల డైరెక్షన్లోనే వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పచ్చ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. పల్నాడులో ప్రజాస్వామ్యం ఖూనీ.. 👉పిడుగురాళ్లలో పట్ట పగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. అరాచకానికి ఐకాన్గా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మారారు. పిడుగురాళ్లలో మొత్తం 33 వార్డులు ఉండగా.. గతంలో 33 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవని తెలుగుదేశం. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ను తన వైపునకు తిప్పుకున్న యరపతినేని. బలం, అర్హత లేకపోయినా వైస్ చైర్మన్ పదవి కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన శ్రీనివాసరావు.👉పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయించారు. బెదిరించి, భయపెట్టి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ వైపునకు తిప్పుకున్నారు. 29వ వార్డు కౌన్సిలర్ మునీరా రెండు ఇళ్లను కూల్చే చేయించిన యరపతినేని. కౌన్సిలర్లు అందరినీ ఒక లాడ్జిలో బంధించి బస్సులో నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చిన తెలుగుదేశం నేతలు. వైఎస్ చైర్మన్ పదవి కైవసం చేసుకున్నట్టు యరపతినేని ప్రకటన. 👉తునిలో మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు దాడిశెట్టి రాజాపై దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడే ఉన్నా.. వారిని అడ్డుకోకపోవడం గమనార్హం. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ సుధా బాలు భర్త ఏలూరి బాలు, తొండంగి వైఎస్సార్సీపీ నేత గంగబాబు, తుని ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతా శ్రీనుతో పాటుగా మరో ముగ్గురు కౌన్సిలర్ల భర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. అనంతరం, తుని టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 👉దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు. దీనిపై కచ్చితంగా కోర్టుకు వెళ్తాం. వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తునిలో 30 స్థానాల్లో 30 కౌన్సిలర్లను వైఎస్సార్సీపీ గెలిచింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. టీడీపీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేడు. తొమ్మిది మందిని మభ్యపెట్టి లాక్కున్నారు. చైర్పర్సన్ ఇంటి చుట్టూ వేలాది మంది మోహరించారు. కోర్టులు, వ్యవస్థలు అంటే టీడీపీకి లెక్కలేదు అంటూ మండిపడ్డారు. కాకినాడ..👉తుని మున్సిపల్ ఎన్నిక సందర్భంగా సెక్షన్ 163(2) అమలు చేసిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఈ నేపథ్యంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమ్మికూడరాదని ఆదేశాలు జారీ. కానీ, టీడీపీ గుండాలకు వర్తించని సెక్షన్ 163(2).👉మున్సిపల్ చైర్మన్ సుధా బాలు ఇంటి వద్ద వందలాదిగా గుమిగూడిన పచ్చ మూకలు. మున్సిపల్ కౌన్సిలర్లు బయటకు రాకుండా అడ్డుకుంటున్న టీడీపీ గుండాలు. సుధా బాలు నివాసం వద్దకు వెళ్ళిన జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా. ఈ క్రమంలో రాజాను కూడా అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు. రంగంలోకి దిగిన పోలీసులు.. టీడీపీ వారికే వత్తాసు. వైఎస్సార్సీపీ నేతలను అక్కడి నుంచి పంపిచేస్తున్న పోలీసులు. కాకినాడ..👉తునిలో మరోసారి టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మున్సిపల్ చైర్మన్ సుధాబాబు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పచ్చమూకలు అడ్డుకున్నాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు.. వారిని అడ్డుకోలేదు. టీడీపీ నేతలకు పోలీసుల సహకారం అందిస్తూ.. తొండగి మండలం వైఎస్సార్సీపీ నేత గంగబాబుతో పాటుగా పలువరి నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారు. కూటమి అరాచకం..👉ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో పలుచోట్ల జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పచ్చ నేతలు యధేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. బలం లేకపోయినా అధికార మదంతో పోటీకి దిగుతున్నారు టీడీపీ నేతలు. కాగా, నేడు తుని, పాలకొండ, పిడుగురాళ్లలో డిప్యూటీ చైర్మన్, చైర్మన్ల ఎన్నికల జరగనుంది. ఇప్పటికే ఇక్కడ రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ స్థానాల్లో టీడీపీకి బలం లేకపోయినా పచ్చ నేతలు అధికార మదంతో పోటీలో నిలబడ్డారు. కూటమి నేతలు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నా పోలీసులు మాత్రం తమకు ఏదీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.👉ఇక, పిడుగురాళ్లలో కూటమి ప్రభుత్వానికి కోరం లేకున్నా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలతో, దౌర్జన్యాలతో లోబరుచుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి మద్దతిచ్చేది లేదని 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మున్నీరా సైదావలి తేల్చి చెప్పడంతో ఆదివారం టీడీపీ నేతలు బరితెగింపునకు పాల్పడ్డారు. కౌన్సిలర్ ఇంటితో పాటు, ఆయన బంధువుకు చెందిన నిర్మాణంలో ఉన్న ఇంటిని మున్సిపల్ అధికారులను అడ్డుపెట్టుకుని పొక్లెయిన్తో కూల్చివేయించారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు, శానిటేషన్ సిబ్బందితో పాటు టీడీపీకి చెందిన రాయపాటి సాంబశివరావు, షేక్ ఇంతియాజ్ తదితరులు, ఆ పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని దగ్గరుండి మరీ రెండు ఇళ్లను కూల్చివేయించారు.ఇప్పటికే రెండు సార్లు అరాచకాలు 👉పిడుగురాళ్ల మున్సిపాల్టీలో 33 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 33 వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. చైర్పర్సన్గా కొత్త వెంకటసుబ్బారావు, వైస్ చైర్మన్లుగా కొమ్ము ముక్కంటి, షేక్ నసీమా జైలాబ్దిన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ముక్కంటి మృతితో ఈ నెల 3న వైఎస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ జీవో ఇచ్చింది. అయితే, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకుండా పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు అడ్డుపడటంతో ఎన్నిక 4వ తేదీకి వాయిదా పడింది. 4వ తేదీ కూడా టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్ల వద్ద ఉండి ఇళ్లల్లోంచి వారిని బయటకు రానివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో మళ్లీ సోమవారానికి వాయిదా పడింది. -
మున్సిపల్ ఎన్నికలలో కూటమి అరాచకాలు
-
పోలీసుల తీరుపై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి అడ్డదారిలో గెలుపు
-
కూటమి కాలకేయుల సాక్షిగా.. ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి, సాక్షి, అమరావతి, నెట్వర్క్: ఆదిమ తెగల్లోనూ కానరాని అకృత్యాలు టీడీపీ కూటమి సర్కారు పాలనలో ఆవిష్కృతమయ్యాయి! పట్టపగలు.. తిరుపతి నడి రోడ్డుపై పోలీసులు, జనం సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. తాలిబన్లు.. ఐసిస్.. హమాస్ ఉగ్రమూకలను తలదన్నే రీతిలో మునిసిపల్ ఉప ఎన్నికల్లో పచ్చ ముఠాలు దాడులకు తెగబడి విధ్వంసం, భయోత్పాతం సృష్టించాయి! పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. అసలు ఒక్క సీటు కూడా గెలవని చోట్ల.. తమకు ఏమాత్రం సంఖ్యా బలం లేని చోట్ల భయపెట్టి నెగ్గేందుకు కూటమి పార్టీలు కుతంత్రాలకు దిగాయి. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి బరి తెగించాయి. బల ప్రయోగం, అక్రమాలు, అరాచకాలు, ప్రలోభాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం తెచ్చేలా వ్యవహరించాయి. మునిసిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ గుర్తులతో జరిగాయి. అలాంటిది.. ఒక పార్టీ గుర్తుపై నెగ్గిన వారిని భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి ఇంత దారుణంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంటే.. అసలు ఇక ఎన్నికలు ఎందుకు? పార్టీ గుర్తులు ఎందుకు? అని ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరికత, ఆధునిక పోకడలు ఏమాత్రం ఎరుగని ఆటవిక జాతులు.. ప్రజాస్వామ్యం అంటే పరిచయం లేని దేశాల్లో మాత్రమే కనిపించే ఘటనలు ఏడుకొండలవాడి సాక్షిగా చోటు చేసుకోవడం నివ్వెరపరుస్తోందని పేర్కొంటున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో నెగ్గేందుకు కూటమి పార్టీల గూండాలు అరాచకం సృష్టించారు. ఉప ఎన్నికలో పాల్గొనేందుకు వాహనంలో వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సు ఆపి రాడ్లతో అద్దాలు పగలగొట్టి లోపలకు చొరబడి దాడులకు తెగబడ్డారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లపై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. మహిళా కార్పొరేటర్ల ఆర్తనాదాలు ఖాకీల చెవికెక్కలేదు. కార్పొరేటర్లను బలవంతంగా లాక్కెళుతున్న కూటమి గూండాల వాహనాలకు పోలీసులు దగ్గరుండి దారిచ్చి సాగనంపడం నివ్వెరపరుస్తోంది. పోలీసుల సాక్షిగా కూటమి గూండాలు చిత్తూరు, తిరుపతిలో సృష్టించిన అరాచకం ఇదీ!! రాష్ట్రంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే వాతావరణం లేదని అధికార మదంతో టీడీపీ నేతలు సవాల్ విసరడంపై ప్రజాస్వామ్యవాదుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు నగర కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులతో ఐదు చోట్ల ఎన్నికలు వాయిదా పడటం గమనార్హం.వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సును అడ్డుకుంటున్న టీడీపీ నాయకుడు అన్నా రామచంద్రయ్య, గూండాలు అర్ధరాత్రి నుంచి అరాచకం..మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు. గత ఐదు రోజులుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేయడంతోపాటు రాత్రిపూట పోలీసులను వారి ఇళ్లకు పంపి కేసులు బనాయిస్తామంటూ బెదిరించారు. ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాలులో సోమవారం డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే కుయుక్తులతో కూటమి నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమయ్యారు. వారంతా చిత్తూరులో ఉన్నారని తెలుసుకుని ఆదివారం అర్ధరాత్రి రిసార్ట్స్లో చొరబడ్డారు. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, పులిగోరు మురళి, జేబీ శ్రీనివాసులు, అనుచరులు గదుల తలుపులు బాదుతూ వీరంగం సృష్టించారు. గదుల్లో ఉన్న మహిళలు, చిన్నారులు ఆందోళనతో భూమన అభినయరెడ్డికి సమాచారం ఇవ్వడంతో పార్టీ శ్రేణులతో కలసి అక్కడకు చేరుకున్నారు. టీడీపీ మూకలు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కార్పొరేటర్లంతా సోమవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో తిరుపతిలోని భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. బస్సుని అడ్డుకుని.. అద్దాలు ధ్వంసం చేసిడిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కోసం సోమవారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లంతా భూమన నివాసం నుంచి ప్రత్యేక బస్సులో ఎస్వీ యూనివర్సిటీలోని సెనెట్ హాలు వద్దకు బయలు దేరారు. దాదాపు 25 మంది కార్పొరేటర్లు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం అందులో ఉండగా వర్సిటీ సమీపంలో వారి బస్సును కూటమి గూండాలు అడ్డుకున్నారు. సుమారు 500 మంది ఒకేసారి బస్సుపైకి దూసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే రాడ్లతో అద్దాలను పగులగొట్టారు. లోపలకు చొరబడి బస్సు తలుపు తెరిచారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లు అమరనాథరెడ్డి, అనీష్రాయల్, మోహన్కృష్ణ యాదవ్, బోగం అనిల్, వెంకటేష్పై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో కార్పొరేటర్లను బలవంతంగా ఎక్కించారు. బస్సులో ముందు వైపు కూర్చున్న మహిళా కార్పొరేటర్లను నెట్టుకుంటూ లోపలకు చొరబడడంతో భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. కార్పొరేటర్లను కాపాడకపోగా మిగిలిన వారిపై దౌర్జన్యానికి దిగారు.ఎంపీ, సాక్షి ప్రతినిధులపై దాడికార్పొరేటర్లతో పాటు బస్సులో ఉన్న ఎంపీ గురుమూర్తిపై కూడా కూటమి గూండాలు దాడికి యత్నించారు. ఈ అరాచకాలను చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధి, ఫోటోగ్రాఫర్పై దాడి చేశారు. ఎమ్మెల్యే కుమారుడు మదన్, సునీల్ చక్రవర్తి ఫోటోగ్రాఫర్ చేతిలోని రూ.రెండు లక్షలు విలువచేసే కెమెరాను ధ్వంసం చేశారు. సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధిపై కూడా దాడికి తెగబడ్డారు. ఉదయం 10.15 గంటల నుంచి 10.45 వరకు యధేచ్ఛగా సాగిన విధ్వంసంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కోరం లేదని డూప్లికేట్ కార్పొరేటర్లతో..నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తే గెలుపు తమదేనని ధీమాతో ఉన్న కూటమి నేతలకు వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. కిడ్నాప్నకు గురైన కార్పొరేటర్లను ప్రవేశపెట్టే వరకు తాము ఉప ఎన్నికలో పాల్గొనబోమని మిగతావారు వర్సిటీ సెనెట్ హాలు బయటే ఆగిపోయారు. ఉప ఎన్నిక జరగాలంటే కోరం ఉండాలి. అంటే.. 50 మంది కార్పొరేటర్లలో సగం మందైనా ఉంటేగానీ ఉప ఎన్నిక ప్రారంభం కాదు. దీంతో కూటమి నేతలు మరో ఎత్తుగడ వేశారు. నలుగురు జనసేన మహిళలకు మాస్క్లు అమర్చి సెనెట్ హాలు లోపలకు పంపేందుకు యత్నించారు. ఈ కుట్రలను పసిగట్టిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం హాలు వద్దకు చేరుకోవడంతో ఆ యత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఉప ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి శుభం బన్సల్ ప్రకటించారు. నలుగురితో బలవంతంగా వీడియో...డిప్యూటీ మేయర్ పదవిని కైవశం చేసుకునేందుకు టీడీపీ మూకలు కిడ్నాప్ చేసిన నలుగురు కార్పొరేటర్ల చేత బలవంతంగా మాట్లాడించి ఓ వీడియోను విడుదల చేశారు. గొడవల కారణంగా తాము సురక్షిత ప్రాంతానికి చేరుకున్నామంటూ ఒకే డైలాగ్ నలుగురితో చెప్పించి వీడియో తీశారు. అది ఒకే ప్రాంతంలో చేసినట్లు తెలుస్తోంది. పక్కన ఎవరో బలవంతంగా చెప్పిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నలుగురి వీడియోలను టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్వర్మ తన ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం గమనార్హం. కాగా భూమన అభినయ్పై అక్రమ కేసు బనాయించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.అడ్డదారిలో స్టాండింగ్ కమిటీ కైవశంగుంటూరు స్టాండింగ్ కమిటీని టీడీపీ అడ్డదారిలో కైవశం చేసుకుంది. 56 మంది సభ్యులకుగానూ కేవలం 11 మంది బలం మాత్రమే ఉన్న కూటమి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి తమవైపు తిప్పుకుంది. స్వయంగా ఎమ్మెల్యేలను కార్పొరేటర్ల ఇళ్లకు పంపి పచ్చ కండువా కప్పారు. సోమవారం స్టాండింగ్ కమిటీ ఎన్నిక సందర్భంగా బ్యాలెట్ పేపర్పై సీరియల్ నంబర్లు వేసి బెదిరింపులకు దిగి గెలుపొందారు. కాగా కార్యాలయం బయట కూటమి సభ్యులు డబ్బులు పంచుకుంటూ మీడియాకు చిక్కారు.సగం చోట్ల వాయిదా...పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు తిరుపతి నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. నోటిఫి కేషన్ జారీ చేసిన సగం చోట్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడడం గతంలో ఎప్పుడూ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాయిదా పడిన ఐదు చోట్ల మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ⇒ టీడీపీ కూటమికి బలం లేకపోయినా నూజివీడు మున్సిపాల్టీలో వైస్ చైర్మన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్లు, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులను అధికారం అండతో చేజిక్కించుకుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైర్మన్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైస్ చైర్మన్, కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ పదవిలో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమైంది. ⇒ కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా తొమ్మిది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరించి లొంగదీసుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇందుకోసం మంత్రి కొలుసు పార్ధసారథి ఆదివారం రాత్రి కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. ⇒ హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 కౌన్సిలర్లకు వైఎస్సార్సీపీ 29, టీడీపీ 6 గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ 13 మందిని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లను కూడా ఉపయోగించుకుని ౖచైర్మన్ పదవిని మోసపూరితంగా తమ పరం చేసుకున్నారు.⇒ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 కార్పొరేటర్లకు 54 సీట్లను వైఎస్సార్సీపీ గెలిచినా.. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని అధికార దుర్వినియోగంతో టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బెదిరింపులు, ప్రలోభాలతో వారిని తమ వైపు తిప్పుకుని ఆ పదవిని అక్రమంగా కైవశం చేసుకున్నారు. ⇒ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్ పదవులను బెదిరింపులకు గురి చేసి టీడీపీ మద్దతుదారులకు కట్టబెట్టారు. 20 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉండగా 12 మందిని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు. ఫిరాయిపుదారుడిని వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి పదవి దక్కేలా చేశారు. ⇒ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో బలం లేకపోయినా రెండు డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ అక్రమంగా చేజిక్కించుకుంది. కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లున్న టీడీపీ రెండు డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడాన్ని బట్టి ఆ పార్టీ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ⇒ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఒక్క కౌన్సిలర్ కూడా లేని టీడీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విఫలయత్నం చేసింది. అక్కడున్న మొత్తం 33 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వారంతా మున్సిపల్ కార్యాలయానికి వెళుతుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గడువు లోపు వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఎన్నికను వాయిదా చేశారు. ⇒ కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అడ్డగోలుగా తమ పరం చేసుకునేందుకు టీడీపీ యత్నించింది. అక్కడి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే అయినా వారి తరఫు అభ్యర్థిని నామినేషన్ వేయకుండా పోలీసుల సాయంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా కమిషనర్ ఎన్నికను వాయిదా వేశారు.డిప్యూటీ మేయర్ ఎన్నిక నిష్పాక్షికంగా జరిగేలా చూడండి సాక్షి, అమరావతి: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో జిల్లా ఎస్పీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక నిష్పాక్షికంగా, ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నిక జరిగే ఎస్వీ యూనివర్సిటీ, సెనెట్ హాల్ బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్పై హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ, పాలకొండపై కాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని భర్తీ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నాదెండ్ల హారిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఖాళీగా ఉన్న 19 వార్డుకు ముందు ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎం.స్వర్ణకుమారి దాఖలు చేసిన వ్యాజ్యంపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
తిరుపతిలో కూటమి గూండాగిరి
-
హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ కుట్ర రాజకీయాలు
-
అప్డేట్స్.. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అరాచకాలు
Election Update.. ఏపీలో నేడు 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై ప్రత్యక్షంగా దాడులు చేస్తూ భయభంత్రులకు గురిచేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్తే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, ఉద్రిక్తర పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు..బుచ్చి మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కామెంట్స్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ డౌర్జన్యాలకు పాల్పడింది. బుచ్చికి నగర పంచాయతీ హోదా ఇచ్చింది వైఎస్ జగన్ వైఎస్జగన్ బొమ్మను చూసే మాకు, కౌన్సిలర్లకు ఓట్లు వేశారు పార్టీ మారిన కౌన్సిలర్లకు మేము ఎక్కడా తక్కువ చెయ్యలేదు.. కానీ వారు మోసం చేసి వెళ్లిపోయారు.. ప్రలోభాలకు లొంగకుండా ఆరుగురు కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ పక్కన నిలబడ్డారూ.. వారికి మంచి భవిష్యత్తు కల్పిస్తాం..టీడీపీకి ఓట్లు వేసిన వారు వెన్నుపోటుదారులయ్యారు: మాజీ మంత్రి కాకాణి టీడీపీ తరపున ఓట్లు వేసిన వారందరూ వెన్నుపోటుదారులులాగా మిగిలిపోయారు ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారికే టీడీపీ వైస్ చైర్మన్ పదవి ఇచ్చింది. మంత్రి నారాయణకి ఫిరాయింపు చట్టాల మీద అవగాహన లేదు.. విప్ దిక్కరించిన వారందరూ అనర్హులవుతారు వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన అరుగుర్ని వైఎస్ జగన్ వద్దకు తీసుకెళ్తాం.. వారికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం ఎవరికో పుట్టిన బిడ్డను తెచ్చుకుని.. తమ బిడ్డగా టీడీపీ చెప్పుకోవడం సిగ్గుచేటు ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో.. కార్యకర్తలకు అండగా ఉంటాం మేము రోడ్డెక్కి ప్రతిదాడులు చేస్తే.. జిల్లా అగ్నిగుండం అవుతుంది.. మా కార్యకర్తల జోలికి రావొద్దు.. క్యాష్, పేమెంట్స్ కోసం కార్పొరేటర్స్ టీడీపీ వైపు వెళ్లారు.తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలుతమ పార్టీ కార్పొరేటర్లు ను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని, ఇవాళ కూడా ఎన్నిక సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు హైకోర్టులో పిటిషన్కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని పిటిషన్విచారణ జరిపిన హైకోర్టురక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని పిటిషనర్కు కోర్టు ఆదేశంకార్పొరేటర్లు బయల్దేరి వెళ్లే దగ్గర నుంచి సెనేట్ హాల్కు చేరుకునే వరకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలుతాడేపల్లి:అసలు చంద్రబాబు మనిషేనా: మాజీ మంత్రి జోగి రమేష్ అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసి పదవులు గెలుపొందారురాష్ట్రంలో ఏ కార్పోరేషన్, మున్సిపాలిటీల్లోనూ టీడీపీకి బలం లేదుకానీ మావారిని కిడ్నాప్ చేసి గెలుపొందటం సిగ్గుచేటుమా కార్పోరేటర్లు వెళ్లే బస్సు మీద దాడి చేయడం దారుణంతిరుపతి ప్రతిష్టను దిగజార్చారుఅధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదు2019లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోదీని తిట్టారుఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్లి మోదీని మెచ్చుకుంటూ, కేజ్రివాల్ని తిట్టారుఅసలు చంద్రబాబు ఒక మనిషేనా? ఆయనకు సిగ్గుందా?సిద్దాంతాలు, విలువలు లేని ఏకైక మనిషి చంద్రబాబుఐటీ రైడ్స్ నుంచి రక్షించుకోవటానికే చంద్రబాబు ఢిల్లీ ప్రచారానికి వెళ్లారుఇది కూటమి ప్రభుత్వం కాదు, కుట్రల ప్రభుత్వంవైసీపి కార్పొరేటర్లను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి గెలవాలని చూస్తున్నారుపవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారుఈ దాడులు, దౌర్జన్యాలపై ఈసీ స్పందించాలిఅధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ఈసీ అడ్డుకోవాలిఎన్టీఆర్ జిల్లా:కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందిఎమ్మెల్సీ,మొండితోక అరుణ్ కుమార్రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ ఎన్నికలే అందుకు నిదర్శనంఎలాగైనా గెలవాలని వైసీపీ కౌన్సిలర్లను అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేశారుటీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారుసైకిల్ గుర్తు పై గెలిచిన వారు కేవలం ఆరుగురేఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారు 13 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకుని గెలవాలని చూశారువైఎస్సార్సీపీ కౌన్సిలర్లను చేర్చుకుని కూడా ఎన్నికలను నిర్వహించుకోలేకపోయారునందిగామ ఎమ్మెల్యే ఓ డమ్మీ ఎమ్మెల్యేఎంపీకి , ఎమ్మెల్యేకి పొసగడం లేదని మీ అనుకూల మీడియాల్లోనే చెబుతున్నారుపార్టీ విప్ ను టీడీపీ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారని వార్తలొస్తున్నాయిమీరు డమ్మీ ఎమ్మెల్యే అని మేం చెప్పడం లేదు...మీ పార్టీవాళ్లే చెబుతున్నారు13 మంది సభ్యుల బలం ఉందని చెప్పుకుంటున్న మీరు ఎందుకు ఎన్నిక జరుపుకోలేకపోయారువైఎస్సార్సీపీ కౌన్సిలర్ మంద మరియమ్మ ఇంటిని ప్రొక్లెయినర్లతో కూల్చేశారుటీడీపీకి ఓటేయకపోతే నీ ఇంటిని కూల్చేసినట్లు నిన్ను కూడా కూల్చేస్తామని మరియమ్మను హెచ్చరించారుబెదిరించి,భయపెట్టి మంద మరియమ్మను టీడీపీలో చేర్చుకున్నారుతమకు లొంగకపోతే బెదిరిస్తున్నారు...భయపెడుతున్నారు...ఆస్తులను ధ్వంసం చేస్తున్నారుకూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నందిగామలో అరాచకాలు పెరిగిపోయాయిప్రభుత్వం రాగానే జగనన్న వాక్ను ధ్వంసం చేశారుమేం చేపట్టిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారుగత ఐదేళ్లలో నందిగామలో రాజకీయంగా ఒక్క 307 కేసు కూడా పెట్టలేదుకానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 307 కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధిస్తున్నారునందిగామ మున్సిపల్ ఛైర్మన్,మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక పై మేం కోర్టుకు వెళ్లాంఛైర్మన్,వైస్ ఛైర్మన్ పదవుల్లో ఉన్నవారు చనిపోతే ఆ వార్డులలో ఎన్నికల కోసం మేం కోర్టుకు వెళ్లాంనందిగామలో టీడీపీ అంతర్గత ప్రజాస్వామ్యం నడిపిస్తున్నారుకౌన్సిలర్లను ఐదు గంటలుగా బంధించారు.. ఫోన్లు లాక్కున్నారుస్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు సూచిస్తున్నాఇంకా ఎన్నాళ్లు డమ్మీ ఎమ్మెల్యేగా ఉంటారునందిగామ నియోజకవర్గాన్ని అపహాస్యం చేశారుటీడీపీ ప్రలోభాలకు గురిచేసిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లంతా మాతో టచ్ లో ఉన్నారుసరైన సమయంలో సరైన ట్విస్ట్ ఇస్తాం ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు..విజయవాడ..రాష్ట్ర ఎన్నికల కమిషన్కి వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదుతిరుపతి డిప్యూటీ మేయర్, ఇతర ఎన్నికల్లో టీడీపీ, జనసేన అరాచకాలపై ఫిర్యాదుఈసీకి ఫిర్యాదు చేసిన దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మికుట్రలతో టీడీపీ విజయం..ఏలూరు..కుట్రలతో నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ను దక్కించుకున్న టీడీపీబలం లేకపోయినా గెలిచేందుకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసిన మంత్రి పార్ధసారధితీవ్ర ఉత్కంఠ నడుమ ఎన్నికకు హాజరైన 30 మంది కౌన్సిలర్లుఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గైర్హాజరు14 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లలో టీడీపీకి ఓటేసిన ఒక వైఎస్సార్సీపీ కౌన్సిలర్18 ఓట్లు రావడంతో టీడీపికి దక్కిన నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిమున్సిపల్ వైస్ చైర్మన్ గా పగడాల సత్యనారాయణగతంలో వైఎస్సార్సీపీ నుంచి గెలిచి వైస్ చైర్మన్ గా పనిచేసిన పగడాల సత్యనారాయణసత్యనారాయణను టీడీపీలో చేర్చుకుని మళ్లీ అతన్నే వైస్ చైర్మన్గా చేసిన టీడీపీ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా..తిరుపతి జిల్లా..డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా వేసిన ఎన్నికల అధికారులుటీడీపీ అడ్డదారుల్లో గెలిచింది: కాకాణి నెల్లూరు జిల్లా..మాజీ మంత్రి కాకాణి కామెంట్స్..తెలుగుదేశం పార్టీ అడ్డదారుల్లో గెలిచింది.పార్టీ తరఫున అభ్యర్థికి బీఫామ్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఆ పార్టీ ఉంది.వైఎస్సార్సీపీ ధిక్కరించిన అందరిపై వేటు తప్పదువైఎస్సార్సీపీ నైతికంగా విజయం సాధించింది..తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోనూ జిల్లాలోనూ ఇదే చివరి విజయం అవుతుందిన్యాయస్థానాన్ని ఆశ్రయించి.. విప్ ధిక్కరించిన కార్పొరేటర్స్పై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకుంటాం..నిస్సిగ్గుగా ఎన్నికల్లో టీడీపీ ప్రవర్తించింది.టీడీపీ విజయం అనైతికం: తోపుదుర్తిఅనంతపురం జిల్లా..మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్స్..హిందూపురంలో టీడీపీ విజయం అనైతికం38 వార్డులకు గాను 30 వార్డుల్లో వైఎస్సార్సీపీకి బలం ఉందిఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరించి.. ప్రలోభాలకు గురి చూసి వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ను లాక్కున్నారుఎమ్మెల్యే బాలకృష్ణ ఓ డాకూలా అరాచకాలు చేస్తున్నారుచంద్రబాబు, బాలకృష్ణలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు.హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను అడ్డుకుంటాంముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల ద్రోహిహంద్రీనీవా కాలువలను వెడల్పు చేయకుండా లైనింగ్ పనులకు టెండర్లు పిలవడం దుర్మార్గంమంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలి టీడీపీలో వర్గపోరు.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా..టీడీపీలో చిచ్చు రాజేసిన నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికనందిగామ మున్సిపల్ చైర్మన్ కోసం కొట్లాటచైర్మన్ కోసం ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే8వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలతకు ఎంపీ కేశినేని చిన్ని మద్దతుస్వర్ణలతకు బీఫామ్ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానంతనకు తెలియకుండా బీఫామ్ ఇవ్వడంతో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫైర్నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏమిటంటూ నిలదీత14వ వార్డు కౌన్సిలర్ సత్యవతికి ఇవ్వాలని పట్టుపడుతున్న ఎమ్మెల్యే సౌమ్యఅధిష్టానం వద్దకు చేరిన ఎంపీ, ఎమ్మెల్యే పంచాయతీనేను ప్రకటించే అభ్యర్థే ఫైనల్ అంటున్న ఎమ్మెల్యే సౌమ్యఅభ్యర్ధి ఎవరో తేలకపోవడంతో ఎన్నిక వాయిదా పడే అవకాశం పల్నాడు జిల్లాలో ఎన్నిక వాయిదా..పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా10 గంటల లోపు వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన గురజాల ఆర్డీఓ మురళినందిగామలో ఎన్నిక వాయిదాఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదారేపటికి చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదాకోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి టీడీపీ అన్ని విధాలా ఓడిపోయింది.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డినెల్లూరులో చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్..టీడీపీ అన్ని విధాలా ఓడిపోయింది.. పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టుకోలేక చేతులు ఎత్తేసింది.టీడీపీకి సపోర్ట్ చేసిన కార్పొరేటర్లలో ఏ ఒక్కరికీ రాజకీయ భవిష్యత్తు ఉండదు.వైఎస్సార్సీపీకి రాజీనామా చేయకుండా.. టీడీపీలో ఉన్న వారిపై అనర్హత వేటు తప్పదు.గెలిచింది టీడీపీ అభ్యర్థినా.. ఇండిపెండెంట్ అభ్యర్థి అనేది కూడా ఎన్నికల అధికారి చెప్పలేదు.ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. పార్టీ ఫిరాయింపుదారులను ప్రజా క్షేత్రంలో దోషులుగా నిలబెడతాం..తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలి: లేళ్ల అప్పిరెడ్డిఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలిప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించ వద్దుదాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసిందిఅలాంటప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించటం ఎందుకు?ఈ పరిస్థితులపై నిన్ననే మేము ఈసీని కలిసి ఫిర్యాదు చేశాంపోలీసు బలగాలను పెంచాలని కోరాంమా కార్పొరేటర్లను కాపాడాలని కోరినా ఫలితం లేదు144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి ఎలా వస్తారు?వారిని పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారు?ఏపీలో దిక్కుమాలిన పాలన కొనసాగుతోందివైఎస్సార్సీపీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను టీడీపీ తమ వైపు నిస్సిగ్గుగా లాక్కుంటోందిప్రలోభాలకు గురిచేయటం, బెదిరించటం, దాడులకు పాల్పడటం అనే మూడు ప్లాన్లతో వ్యవహరిస్తున్నారుతిరుపతిలో మా కార్పొరేటర్లపై దాడి చేశారుమావాళ్లు ప్రయాణిస్తున్న బస్సును ధ్వంసం చేశారుబీసీ వర్గానికి చెందిన మేయర్ శిరీష మీద దాడికి యత్నించారుఆ బస్సులో మహిళా కార్పొరేటర్లు ఉన్నారుఎస్సీ ఎంపీ గురుమూర్తి మీద దాడికి యత్నించారునిన్న ఈసీని కలిసి కూటమి అరాచకాలపై ఫిర్యాదు చేశాంపోలీసులపై నమ్మకం లేదని చెప్పాంఈరోజు జరిగిన దాడులపై మళ్ళీ ఈసీని కలుస్తాంతిరుపతి ప్రతిష్టను టీడీపీ నేతలు దిగజార్చారుగతంలో లడ్డూ వ్యవహారం, అంతకుముందు అమిత్షా పై దాడి చేశారుప్రపంచవ్యాప్తంగా తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగించారు.హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ..శ్రీసత్యసాయి జిల్లా..హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీపార్టీ ఫిరాయింపులతో హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీ నేతల బరితెగింపువైఎస్సార్సీపీకి చెందిన 16 మందిని లాగేసుకున్న టీడీపీవైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు ప్రలోభాలు పెట్టి.. బెదిరించిన టీడీపీ నేతలు23 మంది సభ్యుల మద్దతుతో మున్సిపల్ చైర్మన్ పదవి సొంతం చేసుకున్న టీడీపీహిందూపురంలో మొత్తం 38 వార్డులు తిరుపతి మేయర్ శిరీష కామెంట్స్..కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు.పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు.మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?.మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా దాడి చేశారు.మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు.మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి.మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్లో పాల్గొనం. నూజివీడులో ఉత్కంఠ..ఏలూరు..నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.32 మంది కౌన్సిలర్లలో టీడీపీ గెలిచింది ఏడుఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్వైఎస్సార్సీపీ బలం 24 , టీడీపీ బలం 8బలం లేకపోయినా వైస్ చైర్మన్ ఎన్నికకు పోటీపడుతున్న టీడీపీవైస్ చైర్మన్ ఎన్నిక కోసం ప్రలోభాలకు తెరతీసిన పచ్చ పార్టీ.ఫార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన మంత్రి కొలుసు పార్థసారథిరాత్రికి రాత్రి ఏడుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి చేర్చుకున్న పచ్చ పార్టీ.వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల చేరికతో 15కు పెరిగిన టీడీపీ బలంఎక్స్ అఫీషియో సభ్యుడిగా మంత్రి పార్థసారథి ఓటుమంత్రి ఓటుతో సమం కానున్న బలాబలాలునూజివీడు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఇరు పార్టీల కౌన్సిలర్లుమహిళలపై దాడి అమానుషం: గడికోటవైఎస్సార్ జిల్లా..లక్కిరెడ్డిపల్లి జెడ్పీటీసీ ఇంటిని పరిశీలించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి.శ్రీకాంత్ రెడ్డి కామెంట్స్..నిన్న రాత్రి జాండ్లపల్లిలో జెడ్పీటీసీ రమాదేవి ఇంటిపై దాడికి దిగిన టీడీపీ మూకలుఇంటిని పూర్తిగా ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు.. కనిపించిన వాహనాల్ని దహనం చేసిన వైనం.ఇంట్లో ఉన్న జెడ్పీటీసీ రమాదేవి, గర్భిణీగా ఉన్న ఆమె కోడలిపై దాడి.జెడ్పీటీసీ భర్త రెడ్డయ్యను హత్య చేసేందుకే పథకం ప్రకారం దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు.ప్రజలకు సేవ చేసే జెడ్పీటీసీ ఇంటిపై దాడికి దిగడం దుర్మార్గంబీసీ వర్గానికి చెందిన ఆమె ఇంటిపై దాడికి దిగడం కూటమి ప్రభుత్వ అరాచకానికి పరాకాష్టసొంత డబ్బులతో గ్రామంలో అభివృద్ధి చేసే వ్యక్తి జెడ్పీటీసీ కుటుంబంకూటమి ప్రభుత్వంలో బీసీలకు ఇచ్చే రక్షణ ఇదేనా చంద్రబాబు?ప్రశాంతంగా తయారు చేసిన నియోజకవర్గాన్ని కక్షల దిశగా తీసుకెళ్తున్నారు.ఇది మంచి పరిణామం కాదు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆలోచించాలిబీసీ నాయకులపై ఈ విధంగా ఇళ్లలో దూరి దాడిచేయడం, కనిపించిన వాహనాలను దగ్ధం చేయడం దారుణంమీకు సిగ్గుందా.. ఇలాంటి దాడులతో మా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరువృద్ధురాలు , గర్భిణీలపై కూడా దాడి చేయడం సిగ్గుమాలిన చర్యఎవరైతే దాడికి పాల్పడ్డారో.. వారిపై వెంటనే చర్యలు తీసుకోండి.ఆ రోజు ఎంపీడీవోపై దాడి జరగకపోయినా ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్ కల్యాణ్ బీసీలపై దాడి జరిగితే ఎక్కడకు వెళ్లాడు?కార్యకర్తలు, నాయకులకు మేమంతా తోడుగా ఉంటాం.జిల్లా అధికారులు చిత్తశుద్ధితో దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలి.కాకినాడ..కాకినాడలో పోలీసులు ఓవరాక్షన్..తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలలో పోలీసుల ఓవరాక్షన్మున్సిపల్ చైర్మన్ సుధా బాలుతో పాటుగా కౌన్సిలర్లను కౌన్సిల్ హల్లోకి అనుమతించని పోలీసులుఉదయం 11 గంటలకు లోనికి అనుమతి ఇస్తామని మున్సిపల్ కార్యాలయం గేట్లు మూసివేసిన పోలీసులుఉదయం 10 గంటలకు కౌన్సిల్ హల్లో ఉండాలని.. లేదంటే లోనికి అనుమతించమని మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లకు ఆదేశాలు.చైర్మన్ ఛాంబర్లో కూర్చుంటామని చెప్పినా లోనికి అనుమతించని పోలీసులు.పోలీసుల తీరుపై కౌన్సిలర్ల ఆగ్రహంనెల్లూరు..కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి.కార్పొరేటర్స్తో కలిసి కార్పొరేషన్కి బయల్దేరిన ఎమ్మెల్సీ, సిటీ ఇంచార్జ్ చంద్రశేఖర్ రెడ్డి.ఇప్పటికే విప్ జారీ చేసిన వైఎస్సార్సీపీ..ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారందరూ వైఎస్సార్సీపీ అభ్యర్డికి ఓటేయ్యాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తివిప్ ధిక్కరిస్తే వేటు తప్పదని హెచ్చరిక.తిరుపతి..మేయర్ డాక్టర్ శిరీష వ్యక్తిగత సహాయకుడు నచికేతన్పై టీడీపీ నేతలు దాడి.టీడీపీ నాయకులు అన్నారాం చంద్రయ్య, కార్యకర్తల హల్చల్ఈ క్రమంలో దాడి ఘటపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్న మేయర్ అట్టందర్తిరుపతి..భూమన నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో ఎస్వీ యూనివర్సిటీకి బయలుదేరిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకోనున్న ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం విజయవాడ..నందిగామ, నూజివీడు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలుబలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలుఅనారోగ్య కారణాలతో మృతి చెందిన నందిగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులుచనిపోయిన వారి వార్డులకు ఎన్నికలు జరపకుండానే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక పెడుతున్న కూటమి ప్రభుత్వంచనిపోయిన కౌన్సిలర్ల వార్డులకు ఎన్నికలు జరపకుండా చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికకు ఎన్నిక పెట్టడంపై అభ్యంతరంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీనేడు తీర్పునివ్వనున్న కోర్టుకోర్టులో ఉన్నప్పటికీ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక పెట్టిన కూటమి ప్రభుత్వంఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభపెట్టి తమ పార్టీలోకి చేర్చుకున్న టీడీపీనూజివీడిలోనూ ప్రలోభాలకు తెర తీసిన టీడీపీ నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికబలం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ దక్కించుకోవడానికి టీడీపీ కుట్రలురాత్రికి రాత్రి వైఎస్సార్సీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లను పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ హిందూపురంలో టీడీపీ కుట్రలు..వైఎస్సార్సీపీ చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామాతో హిందూపురంలో ఎన్నికహిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ కుట్ర రాజకీయాలు.ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు.టీడీపీ బరితెగింపు రాజకీయాలు.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తాడేపల్లి..నేడు డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికఖాళీ అయిన పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీకార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపార్టీ నిర్ణయించిన అభ్యర్థికి ఓటెయ్యాలని ఆదేశంపార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని ఆదేశాలువిప్ ధిక్కరిస్తే అనర్హత వేటు వేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంతిరుపతి..తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సర్వం సిద్దంఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తివైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అందరికీ విప్ జారీ.విప్ ఉల్లంఘిస్తే సభ్యత్వం రద్దు చేస్తామన్న విప్ రాధాకృష్ణ రెడ్డితిరుపతి..తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో కార్పొరేటర్లకు విప్ జారీ చేసిన వైఎస్సార్సీపీడిప్యూటీ మేయర్ ఎన్నికలు ఒకటవ డివిజన్ కార్పొరేటర్ ఆదం రాధాకృష్ణ రెడ్డి విప్గా నియామకంతిరుపతి కార్పొరేషన్ 46 మంది డివిజన్ కార్పొరేటర్లకు వాట్సాప్ ద్వారా విప్ ఆదేశాలువిప్ను ధిక్కరిస్తే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరికతిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ టీమ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్హిందూపురంలో 144 సెక్షన్..శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో 30 యాక్ట్, 144 సెక్షన్ విధింపు. చైర్మన్ ఎన్నిక అనంతరం విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్లు లేదన్న డీఎస్పీ మహేష్తిరుపతి..పద్మావతిపురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుభూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులువైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు కొనసాగుతున్న బెదిరింపులు, పోలీసుల వేధింపులుఆటో నగర్లో కార్పొరేటర్ ఉమా అజయ్కు చెందిన షాపును ధ్వంసం చేసిన మున్సిపల్, రెవెన్యూ అధికారులుకూటమికి మద్దతు ఇవ్వకుంటే మిగిలిన ఆస్తులు విధ్వంసానికి దిగుతామని హెచ్చరికలు తిరుపతి కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్, ఏలూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లకు ఎన్నికలు జరగనుండగా.. నందిగామ మున్సిపాలిటీ, హిందూపురం మున్సిపాలిటీ, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, నూజివీడు మున్సిపాలిటీ, తుని మున్సిపాలిటీ, పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్ పర్సన్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాలకు హాజరై డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు.తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లలో ఒక్కో డిప్యూటీ మేయర్, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులతోపాటు ఏలూరు జిల్లా నూజివీడు, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో ఒక్కో వైస్ చైర్మన్, నెలూర్లు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. -
చంఢీగఢ్ మేయర్ ఎన్నికలు: సుప్రీం కోర్టు సీరియస్
చంఢీగఢ్: చంఢీగఢ్లో మేయర్ ఎన్నికల వివాదంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ కౌన్సిలర్ మనోజ్ సోంకర్ చేతిలో ఓటమి పాలైన ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ ధరోర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. మేయర్ ఎన్నికలకు సంబంధించిన బాలెట్ పేపర్లు, ఒరిజినల్ రికార్డులు, వీడియో ఫుటేజీని పంజాబ్, హర్యానా కోర్టు రిజిస్ట్రార్కు అందజేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి బాలెట్ పేపర్లను తారుమారు చేశారని స్పష్టంగా తెలుస్తోంది? ఈ చర్యతో అతను ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటానికి ప్రయత్నించారా? అని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి తాము అనుమతించమని సుప్రీంకోర్టు పేర్కొంది. చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో చోటుచేసుకున్న అవకతవకలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని పేర్కొంది. ఇక.. ఫిబ్రవరి 7న జరగాల్సిన చంఢీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు తిరిగి ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. చంఢీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్లో మొత్తం 36 ఓట్లు ఉండగా.. బీజేపీ మేయర్ అభ్యర్థికి 16 ఓట్లు, ఆప్ అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. 8 మంది ఆప్-కాంగ్రెస్ సభ్యుల ఓట్లు చెల్లవని ప్రకటించారు. ఈ ఫలితాలపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మోసపూరితంగా ఈ ఎన్నికల్లో గెలిచిందని మండిపడింది. -
‘కేజ్రీవాల్ ఒక అడాల్ఫ్ హిట్లర్’
చంఢీఘర్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను నియంత అడాల్ఫ్ హిట్లర్తో పోల్చాడు. ఇప్పటికే.. హర్యాణలోని చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేస్తాయని ఇటు ఆప్ నేత రాఘవ్ చద్దా.. అటు కాంగ్రెస్ నేత పవన్ కుమార్ బన్సల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై నేడు కొన్ని గంటల ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేజ్రీవాల్ భేటీ కూడా అయ్యారు. వారి భేటీ ముగిసిన అనంతరమే పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ను నియంత అడాల్ఫ్ హిట్లర్తో పోల్చాడు. కేజ్రీవాల్ పాలన హిట్లర్ నియంత పాలన వలే ఉంటుందని మండిపడ్డారు. మొదట ఆప్ పార్టీ కార్యాలయాల్లో డా.బీఆర్ అంబేద్కర్, భగత్సింగ్ల వంటి మహనీయుల ఫొటోలను తొలగించాలని.. వాటి స్థానంలో నియంత అడాల్ఫ్ హిట్లర్ ఫొటోలు పెట్టుకోవాలని దుయ్యబట్టారు. ఆప్ నేతలంగా అడాల్ఫ్ హిట్లర్ వలే ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చంఢీఘర్ మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిలో భాగంగా కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. ఆప్కు మేయర్ పదవి, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి అని కూడా చర్చించుకున్నారు. అయితే ఇప్పటివరకు ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకపోవటం గమనార్హం. ఇక.. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు రావొచ్చని ఇరు పార్టీల కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. చదవండి: Flight Delays: శశి థరూర్కు సింధియా కౌంటర్ -
షాకిచ్చిన ఓటర్లు.. మృతి చెందిన అభ్యర్థికి తిరుగులేని విజయం.. కారణం ఇదే!
లక్నో: ఉత్తరప్రదేశ్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మరణించిన స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకుని అందరికీ షాకిచ్చారు ఆ ప్రాంత ఓటర్లు. ప్రజల పట్ల అభ్యర్థి ప్రవర్తనే ఆమెను ఎన్నుకునేలా ప్రజలను ప్రేరేపించిందని, అందుకే ఆమెను తిరిగులేని విజయాన్ని అందించారని స్థానికులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్లో హసన్పూర్ మున్సిపాలిటీలోని 7వ వార్డు మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆసియా ఏప్రిల్ 16న 7వ వార్డు అభ్యర్థిగా తన నామినేషన్ను దాఖలు చేసింది. అయితే అనారోగ్యం కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఏప్రిల్ 20న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మృతి చెందింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం ఆసియా మృతి చెందినప్పటికీ ఆమెకే పట్టం కట్టారు. ఈ విజయంపై ఆసియా భాగస్వామి ముంతజీబ్ అహ్మద్ మాట్లాడుతూ.. ' ఆమె గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రజలకు సేవ చేయాలనే కోరికతో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రవర్తన వల్లనే ప్రజల మనసు గెలుచుకోగలిగింది. ఆమెపై ప్రజల్లో ఉన్న ప్రేమ వల్లే ఎన్నికల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ‘ఆసియా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. అయితే నామినేషన్ వేసిన కొన్ని రోజులకే ఆమె మృతి చెందింది. ఎన్నికల ఫలితాల్లో ఆమె గెలుపొందింది. దీంతో మళ్లీ ఆ వార్డులో ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని’ హసన్పూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ తెలిపారు. చదవండి: కాబోయే భర్తను అరెస్ట్ చేసిన లేడీ సింగం గుర్తుందా?.. ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూత -
ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హీట్
-
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఆయన బెదిరిస్తున్నారని, తివారీ హెచ్చరికలు చూస్తుంటే కేజ్రీవాల్ హత్యకు కుట్ర జరగుతున్నట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఆయనను ఏమీ చెయ్యలేక హత్య చేయాలనుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్పై ఎవరైనా దాడి చేయవచ్చని తివారీ అన్న మాటలకు అర్థమేంటని సిసోడియా ప్రశ్నించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, పోలీసు కేసు కూడా పెడతామని పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. మరోవైపు మనోజ్ తివారీ ఈ ఆరోపణలను ఖండించారు. ఎన్నికల్లో ఆప్ టికెట్లు అమ్ముకుందని ఆరోపించారు. ఆప్ నేత సందీప్ భరద్వాజ్ ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆయన మరణానికి కారణాలేంటో వెలికి తీయాలన్నారు. చదవండి: గుజరాత్ ఎన్నికలు: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు.. -
విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ నేత కన్నుమూత
Congress Leader Harinarayan Gupta.. కాంగ్రెస్ నేత గుండెపోటు కారణంగా అకాల మరణం పొందాడు. ఎన్నికల్లో ఓటమిని భరించలేక తనువు చాలించారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇటీవల మధ్యప్రదేశ్లోని 413 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లు, 99 నగర పాలిక పరిషత్లు, 298 నగర్ పరిషత్లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కాగా, జూలై 6, 13 తేదీల్లో రెండు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. అయితే, వీటి ఫలితాలు ఆదివారం వెల్లడించారు. ఎన్నికల్లో భాగంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడైన హరినారాయణ్ గుప్తా, మునిసిపల్ కౌన్సిల్ వార్డు నెం.9లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేశాడు. గుప్తాకు పోటీగా స్వతంత్ర అభ్యర్థి అఖిలేష్ గుప్తా బరిలో నిలిచారు. కాగా, ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి అఖిలేష్ గుప్తా 14 ఓట్ల తేడాతో ఆయనపై గెలుపొందారు. ఈ క్రమంలో తన ఓటమి వార్త విన్న హరినారాయణ్ ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం గుండెపోటు కారణంగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. ఆయన మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అములుకున్నారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్లోని తొలిసారిగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. సింగ్రౌలీలో విజయం సాధించింది. ఇక, బుర్హాన్పూర్, సత్నా, ఖాండ్వా, సాగర్లలో అధికార బీజేపీ విజయం సాధించింది. #Congress candidate Harinarayan Gupta, contesting in municipal council polls for #Rewa district in #MadhyaPradesh, died of heart attack after his election loss.https://t.co/DHTh5JMwqh — IndiaToday (@IndiaToday) July 17, 2022 ఇది కూడా చదవండి: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా -
Elections: ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం
గుహవటి: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. అసోంలోని గువాహటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, మిత్రపక్షం ఏజీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం అసోం సీఎం హిమంత్ బిస్వాస్ శర్మ.. ప్రజలకు శిరసువంచి అభివాదం చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, గువాహటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 వార్డులకు ఎన్నికలుగా జరుగగా 58 వార్డులను బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థులు 52 వార్డుల్లో గెలుపొందగా, 7 వార్డులలో పోటీ చేసిన ఏజేపీ 6 వార్డులు దక్కించుకుంది. అసోంలో తొలిసారిగా బరిలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఇక, కాంగ్రెస్ పార్టీకి మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్క వార్డు కూడా గెలుచుకోకపోవడంతో హస్తం నేతలు ఖంగుతిన్నారు. ఇదిలా ఉండగా.. మున్సిపల్ ఎన్నికలు చివరిసారిగా 2013లో జరిగాయి. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక, ఈ విజయంపై అసోం సీఎం హిమంత్ బిస్వాస్ శర్మ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భారీ విజయాన్ని అందించిన ప్రజలకు తన శిరసువంచి అభివాదం చేస్తున్నానని అన్నారు. బీజేపీ విజయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఘన విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. I bow my head to the people of Guwahati for giving @BJP4Assam & its allies a historic win in #GMCElections. With this massive mandate, people have reaffirmed their faith on our development journey under the guidance of Adarniya PM Shri @narendramodi ji.@JPNadda @BJP4India pic.twitter.com/AWZ5mqIhc3 — Himanta Biswa Sarma (@himantabiswa) April 24, 2022 -
ముఖ్యమంత్రి సింప్లిసిటీ.. కాలి నడకన పోలింగ్ బూత్కు..
భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆడంబరాలకు దూరంగా ఉంటారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన సింప్లిసిటీ వార్తల్లో నిలిచింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీఎం నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 9.10 గంటలకు ఓ సాదాసీదా ఓటరుగా కాలినడకన 53వ నంబర్ వార్డులోని ఏరోడ్రామ్ ఉన్నత పాఠశాలకు చేరుకున్న ఆయన 544వ నంబర్ పోలింగ్ బూత్లో బీఎంసీ మేయర్, కార్పొరేటర్లకు ఓటు వేశారు. నవీన్ నివాస్ నుంచి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఈ పోలింగ్ కేంద్రం ఉండడంతో సీఎం సాధారణ రక్షణ దళం సహాయంతో కాలినడకన ఓటు వేసేందుకు వెళ్లడం విశేషం. (చదవండి: 10 నిమిషాల్లో డెలివరీ ఎలా సాధ్యం?: ‘జొమోటో’కు పోలీసుశాఖ నోటీసులు) -
అస్సాం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం
గువాహటి: అస్సాంలో మున్సిపల్ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ 80 మున్సిపాల్టీలకు గాను ఏకంగా 72 మున్సిపాల్టీలను గెలుచుకుంది. ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కనీసం ఒక్క మున్సిపాల్టీని సైతం దక్కించుకోలేకపోయింది. మరియానీ, హైలాకండీ పురపాలక సంఘాలను స్వతంత్రులు గెలుచుకున్నారు. మరో ఆరు మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అస్సాం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: ఈసీ ఎవరి తొత్తు కాదు.. అన్ని పార్టీలు సమానమే: సీఈసీ సుశీల్ చంద్ర.. నేర చరితులు ఎందరంటే..) -
తృణమూల్ ప్రభంజనం.. 102 మున్సిపాల్టీలు కైవసం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో 10 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రెండోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 108 మున్సిపాల్టీలకు గాను ఏకంగా 102 మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది. ప్రతిపక్షాలను చావుదెబ్బ కొట్టింది. పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. మొత్తం 2,170 వార్డులకు గాను టీఎంసీ 1,870 వార్డులను దక్కించుకుంది. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీ 63.45 శాతం ఓట్లను సాధించింది. నాలుగు మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్న ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి ఈ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. నందిగ్రామ్ ఎమ్మెల్యే, బీజేపీ నేత సువేందు అధికారికి కంచుకోట అయిన కాంతీ మున్సిపాల్టీలో టీఎంసీ విజయం సాధించడం గమనార్హం. కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన హమ్రో పార్టీ డార్జీలింగ్ మున్సిపాల్టీని దక్కించుకుంది. తాహెర్పూర్ పురపాలక సంఘంలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ జెండా ఎగురవేసింది. బీజేపీ కనీసం ఒక్క మున్సిపాల్టీని కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవమే మిగిలింది. వారణాసిలో నేడు, రేపు మమతా ప్రచారం ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సాయంత్రం కోల్కతా నుంచి బయలుదేరి వెళ్లారు. ఆమె రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గురువారం, శుక్రవారం ప్రచారం నిర్వహిస్తారు. -
సీట్లు ఎక్కువ కావాలి.. ఒంటరిగానే పోటీ చేస్తాం
చెన్నై: తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై సోమవారం ప్రకటించారు. తమిళనాడు వ్యాప్తంగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో అన్నామలై మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ కార్యకర్తలు భావిస్తున్నందున ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అభ్యర్థుల తొలి జాబితాను త్వరలో విడుదల చేస్తామన్నారు. (చదవండి: చిక్కుల్లో డీఎంకే ఎమ్మెల్యే) 'ఇదేమి కష్టమైన నిర్ణయం కాదు. అన్నాడీఎంకే నేతలు ఓ పన్నీర్సెల్వం, ఎడప్పాడి కె. పళనిస్వామితో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయాన్ని జాతీయ నాయకులు ఆమోదించారు. ఇలాంటి ఎన్నికల్లో సీట్ల పంపకం చాలా కష్టంతో కూడుకున్న పని. మాకు 10 శాతం సీట్లు కేటాయించేందుకు అన్నాడీఎంకే ముందుకు వచ్చింది కానీ మేం ఎక్కువ శాతం సీట్లు కావాలని అడిగామ’ని అన్నామలై తెలిపారు. బీజేపీ నిర్ణయంపై అన్నాడీఎంకే అధికార ప్రతినిధి డి జయకుమార్ మాట్లాడుతూ.. కమలం పార్టీ అడిగినన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. సీట్ల పంపకం చర్చలు సామరస్యంగా జరిగినా ఫలప్రదం కాలేదన్నారు. 2024 లోక్సభ ఎన్నికలు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగుతుందా, లేదా అనేది ఏఐఏడీఎంకే అధినాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. కాగా.. సేలం, అవడి, తిరుచ్చి, మదురై, శివకాశి, తూత్తుకుడి మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు అన్నాడీఎంకే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. (క్లిక్: డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్పై వేటు) -
న్యూయార్క్లో డ్రీమర్స్కు ఓటు హక్కు
న్యూయార్క్: అమెరికా పౌరసత్వం లేకపోయినప్పటికీ న్యూయార్క్ నగరం డ్రీమర్స్కి ఓటు వేసే హక్కు కల్పించింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి దేశానికి వచ్చి ఇక్కడే పెరిగిన వారిని అక్కున చేర్చుకునే ప్రయత్నంలో భాగంగా నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 8 లక్షలకు పైగా యువత ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డ్రీమర్స్ ఓటు వేయడానికి వీలు కల్పిస్తూ న్యూయార్క్ నగర కౌన్సిల్ నెల రోజుల క్రితమే ఒక బిల్లును ఆమోదించింది. మేయర్ దానిపై ఆమోద ముద్ర వేయడంతో ఆదివారం నుంచి అది చట్టరూపం దాల్చింది. అయితే ఈ చట్టాన్ని కోర్టులో సవాల్ చేయనున్నట్టుగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. దేశ పౌరసత్వం లేని వారికి ఓటు హక్కు కల్పించిన తొలి అతి పెద్ద నగరంగా న్యూయార్క్ రికార్డు సృష్టించింది. పౌరులు కాని వారు ఇప్పటికీ అధ్యక్ష, రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు. -
తిరుగులేని శక్తిగా వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2021 సంవత్సరం అఖండ విజయాలను అందించింది. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో విజయదుందుభి మోగించి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వాగ్దానాల్లో 95 శాతం హామీలను ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదిలోనే ఆయన అమలుచేశారు. ఫలితంగా.. సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు.. అందిస్తున్న సుపరిపాలనతో వైఎస్సార్సీపీపై ప్రజాదరణ నానాటికీ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్సభ స్థానాలను (88 శాతం) దక్కించుకున్న వైఎస్సార్సీపీ.. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడమే అందుకు తార్కాణం. 1983 ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు.. 1989లో కుప్పం నియోజకవర్గానికి వలస వెళ్లారు. దొంగ ఓట్లు.. దౌర్జన్యాలు, ప్రలోభాలతో మూడు దశాబ్దాలకు పైగా చంద్రబాబు కుప్పంను తన గుప్పెట్లో పెట్టుకున్నారు. కానీ.. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ ఆయన ఆటలు సాగలేదు. టీడీపీని వైఎస్సార్సీపీ చావుదెబ్బ తీసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) మాజీ కమిషనర్ నిమ్మగడ్డ ద్వారా ఏడాదిపాటూ స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు అడ్డుకున్నప్పటికీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఆయన్ను చావుదెబ్బ తీశారు. వంద శాతం కార్పొరేషన్లు వైఎస్సార్సీపీకే.. చివరకు ఈ ఏడాది మార్చి, నవంబర్లలో రెండు విడతలుగా 13 కార్పొరేషన్లు (నగర పాలక సంస్థలు), 86 నగర పంచాయతీ, మున్సిపాల్టీలకు ఎన్నికలను ఎస్ఈసీ నిర్వహించింది. ఈ ఎన్నికల్లో వంద శాతం అంటే.. 13 కార్పొరేషన్లను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. 87 నగర పంచాయతీ, మున్సిపాల్టీల్లో 84 నగర పంచాయతీ, మున్సిపాల్టీల (98 శాతం)ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. చంద్రబాబు మూడున్నర దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కేంద్రంలోని కుప్పం మున్సిపాల్టీలో సైతం వైఎస్సార్సీపీ ఆఖండ విజయం సాధించడం గమనార్హం. గ్రామ పంచాయతీల్లోనూ పాగా మొత్తం 13,092 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తే.. 10,536 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. అంటే 80.4 శాతం గ్రామ పంచాయతీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుందన్న మాట. అదే కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలకుగానూ 74 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులే విజయం సాధించి.. టీడీపీ కోటను బద్దలుకొట్టారు. 100% జిల్లా పరిషత్లు వైఎస్సార్సీపీకే.. రాష్ట్రంలో 652 జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలు (జెడ్పీటీసీ), 9,717 మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల (ఎంపీటీసీ)కు ఎన్నికలు జరిగితే.. 642 జెడ్పీటీసీ స్థానాల (98.46 శాతం)ను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుని అఖండ విజయాన్ని సాధించింది. అలాగే, మొత్తం 13 జెడ్పీ చైర్మన్ పదవులనూ ఆ పార్టీ క్లీన్స్వీప్ చేసింది. ఇక 9,717 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. 8,380 స్థానాలు (86.24 శాతం) స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 96 శాతం మండల పరిషత్ అధ్యక్ష పదవులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని మొత్తం నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 68 ఎంపీటీసీ స్థానాలకుగానూ 63 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. ‘మండలి’లో సంపూర్ణ ఆధిక్యం శాసన మండలిలో 58 స్థానాలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ మండలిలో టీడీపీ ఆధిక్యంలో ఉంది. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడం, పలువురు టీడీపీ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఇటీవల ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేసింది. దీంతో మండలిలో వైఎస్సార్సీపీ బలం 18 నుంచి 32కు ఒక్కసారిగా పెరిగి సంపూర్ణ ఆధిక్యత సాధించినట్లయింది. దేశ చరిత్రలో రికార్డు..: గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఒకే పార్టీ అధికారంలో ఉండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో 80 శాతానికి పైగా గ్రామ పంచాయతీలతోపాటు 13 జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు.. ఇలా అన్నింటా వైఎస్సార్సీపీ అధికారంలో ఉంది. సీఎం వైఎస్ జగన్ సర్కార్ తీసుకునే సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతోనే ఇది సాధ్యమైందని వారు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. -
ఫుల్ జోష్ లో ఆప్.... తరువాత టార్గెట్ అదే
-
kuppam: పెద్దాయన యంత్రాంగం.. మిథున్ మంత్రాంగం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో ఎప్పుడు ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. తిరుపతి లోక్సభ ఎన్నిక, బద్వేలు శాసనసభ ఉపఎన్నికల్లో బాధ్యత తీసుకుని ఏకపక్ష విజయాలను అందించిన ట్రాక్ రికార్డు ఆయనది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల బాధ్యతలు తీసుకున్న పెద్దిరెడ్డి వరుసగా ఏకపక్ష విజయాలను అందిస్తూ వచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఏడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీకి జరిగిన తొలి ఎన్నికకు పెద్దాయన తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి కూడా తోడయ్యారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెద్దిరెడ్డి గత కొంతకాలంగా విస్తృతంగా పర్యటించారు. దీంతో పాటు తిరుపతి వేదికగా జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సమావేశ నిర్వహణ చూస్తూనే కుప్పం ఎన్నికల బాధ్యతను పర్యవేక్షించారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు పెద్దిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యక్తిగతంగానూ తూలనాడారు. అయినా సరే సంయమనం పాటించారు. ఆ సందర్భంలోనే బాబు వ్యాఖ్యలపై స్పందించాలని పెద్దిరెడ్డిని మీడియా కోరగా ఇప్పుడేమీ మాట్లాడనని, కుప్పంలో గెలిచిన తరువాతే మాట్లాడుతానని స్పష్టం చేశారు. బాబు విమర్శలకు దీటుగా ప్రచార ఉధృతిని పెంచి ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కుప్పంవాసులకు జరిగిన మేలును వివరించారు. మరోవైపు మిథున్రెడ్డి కుప్పంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భరత్తో కలిసి ప్రచారం నిర్వహించారు. చేతికి గాయమైనప్పటికీ ఆసుపత్రి నుంచి నేరుగా కుప్పం ప్రచారంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కొంతకాలంగా కుప్పంలో ఉంటూ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆత్మస్ఖైర్యం నింపారు. చంద్రబాబు, లోకేష్లు కార్యకర్తలను రెచ్చగొట్టి వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేయించారు. అయితే వైఎస్సార్సీపీ శ్రేణులు డీలా పడకుండా ఎక్కడికక్కడ కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. ఫలితంగా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మొత్తంగా తండ్రి, తనయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డి సారథ్యంలో వైఎస్సార్సీపీ నేతల సమష్టి కృషితో కుప్పంలో అరుదైన విజయం నల్లేరు మీద నడకలా సాగడం విశేషం. బాబు పతనం ఇలా.. ► 1989లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన బాబు 2019 వరకు గెలుస్తూ వస్తున్నారు. ► తొలిసారిగా 6,918 ఓట్ల మెజారిటీ సాధించిన బాబు.. 1994, 1999లో 60 శాతం వరకు మెజారిటీ సాధించారు. ► 2004లో 42 శాతం, 2009లో 46 శాతం మెజారిటీ వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ 28 శాతానికి పడిపోయింది. ► 2019లో జరిగిన ఎన్నికల్లో 30వేల ఓట్ల తేడాతో కేవలం 16 శాతం మెజారిటీ. ► తాజా స్థానికసంస్థల ఎన్నికల్లో శాంతిపురం, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం జెడ్పీటీసీలను, ఎంపీపీలను, 62 ఎంపీటీసీ, 74 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీని చావుదెబ్బ కొట్టింది. -
ఆ వలంటీర్.. ఇక కౌన్సిలర్!
దాచేపల్లి: ఇప్పటికే పలువురు గ్రామ, వార్డు వలంటీర్లు సర్పంచ్లుగా, ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. అదే కోవలో ఇప్పుడు గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో వార్డు వలంటీర్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 12వ వార్డు నుంచి వైఎస్సార్సీపీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసిన దేవళ్ల లక్ష్మీప్రసన్న.. సమీప టీడీపీ అభ్యర్థి గోళ్ల నారాయణపై 38 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు 22 ఏళ్ల కౌన్సిలర్! వల్లూరు(కమలాపురం): వైఎస్సార్ జిల్లా కమలాపురం నగర పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డుకు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్వీ నిఖిల్రెడ్డి విజయం సాధించారు. అతని వయసు 22 ఏళ్లు మాత్రమే. డిగ్రీ చదివిన నిఖిల్రెడ్డి 95 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. -
కుప్పం ఓటమిపై సైలెంట్.. హైదరాబాద్కు చంద్రబాబు
Kuppam Municipal Election Results 2021: మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలిన వేళ చంద్రబాబు ఉండవల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. పోలింగ్కు కొద్దిరోజుల ముందు నుంచి ఉండవల్లిలోనే ఉన్న ఆయన ఫలితాలు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడిపోవడంతో ఆయన కొంత అసహనంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు టీడీపీకి పూర్తి వ్యతిరేకంగా రావడంతో ఆయన వాటిపై స్పందించలేదు. కుప్పం మునిసిపాలిటీలో గెలిస్తే మీడియాతో మాట్లాడాలని భావించినట్లు సమాచారం. కానీ అక్కడ చిత్తుగా ఓడిపోవడంతో స్పందించేందుకు ఇష్టపడలేదు. మౌనంగా ఉండవల్లి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. కొండపల్లి మునిసిపాలిటీ 10వ వార్డులో గెలిచిన స్వతంత్ర అభ్యర్థిని శ్రీలక్ష్మికి గన్నవరం ఎయిర్పోర్టులో చంద్రబాబు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. -
టీడీపీ ఓటమి సంపూర్ణం
సాక్షి, అమరావతి: మలి విడత మున్సిపల్ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. ఇటీవల జరిగిన పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తొలి విడత మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం పాలైన టీడీపీ.. తాజా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘోర ఓటమి చవిచూసింది. దీంతో టీడీపీ ఓటమి సంపూర్ణమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు వేసిన ఎత్తులు, పన్నిన వ్యూహాలు పనిచేయలేదు. అసత్య ప్రచారం, సానుభూతి కోసం ఆడిన డ్రామాలు విఫలమయ్యాయి. తాజాగా ఒక కార్పొరేషన్, 12 మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. దర్శి మున్సిపాల్టీలో మాత్రమే గెలిచింది. మరో రెండు చోట్ల పోటీ ఇవ్వగలిగింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటా ఓడిపోయింది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. అక్కడ 25 వార్డులకు ఆరింటిలోనే టీడీపీ గెలిచింది. చంద్రబాబుకు కంచుకోట అయిన కుప్పం తొలిసారి చేజారిపోవడం టీడీపీ శ్రేణులకు శరాఘాతంగా మారింది. చంద్రబాబే ఓడిపోతే ఇక పార్టీ పరిస్థితి ఏమిటనే చర్చ నాయకుల్లో మొదలైంది. సొంత నియోజకవర్గంలోనే గెలవలేని చంద్రబాబు తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో ఎలా గెలిపించగలరనే అనుమానాలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇష్టానుసారం నోరుపారేసుకున్న చంద్రబాబు.. తాజా ఫలితాల తర్వాత నోరు మెదపకుండా హైదరాబాద్ వెళ్లిపోయారు. నెల్లూరులో టీడీపీకి అవమానం నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లలో ఒక్కటీ టీడీపీకి దక్కలేదు. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, బీద రవిచంద్ర వంటి నేతలున్నా వైఎస్సార్సీపీకి పోటీ ఇవ్వలేక చేతులెత్తేశారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాల, దాచేపల్లిలో ప్రభావం చూపలేకపోయారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ప్రాతినిథ్యం వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నియోజకవర్గంలోని ఆకివీడు మున్సిపాలిటీలో జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగినా వైఎస్సార్సీపీకి పోటీ ఇవ్వలేకపోయింది. అక్కడ 20 వార్డులకు 4 వార్డుల్లో మాత్రమే అతి కష్టంమీద గెలవగలిగారు. వైఎస్సార్ కడప జిల్లాలోని రాజంపేట, కమలాపురం మున్సిపాల్టీల్లో టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కమలాపురంలో 20 వార్డులకు 5, రాజంపేటలో 20 వార్డులకు 4 వార్డుల్లోనే గెలిచింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 20 వార్డులకు రెండు వార్డులే టీడీపీకి వచ్చాయి. కర్నూలు జిల్లా బేతంచర్లలో 20 వార్డులకు కేవలం ఆరింటిలో టీడీపీ గెలిచింది. అనంతపురం జిల్లా పెనుకొండలోనూ టీడీపీ భంగపడింది. మాజీ మంత్రి పరిటాల సునీత సొంత ప్రాంతమైన ఇక్కడ 20 వార్డులకు రెండే రెండు వార్డులు వచ్చాయి. దక్కింది దర్శి ఒక్కటే ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాల్టీ ఒక్కటే టీడీపీకి దక్కింది. అక్కడ 20 వార్డులకు 13 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపాల్టీలో పోటీ ఇవ్వగలిగింది. అక్కడ 29 వార్డులకు 14 టీడీపీ, 14 వైఎస్సార్సీపీ గెల్చుకున్నాయి. ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్సీపీకి టీడీపీ పోటీ ఇచ్చినా గెలవలేకపోయింది. -
నెల్లూరు క్లీన్ స్వీప్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 54 డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. టీడీపీ నామరూపాలు లేకుండా పోయింది. బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐల ఉనికే కనిపించలేదు. ఎన్నికలు ఏవైనా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. వైఎస్సార్సీపీకి తిరుగులేదని మరోమారు రుజువైంది. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ప్రజలు 20 వార్డులకుగాను 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు కౌన్సిలర్లుగా పట్టం కట్టారు. సీఎం జగన్ రాజకీయాలకు అతీతంగా అందిస్తున్న పాలన, మంత్రి డాక్టర్ అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కష్టానికి తగ్గ ఫలితంగా మునిసిపల్ ఫలితాలను విశ్లేషకులు వర్ణిస్తున్నారు. రాష్ట్ర నేతలకు చేదు అనుభవం టీడీపీ జాతీయ, రాష్ట్ర నేతలుగా చలామణి అవుతున్న వారందరికి మునిసిపల్ పోరులో చేదు అనుభవం ఎదురైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నివాసం ఉంటున్న 20వ డివిజన్ వైఎస్సార్సీపీకి ఏకగ్రీవంగా దక్కింది. పొలిట్బ్యూరో మాజీ సభ్యుడు, కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సొంత డివిజన్లో టీడీపీ అభ్యర్థి ఘోర పరాజయం పాలయ్యారు. సోమిరెడ్డి స్వగ్రామం అల్లీపురం 2వ డివిజన్ పరిధిలో ఉంది. ఈ డివిజన్లో టీడీపీ అభ్యర్థి మేకల రామ్మూర్తి విజయం కోసం సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆయన తనయుడు ఇంటింటా ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుని తీరాలనే దిశగా అనేక ప్రలోభాలకు గురిచేశారు. అయినప్పటికీ ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నా అక్కడ సోమిరెడ్డి వర్సెస్ కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నట్లుగా ఎన్నికలు సాగాయి. ఇద్దరూ తమ అభ్యర్థులు గెలిపించుకోవాలని పోటాపోటీగా ప్రచారం చేశారు. 889 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి రామ్మోహన్ విజయం సాధించారు. మాజీ మంత్రి నారాయణ నివాసం ఉంటున్న 12వ డివిజన్ (చింతారెడ్డిపాళెం) వైఎస్సార్సీపీకి ఏకగ్రీవంగా దక్కింది. టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ నివాసం ఉంటున్న 18వ డివిజన్లోను, పార్టీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నివాసం ఉన్న 16వ డివిజన్లోను వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. -
కుప్పకూలిన బాబు కోట
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలతో మొదలైన వైఎస్సార్సీపీ జైత్రయాత్ర తాజాగా జరిగిన రెండో దశ నగరపాలక(కార్పొరేషన్), పురపాలక (మున్సిపాల్టీ), నగర పంచాయతీ ఎన్నికల్లోనూ అప్రతిహతంగా కొనసాగింది. నెల్లూరు కార్పొరేషన్తో సహా 12 మున్సిపాల్టీ, నగరపాలక సంస్థలకు తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనను ప్రజలు మరోసారి ఆశీర్వదించారు. సోమవారం పోలింగ్ జరగ్గా బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఎంపీ, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల తరహాలోనే రెండో దశ నగర, పురపాలక ఎన్నికల్లోనూ ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. ఫ్యాన్ ప్రభంజనానికి సైకిల్ నామరూపాలు లేకుండా పోయింది. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకుగానూ(ఒకటి ఏకగీవ్రం) అన్నిచోట్లా వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేసింది. ఇక్కడ టీడీపీకి కనీసం ప్రాతినిధ్యం కూడా దక్కలేదు. ఇక ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాల్టీని వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. 25 వార్డులకు కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికలు జరగ్గా ఏకగ్రీవంతో కలిపి వైఎస్సార్సీపీ అభ్యర్థులు 19 వార్డుల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ కేవలం ఆరు వార్డులకే పరిమితమైంది. పెనుకొండ, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లి, గురజాల, కొండపల్లి, జగ్గయ్యపేట, ఆకివీడు పురపాలక, నగర పంచాయతీలను కూడా వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. దర్శి నగర పంచాయతీలో మాత్రమే టీడీపీ ఉనికి చాటుకోగలిగింది. ఇక్కడ 20 వార్డులు ఉండగా వైఎస్సార్సీపీ 7 వార్డుల్లో, టీడీపీ 13 వార్డుల్లో గెలుపొందాయి. 100 % ఒకే పార్టీకి ఇదే తొలిసారి.. తొలి విడత జరిగిన ఎన్నికల్లో 12 నగర పాలక సంస్థలనూ వైఎస్సార్సీపీ సొంతం చేసుకోగా తాజాగా నెల్లూరుతో కలిపి 13 కార్పొరేషన్లలో విజయబావుటా ఎగురవేసింది. ఇక తాజా ఫలితాలతో అధికార పార్టీకి దక్కిన పురపాలక సంస్థల సంఖ్య 74 నుంచి 84కు పెరిగాయి. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన వంద శాతం నగర పాలక సంస్థలను, 97.67 శాతం పురపాలక, నగర పంచాయతీలను ఒకే పార్టీ కైవశం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సురిపాలనతో 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లను సాధించి 175 శాసనసభ స్థానాలకుగానూ 151 చోట్ల, 25 లోక్సభ స్థానాలకుగానూ 22 చోట్ల వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను అమలు చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి నాంది పలికారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో ఫలాలను అందించడం ద్వారా పరిపాలనలో నూతన అధ్యాయానికి తెరతీశారు. పరిపాలన సంస్కరణలను తెచ్చి గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే పరిపాలనను తీసుకెళ్లారు. రెండున్నరేళ్లలో దాదాపు 15 నెలలు రెండు విడతలుగా కరోనా మహమ్మారి విరుచుకుపడి ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా సంక్షేమ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ కరోనా కట్టడి చర్యలు తీసుకున్నారు. మంత్రివర్గంతో పాటు రాజ్యసభ, శాసనమండలి సభ్యులుగా, గ్రామ పంచాయతీ, నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల ఛైర్మన్లు/ఛైర్పర్సన్లుగా 50 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే అవకాశమిచ్చి సామాజిక న్యాయానికి సిసలైన నిర్వచనం చూపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరుగులేని శక్తిగా.. అవినీతికి అడ్డుకట్ట వేసి పారదర్శకమైన పరిపాలన అందిస్తుండటంపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలో 13,092 గ్రామ పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల్లో 10,536 (80.47 శాతం) పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులనే ప్రజలు గెలిపించారు. పరిషత్ ఎన్నికల్లో 9,583 ఎంపీటీసీ స్థానాలకు 8249 స్థానాల్లో (86 శాతం) విజయం చేకూర్చారు. 638 జడ్పీటీసీ స్థానాలకుగానూ 630 స్థానాల్లో (98 శాతం) అధికార పార్టీ అభ్యర్థులనే ప్రజలు ఆశీర్వదించారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్ణణ, నగర ప్రాంతాల్లోనూ వైఎస్సార్సీపీని తిరుగులేని శక్తిగా ప్రజలు తీర్చిదిద్దారని స్పష్టమవుతోంది. సాగనంపిన కుప్పం.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరువు కాపాడుకునేందుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాల్టీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. వార్డుకో ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ/మాజీ ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా నియమించారు. మాజీ మంత్రులు, . బయట ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను భారీ ఎత్తున తరలించి ప్రచారం చేసినా ప్రజలు ఆయన్ను తిరస్కరించారు. తన కుమారుడు లోకేష్ను కుప్పం పంపి దౌర్జన్యాలకు దిగేలా శ్రేణులను ప్రేరేపించి భయోత్పాతం సృష్టించారు. డబ్బులు వెదజల్లారు. ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారు. చివరకు తనదైన రీతిలో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించారు. ఆయన ఎన్ని చేసినా కుప్పం మున్సిపాల్టీ ప్రజలు ‘ఓటే’ అస్త్రంగా తిరుగులేని తీర్పు చెప్పారు. వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని చేకూర్చి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 261 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపు నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 328 డివిజన్లు, వార్డులకు, 19 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న 25 డివిజన్లు, వార్డులకు కలిపి మొత్తం 353 డివిజన్లు, వార్డు స్థానాల ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికెషన్ విడుదల చేసింది. మొత్తం 1206 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఏకగ్రీవాలతో కలుపుకుని వైఎస్సార్సీపీ 261, టీడీపీ 82, జనసేన 5, స్వతంత్ర అభ్యర్థులు ఐదు చోట్ల గెలుపొందారు. -
ఎన్నికల్లో టీడీపీ ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు: అనిల్ కుమార్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్లోని 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యుర్థులను గెలిపించిన ప్రజలకు మంత్రి అనిల్కుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థులతో టీడీపీ సరిగ్గా నామినేషన్ వేయించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఏజెంట్లను కూడా నిలుపుకోలేని పరిస్థితికి టీడీపీ దిగజారిపోయిందన్నారు. చదవండి: CM YS Jagan: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్ ఎన్నికల్లో టీడీపీ ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. తమను రాజీనామా చేసి రమ్మన అచ్చెన్నాయుడు ఈ ఎన్నికల్లో ఏం చేశారు? అని నిలదీశారు. నిజంగా దమ్ముంటే టీడీపీలో మిగిలిన 19 మంది రాజీనామా చేసి గెలవాలని, ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. 54 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై ప్రజలు బాధ్యత పెట్టారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. -
చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడింది
సాక్షి, అమరావతి: చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అన్నారు. తాజా మునిసిపల్ ఫలితాలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపునకు చిహ్నమని అభిప్రాయపడ్డారు. రాబోయే రెండు దశాబ్దాల పాటు సీఎం వైఎస్ జగనే రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఈ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు గ్రహణం పట్టిందని, రాష్ట్రంలో కార్తీక పౌర్ణమి విరబూస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో సొంత కొడుకు ఓడిపోయాడని, ఇప్పుడు సొంత నియోజకవర్గం కుప్పాన్ని కూడా చంద్రబాబు పోగొట్టుకున్నారన్నారు. ఇకపై చంద్రబాబు హైదరాబాద్లో ప్రవాసాంధ్రుడిలా విశ్రాంతి తీసుకుంటూ.. రామోజీరావును, రాధాకృష్ణను రోజూ కలుసుకుంటూ భవిష్యత్పై చర్చించుకోవచ్చని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే ఓట్లు పడవని, మంచి చేస్తేనే పడతాయని అన్నారు. ‘తనపై 11 కేసులున్నాయని, అందులో సెక్షన్ 307 కూడా పెట్టారని.. ఏం పీక్కుంటారని లోకేశ్ అడుగుతుంటే కుప్పం పీకేసుకుంటామని ప్రజలు ఈ రోజు తీర్పు ఇచ్చారు. ఏదైనా కేసు ఉంటే.. 48 గంటల్లోనే స్టే తీసుకు వస్తానని లోకేశ్ అంటున్నాడు. ఇది న్యాయవ్యవస్థను కించపరచటం కాదా. కంటెప్ట్ యాక్ట్ కింద లోకేశ్ మీద సుమోటోగా విచారణ చేపట్టిæ శిక్షించాలని హైకోర్టుకు నివేదించుకుంటున్నాను’ అన్నారు. తండ్రీకొడుకులిద్దరూ సీటు మారాల్సిందే.. చంద్రబాబుకు తన కొడుకు దేనికీ పనికిరాకుండా పోయాడన్న మనస్తాపం తప్ప ఇంకొకటేమీ మిగల్లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మొన్న మంగళగిరి సీటు పోతే, ఇప్పుడు కుప్పం కూడా పోయిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ సీట్లు మారాల్సిందేనన్నారు. కారుపై నిలబడి కాలర్ ఎగరేస్తూ బూతులు తిడితే సీట్లు రావని.. ప్రజాప్రయోజనాలు కాపాడితేనే ప్రజలు ఓట్లు వేస్తారనే విషయాన్ని గుర్తించాలని లోకేశ్కు హితవు పలికారు. మాపై బాధ్యత పెంచిన విజయం: మంత్రి ముత్తంశెట్టి ప్రజలిచ్చిన తీర్పును తాము వినయంతో, విధేయతతో స్వీకరిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ తీర్పు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపైన, రాష్ట్ర ప్రభుత్వంపైన బాధ్యతను పెంచిందని వ్యాఖ్యానించారు. సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం వరకు ఒకే పార్టీ ఉండటం దేశ చరిత్రలో జరగలేదని, మొదటిసారి ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి ఘనత నమోదైందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో ఈ తీర్పు ఇచ్చారన్నారు. -
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్
-
‘చంద్రబాబులా దౌర్జన్యాలు చేయలేదు’
-
ఎన్నిక ఏదైనా తిరుగులేని వైఎస్సార్సీపీ
-
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. అన్ని ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 స్థానాలను (8 స్థానాలు ఏకగ్రీవం) క్లీన్స్వీప్ చేసి వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీలోనూ వైఎస్సార్సీపీ ఘన విజయాన్ని సాధించింది. 25 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 19 చోట్ల విజయం సాధించారు. మరో 6 చోట్ల టీడీపీ గెలుపొందింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఓటరు దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. (చదవండి: కుప్పంలో కుప్పకూలిన టీడీపీ) దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 17, 2021 -
‘బాబు పనైపోయింది.. పార్టీని ఎన్టీఆర్ ఫ్యామిలీకి అప్పగిస్తే బెటర్’
సాక్షి, అమరావతి: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లామని అందుకు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కడుతున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టే ప్రజల మద్దతు తమకు ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్ద పీట వేశామని, చంద్రబాబులా దౌర్జన్యాలు చేయలేదని విమర్శించారు. చంద్రబాబును ప్రజలెవరూ నమ్మరని, ఆ విషయం తాజా ఎన్నికల ఫలితాలతో మరోసారి స్పష్టమైందని చెప్పారు. బాబు మళ్లీ గెలిచే పరిస్థితి లేదని ఆయన జోస్యం చెప్పారు. అందుకనే తెలుగుదేశం పార్టీనీ చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగిస్తే ఉత్తమమని నారాయణ స్వామి సూచించారు. చదవండి: వైఎస్సార్సీపీ ప్రభంజనం.. నెల్లూరు కార్పొరేషన్లో క్లీన్స్వీప్ -
Kuppam: ప్రజల మద్దతు ఫలితమే కుప్పంలో ఘన విజయం: పెద్దిరెడ్డి
-
టీడీపీని ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించు బాబూ!
సాక్షి, అమరావతి: టీడీపీని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు అప్పగించి, చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటే ప్రజలు సంతోషిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ప్రజలు ఛీత్కరించడంతో టీడీపీ శాశ్వతంగా భూస్థాపితమైందన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనకు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. టీడీపీ చంద్రబాబు సొంత పార్టీ కాదని, ఎన్టీఆర్ స్థాపిస్తే వెన్నుపోటు పొడిచి లాక్కున్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ప్రాణాలు పోవటానికి కారణమైన వ్యక్తి.. ఇప్పుడు పార్టీని కూడా అసమర్థతతో నాశనం చేశాడని విమర్శించారు. ‘ఇప్పటికే చంద్రబాబుకు 72 ఏళ్లు వచ్చాయి. తక్షణమే కుప్పం ఫలితాలతోనైనా చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని, తనయుడు లోకేశ్తో కలిసి హైదరాబాద్కు వెళ్లి ఆరోగ్యం కాపాడుకోవాలని హితవు పలికారు. కుప్పం మునిసిపల్ కౌంటింగ్ను స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రికార్డు చేయాలంటూ హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని, తీరా ఫలితాలను చూసి వైఎస్సార్సీపీ మ్యానిప్యులేట్ చేసిందంటూ చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డారని మండిపడ్డారు. చంద్రబాబు ఇక కుప్పంలో పోటీ చేస్తాడనుకోవడం లేదు వైఎస్సార్ తనయుడు జగన్మోహన్రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చూసిన చంద్రబాబు తన కొడుకు లోకేశ్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని మదనపడుతున్నారని పెద్దిరెడ్డి అన్నారు. కుప్పంలో ఓటమి భయంతోనే పోలింగ్కు ముందు తమను దుర్భాషలాడారన్నారు. ‘లోకేశ్ అయితే పెద్దిరెడ్డి గాడు అని మాట్లాడారు. మా నాన్న చాలా సాఫ్ట్. నేను పెద్ద రౌడీని’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రౌడీలు కాబట్టే కుప్పంలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మునిసిపల్ ఎన్నికల్లో వారిని ప్రజలు పూర్తిస్థాయిలో తిరస్కరించారన్నారు. మరోసారి చంద్రబాబు, లోకేశ్, ఆయన అనుచరులు ఇష్టానుసారం మాట్లాడితే తగిన విధంగా స్పందిస్తానంటూ మంత్రి హెచ్చరించారు. మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. ఈ ఓటమితో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తాడని అనుకోవటం లేదన్నారు. తనను టార్గెట్ చేస్తూ పుంగనూరులో పోటీ చేయాలనుకుంటే ఆహ్వానిస్తామన్నారు. తామెప్పుడూ సీరియస్గా తీసుకోలేదు కాబట్టే చంద్రబాబు కుప్పంలో గెలుస్తున్నారన్నారు. కాలేజీలో చదువుతున్నప్పుడు చంద్రబాబు తనకు సీనియర్ అని, తాము వేర్వేరు గ్రూపులకు నాయకులుగా ఉన్నామని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లోనే తాను యూనివర్సిటీకి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అయ్యానని, అప్పుడు పోటీ ఎందుకు పెట్టలేదో చంద్రబాబునే అడగాలని పెద్దిరెడ్డి చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి, పార్టీ నేతలకు సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, చిత్తూరు జిల్లా పార్టీ నేతలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అభినందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రి పెద్దిరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అభినందనలు తెలిపారు. -
చంద్రబాబు రాజకీయ జీవితానికి పులిస్టాప్ ..?
-
కుప్పంలో చంద్రబాబు బిగ్ షాక్
-
కుప్పంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫోటోలు
-
కుప్పంలో కుప్పకూలిన టీడీపీ
Kuppam Municipal Election Results 2021: కుప్పంలో చంద్రబాబుకు బిగ్షాక్ తగిలింది. ఇప్పటికే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లను కోల్పోయిన టీడీపీ.. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ బొక్కబోర్లా పడింది. మున్సిపాలిటీలోని 25 వార్డుల్లో 19 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. మొదటి రౌండ్లో 15 వార్డులకుగాను 13 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించగా.. టీడీపీ కేవలం రెండు వార్డులకే పరిమితమైంది. తర్వాత వెలువడిన ఫలితాల్లోనూ టీడీపీ అభ్యర్థులు తేరుకోలేకపోయారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమ పాలనకు కుప్పం మున్సిపాలిటీ ప్రజలు పట్టం కట్టారు. ఇక 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందంటూ చెప్పుకునే చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీని కాపాడుకోలేకపోయారు. మొత్తంగా టీడీపీ కేవలం 6 స్థానాలకే పరిమితమై పరాభవాన్ని మూటగట్టుకుంది. ► కుప్పం మున్సిపాలిటీలో మొత్తం స్థానాలు 25 ► 19 వార్డుల్లో వైఎస్సార్సీపీ గెలుపు, 6 వార్డుల్లో టీడీపీ గెలుపు ► 1,2,3, 4, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15,16,17, 21, 23, 25 వార్డుల్లో వైఎస్సార్సీపీ గెలుపు ►5, 11, 18, 19, 20, 22, వార్డుల్లో టీడీపీ విజయం -
నెల్లూరులో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
-
నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్
AP Municipal Elections 2021 Results Live Updates: 04: 57PM ► కృష్ణా: జగ్గయ్యపేట మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 31 వార్డుల్లో.. వైఎస్సార్సీపీ-17, టీడీపీ-14 వార్డుల్లో విజయం సాధించాయి. 04: 20PM ► జగ్గయ్యపేట మున్పిపాలిటీని కైవసం చేసుకునే దిశంగా వైఎస్సార్సీపీ ► రెండో రౌండ్లో 11 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ► ఇప్పటికే 8 వార్డులను గెలుచుకున్న వైఎస్సార్సీపీ ► కాకినాడలో ఉప ఎన్నిక జరిగిన 4 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ► కాకినాడలోని 3, 9, 16, 30వ డివిజన్లలో వైస్సార్సీపీ గెలుపొందింది. 03: 54PM ► రాజంపేట మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 29 వార్డుల్లో వైఎస్సార్సీపీ-24, టీడీపీ-4, ఇండిపెండెంట్-1 వార్డులో విజయం సాధించాయి. ► గురజాల నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్సీపీ 16, టీడీపీ-3, జనసేన-1 వార్డులో విజయం సాధించాయి. ►ఆకివీడు నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్సీపీ-12, టీడీపీ-4, జనసేన-3 వార్డుల్లో విజయం సాధించాయి. 03:32PM కృష్ణా: కొండపల్లిలో ముగిసిన కౌంటింగ్ ► కొండపల్లిలో 29 స్థానాల్లో వైఎస్సార్సీపీ-14 స్థానాల్లో విజయం, టీడీపీ- 14 స్థానాల్లో విజయం, ఇండిపెండెంట్-1 స్థానంలో గెలుపు 03:15PM ► నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ ► నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ ప్లాప్ షో ► బొక్కబోర్లాపడ్డ సైకిల్ ► 54కి గాను 54 డివిజిన్లలో వైఎస్సార్సీపీ గెలుపు ►కార్పొరేషన్ ఎన్నిక జరిగిన 46 డివిజన్లలో 46 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ►ఏకగ్రీవాలతో కలిపి 54 డివిజన్లను కైవసం చేసుకొన్న వైఎస్సార్సీపీ ►క్లీన్ స్వీప్తో మరో చరిత్ర సృష్టించిన వైఎస్సార్సీపీ 02:29PM విశాఖపట్నం: జీవీఎంసీ 31వ వార్డు కార్పొరేటర్గా వైఎస్సార్సీపీ అభ్యర్థి బీపిన్ కుమార్ జైన్ విజయం సాధించారు. జీవిఎంసీలో 61వ డివిజన్లో వైఎస్సార్సీపీ విజయం ► 2028 ఓట్ల మెజార్టీతో కొణతాల సుధ(వైఎస్సార్సీపీ) గెలుపొందారు. కృష్ణాజిల్లా: ► కొండపల్లి మున్సిపాలిటీ 19వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగిరాము గెలుపొందారు. ► 26వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి గుంజా శ్రీనివాసు విజయం సాధించారు. ► కొండపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి మండే చంద్రశేఖర్ బాబు గెలుపొందారు. 01:40PM కుప్పం గెలుపుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభినందించిన సీఎం వైఎస్ జగన్ 01:36PM మొదటి రౌండ్లోనే కుప్పం మున్సిపల్ ఫలితం రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠగా ఎదురుచూసిన కుప్పం మున్సిపల్ ఎన్నిక ఫలితం మొదటి రౌండ్లోనే తేలిపోయింది. మొదటి రౌండ్లో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ 15 వార్డులకు గాను 13 వార్డులను కైవసం చేసుకున్నారు. దీంతో 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీలో మొదటి రౌండ్లోనే వైఎస్సార్సీపీ 13 స్థానాలను గెలుచుకొని మున్సిపాల్టీని తమ ఖాతాలోకి వేసుకున్నారు. టీడీపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. 01:00PM నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికే 20 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించగా, మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. 12:50PM ►నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ►నెల్లూరు కార్పొరేషన్ 27 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం ►ఇప్పటి వరకు 9 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ ►కుప్పం, ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో వైఎస్సార్సీపీ గెలుపు 12:40PM ►నెల్లూరు కార్పొరేషన్ 7 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం ►14,27,28,33,39,41,53 డివిజన్లలో వైఎస్సార్సీపీ గెలుపు ►మరో 32 డివిజన్లలో వైఎస్సార్సీపీ ఆధిక్యం 12:15PM ►కుప్పంలో రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం ►16 వార్డు నుంచి 25 వార్డుల ఓట్ల లెక్కింపు ►హైకోర్టు ఆదేశాలతో కొనసాగుతున్న కుప్పం కౌంటింగ్ ప్రక్రియ 11:55AM వైఎస్సార్ జిల్లా కమలాపురం రౌడీలకు ప్రజలు బుద్ధి చెప్పారు కమలాపురం మున్సిపల్ ఎన్నికల విజయంపై ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పందించారు. 'ఈ ఎన్నికల్లో కమలాపురం రౌడీలకు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగాయి, ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి ఓటు చేశారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు. 15 వార్డుల్లో గెలుపొందాం. ఓడిన 5 వార్డుల్లో కూడా స్వల్ప మెజారిటీతో ఓడిపోయాము. ఛైర్మెన్ అభ్యర్థి ఖరారుపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం' అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. 11:45AM నెల్లూరు జిల్లా ►బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయితీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 20 వార్డుల్లో.. 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించగా.. టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. 11:15AM నెల్లూరు ►కార్పొరేషన్ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదల ►39వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్థి సన్ను నాగమణి 1390 ఓట్లతో విజయం ►టీడీపీ కంచుకోట డివిజన్లలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థుల ముందంజ కుప్పంలో వైఎస్సార్సీపీ హవా ►మొదటి రౌండ్లో 14 వార్డులకుగాను 12 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. 11:05AM ►రాజంపేట మున్సిపల్ వైఎస్సార్సీపీ కైవసం ►రాజంపేటలో 24వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ►దాచేపల్లి, కమలాపురం, ఆకివీడు, గురజాల, పెనుగొండలో నగర పంచాయతీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. దర్శి మున్సిపాలిటీలో టీడీపీ విజయం ► దర్శి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ-7, టీడీపీ- 13 వార్డుల్లో విజయం సాధించింది. ► దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► దాచేపల్లిలో 11 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం, టీడీపీ-7 వార్డులు, ఇండిపెండెంట్-1, బీజేపీ-1 వార్డులో గెలుపొందాయి. 10:50AM ►గురజాల నగరపంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► గురజాల 16 వార్డుల్లో వైఎస్సార్సీపీ కైవసం ► గురజాల 3 వార్డుల్లో టీడీపీ, ఒక వార్డులో జనసేన విజయం ► కమలాపురం నగరపంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ►కమలాపురంలో 15 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం ►మొత్తం 20 వార్డుల్లో.. వైఎస్సార్సీపీ-15, టీడీపీ-5 వార్డుల్లో విజయం సాధించాయి. ► బేతంచర్ల నగరపంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► 14వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం కుప్పంలో వైఎస్సార్సీపీ హవా ►మొదటి రౌండ్లో 14 వార్డులకుగాను 14 వార్డుల్లోనూ వైఎస్సార్సీపీ ఆధిక్యం.. ఇందులో ఇప్పటికే వైఎస్సార్సీపీ ఐదు వార్డుల్లో విజయం సాధించింది. నెల్లూరు జిల్లా ►కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్లో వైఎస్సార్సీపీ హవా ►37 డివిజన్లలో ముందంజ 10:40AM ►ఆకివీడు నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం మొత్తం 20 వార్డుల్లో 12 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ► పెనుకొండ మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం ►మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్సీపీ-18, టీడీపీ-2 వార్డుల్లో విజయం సాధించాయి. 10:30AM బుచ్చి నగరపంచాయితీలో దూసుకు పోతున్న వైఎస్సార్సీపీ ►డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్ ఇప్పటి వరకు విడుదలైన ఫలితాలు. ►ఒకటో వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి కత్తి నాగరాజు 273 ఓట్ల మెజార్టీతో విజయం.. ►మూడో వార్డు లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రత్యూష విజయం.. ►నాలుగో వార్డ్ లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మాచర్ల సుప్రజా విజయం.. ►7వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి షకీలా విజయం.. ►18వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి జయంతి విజయం.. ►9వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి యరటపల్లి శివారెడ్డి విజయం.. ►14 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి చీర్ల ప్రసాద్ ముందంజ.. ►15 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి కంట అనంతమ్మ ముందంజ.. అనంతపురం ►పెనుకొండ నగర పంచాయతీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం ►మొత్తం 20 వార్డులకుగాను 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం 10:25AM కుప్పంలో వైఎస్సార్సీపీ హవా ►మొదటి రౌండ్లో 14 వార్డులకుగాను 10 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం 10:20AM ►పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఫ్యాన్ జోరు ►మొత్తం 20 వార్డులకుగానూ 13 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 10:18AM కర్నూలు జిల్లా ►బేతంచర్ల నగర పంచాయితీ ఎన్నికల్లో 14 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మధుసూదన్ రావు గెలుపు ►బేతంచర్ల నగర పంచాయితీ ఎన్నికల్లో 20 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి జి శకుంతల గెలుపు అనంతపురం జిల్లా ►పెనుకొండ నగర పంచాయతీ లో వైఎస్సార్ సీపీ హవా ►మొత్తం 20 వార్డుల్లో 10 వార్డులు వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఆధిక్యత 10:12AM వైఎస్సార్ జిల్లా.. కమలాపురం 2 వార్డు వైసీపీ అభ్యర్థి షేక్ మోహమ్మద్ సాదిక్ 324 ఓట్లతో భారీ విజయం ►18 వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి కుప్పూరి సుదర్శన్ రెడ్డి 18 ఓట్లతో విజయం ►3 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ నూరి 134 ఓట్లతో విజయం ►కమలాపురం 13 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం ► రాజంపేట 4వ వార్డులో వైసీపీ అభ్యర్థి మర్రి రవి కుమార్ విజయం ►21వ వార్డులో పోలా రమణా రెడ్డి వైఎస్సార్సీపీ విజయం 10:02AM గురజాల ►నగర పంచాయతీలో 2 వార్డు లో 377 మెజార్టీ వైసిపి గెలుపు ►గురజాల 15వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మన్యం కన్యాకుమారి 101 ఓట్లతో గెలుపు 10.02AM: చిత్తూరు జిల్లా: ►కుప్పం 1,2,7 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం 9:50AM గుంటూరు: ►దాచేపల్లి 13వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి వందనపు లక్ష్మి 159 ఓట్లమెజార్టీతో గెలుపు ►దాచేపల్లి 6వ వార్డు టీడీపీ అభ్యర్థి 94 ఓట్లతో గెలుపు ►గురజాల ఒకటో వార్డువైఎస్సార్సీపీ అభ్యర్థి లింగా చారి 456 ఓట్లతో గెలుపు ►అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ లోని 17వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి రామాంజనేయులు విజయం ►18 వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నందిని విజయం 9:45 AM అనంతపురం: ►పెనుకొండ నగర పంచాయతీ లో వైఎస్సార్ సీపీ బోణీ ►14, 18 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల ఆధిక్యత వైఎస్సార్ జిల్లా.. కమలాపురం ►17 వార్డు వైసీపీ అభ్యర్థి కలవ నాగమణి 27 ఓట్ల మెజార్టీతో విజయం వైఎస్సార్ జిల్లా.. కమలాపురం ►9 వార్డు లో వైసీపీ అభ్యర్థి మారుజోళ్ళ శ్రీనివాసులు రెడ్డి 42 ఓట్లతో విజయం.. ►10 వార్డులో వైసీపీ అభ్యర్థి గెంటెమ్ సుగంధి 81 మెజార్టీతో విజయం.. వైఎస్సార్ జిల్లా.. కమలాపురం ►16 వార్డు వైసీపీ అభ్యర్థి కొప్పు షాహీనా బేగం 144 ఓట్లతో విజయం 9.40AM వైఎస్సార్ జిల్లా ►కమలాపురం మునిసిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం 09:22AM చిత్తూరు జిల్లా ►కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో మొదటి రౌండ్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఆధిక్యంలో ఉన్నారు. ►14వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మునిస్వామి ఏకగ్రీవ ఎన్నిక ►నగిరి మున్సిపాలిటీ 17వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి గంగాధరం ఏకగ్రీవం 09:14AM బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో వార్డుల వారీగా పార్టీలకు వచ్చిన పోస్టల్ బ్యాలెట్ వివరాలు మొత్తం పోస్టుల బ్యాలెట్ లు - 114 వైఎస్సార్సీపీ - 66 టీడీపీ - 20 బీజేపీ - 27 సీపీఎం - 1 వైఎస్సార్ జిల్లా ►కమలాపురం 11 వార్డులో 83 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి కొప్పోలి సలీల విజయం ►కమలాపురం 15వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి చవారెడ్డి సంధ్యారాణి 129 ఓట్ల మెజారిటీతో విజయం 08:44AM గుంటూరు జిల్లా ►ప్రారంభమైన గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ►ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన అధికారులు ►ఓట్లను కట్టలు కడుతున్న అధికారులు 08:40AM నెల్లూరు జిల్లా ►ప్రారంభమైన కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ►పోస్టల్ బ్యాలెట్లు లెక్కస్తున్న సిబ్బంది 08:37AM తూర్పుగోదావరి జిల్లా ►కాకినాడ నగరపాలక సంస్థ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం ►3,9,16,30. డివిజన్లకు ఈ నెల 15 న జరిగిన పొలింగ్ ►మొత్తం 15 మంది అభ్యర్ధులు పోటి, 51.46 % పోలింగ్ నమోదు ►రంగరాయ మెడికల్ కళశాలలో కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు ►8 టేబుళ్ళు ఏర్పాటు, మధ్యహన్నం కల్లా వెలువడనున్న ఫలితాలు 08:31AM ప్రకాశం జిల్లా ►దర్శి నగర పంచాయతీకి సంబంధించి ఏపీ మోడల్ స్కూల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. ►19 వార్డులకు కౌంటింగ్ కోసం 38 టేబుల్స్ ఏర్పాటు ►100 మంది సిబ్బందిని ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు 08:21AM కృష్ణా జిల్లా ►తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్ లు ►స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ హాల్ కు బ్యాలెట్ బాక్సులు తరలింపు ►మొదటగా ఓట్లను వేరు చేసి కట్టలు కట్టనున్న కౌంటింగ్ సిబ్బంది ►తొలిఫలితం 11 గంటలకు తెలిసే అవకాశం ►16 టేబుళ్ల పై కౌంటింగ్ ►రెండు రౌండ్లలో ముగియనున్న కౌంటింగ్ ►ఏజెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తున్న పోలీసులు ►కౌంటింగ్కు పకడ్భందీ చర్యలు.. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు 08:17AM కర్నూలు జిల్లా ►ప్రారంభమైన బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికలకు కౌంటింగ్ ►మొత్తం 20 వార్డులకు సంబంధించి కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ ►20 వార్డులకు గాను 20 టేబుళ్ల ఏర్పాటు ►ఒకటే రౌండ్లో ముగియనున్న ఓట్ల లెక్కింపు. ►11 గంటలలోపే వెలువడనున్న ఫలితాలు 08:10AM చిత్తూరు జిల్లా ►కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం ►పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మూడుకు గానూ ఒక్కటి కూడా నమోదు కాలేదు. 08:00AM నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఆయా మునిసిపాలిటీల్లో 325 డివిజన్లు, వార్డులకు సోమవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 325 స్థానాలకు 1,206 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. మొత్తం 23 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇక సోమవారం జరిగిన పోలింగ్లో 8,62,066 మందికిగాను 5,14,086 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉ.8 గంటలకు లెక్కింపు ప్రారంభం ఓట్ల లెక్కింపు బుధవారం ఉ.8 గంటలకు ప్రారంభిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అనంతరం సాధారణ ఓట్లు లెక్కిస్తారు. సా.5 గంటలలోపు అన్ని మున్సిపాలిటీల్లో పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 23 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కించడానికి 450 టేబుళ్లు ఏర్పాటుచేశారు. కౌంటింగ్ సూపర్వైజర్లుగా 534 మందిని, అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్లుగా 3,792 మందిని నియమించారు. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉండగా ఏకగ్రీవమైన 8 డివిజన్లు పోను మిగిలిన 46 డివిజన్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆయా డివిజన్లలో పోలైన ఓట్లు లెక్కించడానికి 142 టేబుళ్లు ఏర్పాటుచేశారు. అదే విధంగా కుప్పంలో 24 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 14 టేబుళ్లు సమకూర్చారు. లెక్కింపు ప్రక్రియ చిత్రీకరణ ఇక అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్ని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లోని పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించినట్లు తెలిపారు. కుప్పం మున్సిపాలిటీలో పోలింగ్ స్టేషన్ల వెలుపల చిన్నచిన్న ఘటనలు మినహా, పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా సాగినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు, ఇతర అధికారుల నుంచి నివేదికలు అందాయన్నారు. అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే పోలింగ్ జరిగిందని.. రీపోల్ నిర్వహించాలన్న వినతులు అందలేదన్నారు. -
టీడీపీ అక్రమాలపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు
సాక్షి, అమరావతి: మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకు, అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి సోమవారం ఫిర్యాదు చేశారు. వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలలో అలజడులు, ఆటంకాలు సృష్టించాలని, శాంతిభద్రతల సమస్య నెలకొనేలా చేయాలని చంద్రబాబు ప్రయత్నించారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ కోరుకుంటోందని తెలిపారు. చంద్రబాబు రాబోయే ఓటమికి సాకులు వెదుకుతున్నారని, దానిలో భాగంగా కుప్పంలో దొంగఓట్లు అంటూ కొత్తపల్లవి అందుకున్నారని విమర్శించారు. ఓడిపోయే సమయంలో ఇలాంటి సాకులు రెడీ చేసిపెట్టుకునే అలవాటు చంద్రబాబుకు ఉందనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు అక్రమాలపై తాము చేసిన ఫిర్యాదుకు తగిన ఆధారాలు కూడా ఎన్నికల కమిషనర్కు అందచేశామని చెప్పారు. కమిషనర్ను కలిసిన వారిలో నవరత్నాల అమలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణమూర్తి కూడా ఉన్నారు. -
పెళ్లి పందిరి నుంచి పోలింగ్ కేంద్రానికి..
కుప్పం: కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కుప్పం 23వ వార్డు మునస్వామిపురానికి చెందిన దిలీప్కు, మంకలదొడ్డికి చెందిన రజినీతో సోమవారం ఉదయం పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో వివాహం జరిగింది. మునిసిపాలిటీలో దిలీప్కు ఓటు ఉండడంతో పెళ్లి పందిరి నుంచి పెళ్లి దుస్తులతో పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. 23వ వార్డు పోలింగ్ జరుగుతున్న ఆర్ పేట పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకుని ఓటుపై తనకు ఉన్న మమకారాన్ని చాటుకున్నాడు. -
ఏపీ మున్సిపల్ ఎన్నికలు; 59.63% పోలింగ్
సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతోపాటు, వివిధ మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డుల్లో పోలింగ్ సోమవారం ముగిసింది. 325 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు నిర్వహించగా 8,62,066 మంది ఓటర్లకు గాను 5,14,086 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 59.63% పోలింగ్ నమోదైంది. అనంతపురం జిల్లా పెనుకొండ మున్సిపాలిటీలో 82.63%, అత్యల్పంగా నెల్లూరు కార్పొరేషన్లో 52.25% పోలింగ్ నమోదైంది. నెల్లూరు కార్పొరేషన్లో 46 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 52.25 శాతం మంది ఓటు వేశారు. కుప్పం మున్సిపాలిటీలో 24 వార్డులకు పోలింగ్ జరిగింది. ఇక్కడ 37,664 మంది ఓటర్లు ఉండగా 28,942 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మందకొడిగా పోలింగ్ ఎన్నికల సరళి మందకొడిగా సాగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తొమ్మిది గంటల వరకూ కేవలం 10.12% పోలింగ్ నమోదైంది. 11 గంటలకు 24.96%, మ.ఒంటి గంటకు 41.02%.. 3 గంటల సమయానికి 50 శాతానికి పోలింగ్ జరిగింది. ఇలా మొత్తంగా 59.63% ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా విజయనగరం కార్పొరేషన్లో 65.04%, అత్యల్పంగా అనంతపురం కార్పొరేషన్లో 37.58% పోలింగ్ నమోదైంది. నగర పంచాయతీలు, పట్టణాలే మిన్న ఓటు హక్కు వినియోగించుకోవడంలో నగరాలతో పోలిస్తే పట్టణాలు, నగర పంచాయతీ ప్రజలే చైతన్యం కనబర్చారు. నెల్లూరు కార్పొరేషన్లోని 46 డివిజన్లతో పాటు, వివిధ కార్పొరేషన్లలోని 10 డివిజన్లు కలిపి 56 డివిజన్లలో కేవలం 49.89% మంది మాత్రమే ఓటు వేశారు. అదే పట్టణాలు, నగర పంచాయతీల్లో 72.19% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
దొంగ ఓట్లు వేసే ఛాన్సే లేదు..
-
వైఎస్సార్ జిల్లాలో కోనసాగుతున్న మున్సిపల్ పోలింగ్
-
పెనుగొండలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్
-
కిక్కిరిసిపోతున్న ఓటర్ క్యూ లైన్..
-
కుప్పంలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
-
కుప్పంలో మరోసారి రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
-
ఐడీ కార్డులు చూపించాలంటూ మాజీ మంత్రి దాదాగిరి
-
నెల్లూరు నగర పోరుకు సర్వం సిద్ధం
-
కుప్పానికి టీడీపీ దొంగ ఓటర్లు
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి టెన్షన్ రోజురోజుకీ ఎక్కువవుతుండడంతో ఆ పార్టీ నేతలు దొంగ ఓటర్లను రంగంలోకి దించుతున్నారు. ఇలాగైనా పరువు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతూ అడ్డదారులు తొక్కుతున్నారు. పోలింగ్కు ఇంకా ఒక్కరోజే సమయం ఉండడంతో డబ్బులు, మందు పంపిణీ పూర్తిచేయడంతో పాటు దొంగ ఓట్లు వేయించి లబ్ధిపొందాలని ప్రలోభాలకు తెరలేపారు. నిజానికి.. కుప్పంలో పనులు దొరక్క అనేకమంది బెంగళూరుకు వలస వెళ్లిపోయారు. వారంతా అక్కడే స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. వారిలో సుమారు 35 వేల మందికి అటు కుప్పంలోనూ.. ఇటు బెంగళూరులోనూ ఓటు హక్కు ఉంది. అలాగే, వీరికి అక్కడ ఇక్కడ ఆధార్, రేషన్ కార్డులు ఉన్నాయి. పింఛను, బియ్యం రెండుచోట్లా తీసుకుంటున్నారు. దీంతో వీరిలో అధిక శాతం మందిని టీడీపీ నేతలు తీసుకొచ్చి ఓట్లు వేయిస్తుండడంతో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధిస్తూ వస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ విషయాన్ని 2019 ఎన్నికల్లో అప్పటి వైఎస్సార్సీపీ అభ్యర్థి దివంగత చంద్రమౌళి గుర్తించారు. పక్కా వివరాలతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో 25 వేల ఓట్లను తొలగించారు. మరో 10వేల ఓట్లను వివిధ కారణాలతో తొలగించలేదు. వారందరినీ టీడీపీ నేతలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు పిలిపిస్తున్నట్లు సమాచారం. దొంగ ఓటర్లకు ప్రత్యేక శిక్షణ బెంగళూరు, కేజీఎఫ్, పలమనేరు నుంచి మరో 5 వేల మందితో దొంగ ఓట్లు వేయించుకునేందుకు టీడీపీ నేతలు రవాణా సదుపాయాలుఏర్పాటుచేశారు. ఇలా వచ్చేవారి కోసం కుప్పానికి దూరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. వీరికి ప్రత్యేకంగా ఓటరు ఐడీ కార్డులు, స్లిప్పులు సిద్ధంచేసినట్లు సమాచారం. వాటితో సోమవారం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాక ఏం చేయాలో టీడీపీ నేతలు శిక్షణనిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్దకు దొంగ ఓటర్లు చేరుకున్నాక.. వారిని ఎవరైనా గుర్తిస్తే వైఎస్సార్సీపీ వారు పంపించారని చెప్పమని తర్ఫీదు ఇచ్చారు. ఎవరూ అడ్డుకోకపోతే సైకిల్ గుర్తుకు ఓటేయమంటున్నారు. వలంటీర్లకు బెదిరింపులు టీడీపీ నేతలు వలంటీర్ల ఇళ్లకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మాజీ జెడ్పీటీసీ రాజ్కుమార్ తన అనుచరులతో శుక్రవారం రాత్రి ఓ మహిళా వలంటీర్ ఇంటికి వెళ్లి తీవ్రస్థాయిలో బెదిరించారు. శనివారం మరో ముగ్గురు మహిళా వలంటీర్ల నివాసాలకు టీడీపీ నేతలు వెళ్లి బెదిరించినట్లు బాధితులు వాపోతున్నారు. కొత్తదారుల్లో నగదు పంపిణీ ఇక ఎన్నికల్లో డబ్బులు పంపిణీని ఇప్పటివరకూ నేరుగా ఇళ్లకు వెళ్లి ఇవ్వడమే చూశాం. కానీ, కుప్పంలో టీడీపీ నేతలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్న చిల్లర దుకాణాలు, చిన్నచిన్న బంకులు, మెడికల్ షాపులు, టీ బంకులను కేంద్రాలుగా ఎంచుకున్నారు. టీడీపీ అభ్యర్థులు ఈ దుకాణాల్లో డబ్బులు, పేర్లు, కోడ్ నంబర్లు స్లిప్పై వేసి ఇస్తారు. అభ్యర్థులు ప్రచారానికి వెళ్లినప్పుడు ఓటర్లకు ఓ నంబర్ కోడ్తో ఉన్న స్లిప్ ఇస్తారు. దానిని వారు చెప్పిన దుకాణంలో ఇస్తే డబ్బులు ఇచ్చేస్తారు. ఈ తరహా డబ్బుల పంపిణీ శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం ప్రారంభం కానున్నట్లు టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. మరోవైపు.. టీడీపీ నేతలు అన్ని వార్డులకు రెబల్ అభ్యర్థులుగా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయించారు. వీరంతా టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా రెబల్ అభ్యర్థులను స్వతంత్రులుగా ప్రకటిస్తారు. వీరిపై పోలీసుల నిఘా పెద్దగా ఉండదు. దీనిని టీడీపీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా 3వ వార్డు స్వతంత్ర అభ్యర్థి వేలు టీడీపీ అభ్యర్థి తరఫు డబ్బులు పంచుతూ పోలీసులకు దొరికిపోయాడు. అతని నుంచి రూ.50,500 స్వాధీనం చేసుకున్నారు. స్వతంత్రులుగా ఉన్న టీడీపీ అభ్యర్థుల ద్వారా ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అలాగే.. ఎక్కువ సంఖ్యలో ఓట్లు కలిగిన వారికి పెద్దమొత్తంలో డబ్బులు లేదా బహుమతులు ఇవ్వటానికి టీడీపీ అన్ని ఏర్పాట్లుచేసినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. -
Kuppam: డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేతలు
సాక్షి, చిత్తూరు: టీడీపీ నేతలకు కుప్పం టెన్షన్ పట్టుకుంది. ఓటమి భయంతో పచ్చ నేతలు కొత్త డ్రామాకు తెరతీశారు. ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కనీసం కుప్పం మున్సిపాలిటీలోనైనా పరువు దక్కించుకోవాలని ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు తెరలేపింది. కుప్పంలో ఓటర్లకు భారీగా టీడీపీ నగదు పంపిణీ చేస్తోంది. డబ్బులు తీసుకోండి.. ఓటేయండి అంటూ టీడీపీ ఓపెన్ ఆఫర్ ఇస్తోంది. వార్డుల వారీగా తిరుగుతూ టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారు. కుప్పంలో చంద్రబాబు పరువు కాపాడేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ నేతలు.. ఓటుకు రూ.4వేలు పంచుతున్నారు. చదవండి: ‘కుప్పంలో విజయానికి లోకేష్ ఐదు వేలు పంచడం సిగ్గుచేటు’ ఓటర్లకు డబ్బులు పంచుతూ టీడీపీ నేతలు మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. కుటుంబంలో నలుగురికి మించి ఉంటే, టీవీ, ఫ్రిడ్జ్లను కూడా టీడీపీ నేతలు ఆఫర్ ఇస్తున్నారు. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో ఓటమి భయం వెన్నాడుతుండటంతో టీడీపీ నేతలు అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. ఎలాగైనా కుప్పంలో గెలవాలని చంద్రబాబు, లోకేశ్.. తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు, లోకేష్ అరాచకాలు: ఎంపీ మిథున్రెడ్డి గత రెండు వారాలుగా కుప్పంలో చంద్రబాబు అరాచకాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రలోభాల పర్వానికి కూడా టీడీపీ తెరలేపిందన్నారు. చంద్రబాబు హయాంలో కుప్పం నియోజకవర్గాన్ని ఏవిధంగానూ అభివృద్ధి చేయలేదన్నారు. చదవండి: లోకేశ్ ప్రచారం.. డబ్బు పంపిణీ.. -
కుప్పంలో ప్రలోభాలు.. అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు
-
ప్రచారాల్లో దూకుడు పెంచిన వైఎస్సార్సీపీ
-
పొలిటికల్ కారిడర్ 12 November 2021
-
ప్రగతి పధంలో పెనుకొండ..
-
టీడీపీకి గట్టి గుణపాఠం చెప్తారు
-
జోరువానలోనూ వైఎస్సార్సీపీ ప్రచార జోరు..
-
కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి
-
ఉనికి చాటుకునేందుకు ప్రతిపక్ష పార్టీల ఆరాటం
-
అబ్దుల్ అజిజ్ నారాయణకు ఎంతకు అమ్ముడు పోయారో చెప్పాలి
-
కుప్పంలో టీడీపీ ‘నంద్యాల’ జిత్తులు
సాక్షి, తిరుపతి/అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు లేకపోవడంతో ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. 2017లో నంద్యాల ఉపఎన్నిక సమయంలో ప్రయోగించిన జిత్తులను మరోసారి తెరపైకి తెస్తోంది. ఇందులో భాగంగా.. చంద్రబాబు కనుసన్నల్లో ప్రలోభాలు, విధ్వంసాలకు పాల్పడుతోంది. మాజీమంత్రి అమర్నాథ్రెడ్డి, పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు వీటి అమలుకు రంగంలోకి దిగారు. అలాగే.. మంగళవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో టీడీపీ నేతలు ఓటర్లను లోబర్చుకునేందుకు బేరసారాలు సాగించారు. ప్రచారం ముసుగులో వీరు ఓటర్ల నివాసాల్లోకి వెళ్లి గంపగుత్తుగా ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలోని ఉమ్మడి కుటుంబాలపై కూడా టీడీపీ నేతలు గురిపెట్టారు. ఒక ఇంట్లో పది, అంతకుమించి ఓట్లు ఉంటే రూ.25 వేలు నుంచి రూ.50వేలు వరకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 50 ఓట్లకు మించి ఉన్న వారికి భారీ నజరానాలివ్వాలని నిర్ణయించారు. డబ్బులు తీసుకోని వారికి ఆ స్థాయిలో బహుమతులిచ్చేందుకు సైతం ఏర్పాట్లుచేస్తున్నారు. ఫ్రిడ్జ్, 40 అంగుళాల టీవీలు, బుల్లెట్ వాహనాలు, ట్రాక్టర్ల వంటివి ఇచ్చేందుకు ఆశపెడుతున్నారు. అసంతృప్తివాదులకు తాయిలాలు ఇక చంద్రబాబు పాలనలో సాయం కోసం వెళ్లి నిరాశతో వెనక్కి వచ్చిన వారిని కూడా గుర్తించే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. వారు అడిగిన పనులను ఇప్పుడు చేసిపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం వారు ఐదు కుటుంబాలను కలిసినట్లు తెలిసింది. కానీ, టీడీపీ నేతలపై ఆ ఇళ్లవారు ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ నాయకులు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా ఓటర్లు ససేమిరా అన్నట్లు తెలిసింది. దీంతో టీడీపీ నేతలు నేరుగా చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిస్తున్నారు. అయితే.. ఓటర్లు ఆ నేతలకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ విషయంపై టీడీపీ నేతలు మంగళవారం సాయంత్రం మరోసారి చంద్రబాబుతో సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడినట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇలాంటి వారినందరినీ వెంటనే గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు ఆ నేతలకు ఆదేశించారు. బుల్లెట్లు, ట్రాక్టర్లు బహుమతులు దీంతో అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉంటున్న ద్వితీయ, తృతీయశ్రేణి కార్యకర్తలు కొందరిని గుర్తించారు. గత నాలుగు రోజులుగా నేతలు వారి ఇళ్లకెళ్లి బుజ్జగిస్తూ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరినట్లు తెలిసింది. అందుకు ప్రతిఫలంగా బుల్లెట్ బైకులు కొనిస్తామని హామీ ఇచ్చినట్లు కుప్పంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అంతేకాక.. ఎన్నికలు అయ్యేంత వరకు పెట్రోల్ ఖర్చులు, మందు, విందు తదితర వాటిన్నింటికి ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. అలాగే.. వ్యవసాయ భూములుండి పార్టీ కోసం పనిచేసి ఎలాంటి లబ్ధిపొందలేకపోయిన వారికి ట్రాక్టర్లు బహుమతిగా ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇంకా ద్వితీయశ్రేణి నాయకుల్లో 500 వరకు ఓటు బ్యాంకు ఉన్న వారికి ఏకంగా కార్లు ఇస్తామని హామీలిస్తున్నారు. ఇలా ఇన్ని రకాలుగా టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నా ఓటర్ల నుంచి వారికి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లూ బాబుగారు మాకేమీ చేశారంటూ నిలదీస్తుండడం కొసమెరుపు. వార్డుల వారీగా వ్యూహాలు ఇక తొలిసారిగా చిత్తూరు జిల్లాతో ఏమాత్రం సంబంధంలేని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి కుప్పం బాధ్యత అప్పగించారు. బాబు కూడా రోజుకు మూడు, నాలుగుసార్లు టెలీకాన్ఫరెన్స్లు నిర్వహించి వార్డుల వారీగా దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే, వ్యూహాత్మకంగానే ఒక్కో వార్డుకు నలుగురైదుగురితో నామినేషన్ల వేయించారు. అవసరమైతే పోలీసులు, ఎన్నికల అధికారులపై దాడులు చేయగల కరడుగట్టిన నాయకులు, వారి అనుచరులను అక్కడ మొహరించారు. ఎంతైనా ఇద్దాం.. కుప్పంలో గెలుద్దాం కుప్పం మున్సిపాల్టీలో ఎలాగైనా గెలిచేందుకు చంద్రబాబు తన శక్తియుక్తులు అన్నింటినీ ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక మున్సిపాల్టీపై ఆయన పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకాడొద్దని.. ఓటర్లకు ఎంతైనా ఇద్దామని నాయకులకు ఆయన పదేపదే చెబుతున్నట్లు తెలిసింది. దశాబ్దాలుగా తన కంచుకోటగా ఉన్న కుప్పం జేజారిపోతుందేమోననే భయం ఆయన్ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో కుప్పం టీడీపీ కోటకు బీటలు వారడంతో ఆయనకు తీవ్ర భంగపాటు ఎదురైంది. దీంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఇప్పుడు కుప్పం మున్సిపాల్టీ కూడా చేజారితే తన పరువు పోవడమే కాకుండా దాని ప్రభావం పార్టీ మీద తీవ్రంగా ఉంటుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. అందుకే కుప్పం మున్సిపాల్టీలో గెలవడమే లక్ష్యంగా సాధారణ ఎన్నికల స్థాయిలో పనిచేస్తున్నారు. అవసరమైతే కుప్పం పర్యటనకు రెడీ ఇక అవసరమైతే ఒకరోజు స్వయంగా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ, ఒక్క కుప్పం మున్సిపాల్టీ కోసం ఆయన వెళ్తే చులకనగా ఉంటుందని ముఖ్య నేతలు అభిప్రాయపడడంతో దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. అక్కడ ఏ చిన్న గొడవ జరిగినా దాన్ని సాకుగా చూపి పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం రాత్రి ఎన్నికల అధికారితో కావాలని గొడవకు దిగి నానా రభస సృష్టించారు. ఈ ఘటనను చూపించి కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. కానీ, చివరి నిమిషంలో ఆ ఆలోచన విరమించుకున్నారు. ప్రచార గడువు ముగిసే లోపు ఏదో ఒక సాకుతో చంద్రబాబు కుప్పం వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
కుప్పం పేరు వింటేనే హడలిపోతున్న చంద్రబాబు
-
అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ
-
టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు
-
చంద్రబాబు మళ్ళీ డ్రామాలాడుతున్నాడు
-
YSRCP నేతలకు బ్రహ్మరధం పడుతున్న ప్రజలు
-
నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది
-
బాబుపై పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
-
Kuppam Municipality: కుప్పంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి..
కుప్పంరూరల్, కుప్పం(చిత్తూరు జిల్లా): కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని నాల్గో వార్డు కమతమూరుకు చెందిన దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భరత్ ఆధ్వర్యంలో కమతమూరుతో పాటు కత్తిమానుపల్లి, గుండ్లపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. అలాగే కుప్పం మునిసిపాలిటీకి చెందిన టీడీపీ సీనియర్ నేత అడవి కొట్టాలు సుబ్రమణ్యం కూడా వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన చూసి పార్టీలో చేరినట్టు వారు చెప్పారు. చదవండి: Municipal Elections: బాబులో కుప్పం టెన్షన్ -
Municipal Elections: బాబులో కుప్పం టెన్షన్
సాక్షి, తిరుపతి: 2019 సార్వత్రిక ఎన్నికలు మొదలు నిన్న మొన్నటి స్థానిక సంస్థలు, తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక వరకు వరుస ఓటములతో ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు తాజాగా కుప్పం మున్సిపల్ ఎన్నికల రూపంలో మరో టెన్షన్ వెంటాడుతోంది. కుప్పం ఎన్నికల్లో ఇప్పుడు ఓటమి పాలైతే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మరోసారి పరాభవం ఖాయమని ఆయన బెంబేలెత్తిపోతున్నారు. అందుకే కుప్పంపై ఆయన ‘ప్రత్యేక’ దృష్టిపెట్టి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. చదవండి: Andhra Pradesh: ‘కోవిడ్’లోనూ కొలువులు కుట్రలు, కుతంత్రాలకు పన్నాగం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఈనెల 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీడీపీ శ్రేణులు మాత్రం చంద్రబాబు ఒత్తిడి తట్టుకోలేక ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇక్కడి పరిస్థితులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరతీశారు. వాటిని పక్కాగా అమలుచేసేందుకు ఆయన, లోకేశ్.. టీడీపీ నేతలు, ఇన్చార్జ్లుగా ఉన్న మాజీమంత్రి అమరనాథ్రెడ్డి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానితో రోజూ ఫోన్లో మాట్లాడుతున్నారు. టీడీపీ శ్రేణులు ఏం చేయాలో ఏ రోజుకా రోజు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎంతైనా ఖర్చు చేయండి నిజానికి.. కుప్పం మున్సిపల్ ఎన్నికలు చంద్రబాబును తీవ్రంగా కలవరపెడుతున్నాయి. దీంతో ఎన్నికలను అధిగమించేందుకు భారీగా డబ్బులు, మద్యం, బహుమతులు పంపిణీ చేసేందుకు వెనుకాడొద్దని పార్టీ శ్రేణులకు ఆయన స్పష్టంచేసినట్లు విశ్వసనీయ సమాచారం. డబ్బు ఎంతైనా ఖర్చుచేయాలని.. అవసరమైన మొత్తం తాను పంపుతానని ఇన్చార్జ్లకు చెప్పినట్లు తెలిసింది. ఈ ఖర్చు బాధ్యతలను చంద్రబాబు తన పీఎస్ దొరస్వామినాయుడుకు అప్పగించినట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. రోజువారీ ప్రచారం నిమిత్తం ఎప్పటికప్పుడు కూలీలకు డబ్బులు, మద్యం, బిర్యాని పంపిణీ కూడా చేయమని ఆదేశాలు జారీచేశారు. అలాగే, ఏపీలో మద్యం కొనుగోలు చేయవద్దని, పక్కనే ఉన్న కర్ణాటక మద్యంతోపాటు నాటుసారా తెప్పించుకోమని సూచించినట్లు సమాచారం. మద్యం కోసమే ప్రత్యేకంగా ఓ టీంని నియమించారు. ఇక ఓటర్లకు ఎంత ఇవ్వాలో తాను తరువాత చెబుతానని బాబు చెప్పినట్లు తెలిసింది. దాడి చేయండి.. ఎదురు కేసులు పెట్టండి ఇక కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ప్రయోజనం కలిగేలా వైఎస్సార్సీపీ శ్రేణులే టార్గెట్గా దాడులు చేయమని కూడా చంద్రబాబు సూచనలు చేసినట్లు కుప్పం టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను కొట్టి.. వారిపైనే తిరిగి కేసు పెట్టాలని ఇన్చార్జ్లకు సూచనలు అందాయి. ఇందులో భాగంగానే శుక్రవారం వీ కోట టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ రంగనాథ్ తన అనుచరులతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులు తప్ప మిగిలిన వారికి ఇక్కడ ఏం పని అని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి గణపతి ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన రంగనాథ్ అనుచరులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. అదే విధంగా ఎన్ఎఫ్సీ కళాశాల వద్ద కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థి మునస్వామి, బంధువు వెంకటేష్పై స్థానికేతరులైన టీడీపీ శ్రేణులు దాడిచేశారు. దాడిచేసిన వారే బాధితులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం బాబు ఆదేశాలకు అద్దంపడుతున్నాయి. కుప్పానికి పరిటాల, జేసీ వర్గీయులు కుప్పంలో అలజడులు సృష్టించి తద్వారా ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల, జేసీ వర్గీయులను దింపనున్నారు. అల్లర్లలో ఆరితేరిన వారిని కుప్పం ఎన్నికలకు వాడుకునేందుకు ప్రణాళికలు రూపొందించారు. వారంతా ఒకట్రెండు రోజుల్లో కుప్పానికి చేరుకోనున్నారు. వీరి కోసం కుప్పం శివారుల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేసినట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. వీరు వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకుని టీడీపీ ప్రచారాల్లో రచ్చచేయాలని.. వీలైతే దాడులు చేయాలని ప్రణాళికలు రచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనల ద్వారా తన అనుకూల మీడియా ద్వారా వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయించేందుకు కూడా చంద్రబాబు ఓ ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిసింది. వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టుచేయడం ఈ బృందం బాధ్యత. -
అనంతపురం జిల్లాలో కార్పొరేషన్ ఎన్నికల సందడి
-
ఏపీలో ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
-
చంద్రబాబు హయాంలో కుప్పంలో అభివృద్ధి లేదు: పెద్దిరెడ్డి
-
14 ఏళ్లు సీఎంగా ఉండి కనీసం మంచి నీళ్లు ఇవ్వలేకపోయారు: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పంలో పండగ వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం సభ నిర్వహిస్తోంది. ఈ సభకు భారీ ఎత్తున జనం తరలి రావడంతో సభా ప్రాంగణం నిండిపోయింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తోపాటు ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, ద్వారకనాథరెడ్డి, వెంకట గౌడ, కోనేటి ఆదిమూలం తదితరులు ఈ సభకు హాజరయ్యారు. సభలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. 14 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం చేసిన అభివృద్ధి శూన్యం అని అన్నారు. చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పని కూడా తన పాలనలో చేయలేదన్నారు. సాగునీరు, తాగునీరు అందించలేని దౌర్భాగ్యస్థితి చంద్రబాబుది అని ఫైర్ అయ్యారు. అనునిత్యం కుప్పం నుంచి బెంగళూరుకు వేలాదిమంది కూలి పనులకు వెళ్తుంటే చంద్రబాబు ఏం చేసాడు అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. చంద్రబాబుకు అసహనం పెరిగిపోయింది. కుప్పం ప్రజలు కూడా ఇప్పుడు చంద్రబాబు నమ్మడం లేదని జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు. 2014 నుంచి ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న నీళ్లు ఇవ్వడానికి కృషి చేయలేదని అన్నారు. సీఎం జగన్ కుప్పం వాసులకు సాగు, త్రాగు నీరును ఇవ్వడానికి కృషి చేస్తున్నారని అన్నారు. గుడిపల్లి మండలం బసిని గాని పల్లి వద్ద రెండు టీఎంసీల తో కూడుకున్న రిజర్వాయర్ ఏర్పాటు చేసి కుప్పం సమీపంలోని చెరువులకు నీళ్లు అందించడమే కాకుండా కుప్పం వాసులకు తాగునీరు అందిస్తామన్నారు. హంద్రీనీవా జలాలు పది రోజుల్లోనే కుప్పంకు రానున్నాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చదవండి: (ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు: మంత్రి వెల్లంపల్లి) -
స్థానిక సమరం.. జోరుగా ప్రచారం
-
ఏపీలో స్ధానిక సమరం
-
11 ఏళ్ల రాజం పేట మున్సిపాలిటీ ఎన్నికలు
-
మున్సిపోల్స్కు నామినేషన్ల ప్రక్రియ షురూ
-
AP: మున్సిపోల్స్కు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
Updates: ►ఆంధ్రప్రదేశ్లో మిగిలిన కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. నెల్లూరు కార్పొరేషన్లో 9వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రి అనిల్కుమార్ యాదవ్ పాల్గొన్నారు. సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్తోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. అలాగే 7 కార్పొరేషన్లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు, ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. (చదవండి: Rain Alert: ఏపీలో భారీ వర్షాలు) ఈ నెల 15న వీటికి ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బుధవారం (నేడు) నుంచి శుక్రవారం వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. శనివారం నామినేషన్ల పరిశీలన చేపడతారు. పోటీ చేయని అభ్యర్థులు సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. మహిళా ఓటర్లే అత్యధికం ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో 9,58,141 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,67,045 మంది పురుషులు కాగా 4,90,897 మంది మహిళలు. 199 మంది ఇతర ఓటర్లు. మొత్తం ఓటర్లలో 4,77,244 మంది నెల్లూరులో ఉండగా మిగిలినవారు ఇతర మునిసిపాలిటీల్లో ఉన్నారు. 10 చోట్ల తొలిసారి.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లా దర్శి, చిత్తూరు జిల్లా కుప్పం, కర్నూలు జిల్లా బేతంచర్ల, వైఎస్సార్ జిల్లా కమలాపురం, రాజంపేట, అనంతపురం జిల్లా పెనుకొండ మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు.. ఎన్నికలు నిలిచిన 14 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించడంతో ఆగిన ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్న విషయం విదితమే. మరణించిన అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి మాత్రమే ఆయా స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. అందులో ఆరు జెడ్పీటీసీ స్థానాల్లో కేవలం టీడీపీ అభ్యర్థులకు మాత్రమే కొత్తగా నామినేషన్ల వేసుకునే వీలుంటుంది. అలాగే రెండేసి చొప్పున జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కొత్తగా నామినేషన్లు వేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఒక జెడ్పీటీసీ స్థానంలో బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులకు అవకాశమిచ్చింది. ఈ జెడ్పీటీసీ స్థానాలతో పాటు 81 ఎంపీటీసీ స్థానాల్లో అన్ని పార్టీల నుంచి కాకుండా కేవలం ఒక్కొక్క పార్టీ నుంచి మాత్రమే నామినేషన్ల స్వీకరణకు అనుమతిచ్చింది. కాగా, మరో మూడు జెడ్పీటీసీ స్థానాలు, 95 ఎంపీటీసీ స్థానాలు, 69 గ్రామ సర్పంచ్, 533 వార్డు సభ్యులకు అన్ని రాజకీయ పార్టీల నుంచి, స్వతంత్రుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. -
మహిళలకే అగ్రతాంబూలం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగిన రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలను ఏకగ్రీవంగా దక్కించుకున్న టీఆర్ఎస్.. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేసింది. రిజర్వేషన్స్థానాల్లోనే గాక రిజర్వేషన్వర్తించని చోట్ల కూడా మహిళలకే ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తం 14 పదవుల్లో పదింటిని వారికే ఇచ్చి అగ్రతాంబూలం వేసింది. రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, అచ్చంపేట, కొత్తూరు మున్సిపాలిటీలకు గత నెల 30న పోలింగ్జరగ్గా.. ఈ నెల 3న ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. వీటిలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించింది. స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఈ పదవులన్నింటినీ టీఆర్ఎస్ అభ్యర్థులే ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. కార్పొరేషన్లలో.. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లుగా మహిళలకే టీఆర్ఎస్ప్రాధాన్యం ఇచ్చింది. వరంగల్ కార్పొరేషన్ మేయర్ పదవి బీసీ జనరల్ కేటగిరీకి రిజర్వు అయినా.. ఇక్కడ పద్మశాలి సామాజికవర్గానికి చెందిన బీసీ మహిళ, మాజీ ఎంపీ గుండు సుధారాణికి అవకాశం లభించింది. ఖమ్మం మేయర్ పదవి జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వుకాగా.. కమ్మ సామాజికవర్గానికి చెందిన నీరజను అధిష్టానం ఎంపిక చేసింది. రెండు కార్పొరేషన్లలోనూ ఎలాంటి రిజర్వేషన్ వర్తించని డిప్యూటీ మేయర్పదవులను మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఇచ్చింది. వరంగల్లో 36వ డివిజన్ నుంచి ఎన్నికైన రిజ్వానా షమీమ్, ఖమ్మంలో 37వ డివిజన్ నుంచి గెలిచిన షేక్ ఫాతిమా జోహ్రాకు పదవి దక్కింది. మున్సిపాలిటీల్లోనూ మహిళలకే.. సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవుల్లోనూ టీఆర్ఎస్ మహిళలకు ప్రాధాన్యతనిచ్చింది. జడ్చర్ల మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు రెండూ మహిళలకు దక్కాయి. అచ్చంపేట, నకిరేకల్లో వైస్ చైర్పర్సన్ పదవులకు మహిళా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు మున్సిపాలిటీల్లో ముగ్గురు చైర్పర్సన్లుగా, ముగ్గురు వైస్ చైర్ పర్సన్లుగా పీఠం అధిష్టించారు. ఎంపికలో ఎమ్మెల్యేలకే స్వేచ్ఛ 63 మంది కార్పొరేటర్లు ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉండటంతో మేయర్ అభ్యర్థి పేరును టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. నామినేషన్ల సమయంలోనే ఎంపీ గుండు సుధారాణికి అవకాశమిస్తామని కేసీఆర్ స్పష్టతనిచ్చారు. ఈ మేరకు ఆమెను ఎంపిక చేశారు. వరంగల్ మినహా ఖమ్మం, ఐదు మున్సిపాలిటీల్లో పదవుల ఎంపికలో పార్టీ స్థానిక ఎమ్మెల్యేలకు కేసీఆర్ స్వేచ్చనిచ్చారు. పరిశీలకులు సీల్డ్ కవర్లలో పేర్లను తీసుకెళ్లినా ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే ఎంపకి జరిగినట్టు జాబితా స్పష్టం చేస్తోంది. మంత్రి హరీశ్రావు ప్రతిపాదన మేరకు.. సిద్దిపేట మున్పిపల్ చైర్మన్గా వరుసగా రెండు పర్యాయాలు పనిచేసిన కడవేర్గు రాజనర్సు భార్య మంజుల తాజాగా చైర్ పర్సన్గా ఎన్నికయ్యారు. అచ్చంపేటలో ప్రభుత్వ విప్ బాలరాజు, జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, నకిరేకల్లో ఎమ్మెల్యే లింగయ్య, షాద్నగర్లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రతిపాదించిన వారికే పదవులు దక్కాయి. ఖమ్మంలోనూ మంత్రి పువ్వాడ అజయ్ ప్రతిపాదన మేరకే నీరజకు మేయర్గా అవకాశం దక్కినట్టు తెలిసింది. అన్ని జాగ్రత్తల మధ్య ఎన్నిక రెండు కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్లతోపాటు ఐదు మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ పదవులకు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నిక నిర్వహించారు. అన్ని పదవులు టీఆర్ఎస్కు దక్కడం ఖాయమవడంతో పార్టీ పరిశీలకులుగా వెళ్లిన మంత్రులు, ఇతర టీఆర్ఎస్ నేతలు.. ముందుగానే పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో భేటీ అయ్యారు. ఎన్నిక జరిగే తీరును వివరించడంతోపాటు పార్టీ ఖరారు చేసిన వారినే ఎన్నుకోవాలని సూచించారు. ఎన్నికల కోసం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జరిగిన ప్రత్యేక సమావేశాలకు.. కొత్త కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో సభ్యులను మాత్రమే సమావేశ మందిరంలోకి అనుమతించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సభ్యులు భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. శానిటైజర్లు, మాస్కులు, ఫేస్ షీల్డ్, గ్లౌజులు అందజేశారు. రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. అయితే విజయోత్సవ ర్యాలీలు, పూల దండలు, షాలువాలు, బొకేలపై అధికారులు నిషేధం విధించారు. వీడియో కాల్ 17 మంది ద్వారా ప్రమాణ స్వీకారం ఎన్నికల తర్వాత కోవిడ్ బారినపడిన 17 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వీడియా కాల్ ద్వారా ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికలోనూ వారు వీడియో కాల్ ద్వారా ఓటింగ్లో పాల్గొన్నారు. ఒక్క వరంగల్ కార్పొరేషన్లోనే గెలిచిన 48 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లలో.. కరోనా బారినపడ్డ ఎనిమిది మంది వీడియో కాల్ ద్వారానే ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం. కార్పొరేషన్/మున్సిపాలిటీ మేయర్/చైర్మన్ డిప్యూటీ మేయర్/వైస్ చైర్మన్ వరంగల్ (బీసీ జనరల్) గుండు సుధారాణి రిజ్వానా షమీమ్ ఖమ్మం (జనల్ మహిళ) పొనుకొల్లు నీరజ షేక్ ఫాతిమా జోహ్రా సిద్దిపేట (జనరల్ మహిళ) కడవేర్గు మంజుల జంగిటి కనకరాజు జడ్చర్ల (బీసీ మహిళ) దొరపల్లి లక్ష్మి పాలాది సారిక నకిరేకల్ (బీసీ జనరల్) రాచకొండ శ్రీనివాస్ ఎం.ఉమారాణి అచ్చంపేట (జనరల్) ఎడ్ల నర్సింహగౌడ్ పోరెడ్డి శైలజ కొత్తూరు (జనరల్ మహిళ) బి.లావణ్య డోలి రవీందర్ నంబర్ వన్ చేస్తా.. కార్పొరేటర్ల అందరి సహకారంతో ఖమ్మం కార్పొరేషన్ను నంబర్వన్ స్థానంలో నిలబెట్టేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తా. ఏ సమస్య వచ్చినా కార్పొరేటర్లు నన్ను సంప్రదించవచ్చు. అందరికీ అందుబాటులో ఉంటూ వారి డివిజన్లకు కావాల్సిన పనులు పూర్తి చేసేందుకు ప్రాధాన్యతనిస్తా. – ఖమ్మం మేయర్ నీరజ రాజకీయ పునర్జన్మ.. బీసీ జనరల్ స్థానంలో మహిళనైన నాకు అవకాశమిచ్చి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాజకీయ పునర్జన్మ ఇచ్చారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వరంగల్ అభివృద్ధికి పాటుపడతా. కేటీఆర్కు వరంగల్పై ప్రత్యేక విజన్ ఉంది భవిష్యత్ తరాలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తా. – వరంగల్ మేయర్ సుధారాణి చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ చదవండి: తమిళ రాజకీయాల్లో ఇక సినీ క్రేజ్ తగ్గినట్టేనా..? వరంగల్, ఖమ్మం మేయర్లు వీరే.. -
వరంగల్ మేయర్గా గుండు సుధారాణి ఎన్నిక
-
వరంగల్, ఖమ్మం మేయర్లు వీరే..
సాక్షి, ఖమ్మం: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయ్యింది. అనుకున్నట్లుగానే కమ్మ సామాజిక వర్గానికే ఖమ్మం మేయర్ పదవి దక్కింది. 26వ డివిజన్ నుంచి గెలిచిన పునుకొల్లు నీరజ ఖమ్మం మేయర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ పదవి మైనార్టీ వర్గానికి దక్కగా.. ఖమ్మం 38వ డివిజన్ కార్పొరేటర్గా గెలిచిన ఫాతిమా పేరును అధిష్టానం ఖరారు చేసింది. వరంగల్ మహా నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక వరంగల్ మేయర్ పీఠానికి 29 వ డివిజన్ కార్పొరేటర్ గుండు సుధారాణి పేరును అధిష్టానం ఖరారు చేసింది. సుధారాణికి మేయర్ పీఠం ఖాయమన్న ప్రచారం ముందు నుంచి జరిగింది.. అధిష్టానం కూడా ఆమె పేరే ప్రకటించింది. డిప్యూటీ మేయర్ పదవికి రిజ్వాన షమీకి దక్కింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలతో చర్చించి అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ పట్ల విధేయత, అనుభవం, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ ఎంపిక ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా తెరాస ఎన్నికల పరిశీలకులు బాధ్యతలు నిర్వర్తించారు. మధ్యాహ్నం 3 గంటలకు కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్, చైర్పర్సన్ల కోసం పరోక్ష ఎన్నిక నిర్వహించారు. మేయర్ అభ్యర్థుల పేర్లతో కూడిన సీల్డ్ కవర్లను టీఆర్ఎస్ అధిష్ఠానం, పార్టీ పరిశీలకులకు అందించింది. వరంగల్కు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, పరిశీలకులుగా వ్యవహరించారు. కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో 8 మంది కార్పొరేటర్లు గైర్హాజరు అయ్యారు. వీరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తద్వారా ఓటింగ్ ప్రక్రియ పూర్తిచేయడం జరిగింది. చదవండి: Municipal Polls: ఆ ఊపు లేదు.. హవా లేదు! -
నేడు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు మరో ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల భర్తీ కోసం శుక్రవారం పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరగనుంది. కార్పొరేషన్లలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుం టారు. ఈ నెల 3న వెలువడిన ఫలితాల్లో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో మెజారిటీ డివిజన్లు, వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో అన్ని చోట్లా ఇతర పార్టీలు, కో ఆప్షన్ సభ్యుల మద్దతు లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. అయితే సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు టీఆర్ఎస్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చం పేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు రెండు రోజుల క్రితమే పరిశీలకులను నియమించింది. పలువురు మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతోపాటు కొందరు ముఖ్య నేతలకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే ఆయా ప్రాం తాల పరిధిలోని మంత్రులు, స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకుని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆశావహుల జాబితాకు తుది రూపం ఇచ్చారు. పేర్లను సీల్డ్ కవర్లలో గురువారం మధ్యా హ్నం పార్టీ పరిశీలకులకు అందజేశారు. వీరు గురువారంరాత్రికే తమకు కేటాయించిన కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీకి చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నిక జరగనుండగా, పార్టీ కొత్త కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పరిశీలకులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశమవుతారు. ఎన్నిక జరిగే తీరుతెన్నులను వివరించడంతోపాటు, సీల్డ్ కవర్లోని పార్టీ నిర్ణయాన్ని కూడా తెలియచేస్తారు. కో ఆప్షన్ సభ్యులతోపాటు కొత్తగా ఎన్నికైన వారితో కలిసి ఎన్నిక జరిగే సమావేశ మందిరానికి చేరుకుంటారు. రిజర్వేషన్ కేటగిరీ, విధేయత, సీనియారిటీ తదితరాలను ప్రాతిపదికగా తీసుకుని కేసీఆర్ మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. కార్పొరేషన్/ మేయర్/చైర్మన్ మున్సిపాలిటీ ఆశావహులు వరంగల్ గుండు సుధారాణి ఖమ్మం బీసీ లేదా కమ్మ సామాజికవర్గం సిద్దిపేట కడవేర్గు మంజుల/ కొండం కవిత అచ్చంపేట నర్సింహ గౌడ్/ గోపిశెట్టి శివ/ పోరెడ్డి శైలజ జడ్చర్ల దోరేపల్లి లక్ష్మి కొత్తూరు కరుణ/ లావణ్య నకిరేకల్ రాచకొండ శ్రీనివాస్/ కొండ శ్రీనుగౌడ్ -
Telangana: 7న మేయర్, చైర్మన్ల ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ఈ నెల 7న మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్వహించనున్నారు. పరోక్ష పద్ధతిలో జరగనున్న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు నియమించిన గెజిటెడ్ అధికారి ప్రిసైడింగ్ అధికారిగా ఉంటారు. ఆయన ఈ పదవులకు ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సమావేశానికి పిలుపునిస్తూ ఈ నెల 6న లేదా అంతకంటే ముందే నోటీసు జారీ చేస్తారు. 7న మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తొలుత వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం 3.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికైన వార్డు మెంబర్లు, ఎక్స్– అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోకసభ, రాజ్యసభ సభ్యులు ఓటేయడానికి అర్హులు. ఓటు హక్కు ఉన్న సభ్యుల్లో సగం సంఖ్యను ’కోరం’గా పరిగణిస్తారు. మొదటి రోజు కోరం లేక ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు ఎన్నిక నిర్వహించాలి. రెండో రోజు లేదంటే ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలి. తదుపరి సమావేశంలో కోరంతో సంబంధం లేకుండా ఎన్నిక జరుగుతుంది. పార్టీ విప్కు అనుగుణంగా చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు. పార్టీ విప్ ను ధిక్కరించిన వారు అనర్హతకు గురవుతారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు విప్ ను నియమించి ఆ విషయాన్ని ప్రిసైడింగ్ అధికారికి ఎన్నిక ముందు రోజు 11 గంటల లోపు తెలపాలి. చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మేయర్, డిప్యూటి మేయర్ అభ్యర్థి పేరును ఓటు హక్కు కలిగి ఉన్న ఒక సభ్యుడు ప్రతిపాదిస్తే మరొకరు బలపరచాలి. ఒకే అభ్యర్ధి పోటీలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. చైర్పర్సన్/ మేయర్ ఎన్నిక పూర్తికాకపోతే డిప్యూటీ చైర్పర్సన్/ డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించరాదు. పరోక్ష ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఈ ఎన్నికలు జరగనున్న జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ ఎన్నిక నిర్వహించాలని ఆదేశించారు. విజయోత్సవ ర్యాలీపై ఎన్నికల సంఘం ఇప్పటికే నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
Municipal Polls: ఆ ఊపు లేదు.. హవా లేదు!
సాక్షి, హైదరాబాద్: ఆ ఊపు లేదు.. ఆ హవాలేదు.. ఆ హడావిడి లేదు.. ఆ సంబురం లేదు.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల జోరును మినీ మున్సి‘పోల్స్’లో కొనసాగించలేకపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో చతికిలపడిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. పట్టణ ప్రాంతాల్లో తమకున్న పట్టును నిలుపుకోవాలని పలు వ్యూహాలు పన్నినా అధికార టీఆర్ఎస్ ముందు అవి పారలేదు. ఎక్కడా సత్తా చాటలేకపోయింది. గ్రేటర్ వరంగల్లో మాత్రం కొంత నయం. 10 కార్పొరేటర్ స్థానాలను అతికష్టం మీద గెలుచుకుంది. కనీసంగా 20 కార్పొరేటర్ స్థానాలను దక్కించుకుంటామని పార్టీ శ్రేణులు తొలుత ధీమా వ్యక్తం చేశాయి. కానీ, ఇప్పుడు అందులో సగానికే పరిమితం కావాల్సి వచ్చింది. గతంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో బీజేపీకి ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్నారు. ఇక్కడ పది స్థానాలు రావడం కాస్త మెరుగేనని కార్యకర్తలు భావిస్తున్నారు. లింగోజిగూడ లాస్.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఒక కార్పొరేటర్ స్థానాన్ని చేజిక్కించుకొని ఖాతా తెరిచింది. తమ పార్టీ కార్పొరేటర్ మరణంతో ఉపఎన్నిక జరిగిన లింగోజిగూడ సిట్టింగ్ స్థానాన్ని మాత్రం కాపాడుకోలేకపోయింది. ఖమ్మంలో తమకు ఆరేడు స్థానాలు వస్తాయని, కాంగ్రెస్కు ఏమీ రావని పార్టీ ముఖ్యనేతలు వేసుకున్న అంచనా తారుమారైంది. గ్రేటర్ హైదరాబాద్ తరహాలో వరంగల్లో ఉండాలని, కనీసంగా 20 కార్పొరేటర్ స్థానాలను దక్కించుకోగలిగితే పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం సులభం అవుతుందని బీజేపీ శ్రేణులు భావించాయి. మున్సిపోల్స్లో తాము ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. చదవండి: 'పుర' పీఠాలపై గులాబీ జెండా -
'పుర' పీఠాలపై గులాబీ జెండా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరిగిన మినీ మున్సి‘పోల్స్’లో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు.. సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డులు గెలుచుకుని ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అన్నిచోట్లా సగానికి పైగా వార్డులు గెలుచుకోవడం ద్వారా ఎక్స్అఫీషియో ఓట్ల అవసరం లేకుండానే.. మేయర్/ చైర్ పర్సన్ పదవులను చేజిక్కించుకోబోతోంది. మొత్తంగా ఏడు పురపాలికల్లో 248 వార్డులకు ఎన్నికలు జరిగితే.. 181 సీట్లను, ఇతర ఐదు పురపాలికల్లోని ఐదు ఖాళీ వార్డులకు జరిగిన ఎన్నికల్లో మరో మూడు సీట్లను గులాబీ పార్టీ దక్కించుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. మినీ మున్సి‘పోల్స్’కు ఈ నెల 30న పోలింగ్ జరగగా.. సోమవారం ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. ఓరుగల్లు కోటపై గులాబీ జెండా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 66 వార్డులుండగా.. టీఆర్ఎస్ ఏకంగా 48 వార్డులను గెలుచుకుని విజయదుందుభి మోగించింది. బీజేపీ 10, కాంగ్రెస్ 4, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 1, స్వతంత్రులు 3 వార్డులను గెలుచుకున్నారు. ఇక్కడ 2016లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 44 వార్డులు గెలవగా, కాంగ్రెస్ 4, బీజేపీ 1, సీపీఐ 1, స్వతంత్రులు 8 వార్డుల్లో గెలిచారు. ఈసారి టీఆర్ఎస్ 48 సీట్లు గెలుచుకుంది. బీజేపీ బలం పెంచుకోగా, కాంగ్రెస్ తన సీట్లను నిలుపుకొంది. ఇక గ్రేటర్ వరంగల్ మేయర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ గుండు సుధారాణి పేరును పార్టీ అధిష్టానం ఇదివరకే ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 29వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలిచిన ఆమె త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని అంటున్నాయి. ఖమ్మంలోనూ హవా.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో 60 వార్డులుండగా.. టీఆర్ఎస్ 57, మిత్రపక్షం సీపీఐ 3 డివిజన్లలో బరిలోకి దిగాయి. టీఆర్ఎస్ 43 డివిజన్లు, సీపీఐ రెండు డివిజన్లను కైవసం చేసున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గులాబీ పార్టీనే కైవసం చేసుకోనుంది. కాంగ్రెస్ 48 డివిజన్లలో పోటీ చేసి 10 డివిజన్లు.. సీపీఎం 9 డివిజన్లలో పోటీ చేసి రెండు డివిజన్లు గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్లు 2 చోట్ల విజయం సాధించారు. ఏకంగా 47 డివిజన్లలో బరిలోకి దిగిన బీజేపీ.. కేవలం ఒక్క డివిజన్తోనే సరిపెట్టుకుంది. బీజేపీ పొత్తుతో పోటీ చేసిన జనసేన 6 డివిజన్లలో బరిలో నిలిచినా ఒక్కసీటూ గెలవలేదు. ఇక్కడ టీఆర్ఎస్లో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మున్సిపాలిటీల్లోనూ తొలిసారి ఎన్నికలు జరిగిన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 27 వార్డుల్లో 23 టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు రెండు సీట్ల చొప్పున దక్కించుకున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు.. 13 చోట్ల టీఆర్ఎస్, ఆరు చోట్ల కాంగ్రెస్ గెలవగా బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీలోని 20 వార్డులకు టీఆర్ఎస్ 11 గెల్చుకోగా.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మద్దతుదారులు (ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీచేసి) ఆరుగురు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్ ఒకరు గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్ధి కందాల భిక్షంరెడ్డి టీఆర్ఎస్ క్యాంపులోకి వెళ్లిపోవడంతో చైర్మన్ పీఠం టీఆర్ఎస్కే దక్కనుంది. జీహెచ్ఎంసీలోని లింగోజిగూడ డివిజన్లో కాంగ్రెస్ గెలుపు జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ (18వ వార్డు)కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఆకుల అఖిల్పై కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్రెడ్డి 1,272 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మొత్తం 13,591 ఓట్లు పోలవగా.. కాంగ్రెస్కు 7,240 ఓట్లు, బీజేపీకి 5,968 ఓట్లు వచ్చాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ నుంచి గెలిచిన ఆకుల రమేశ్గౌడ్ (బీజేపీ) అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. రమేశ్గౌడ్ కుటుంబ సభ్యులు, బీజేపీ నేతల విజ్ఞప్తి మేరకు టీఆర్ఎస్ ఈ ఎన్నికలో పోటీకి దూరంగా ఉంది. ఆ ఐదింటిలో మూడు.. రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న ఐదు వార్డులకు కూడా సోమవారం ఫలితాలు వచ్చాయి. గజ్వేల్ మున్సిపాలిటీలోని 12వ వార్డును, నల్లగొండ మున్సిపాలిటీలోని 26వ వార్డు, బోధన్ మున్సిపాలిటీలోని 18వ వార్డును టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకున్నారు. పరకాల మున్సిపాలిటీలోని 9వ వార్డును బీజేపీ, జీహెచ్ఎంసీలోని 18వ వార్డు (లింగోజిగూడ)ను కాంగ్రెస్ గెలుచుకున్నాయి. -
181+3 స్థానాలు గెలిపించిన మీకు థ్యాంక్స్: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాలను గెలిపించిన ఓటర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు (వరంగల్, ఖమ్మం), ఐదు మున్సిపాలిటీలకు (సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు) ఎన్నికలు జరగ్గా అందులో టీఆర్ఎస్ విజయ భేరీ మోగించడంతో సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రంలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు (వరంగల్, ఖమ్మం), ఐదు మున్సిపాలిటీలకు (సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు) జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ గెలిపించి, 74శాతం ఓట్లతో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాలను టీఆర్ఎస్కు, 3 స్థానాలను మిత్రపక్షం సీపీఐకి కలిపి 184 స్థానాల్లో గెలిపించి టీఆర్ఎస్కు తిరుగులేదని మరోమారు నిరూపించారు. టీఆర్ఎస్ పార్టీయే మా పార్టీ అని తెలంగాణ ప్రజలు నిష్కర్షగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి ఇంతటి అద్భుత విజయాన్ని చేకూర్చిన ఏడు మున్సిపాలిటీల ప్రజలందరికీ ధన్యవాదాలు’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. చదవండి: మమతాకు ఉన్న ఒకేదారి ఏమిటో తెలుసా..? చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర -
అన్ని చోట్ల గుబాళింపు: టీఆర్ఎస్లో డబుల్ జోష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఫుల్ జోష్లో ఉంది. నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికలో గెలిచిన ఆనందంలో ఉండగానే మినీ మున్సిపల్స్లో అద్భుతమైన విజయంతో డబుల్ సంతోషంలో టీఆర్ఎస్ శ్రేణులు మునిగారు. రాష్ట్రంలో జరిగిన ఐదుకు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం ఐదు మున్సిపాలిటీలను సొంతం చేసుకుని గులాబీ పార్టీ సత్తా చాటింది. ఇక వరంగల్, ఖమ్మం కార్పొఒరేషన్లను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకోవడంతో గులాబీ శ్రేణుల్లో డబుల్ జోష్ వచ్చింది. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. నకిరేకల్లో 20 వార్డులు ఉండగా వాటిలో టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు 6 గెలిచారు. ఆ ఇతరుల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. రేపోమాపో వారు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. దీంతో టీఆర్ఎస్ సంఖ్య పెరగనుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ 7 స్థానాలతో సొంతం చేసుకుంది. 12 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 7 గెలవగా కాంగ్రెస్ 5 డివిజన్లలో గెలిచింది. నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో 20 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 13 గెలిచి చైర్మన్ పీఠం సొంతం చేసుకుంది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ 6, బీజేపీ 1 గెలుచుకున్నాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ భారీగా డివిజన్లు సొంతం చేసుకుంది. మొత్తం 27 డివిజన్లు ఉండగా వాటిలో 23 టీఆర్ఎస్ గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ 2, బీజేపీ 2 డివిజన్లతో సరిపెట్టుకున్నాయి. సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీశ్ రావు మ్యాజిక్ చేసినట్టు కనిపిస్తోంది. 43 స్థానాలు ఉన్న సిద్దిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఏకంగా 36 సొంతం చేసుకుంది. ఒకటి చొప్పున బీజేపీ, ఎంఐఎం గెలవగా ఇతరులు 5 డివిజన్లలో గెలిచారు. ఇతరులు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. క్లీన్ స్వీప్ చేస్తుందని అందరూ భావించగా కొద్దిలో ఆ అవకాశం మిస్సయ్యింది. సొంత నియోజకవర్గం సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు సత్తా చాటారు. కార్పొరేషన్ ఫలితాలు గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ 51 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 10 సొంతం చేసుకోగా, రెండుచోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్లో 55 డివిజన్లు ఉండగా అత్యధిక డివిజన్లను అధికార పార్టీ టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. 45 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొంది కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 8 డివిజన్లు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు. చదవండి: థియేటర్లో కాదు.. శ్మశానాల్లో ‘హౌస్ ఫుల్’ చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర -
సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ అప్ డేట్
-
లింగోజిగూడ డివిజన్: ఉప ఎన్నికల కౌంటింగ్
-
తెలంగాణ:మినీ మున్సి ‘పోల్స్’ కౌంటింగ్
-
తెలంగాణ: 2 కార్పొరేషన్, 5 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ వశం
లైవ్ అప్డేట్స్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ 51 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 10 సొంతం చేసుకోగా, రెండుచోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్లో 55 డివిజన్లు ఉండగా అత్యధిక డివిజన్లను అధికార పార్టీ టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. 45 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొంది కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 8 డివిజన్లు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్లో పొత్తులవారీగా.. టీఆర్ఎస్ + సీపీఐ =38 కాంగ్రెస్+ సీపీఎం = 11 బీజేపీ = 1 ఇతరులు = 2 తెలంగాణలో 5 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయం నకిరేకల్ (20): టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు 6 కొత్తూరు (12): టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5 అచ్చంపేట (20): టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6, బీజేపీ 1 జడ్చర్ల (27): టీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 2, బీజేపీ 2 సిద్దిపేట (43): టీఆర్ఎస్ 36, బీజేపీ 1, ఎంఐఎం 1, ఇతరులు 5 సిద్దిపేట మున్సిపాలిటీ జనరల్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు 1వ వార్డు టీఆర్ఎస్ 2వ వార్డు టీఆర్ఎస్ 3వ వార్డు టీఆర్ఎస్ 4వ వార్డు టీఆర్ఎస్ 5వ వార్డు టీఆర్ఎస్ 6వ వార్డు టీఆర్ఎస్ 7వ వార్డు టీఆర్ఎస్ 8వ వార్డు టీఆర్ఎస్ 9వ వార్డు టీఆర్ఎస్ 10వ వార్డు టీఆర్ఎస్ 11వ వార్డు టీఆర్ఎస్ 12వ వార్డు టీఆర్ఎస్ 13వ వార్డు టీఆర్ఎస్ 14వ వార్డు టీఆర్ఎస్ 15వ వార్డు టీఆర్ఎస్ 16వ వార్డు టీఆర్ఎస్ 17వ వార్డు బీజేపీ 18వ వార్డు టీఆర్ఎస్ 19వ వార్డు టీఆర్ఎస్ 20వ వార్డు స్వతంత్రుడు. కానీ టీఆర్ఎస్లో చేరిక 21వ వార్డు టీఆర్ఎస్ 22వ వార్డు టీఆర్ఎస్ 23వ వార్డు టీఆర్ఎస్ 24వ వార్డు టీఆర్ఎస్ 25వ వార్డు టీఆర్ఎస్ 26వ వార్డు టీఆర్ఎస్ 27వ వార్డు టీఆర్ఎస్ 28వ వార్డు టీఆర్ఎస్ 29వ వార్డు ఏఐఎంఐఎం 30వ వార్డు టీఆర్ఎస్ 31వ వార్డు టీఆర్ఎస్ 32వ వార్డు టీఆర్ఎస్ 33వ వార్డు టీఆర్ఎస్ 34వ వార్డు టీఆర్ఎస్ 35వ వార్డు స్వతంత్ర 36వ వార్డు స్వతంత్ర 37వ వార్డు టీఆర్ఎస్ 38వ వార్డు టీఆర్ఎస్ 39వ వార్డు టీఆర్ఎస్ 40వ వార్డు టీఆర్ఎస్ 41వ వార్డు టీఆర్ఎస్ 42వ వార్డు స్వతంత్ర 43వ వార్డు స్వతంత్ర ................................. 43 వార్డుల్లో టీఆర్ఎస్ 36 సొంతం చేసుకోగా, స్వతంత్రులు ఐదుగురు, ఒక బీజేపీ, ఒక ఏఐఎంఎం సొంతం చేసుకున్నాయి. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తాజా లెక్కింపు వివరాలు మొత్తం డివిజన్లు 66 ఉండగా టీఆర్ఎస్ హవా సాగిస్తోంది. టీఆర్ఎస్ 28 విజయం + 23 ఆధిక్యం = మొత్తం 51 బీజేపీ 8 విజయం, రెండింటిలో ఆధిక్యం = మొత్తం 10 ఒక చోట కాంగ్రెస్ విజయం, మరో చోట ఆధిక్యం స్వతంత్రులు ఇద్దరు విజయం, ఒకరు ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం మూడు స్థానాలు ఖమ్మం లెక్కింపు కేంద్రంలో గందరగోళం .. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్ బ్యాలెట్ బాక్స్ లో కంపించాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ ఆందోళన. 11 డివిజన్ బ్యాలెట్ బాక్స్లో 24వ డివిజన్ ఓట్లలో ఎలా వచ్చాయంటూ ఆందోళన. కౌంటింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి. కన్నీళ్లు పెట్టుకుంటూ కౌంటింగ్ కేంద్రం ముందు ఆందోళన. రీపోలింగ్ జరపాలని డిమాండ్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ అప్డేట్స్.. మూడు రౌండ్లు ముగిసేవరకు 28 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం..మరో 23 డివిజన్లలో ఆధిక్యం. 7 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం.. మరో మూడు డివిజన్లలో లీడ్. ఒక డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం. మరో డివిజన్లో లీడ్. రెండు డివిజన్లలో స్వతంత్రులు విజయం. మరో స్థానంలో లీడ్. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. రెండో రౌండ్లో దూసుకుపోతున్న కారు.. 22, 23 , 24 , 25 , 26, 27 వార్డుల్లో కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 9, బీజేపీ 3, కాంగ్రెస్ 1, ఐఏఎఫ్ బీ ఒకరు గెలిచారు. టీఆర్ఎస్ నుంచి 9వ డివిజన్ టీఆర్ఎస్ చీకటి శారద 13 వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి సురేష్ జోషి విజయం 23 డివిజన్ టీఆర్ఎస్ యెలగం లీలావతి 24 డివిజన్ టీఆర్ఎస్ రామ తేజస్విని విజయం 28వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి గందె కల్పన విజయం 29 డివిజన్ టీఆర్ఎస్ గుండు సుధారాణి 51వ డివిజన్ బోయినిపెల్లి రంజిత్ రావు 60వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి అభినవ్ భాస్కర్ 61వ డివిజన్ టీఆర్ఎస్ ఎలకంటి రాములు గెలిచారు. బీజేపీ 30 డివిజన్ రావుల కోమల 52 డివిజన్ చాడ స్వాతి 59వ డివిజన్ గుజ్జుల వసంత ఇతరులు 22 డివిజన్ ఐఏఎఫ్ బీ అభ్యర్థి బస్వరాజు కుమార్ 10వ డివిజన్ కాంగ్రెస్ తోట వెంకటేశ్వర్లు గెలిచారు. 2 డివిజన్లలో టీఆర్ఎస్ ముందంజ. 10 టీఆర్ఎస్ గెలుపు. బీజేపీ 5, 3 డివిజన్లలో ముందంజలో స్వంతంత్ర అభ్యర్థి 1 గెలుపు, 1 కాంగ్రెస్ గెలుపు వరంగల్ : 6 డివిజన్ చెన్నం మధు టీఆర్ఎస్ గెలుపు 7 డివిజన్ వేముల శ్రీనివాస్ టీఆర్ఎస్ గెలుపు ఖమ్మం.. ఖమ్మం కార్పొరేషన్ 30డివిజన్ల లెక్కింపు పూర్తి టీఆర్ఎస్, సీపీఐ కూటమి -21 (టీఆర్ఎస్-19, సీపీఐ-2) కాంగ్రెస్, సీపీఎం కూటమి-7 (కాంగ్రెస్ 6, సీపీఎం 1) బీజేపీ-1 స్వతంత్ర -1 టీఆర్ఎస్-21 కాంగ్రెస్-07 బీజేపీ-01 స్వతంత్ర -01 నల్లగొండ: నకిరేకల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం నకిరేకల్ (20): టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు 6 రంగారెడ్డి: కొత్తూరు మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం కొత్తూరు (12): టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5 నాగర్కర్నూలు: అచ్చంపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం అచ్చంపేట (20): టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6, బీజేపీ 1 మహబూబ్నగర్: జడ్చర్ల మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం జడ్చర్ల (27): టీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 2, బీజేపీ 2 సిద్దిపేట: సిద్దిపేట 4 వ వార్డులో బీజేపీ పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థి లక్ష్మి మృతి .నాల్గు రోజుల నుంచి అనారోగ్యంతోబాధపడుతున్న లక్ష్మి సోమవారం మృతి చెందారు. ఖమ్మం: పోలింగ్ నాడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఖమ్మం 57వ డివిజన్లో కాంగ్రెస్ విజయం సాధించింది. పోలింగ్ రోజు 57వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్, టీఆరెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ వాళ్ళు దొంగ ఓట్లు వేయించారని పోలింగ్ కేంద్రం ముందు బైఠాయించి ఆందోళన చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. దాంతో పోలీసులు రెండు సార్లు లాఠీ ఛార్జ్ చేశారు. హైదరాబాద్: లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్ధి దర్పల్లి రాజశేఖర్రెడ్డి గెలుపొందారు. బల్దియాలో మూడుకు చేరిన కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య. బీజేపీ కార్పొరేటర్ మృతితో లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నిక అనివార్యం అయింది. నల్గొండ జిల్లా: నకిరేకల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం నకిరేకల్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో టీఆర్ఎస్ 12 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 2, ఇతరులు 5 వార్డుల్లో గెలుపొందారు. ►ఒకటో వార్డులో 190 ఓట్లు మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థి కందాల భిక్షం రెడ్డి గెలుపొందారు. 196 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ► రెండో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సునీల్ కుమార్ 400 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ► మూడో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి చింత స్వాతి త్రిమూర్తులు గెలిచారు. ► నాలుగో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాజుల సుకన్య విజయం సాధించారు. ► ఐదో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి వంటేపాక సోమలక్ష్మీ గెలుపొందారు. ► ఆరో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ మట్టిపల్లి కవిత విజయం సాధించారు. ► ఏడో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కొండ శ్రీను గెలుపొందారు. ► ఎనిమిదో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పన్నాల పావని శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. ► తొమ్మిదో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి చౌగోని రజిత విజయం సాధించారు. ► పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇ సునీత 74 మెజారిటీతో విజయం సాధించారు. ► 11వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మురారి శెట్టి ఉమారాణి గెలుపొదారు. ► 12వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బానోతు వెంకన్న విజయం సాధించారు. ► 13వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత విజయం సాధించారు. ► 14వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం స్వామి గెలుపొందారు. ► 15వ వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి యసారపు వెంకన్న గెలిచారు. ► 16వ వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి సైదుల విజయం సాధించారు. ►17వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లె విజయ్ గెలిచారు. ► 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దైద స్వప్న రవీందర్ విజయం సాధించారు. ► 19వ వార్డులో రాచకొండ శ్రీను (టీఆర్ఎస్) గెలుపొందారు. ► 20వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి రాములమ్మ విజయం సాధించారు. ఖమ్మం జిల్లా: ఖమ్మం కార్పొరేషన్ ఫలితాలు: ► ఒకటో డివిజన్ టీఅర్ఎస్ అభ్యర్థి తేజావత్ హుస్సేన్ గెలుపొందారు. ► 2వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్ధి వెంకటేశ్వర్లు గెలుపొందారు. ► 3వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కొత్తపల్లి నీరజ విజయం సాధించారు. ► 7వ డివిజన్లో బీజేపీ దొంగల సత్యనారాయణ గెలుపొందారు. ► 8వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సైదుల విజయం సాధించారు. ► 14వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి బలరాజు విజయం సాధించారు. ► 20వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ లక్ష్మీ గెలుపొందారు. ► 25వ డివిజన్లో టీఆఎస్ అభ్యర్థి చంద్రకళ గెలుపొందారు. ► 31వ డివిజన్లో సీపీఎం అభ్యర్థి ఎర్ర గోపి విజయం సాధించారు. ► 37వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఫాతిమా జోహార విజయం సాధించారు. ► 43వ డివిజన్ నుంచి సీపీఐ అభ్యర్ధి క్లైమేట్ విజయం సాధించారు. ►44వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయ గెలుపొందారు. ► 55వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి మోతారపు శ్రావణి విజయం సాధించారు. ► 56వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పైడిపల్లి రోహిణి గెలుపొందారు. ►ఖమ్మం కార్పొరేషన్ 30 డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది. టీఆర్ఎస్,సీపీఐ కూటమి-21(టీఆర్ఎస్-19, సీపీఐ-2), కాంగ్రెస్, సీపీఎం కూటమి-07(కాంగ్రెస్-6, సీపీఎం-1), బీజేపీ-01, ఇండిపెండెంట్-01 గెలుపొందారు. వరంగల్: వరంగల్ కార్పొరేషన్ ఫలితాలు: వరంగల్ కార్పొరేషన్లో కొనసాగుతున్నటీఆర్ఎస్ హవా. టీఆర్ఎస్ 23 డివిజన్లు, బీజేపీ 3 డివిజన్లు, కాంగ్రెస్ పార్టీ 1 డివిజన్లో ఆధిక్యంలో ఉన్నాయి. ► వరంగల్ కార్పొరేషన్లో కొనసాగుతున్నటీఆర్ఎస్ హవా. టీఆర్ఎస్ 23 డివిజన్లు, బీజేపీ 3 డివిజన్లు, కాంగ్రెస్ పార్టీ 1 డివిజన్లో ఆధిక్యంలో ఉన్నాయి. సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీ ఫలితాలు ► 1వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి విజేందర్ రెడ్డి గెలుపొందారు. ► 2వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నాయిని చంద్రం 364 ఓట్ల మెజారిటీ గెలిచారు. ► 3వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి వంగ రేణుక తిరుమల్ రెడ్డి విజయం సాధించారు. ► 4వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కొండం కవిత గెలుపొందారు. ► 5వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి అనగోని వినోద్ విజయం సాధించారు. ► 6వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి వడ్ల కొండ సాయి కుమార్ గెలుపొందారు. ► 7వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల శ్రీదేవి 547 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ► 8వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి వరాల కవిత విజయం సాధించారు. ► 9వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి పసుకుల సతీష్ 88 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ► 10వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బింగి బాల్ లక్ష్మీ 222 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ► 11వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ యాదవ్ గెలుపొందారు. ► 12వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి అత్తెల్లి శ్రీనివాస్ 331 ఓట్లతో విజయం సాధించారు. ► సిద్దిపేట మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. మొత్తం 43 వార్డుల్లో.. 14 వార్డుల్లో టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా.. బీజేపీ రెండో స్థానంలో ఉంది. ► తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి. 12 వార్డుల్లో మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 49. టీఆర్ఎస్ 44, బీజేపీ 2, ఇండిపెండెంట్ 3 ఓట్లు వచ్చాయి. ►మొదటి రౌండ్లో 21 వార్డుల్లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 19 వార్డుల్లో టీఆర్ఎస్, బీజేపీ-1, ఇండిపెండెంట్-1 గెలుపొందారు. మహబూబ్నగర్: అచ్చంపేట మున్సిపాలిటీ ఫలితాలు.. ►అచ్చంపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం అయ్యింది. 20 వార్డుల్లో కౌంటింగ్ పూర్తయ్యింది. టీఆర్ఎస్-13, కాంగ్రెస్-6, బీజేపీ-1 విజయం సాధించారు. ►ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గౌరి శంకర్ విజయం సాధించారు. ►13వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి అంతటి శివ గెలుపొందారు. వరంగల్: పరకాల 9వ వార్డులో బీజేపీ విజయం పరకాల 9వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. పరకాల మున్సిపాలిటీ 9 వార్డులో 215 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి పూర్ణచారి విజయం సాధించారు. 261ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి చిదురాల దేవేంద్ర రెండో స్థానంలో నిలిచారు. 131 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి దార్నా వేణుగోపాల్ మూడో స్థానంలో నిలిచారు. రంగారెడ్డి: కొత్తూరు మున్సిపాలిటీ ► ఏడో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కమ్మరి జయమ్మ 26 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ► రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతోంది. మహబూబ్ నగర్: జడ్చర్ల మున్సిపాలిటీ జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. రెండు రౌండ్లలో ఫలితాలు కానున్నాయి.5 కౌంటింగ్ హాల్స్లో 19 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ► సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ► తెలంగాణ మినీ మున్సి ‘పోల్స్’ కౌంటింగ్ ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లకు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేశారు. నెగిటివ్ రిపోర్ట్ ఉన్నవారికే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. ► తెలంగాణ మినీ మున్సి ‘పోల్స్’ కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభంకానుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో పాటు సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీల ఓట్లను లెక్కిస్తారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లకు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేశారు. నెగిటివ్ రిపోర్ట్ ఉన్నవారికే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. సాక్షి, హైదరాబాద్: మినీ మున్సి‘పోల్స్’ఫలితాలు నేడు(సోమవారం) వెల్లడికానున్నాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలతోపాటు గజ్వేల్ మున్సిపాలిటీలోని 12వ వార్డు, నల్లగొండ 26వ వార్డు, బోధన్ 18వ వార్డు, పరకాల 9వ వార్డు, జీహెచ్ఎంసీలోని లింగోజిగూడ డివిజన్కు గత నెల 30న ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో సాయంత్రంలోగా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపులో కోవిడ్–19 నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా అధికారులను ఆదేశించింది. ఫలితాలు వెల్లడైన తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ఆంక్షలు విధించింది. ఎన్నికల అధికారులు, సిబ్బందితోపాటు ఏజెంట్లు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకుని నెగెటివ్గా తేలిన తర్వాతే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం: ఈటల బర్తరఫ్ -
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో స్వల్ప ఉద్రిక్తత
-
ఖమ్మం 57వ డివిజన్లో ఉద్రిక్తత
-
లింగోజిగూడలో ప్రశాంతంగా పోలింగ్
-
వరంగల్: కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్, లైవ్ అప్డేట్స్
-
మినీ మున్సి‘పోలింగ్’.. లైవ్ అప్డేట్స్
-
సిద్దిపేట: మున్సి‘పోలింగ్’.. లైవ్ అప్డేట్స్
-
ఖమ్మం:మినీ మున్సి‘పోలింగ్’..
-
తెలంగాణ మున్సి‘పోల్స్’: భౌతిక దూరం పాటించని ఓటర్లు
-
Telangana Municipal Elections 2021: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
తెలంగాణలో రెండు, కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 5 గంటల వరకు ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్. అయితే 5 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. Time: 3:00 గంటల వరకు పోలింగ్ 44.15 శాతంగా నమోదైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. Time: 2:15 PM కాంగ్రెస్ నేత ముస్తఫా అరెస్ట్ ఖమ్మం: 57వ డివిజన్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. కాంగ్రెస్ నాయకుడు ముస్తఫాని అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో కార్యకర్తలను అడ్డుకోవడమే కాక వారిని చెదరగొట్టారు. Time: 1:31 PM ఉద్రిక్తత.. పోలింగ్ కేంద్రం ఎదుట లాఠీఛార్జి ఖమ్మం: 57వ డివిజన్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్ఎస్పీ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. టీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపణలకు దిగారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. Time: 1:02 PM విషాదం.. గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి వరంగల్: మున్సిపల్ ఎన్నికల విధుల్లో విషాదం నెలకొంది. 57వ డివిజన్లోని సమ్మయ్య నగర్ లో పోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు రమేష్బాబు గుండెపోటుతో మృతి చెందారు. జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలంలోని కొండాపూర్ తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఆయన పని చేస్తున్నారు. Time: 12:47 PM ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి హరీష్రావు.. సిద్ధిపేట 23వ వార్డులోని 69వ పోలింగ్ బూత్లో మంత్రి హరీష్రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలోన రెండు కార్పొరేషన్లు, 5 మున్సి పాలిటీల్లో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సిద్దిపేట 43 వార్డులకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ను వెబ్ కెమెరా లో పరిశీలించారు. సమయానుకూలంగా ఓటర్లందరూ వచ్చి విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. Time: 12:08 PM ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వరంగల్ కార్పొరేషన్- 23.62 శాతం ఖమ్మం కార్పొరేషన్- 23.41 శాతం సిద్దిపేట మున్సిపాలిటీ- 31.39 శాతం అచ్చంపేట మున్సిపాలిటీ- 34 శాతం జడ్చర్ల మున్సిపాలిటీ-35 శాతం కొత్తూరు మున్సిపాలిటీలో 43.99 శాతం నకిరేకల్ మున్సిపాలిటీ- 45.55 శాతం Time: 12:00 PM టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ ఖమ్మం: పీజీ కాలేజీ సెంటర్ ముందు టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పరస్పర ఆరోపణలకు దిగారు. ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు చేరుకున్నారు. Time: 11:35 AM సిద్ధిపేట మున్సిపాలిటీలో ఉదయం 11 గంటల వరకు 31.39 శాతం పోలింగ్ నమోదైంది. సిద్ధిపేట జిల్లా గజ్వెల్ పట్టణం లో 12వ వార్డు పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదైంది. అచ్చంపేటలో 11 శాతం, నకిరేకల్లో 11.12 శాతం, జడ్చర్లలో 12 శాతం, ఖమ్మం కార్పొరేషన్లో 15.23 శాతం పోలింగ్ జరిగింది. Time: 10:43 AM బీజేపీ ఆందోళన.. ఖమ్మం కార్పొరేషన్ 20వ డివిజన్ పరిధిలో బీజేపీ ఆందోళన చేపట్టింది. కాలేజీ విద్యార్థులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు ప్లకార్టులతో ధర్నా నిర్వహించారు. Time: 9:20 AM ఖమ్మం: పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. కొన్ని చోట్ల కోవిడ్ నిబంధనలు ప్రకారం.. అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో ఓటర్లు క్యూలైన్లల్లో సోషల్ డిస్టెన్స్ పాటించడంలేదు. Time: 8:36 AM ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం కార్పొరేషన్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా ఇందులో 10వ డివిజన్ ఏకగ్రీవం కావడంతో 59డివిజన్ల కు పోలింగ్ జరుగుతుంది. హార్వెస్ట్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: 8:14 AM సిద్దిపేటలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 100653 ఉండగా.. పురుష ఓటర్లు 49875 మంది, మహిళా ఓటర్లు 50767 మంది ఉన్నారు. 130 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 485 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. Time: 7:58 AM నల్గొండ జిల్లా: నకిరేకల్ నూతన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. వార్డుకి రెండు బూత్లు చొప్పున 40 పోలింగ్ బూత్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. Time: 7:10 AM తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, 5 మున్సి పాలిటీల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో కొనసాగనుంది. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్ది పేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు, కొన్ని మున్సిపాలిటీలలోని ఒక్కొక్క వార్డుకు పోలింగ్ జరుగుతోంది. కోవిడ్ నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. ♦వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికల పోలింగ్ ♦వరంగల్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లకు పోలింగ్ ♦వరంగల్ కార్పొరేషన్ 66 డివిజన్ల బరిలో 502 మంది అభ్యర్థులు ♦ఖమ్మం కార్పొరేషన్ 60 డివిజన్లలో ఒకటి ఏకగ్రీవం, 59 చోట్ల పోలింగ్ ♦ఖమ్మం కార్పొరేషన్ 59 డివిజన్ల బరిలో 251 మంది అభ్యర్థులు ♦ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 377 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు ♦ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 2.88 లక్షల మంది ఓటర్లు ♦సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు పోలింగ్ ♦అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికలకు పోలింగ్ ♦సిద్దిపేట మున్సిపాలిటీ 43 వార్డుల్లో 236 మంది అభ్యర్థులు ♦కొత్తూరు మున్సిపాలిటీ 12 వార్డుల్లో 47 మంది అభ్యర్థులు ♦అచ్చంపేట మున్సిపాలిటీ 20 వార్డుల్లో 66 మంది అభ్యర్థులు ♦జడ్చర్ల మున్సిపాలిటీ 27 వార్డుల్లో 112 మంది అభ్యర్థులు ♦నకిరేకల్ మున్సిపాలిటీ 20 వార్డుల్లో 93 మంది అభ్యర్థులు కోవిడ్– 19 నిబంధనలను హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదేశించారు. ఎన్నికలు జరగనున్న ప్రాంతాల పరిధిలోని జిల్లా కల్లెక్టర్లు, పోలీస్ కమిషనర్లు/ఎస్పీలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు, మునిసిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు రోజున పాటించాల్సిన కోవిడ్–19 నిబంధనలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో ఈ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు శివ బాలాజీ రెడ్డి, ఓఎస్డీ జయసింహ రెడ్డి కూడా పాల్గొన్నారు. మే 3న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఫలితాల ప్రకటన ఏర్పాట్లను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షించింది.పోలింగ్ సందర్భంగా ఇలా.. ► పోలింగ్ నాడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి ► అన్ని పోలింగ్ కేంద్రాల పరిసరాలను శానిటైజ్ చేయాలి ► పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశిస్తున్న సమయంలోనూ, బయటికి వచ్చేటప్పుడూ చేతులను శానిటైజ్ చేసుకోవాలి. దీనికోసం శానిటైజర్లను సిద్ధంగా ఉంచాలి. ► భౌతిక దూరం పాటించేలా పోలింగ్ కేంద్రాల బయట వలయాలను మార్క్ చేసి, భౌతిక దూరం పర్యవేక్షణకు ఒక పోలీస్ కానిస్టేబుల్ నియామకం ► భౌతిక దూరం పాటించేలా పోలింగ్ సిబ్బంది, ఏజెంట్ల సీటింగ్ ► సిబ్బంది, పోలీసులు విధిగా మాస్క్ లు, ఫేస్ షీల్డులు, గ్లౌజులు ధరించాలి. వీలును బట్టి ఎన్–95 మాస్క్ లేదా రెండు మాస్కులు ధరించాలి. ► కోవిడ్–19 నిబంధనల అమలుకు ప్రతి మునిసిపాలిటీలో ఒకరు లేదా ఇద్దరు హెల్త్ నోడల్ అధికారుల నియామకం. ► ప్రతి కేంద్రంలో ఒకరు లేదా ఇద్దరు ఆరోగ్య సిబ్బంది మెడికల్ కిట్లతో సిద్ధంగా ఉండాలి. ► అవసరమైన అంబులెన్సులను ఆక్సిజెన్ సిలిండర్లతో సిద్ధంగా ఉంచాలి ► రిసెప్షన్లో ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి ఒకే సమయంలో 10 మందికి మించకుండా ఉండేలా చూడాలి. ► పోలింగ్ సిబ్బందికి రిసెప్షన్ సెంటర్ నుండి వారి గమ్యస్థానాలకు రవాణా సౌకర్యం కల్పించాలి. ► నలుగురికంటే ఎక్కువ మంది ఒక్కచోట చేరకుండా చూడాలి. అవసరమైతే 144 సెక్షన్ విధించాలి. కౌంటింగ్ సమయంలో... ► స్ట్రాంగ్ రూమ్లు విశాలమైన గదులలో ఏర్పాటు చేసి శానిటైజ్ చేయాలి. అలాగే పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టాలి. ► కౌంటింగ్ హాల్స్ విశాలమైన గదులలో ఏర్పాటు చేయాలి. ఒక్క కౌంటింగ్ హాల్లో 50 మందికి మించి ఉండొద్దు. ► కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ఏర్పాటు చేయాలి. ► మాస్కులు ధరించి, ఎప్పటికప్పుడు శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకునేలా చూడాలి. ► జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్న వారిని కౌంటింగ్ హాల్లోకి అనుమతించరాదు. ► అవసరమైన వారికి పీపీఈ కిట్లు ఇవ్వాలి. -
ఎస్ఈసీ అధికారులు అంగారక గ్రహంపై ఉన్నారేమో?
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలు సజావుగా, జాగ్రత్తగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మద్యం షాపులు మూసివేయాలని ప్రభుత్వానికి సూచించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టిన హైకోర్టు విచారణకు ఎస్ఈసీ కార్యదర్శి హాజరయ్యారు. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు పలు సూచనలు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు అత్యంత బాధాకరంగా ఉందని హైకోర్టు పేర్కొంది. ఎన్నికల సంఘం పనితీరు సరిగా లేదని కరోనా విపత్తులో ఎన్నికలు వాయిదా వేయకుండా ముందుకెళ్లడం బాధాకరమని విచారం వ్యక్తం చేసింది. ఎన్నికల విధుల్లో 2557 మంది పోలీసులు సహా 7695 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారని ఎస్ఈసీ తెలపగా.. ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల నిర్వహిస్తున్నారని హైకోర్టు తెలిపింది. గతంలో హైదరాబాద్ మేయర్ స్థానం ఏడాదిన్నర ఖాళీగా ఉంది కదా అని ధర్మాసనం గుర్తు చేసింది. ఉద్యోగులు చేస్తారా? చస్తారా అనే పరిస్థితి కల్పించారని వ్యాఖ్యానించింది. ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే.. ఎస్ఈసీ దృష్టి ఎన్నికలపై ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్ఈసీ అధికారులు అంగారక గ్రహంపై ఉన్నారేమో? అని మండిపడింది. ప్రభుత్వం కూడా ఎన్నికలకు సన్నద్ధత వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. చదవండి: ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాలా?: తెలంగాణ హైకోర్టు -
సిద్ధిపేట: మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి హరీష్ రావు జోరు
-
పట్టణాల్లో గెలుపు.. పట్టు నిలుపు!
సాక్షి, హైదరాబాద్: మినీ పురపోరును బీజేపీ సవాల్గా తీసుకుంది. ఎన్నికల రణానికి అన్ని అస్త్రాలతో సిద్ధమైంది. మున్సి‘పోల్స్’లో విజయం ద్వారా పట్టణాల్లో పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట్; నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూర్ మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. పట్టణ ప్రాంతాల్లో తమకు ఉన్న బలాన్ని ఓట్లుగా మార్చుకునేందుకు పక్కావ్యూహంతో ముందుకువెళుతోంది. పార్టీకి బలమున్న డివిజన్లు, వార్డులపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు మిగతాచోట్లా తమ అభ్యర్థులను గెలి పించుకునేలా కసరత్తు చేసింది. క్షేత్రస్థాయిలో ప్రతిఓటరు నూ కలిసేలా పార్టీ శ్రేణులను రంగంలోకి దింపింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఇన్చార్జీలను నియమించింది. ముందు నుంచే సిద్ధంగా ఉన్న పార్టీ.. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పార్టీ శ్రేణులను బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్రమత్తం చేసింది. నోటిఫికేషన్ రాగానే ప్రచార, గెలుపు వ్యూహాలను రూపొందించుకుంది. ఇందులో భాగంగా ఇటీవల వరంగల్లోనూ భారీ సభను నిర్వహించింది. ఇన్చార్జీల నేతృత్వంలో స్థానిక నేతల ప్రచారం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. త్వరలోనే రాష్ట్రస్థాయి నేతలను ప్రచార రంగంలోకి దించాలని భావిస్తోంది. ఇప్పుడు కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్నందున సభలు, సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు, భౌతికదూరం పాటిస్తూ ఇంటింటి ప్రచారానికి రూపకల్పన చేస్తోంది. బాధ్యతలు తీసుకున్న ముఖ్య నేతలు.. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు, వార్డు కౌన్సిలర్లను గెలిపించుకునే బాధ్యతలను ముఖ్యనేతలు స్వీకరించారు. వరంగల్ కార్పొరేషన్లో గెలుపు బాధ్యతలను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఖమ్మం కార్పొరేషన్లో బాధ్యతలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, మహబూబ్నగర్లో పార్టీ గెలుపు బాధ్యతలను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సిద్దిపేట్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రఘునందన్రావు తీసుకున్నట్లు తెలిసింది. వరంగల్ కార్పొరేషన్లో పార్టీ ఎన్నికల ఇన్చార్జీ మాజీ ఎంపీ జితేందర్రెడ్డిని, ఖమ్మం కార్పొరేషన్లో పార్టీ ఎన్నికల ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డికి అప్పగించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా తమ సత్తా చాటాలన్న భావనలో ఉంది. తద్వారా టీఆర్ఎస్ తామే ప్రత్యామ్నాయమన్న విషయాన్ని చాటిచెప్పాలని యోచిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొనసాగించిన ఊపును మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగించేలా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. -
కీలక ఎన్నికలకు కేటీఆర్ దూరం: మంత్రులదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు మరో ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం మంగళవారం ముగియనుండటంతో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచార వేడిని పెంచుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 27న ప్రచారం ముగియనుండటంతో ఓటర్లను చేరుకునేందుకు మూడు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఓ వైపు కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే మరోవైపు తక్కువ సమయంలో వీలైనంత మంది ఎక్కువ ఓటర్లను కలుసుకోవడం అభ్యర్థులతోపాటు వారికి మద్దతుగా ప్రచారం చేస్తున్న నేతలకు సవాలుగా మారింది. ఓ వైపు వేసవి తీవ్రత, మరోవైపు కరోనా ప్రభావంతో కేవలం ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం కొనసాగుతోంది. కర్ఫ్యూ నిబంధనల మూలంగా రాత్రి 8 గంటలకే ప్రచారాన్ని ముగించాల్సి రావడం అభ్యర్థులను కలవరానికి గురి చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రచార బృందాలను కలుసుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. సభలు, రోడ్షోలు, ర్యాలీలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్న అభ్యర్థులు, నేతలు వీలైనంత మేరకు పాదయాత్ర ద్వారా కాలనీలను చుట్టబెడుతున్నారు. కరోనా పరిస్థితుల్లో ఊరేగింపులు, పాదయాత్రల్లో పాల్గొనేందుకు జన సమీకరణ కూడా అనుకున్న స్థాయిలో జరగకపోవడం అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వార్డు, డివిజన్ స్థాయిలో పార్టీ యంత్రాంగం మీదే ఆధారపడి ప్రచారం సాగుతోంది. డివిజన్లు, వార్డుల్లో ప్రతీ వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్చార్జిలను నియమించిన టీఆర్ఎస్ ప్రచారం, పోలింగ్ సందర్భంగా సమన్వయంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తోంది. కార్పొరేషన్ల పరిధిలో... వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షోల్లో పాల్గొనేలా షెడ్యూలు సిద్ధం చేశారు. అయితే కరోనా బారిన పడ టంతో ఆయన రోడ్షోలను రద్దు చేశారు. సంబంధిత జిల్లా మంత్రులే ప్రచారం చేయడంతో పాటు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే వరంగల్ పరిధిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేస్తూ ప్రచారంలో పాల్గొంటోంది. మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో ప్రచారం చేస్తోంది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ టీఆర్ఎస్తో పాటు పొత్తుతో మూడు డివిజన్లలో పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థుల తరపున కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. హోం మంత్రి మహమూద్ అలీ కూడా ఖమ్మంలో ప్రచారం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి... సిద్దిపేట సహా మొత్తం 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతుండగా 43 వార్డులు ఉన్న సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు పూర్తి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం కావడంతో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ను పార్టీ కేడర్ను సమన్వయం చేయడంలో భాగస్వాములను చేశారు. కొత్తూరులో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్తో కలసి ప్రచారం చేస్తున్నారు. అచ్చంపేటలో మంత్రి నిరంజన్రెడ్డి.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలసి ప్రచారంలో పాల్గొంటున్నారు. నకిరేకల్లో మంత్రి జగదీశ్రెడ్డి ఎమ్మెల్యే లింగయ్యతో కలసి ప్రచారంలో పాల్గొంటున్నారు. జడ్చర్లలో మాజీమంత్రి లక్ష్మారెడ్డికి తోడు ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కాగా, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్తోపాటు జడ్చర్ల, సిద్దిపేట మున్సిపాలిటీల్లో వందల సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది టీఆర్ఎస్ టికెట్ ఆశించిన వారే కావడంతో ప్రచార బాధ్యతలు తీసుకున్న మంత్రులు పార్టీ అభ్యర్థు లకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడుతున్నారు. వరం గల్ పరిధిలో 66 డివిజన్లకు 434 మంది బరిలో ఉండ టంతో తక్కువ సమయంలో పార్టీ అభ్యర్థులను ఓటర్లకు చేరువ చేసేందుకు మంత్రులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
కరోనా ఎంతున్నా ఎన్నికలు జరుపుతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత దృష్ట్యా మినీ మున్సిపోల్స్ ఉంటాయా లేదా అన్న సందిగ్ధానికి తెరపడింది. ఈ నెల 30న మినీ మున్సి‘పోల్స్’యథాతథంగా జరగనున్నాయి. ముందుగా ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం రెండు కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బుధవారం రాత్రి ఎస్ఈసీకి మున్సిపల్ పరిపాలన శాఖ ద్వారా వర్తమానం అందినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి అనుగుణంగా యధాతథంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం హైకోర్టుకు తెలియజేయడంతోపాటు గతంలో ప్రకటించిన మేరకు పోలింగ్, కౌంటింగ్ తదితర ఏర్పాట్లు చేసుకోవాలని మున్సిపల్, సంబంధిత అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు జారీచేయనున్నట్టు తెలిసింది. మున్సిపల్ చట్టంలో చేసిన సవరణలకు అనుగుణంగా ఎన్నికల తేదీపై నిర్ణయాధికారం ప్రభుత్వానికే ఉండటంతో ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలా లేక వాయిదా వేయాలా అన్న అంశంపై స్పష్టత కోరుతూ రాసిన లేఖకు ప్రభుత్వం నుంచి ఈ మేరకు సమాధానం రావడంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎస్ఈసీ నిమగ్నమైంది. ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా.. ప్రస్తుత కరోనా కల్లోల పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలంటూ వివిధ రాజకీయ పార్టీలు ఎస్ఈసీని కోరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే నామినేషన్ల దాఖలు ముగిసి, గురువారం పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా కూడా వెలువడ¯నున్న నేపథ్యంలో 30న జరగాల్సిన పోలింగ్ నిర్వహణ నుంచి వెనక్కు తగ్గే అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన మేరకు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలతో పాటు, స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికలు కొనసాగిన విషయాన్ని ఎస్ఈసీకి పంపిన వర్తమానంలో ప్రభుత్వం తరఫున మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖలు ఉటంకించినట్టు తెలుస్తోంది. కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా తగిన జాగ్రత్తలతో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. ఇప్పటికే కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా మే 1 ఉదయం 5 గంటల వరకు రాత్రి కరŠూప్య విధించిన విషయాన్ని ప్రభుత్వం పొందుపరిచినట్లు తెలుస్తోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ... మున్సిపల్ ఎన్నికల ప్రచారం, సభల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి కోవిడ్ నిబంధనలు పాటించడంపై ఇదివరకే ఎస్ఈసీ ఆదేశాలు జారీచేసింది, అదేవిధంగా ఎన్నికల అధికారులు, సిబ్బందికి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇది వరకు సవివర సర్క్యులర్ జారీ చేసింది. ఇదిలా ఉంటే గురువారం నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక సాయంత్రం ఆయా మున్సిపాలిటీల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈనెల 30న రెండు కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా అవసరమైతే మే 2న రీపోలింగ్ ఉంటుంది. 3న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అది ముగిశాక ఫలితాలు ప్రకటిస్తారు. -
పొత్తులు.. ఎత్తులు.. హస్తం కొత్త వ్యూహం
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న మినీ మున్సిపల్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా వామపక్షాలు, టీడీపీతో పొత్తు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఖమ్మం కార్పొరేషన్లో సీపీఎం, టీడీపీ, వరంగల్లో సీపీఎం, సీపీఐలతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలను ఎదుర్కొనేందుకు వీలుగా ఆయా కార్పొరేషన్ల ఇన్చార్జులు, స్థానిక నాయకత్వం అడుగులు వేస్తోంది. ఈ రెండు చోట్లా పొత్తుల విషయంలో పీటముడే కనిపిస్తున్నా.. మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం కామ్రేడ్లతో మాట్లాడి పొత్తులను ఖరారు చేసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ రెండు కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖరారైనా అప్పుడే బీఫామ్లు ఇవ్వకపోవడం ద్వారా మిగతా వారు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీల నుంచి టికెట్ ఆశించి భంగపడిన వారిని చివరి క్షణంలో బీఫామ్లు ఇచ్చేలా కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. అక్కడ వారు... ఇక్కడ వీరు వరంగల్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లకు గాను 20 డివిజన్లను వామపక్షాలకు వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. అయితే సీపీఐ, సీపీఎంలు రెండూ కలిపి 24 సీట్లు అడుగుతు న్నాయి. ఇందులో సీపీఐ ఇప్పటికే ఏడు చోట్ల నామినేషన్లు దాఖలు చేయగా, మరో నాలుగింటి కోసం ఎదురుచూస్తోంది. సీపీఎం కూడా 11 స్థానాల్లో అధికారికంగా నామినేషన్లు దాఖలు చేయగా, మరో రెండింటిలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు పార్టీల మధ్య కేవలం మూడు స్థానాల్లోనే పేచీ ఉండడం కొంత సానుకూల అంశమే అయినా కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాలు కొన్నింటిని కామ్రేడ్లు ఆశిస్తుండటం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి లేదంటే బుధవారం ఉదయం వరంగల్లో పొత్తులు ఖరారు కానున్నట్టు సమాచారం. ఇక ఖమ్మంలో సీపీఐ, టీఆర్ఎస్లు పొత్తు కుదుర్చుకోవడంతో అక్కడ సీపీఎంతో పాటు టీడీపీతో కలసి ముందుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. అక్కడ 60 డివిజన్లకు గాను సీపీఎం ఇప్పటికే 20 చోట్ల నామినేషన్లు దాఖలు చేయగా, టీడీపీ పదింటిలో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు కలిపి 10-15 స్థానాలు ఇవ్వాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం ఉదయానికల్లా ఈ పొత్తులను కూడా ఖరారు చేసే పనిలో పడ్డారు. అయితే టీడీపీ, సీపీఎం పార్టీలు తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతుండటం గమనార్హం. ఇక నకిరేకల్, కొత్తూరు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల మున్సిపాలిటీల్లో కూడా స్థానిక పరిస్థితులను బట్టి వీలున్న పార్టీలు లేదా వ్యక్తులతో కలసి ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఆపరేషన్ ‘ఆకర్ష్’ ఎన్నికల వేళ పార్టీ నేతలు ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ వేస్తున్న బుట్టలో పడుతున్న నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే బీఫామ్లు పార్టీ అభ్యర్థులకు కాకుండా చివరి క్షణంలో నేరుగా ఎన్నికల పరిశీలకులకే అందజేయాలని నిర్ణయించింది. తద్వారా తమ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా నివారించడంతో పాటు అభ్యర్థులుగా ప్రకటించిన నేతలు అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గి పోటీ నుంచే తప్పుకునే వీలు లేకుండా ద్విముఖ వ్యూహాన్ని అమలు పరుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ అసంతృప్త నేతలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి బాగానే గాలం వేస్తోంది. ఇప్పటికే ఖమ్మంలోని నాలుగైదు చోట్ల గులాబీ నేతలను పార్టీలో చేర్చుకుని ఆయా డివిజన్లలో బలోపేతం అయ్యే ప్రయత్నాలు చేసింది. మిగిలిన స్థానాల్లో కూడా టీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేసి, వీరిలో బలమైన నేతలు ఉంటే వారినే చివరి క్షణంలో అభ్యర్థులుగా ఖరారు చేయడం కూడా టీపీసీసీ వ్యూహంగా కనిపిస్తోంది. -
కాంగ్రెస్ వడివడిగా.. జీవన్రెడ్డికి వరంగల్ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలతోపాటు ఇతర వార్డు సభ్యుల ఎన్నికలకు కాంగ్రెస్ వడివడిగా సిద్ధమవుతోంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, పోలింగ్కు చాలా తక్కువ సమ యం ఉండటంతో ఆగమేఘాల మీద పార్టీ యంత్రాంగం ఎన్నికల్లో నిమగ్నమవ్వాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఎన్నికల కమిటీలను నియమించారు. ఈ కమిటీలకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థుల ఖరారుతోపాటు స్థానిక పరిస్థితులను బట్టి ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకొనే విషయంలో నిర్ణయం తీసుకొనే అధికారాన్ని కూడా వారికే కట్టబెట్టారు. వరంగల్కు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఖమ్మంకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లను కమిటీల కన్వీనర్లుగా నియమించగా మిగిలిన మున్సిపాలిటీల్లోనూ స్థానిక నాయకత్వాలకే బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముగిసిన నేపథ్యంలో పార్టీ యంత్రాంగమంతా మున్సిపోల్స్పై దృష్టి పెట్టాలని, ఈ ఎన్నికలు ముగిసే వరకు అక్కడే మకాం వేయాలని పార్టీ నేతలను ఉత్తమ్ ఆదేశించారు. రెండు కార్పొరేషన్ల కమిటీలివే... వరంగల్ కమిటీకి ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డిని కన్వీనర్గా నియమించగా, కో–కన్వీనర్గా ఎమ్మెల్యే శ్రీధర్బాబును నియమించారు. ఇక కమిటీ సభ్యులుగా డీసీసీ అధ్యక్షుడు ఎన్. రాజేందర్రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, వేం నరేందర్రెడ్డి, మాజీ ఎంపీ ఎస్. రాజయ్య, వరంగల్ నగర మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పరకాల ఇన్చార్జి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నామిండ్ల శ్రీనివాస్, కట్ల శ్రీనివాస్లను సభ్యులుగా నియమించారు. వరంగల్ నగరపాలక సంస్థలో ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్లుగా ఉన్న వారిని కమిటీ ఎక్స్అఫీషియో సభ్యులుగా నియమించారు. ఇక ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల కమిటీ కన్వీనర్గా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కు బాధ్యతలు అప్పగించారు. కమిటీ సభ్యులుగా డీసీసీ అధ్యక్షుడు పి. దుర్గాప్రసాద్, సభ్యులుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు జావెద్ అహ్మద్, వర్కింగ్ ప్రెసిడెంట్ దీపక్ చౌదరి, పార్టీ నేతలు పరుచూరి మురళీకృష్ణ, పుచ్చకాయల వీరభద్రం, జాముల శరత్కుమార్రెడ్డి, పి. రాధాకృష్ణ, కొత్త సీతారాములను నియమించారు. ఇక్కడ కూడా సిట్టింగ్ కార్పొరేటర్లు కమిటీ ఎక్స్అఫీషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు. బీ–ఫారాలు ఎన్నికల అధికారికే పార్టీ అభ్యర్థులుగా ఈ రెండు కార్పొరేషన్లలో పోటీ చేయనున్న అభ్యర్థులను నేడు ఖరారు చేయనున్నారు. ఆయా డీసీసీ కార్యాలయాల్లో ఎన్నికల కమిటీలు సమావేశమై అభ్యర్థులను నిర్ణయిస్తాయి. అయితే అభ్యర్థుల బీ–ఫారాలను మాత్రం వరంగల్లో పీసీసీ పరిశీలకుడి ద్వారా, ఖమ్మంలో నగర పార్టీ అధ్యక్షుడి ద్వారా నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన 22న నేరుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు. సిద్దిపేట, నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీల్లోనూ స్థానిక నాయకత్వాలకే అభ్యర్థుల ఖరారు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. స్థానిక నాయకులందరూ కలసి అభ్యర్థులను నిర్ణయిస్తారని, వారే ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలోనూ ప్రచార బాధ్యతలను ఎన్నికల కమిటీలకే అప్పగిస్తూ ఉత్తమ్ శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: మినీ మున్సిపోల్స్లో టీఆర్ఎస్ గెలుపు గుర్రాల వేట -
మినీ మున్సిపోల్స్లో టీఆర్ఎస్ గెలుపు గుర్రాల వేట
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు మరో ఐదు మున్సిపాలిటీల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ముగియనుండటంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తును టీఆర్ఎస్ ముమ్మరం చేసింది. వరంగల్లో 66, ఖమ్మంలో 60 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుండగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలని పార్టీ ఆదేశించింది. దీంతో కార్పొరేషన్ల డివిజన్లు, మున్సిపల్ వార్డులవారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీ తరఫున బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే చాలా చోట్ల ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక మంత్రులు, ఎమ్మెల్యేలకు తలకు మించిన భారంగా తయారైంది. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల వరకు బీ ఫారాలు సమర్పించేందుకు అవకాశం ఉంది. దీంతో ఏకాభిప్రాయం కుదిరిన డివిజన్లు, వార్డుల్లో పార్టీ అభ్యర్థుల జాబితాను ఆదివారం సాయంత్రంలోగా విడుదల చేసి ఏకాభిప్రాయం కుదరని ఒకటీ అరా స్థానాల్లో 22లోగా బలమైన అభ్యర్థులను గుర్తించి బీ ఫారాలు ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. జీహెచ్ంఎసీ ఎన్నికల్లో వ్యతిరేకత ఉన్న చోట కూడా సిట్టింగ్ కార్పొరేటర్ల ఒత్తిళ్లకు తలొగ్గి మళ్లీ టికెట్లు ఇవ్వడం నష్టం చేసిందని పార్టీ గుర్తించింది. దీంతో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఒత్తిళ్లకు లొంగకుండా అభ్యర్థులను ఎంపిక చేయాలని స్పష్టం చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లకు పార్టీ ఇన్చార్జీలు.. ఎన్నికలు జరుగుతున్న రెండు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సమన్వయం చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇన్చార్జీలను నియమించారు. వరంగల్ కార్పొరేషన్లో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖమ్మం కార్పొరేషన్కు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఇన్చార్జీలుగా వ్యవహరించనుననారు. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, పరకాల, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో వరంగల్ కార్పొరేషన్ విస్తరించి ఉండగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించి ఉంది. దీంతో సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేయడంలో పార్టీ ఇన్చార్జీలు కీలకంగా వ్యవహరించనున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిపై ఇన్చార్జీలు నివేదికలు సమర్పించనున్నారు. వరంగల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఖమ్మంలో పువ్వాడ అజయ్ అభ్యర్థుల ఎంపికతోపాటు ప్రచారం తదితరాలను సమన్వయం చేయనున్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు ఒంటి చేత్తో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం నిర్వహిస్తుండగా కొత్తూరులో వి.శ్రీనివాస్గౌడ్, అచ్చంపేటలో నిరంజన్రెడ్డి, నకిరేకల్లో జగదీశ్రెడ్డి, జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పార్టీ ఎన్నికల బాధ్యతలు చేపట్టారు. టికెట్ల కోసం పోటెత్తుతున్న అభ్యర్థులు... మున్సిపల్ డివిజన్లు, వార్డుల్లో టికెట్ల కోసం ఆశావహులు పోటెత్తుతుండటంతో అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారింది. ఒక్కో డివిజన్, వార్డులో సగటున నలుగురు చొప్పున పోటీ పడుతుండటంతో ఏకాభిప్రాయం కుదరడం లేదు. శనివారం సాయంత్రం వరకు 43 వార్డులున్న సిద్దిపేట మున్సిపాలిటీలో రెండు విడతల్లో 12 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. మిగతా మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో ఒక్క అభ్యర్థి పేరునూ ప్రకటించకపోవడం ఆశావహుల నడుమ టికెట్ల కోసం నెలకొన్న పోటీకి అద్దం పడుతోంది. ఆదివారం మధ్యాహ్నంలోగా 80 శాతానికిపైగా అభ్యర్థులు ఖరారయ్యే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. వరంగల్ కార్పొరేషన్ మినహా మిగతా చోట్ల బీజేపీతో పెద్దగా పోటీ ఉండక పోవచ్చనే అంచనాకు వచ్చిన టీఆర్ఎస్... ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు పొరుగునే ఉన్న కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య ప్రజాప్రతినిధులకు డివిజన్లవారీగా ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. చదవండి: అందని ఆక్సిజన్ -
తెలంగాణ: మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
-
తెలంగాణ: మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మినీ మున్సి‘పోల్స్’ కు నగారా మోగింది. ఈ నెల 30న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట, సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీలోని లింగోజిగూడ డివిజన్, వివిధ మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన పలు వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. శుక్రవారం(నేటి) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై ఆదివారంతో ముగియనుంది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్ కొత్తగా ఏర్పడ్డాయి. సిద్దిపేట పాలకమండలి పదవీకాలం గురువారం పూర్తికాగా, అచ్చంపేటలో వివిధ గ్రామపంచాయతీల విలీనం అనంతరం మున్సిపాలిటీగా మారాక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జల్పల్లి, అలంపూర్, గజ్వేల్, నల్లగొండ, బోధన్, బెల్లంపల్లి, మెట్పల్లి, పరకాల మున్సి పాలిటీల్లో ఖాళీలు ఏర్పడటంతో ఒక్కోవార్డుకు ఎన్నికలు జరగనున్నాయి. గురువారం ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లన్నీ ఇదివరకే ఎస్ఈసీ పూర్తిచేయడంతో వెంటనే నామినేషన్ల స్వీకరణ, ఇతర ప్రక్రియలను చేపట్టడానికి మున్సిపల్ శాఖ సిద్ధమైంది. రిజర్వేషన్ల ఖరారు... గెజిట్ జారీ ఎన్నికలు జరగనున్న 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లను ఆయా జిల్లాల కలెక్టర్లు గురువారం ఖరారు చేశారు. ఆ వెంటనే రిజర్వేషన్లను ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఆయా జిల్లాల్లో రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెకర్లు మహిళారిజర్వేషన్లకు సంబంధించి లాటరీ తీశారు. కొత్తగా ఏర్పాటైన కొత్తూరు, నకిరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులకు రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి లాటరీలు తీశారు. చైర్పర్సన్ స్థానాలకు నకిరేకల్ బీసీ జనరల్కు, జడ్చర్ల బీసీ మహిళకు, కొత్తూరు జనరల్ మహిళకు రిజర్వ్ చేస్తూ మున్సిపల్ శాఖ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ల వివరాలను గురువారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందగానే ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసింది. గతేడాది జనవరిలో మున్సిపల్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం... వరంగల్ మేయర్ పదవి జనరల్కు, ఖమ్మం మేయర్ పదవి మహిళకు, సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ పదవి మహిళకు, అచ్చంపేట మున్సిపల్ చైర్పర్సన్ పదవి జనరల్కు రిజర్వ్ అయ్యాయి. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలి ప్రస్తుతం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా కోవిడ్ ప్రొటోకాల్పై కేంద్ర హోంశాఖ వెలువరించిన మార్గదర్శకాలతోపాటు ఇతర నియమ, నిబంధనలను ఎస్ఈసీ విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకునే ప్రతివ్యక్తి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, పోలింగ్ స్టేషన్లలో శానిటైజర్ అందుబాటులో ఉంచాలని, క్యూలైన్లలో భౌతికదూరాన్ని కచ్చితంగా పాటించాలని సూచించింది. ఎన్నికల సిబ్బందికి ఆరోగ్యసేతు యాప్ను తప్పనిసరి చేయాలని, ప్రతిస్థాయిలో నోడల్ హెల్త్ ఆఫీసర్లను నియమించి ఎన్నికల సందర్భంగా ఏర్పాట్లు, నియంత్రణచర్యలు పర్యవేక్షించాలని సూచిస్తూ సర్క్యులర్ జారీచేసింది. ఎన్నికల కోడ్.. మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో ఒకవార్డు/డివిజన్కు ఎన్నిక జరిగినా మొత్తం మున్సిపాలిటీకి ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఒక జిల్లాలో మున్సిపాలిటీ జరుగుతుంటే ఆ మునిసిపాలిటీ వరకు మాత్రమే ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. అభ్యర్థులు తమ నామినేషన్లతోపాటు డిపాజిట్ ఇలా... మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500, ఇతర అభ్యర్థులకు రూ.5,000 మున్సిపాలిటీల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1,250, ఇతర అభ్యర్థులకు రూ.2,500 వ్యయం ఇలా... మున్సిపల్ కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ మినహా) డివిజన్లకు పోటీ చేసే అభ్యర్థులకు రూ.1,50,000 ఎన్నికల వ్యయ పరిమితి ఉంటుంది. జీహెచ్ఎంసీలోని డివిజన్కు పోటీచేసే వారికి రూ.5,00,000 ఎన్నికల ఖర్చు పరిమితి విధించారు. మున్సిపాలిటీల పరిధిలోని వార్డులకు పోటీ చేసే అభ్యర్థులకు రూ.1,00,000 ఎన్నికల ఖర్చు పరిమితి ఉంటుంది. నామినేషన్లతోపాటు అభ్యర్థులు తమ నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, తదితరాలను ఇద్దరు సాక్షుల అటెస్టేషన్తో నిర్ణీత ఫార్మాట్లో సమర్పించాలి. ఇదీ షెడ్యూల్... ఏప్రిల్ 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ తుది ఓటర్ల జాబితా వార్డులవారీగా 16న ప్రచురణ 19న నామినేషన్ల పరిశీలన నామినేషన్ల తిరస్కరణపై 20న అప్పీళ్ల స్వీకరణ 21న అప్పీళ్లపై నిర్ణయం 22న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ 30న పోలింగ్ మే 2న రీపోలింగ్ 3న ఓట్ల లెక్కింపు.. ముగిసిన వెంటనే ఫలితాల ప్రకటన -
బల్దియా పోరుకు సిద్ధం..
సిద్దిపేట బల్దియా పోరుకు సిద్ధమైంది. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎన్నికల ప్రక్రియను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డుల పునర్విభజన పూర్తైన విషయం తెలిసిందే. రెండో ఘట్టంగా కుల గణన ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ఈ నెల 14లోగా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాలని సూచించింది. – సిద్దిపేటజోన్ వార్డుల వారిగా ఓటరు తుది జాబితా ఈనెల 11లోగా విడుదల చేయాలని, అదేవిధంగా వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఈనెల 14లోగా ప్రచురించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల కోసం అధికారుల నియామక ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి జాబితా అందజేయాలని ఆదేశించింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఈనెల 12లోగా శిక్షణ పూర్తి చేయాలని సూచించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసుకోవాలని అవసరమైన సిబ్బంది నియమాలను, సామగ్రి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రత, బ్యాలెట్పేపర్ల ముద్రణ, ఇండెలిబుల్ ఇంక్ తదితర ఏర్పాట్లు చూడాలని ఈసీ సూచించింది. త్వరలో పరిశీలకుల నియామకం సిద్దిపేట మున్సిపల్ పరిధిలో గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాల సంఖ్య ప్రస్తుత అవసరమైన కేంద్రాల సంఖ్య సరిపోల్చి వాడుకోవాలని సూచనలు చేసింది. బ్యాలెట్ బాక్స్లు అవసరమైన మేరకు వాటిని తయారు చేసి సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. వార్డ్ వారీగా బ్యాలెట్ పేపర్లను అంచనా వేసుకొని ముద్రణ కోసం ప్రింటింగ్ ప్రెస్లను గుర్తించాలని ఆదేశించింది. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతుందని, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి కోడ్ అమలులో ఉంటుందని, సాధారణ, వ్యయ పరిశీలకులను త్వరలో నియమిస్తామని కమిషన్ పేర్కొంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఈసీ సూచనలు చేసింది. పోలింగ్ కేంద్రాల నోటిఫికేషన్ సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఈసీ సెక్రటరీ అశోక్కుమార్ పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. ►ఏప్రిల్ 8న పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ►8 నుంచి 11వ తేదీ వరకు ఫిర్యాదుల స్వీకరణ ►9న రాజకీయ పార్టీల సమావేశం ►12న ఫిర్యాదుల పరిష్కారం ►14న పోలింగ్ కేంద్రాల తుది జాబితా సిద్ధంగా ఉన్నాం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మేము సమర్థవంతంగా నిర్వహిస్తాం. షెడ్యూల్ మేరకు ఒక్కో ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఎన్నికల నిర్వహణ కోసం అవరసమైన సిబ్బంది, అధికారుల నియామకాలను కలెక్టర్ అనుమతితో చేపడుతాం. – రమణాచారి, మున్సిపల్ కమిషనర్ -
మున్సి‘పోల్స్’పై టీఆర్ఎస్ దృష్టి
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో ఐదు మున్సిపాలిటీలకు ఈ ఏడాది మే నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారం, అభ్యర్థి ఎంపికలో తలమునకలైన టీఆర్ఎస్ పార్టీ త్వరలో ఎన్నికలు జరిగే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపైనా దృష్టి కేంద్రీకరించింది. సర్వేలు, పార్టీ ఇన్చార్జిల నివేదికల ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తూ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఎన్నికల షెడ్యూలు వెలువడేలోగా ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటి కార్యక్రమాలు పూర్తి చేయాలని సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. నాగార్జునసాగర్ అభ్యర్థి ఎంపిక పూర్తయిన తర్వాత ఏప్రిల్ మొదటివారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు సమావేశం అవుతారు. ఆశావహుల జాబితాపై కసరత్తు వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట మున్సిపాలిటీ పాలకమండలి కాలపరిమితి ఈ నెల 14న ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పాలకమండలి గడువు కూడా ఏప్రిల్ 14న ముగియనుంది. గతంలో గ్రామ పంచాయతీలుగా ఉన్న జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలుగా అవతరించాయి. ఈ మూడు గ్రామ పంచాయతీల పాలకమండళ్ల పదవీ కాలపరిమితి కూడా గత ఏడాది ముగిసింది. దీంతో రెండు కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన కసరత్తును మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వార్డుల పునర్విభజనతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గ ఓటర్ల సంఖ్య తేలితే ఏప్రిల్ రెండో వారంలోగా వార్డులు, మున్సిపల్ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. ఈ నేపథ్యంలో వార్డుల వారీగా టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న నేతలు, క్రియాశీల కార్యకర్తల జాబితాను ఇప్పటికే పార్టీ ఇన్చార్జిలు రూపొందించారు. ఇతర పార్టీల్లో క్రియాశీల నాయకులు, వారి బలాబలాలు, సామాజిక నేపథ్యం వంటి పూర్తి వివరాలతో నివేదికలు సిద్ధం చేశారు. సిట్టింగ్ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పనితీరును కూడా మదింపు చేయాలని తాజాగా ఇన్చార్జీలను టీఆర్ఎస్ ఆదేశించింది. త్వరలో కేటీఆర్ ఖమ్మం పర్యటన ఎన్నికలు జరిగే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధుల కేటాయింపుపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2021–22లో వరంగల్ కార్పొరేషన్కు రూ.250 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్కు రూ.150 కోట్లు ప్రత్యేక నిధులను ఎన్నికల నేపథ్యంలోనే కేటాయించినట్లు కనిపిస్తోంది. సిద్దిపేటలో రూ.45 కోట్లతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టవర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది డిసెంబర్లో శంకుస్థాపన చేశారు. తాజాగా ఖమ్మంలో రూ.36 కోట్లతో అదనపు ఐటీ టవర్ను నిర్మించేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ఐదు మున్సిపాలిటీల ఎన్నిలకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే బాధ్యతను సంబంధిత జిల్లా మంత్రులకు అప్పగిస్తారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై మాత్రం కేటీఆర్ స్వయంగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కేటీఆర్ ఈ నెల 31 లేదా వచ్చే నెల 2వ తేదీన ఖమ్మంలో పర్యటిస్తారు. ఏప్రిల్ రెండో వారంలో వరంగల్ నగరంలో పర్యటించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
పుర పోరులో సామాన్యుడికి పట్టం కట్టిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాజకీయాలంటే బాగా డబ్బున్న వాళ్లు.. ఉన్నత వర్గానికి చెందిన వారు.. బలమైన బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి మాత్రమే అనే భావన బలంగా ఉంది సమాజంలో. అధికారంలో ఉన్న వారు కూడా తాము పేదల పక్షం అని చెప్తారు. కానీ ఎన్నికల బరిలో నిలబడే విషయంలో మాత్రం పేరు ప్రఖ్యాతులు, అంగబలం, అర్థబలానికే అగ్రతాంబులం ఇస్తారు. సామాన్యులంటే ఓటు వేయడానికి మాత్రమే అని భావించే నేతలున్న దేశం మనది. అయితే ఈ అభిప్రాయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పని నిరూపించారు. నీతి నిజాయతీ, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న వారు రాజకీయాల్లోకి రావాలనేది సీఎం జగన్ అభిమతం. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో సామాన్యులకు టికెట్ ఇచ్చి.. వారిని మున్సిపల్ చైర్మన్, మేయర్లుగా నియమించి.. ఇచ్చిన మాటలను నిజం చేసే నాయకుడిని అని మరోసారి నిరూపించుకున్నారు. కట్టెలు కొట్టి బతకు బండిని లాగే వ్యక్తికి.. కూరగాయలు అమ్ముకునే వ్యక్తికి.. అటెండర్ కోడలికి.. తోపుడు బండి వ్యాపారికి మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం ఇచ్చి.. బడుగు వర్గాలకు పాలనా పగ్గాలు అందించి దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. మున్సిపల్ చైర్మన్, మేయర్లుగా నియమితులైన ఆ సామాన్యుల వివరాలు... రాయచోటి మున్సిపల్ చైర్మన్గా కూరగాయల వ్యాపారి రాయచోటికి చెందిన షేక్ బాష డిగ్రీ వరకు చదువుకున్నారు. ఉద్యోగం దొరక్కపోవటంతో గ్రామంలోనే కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు. స్థానికంగా ప్రజల్లో మంచి పేరున్న షేక్ భాషకు వైఎస్సార్ సీపీ మున్సిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. దీంతో ప్రజలు షేక్ భాషను గెలిపించారు. గురువారం రాయచోటి మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా షేక్ బాష సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో ఇలాంటి అవకాశం వస్తుందని ఊహించలేదన్నారు. తోపుడుబండి వ్యాపారి.. మునిసిపల్ చైర్మన్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్గా తలారి రాజ్కుమార్ ఎన్నికయ్యారు. ఇంటర్ చదివిన రాజ్కుమార్కు భార్య విజయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణకు తోపుడుబండిపై పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీపై అభిమానంతో కార్యకర్తగా సేవలందిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో 10వ వార్డు బీసీ జనరల్కు రిజర్వు కాగా.. వైఎస్సార్సీపీ టికెట్ రాజ్కుమార్కు లభించింది. ఎన్నికల్లో పోటీకైతే దిగాడు కానీ కనీస ఖర్చు కూడా పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోయింది. కానీ సీఎం వైఎస్ జగన్పై ప్రజలకున్న అభిమానం రాజ్కుమార్కు ఓట్ల వర్షం కురిపించి కార్పొరేటర్గా గెలిపించింది. ఇప్పుడు ఏకంగా మునిసిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్ చిత్తూరు కార్పొరేషన్ నూతన మేయర్గా ఎన్నికైన అముద ప్రస్థానం.. కష్టాల్లో ఆగిపోకుండా నిలదొక్కుకోవాలనే ఎందరో మహిళలకు ఆదర్శం. కుటుంబం గడవడం కోసం ఒకప్పుడు అముద కట్టెలు కొట్టి అమ్మారు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్నారు. జగన్ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. వైఎస్సార్సీపీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడమేగాక ఇప్పుడు ఏకంగా చిత్తూరు మేయర్గా ఎన్నికయ్యారు. మామ అటెండర్గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్ మునెయ్య.. ఆరేళ్లక్రితం వరకు తిరుపతి మునిసిపాలిటీలో అటెండర్గా పనిచేశారు. కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తిరుపతికి ఈసారి మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు. మునెయ్య కోడలే ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్కు తొలి మేయర్గా ఎన్నికయ్యారు. నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు నిన్నమొన్నటివరకు విశేష సేవలందించి అందరి ప్రశంసలు పొందిన ఇద్దరు వలంటీర్లు నేడు కౌన్సిలర్, కార్పొరేటర్గా ఎన్నికై రికార్డు సృష్టించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మునిసిపాలిటీలో 12వ వార్డు నుంచి వైఎస్సార్సీపీ తరఫున వలంటీర్ లోకా కల్యాణి బరిలోకి దిగారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన సరికొండ జ్యోతిపై 504 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు విశాఖలో.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో ఓ వార్డు వలంటీర్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 47వ వార్డు కంచర్లపాలెం అరుంధతినగర్ కొండవాలు ప్రాంతానికి చెందిన కంటిపాము కామేశ్వరి గతంలో వార్డు వలంటీర్గా పనిచేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన ఆమె తన సమీప ప్రత్యర్థిపై 3,898 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. వీరితో పాటు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ జగన్ మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారు సీఎం జగన్. చరిత్రలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 78 శాతం పదవులు ఇచ్చారు. దీంతోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లుగా బీసీ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు ఎన్నిక కావడం ఊహలకు కూడా అందని పరిణామం. మహిళాభ్యున్నతిని చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి జగన్... పార్టీ సాధించిన 11 కార్పొరేషన్లలో ఏకంగా ఏడింటి పగ్గాలు మహిళలకే అప్పగించారు. పురపాలక అధ్యక్ష పదవుల్లో 60.46 శాతం మహిళలకే దక్కటం ఒక రికార్డేనని చెప్పాలి. -
గిర్రున తిరిగిన ఫ్యాన్.. బ్యాలెట్ బద్దలు
మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గిర్రున తిరగ్గా బ్యాలెట్ బాక్సులు బద్దలయ్యాయి. సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు.. అభివృద్ధి అస్త్రాలుగా వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రచారం హోరెత్తించగా.. ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. అప్పటివరకూ టీడీపీ కంచుకోటగా ఉన్న వార్డులు/ డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో పాగా వేశారు. ఫలితంగా అనంతపురం కార్పొరేషన్ సహా చాలా మున్సిపాలిటీల్లో టీడీపీ ఉనికి కోల్పోయింది. అనంతపురం సెంట్రల్: మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడుకు ప్రత్యర్థి పారీ్టలు గల్లంతయ్యాయి. ప్రజలందరూ ఏకపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి పట్టం కట్టారు. ఫలితంగా మున్సిపాలిటీల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అనంతపురం కార్పొరేషన్లో తొలిసారి ప్రతిపక్ష పారీ్టలకు కనీసం ప్రాతినిధ్యం కూడా దక్కకపోవడం విశేషం. టీడీపీ ఖల్లాస్ అనంతపురం నగరంలో టీడీపీకి మంచి పట్టు ఉండేది. ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నగరపాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లుండగా.. 48 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలో అత్యధిక మెజార్టీ అనంతపురం నగరపాలక సంస్థలో వచ్చాయి. 26వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వర్దిరెడ్డి మీనాక్షమ్మ ఏకంగా 2,455 ఓట్ల మెజార్టీతో తిరుగులేని విజయం సాధించారు. టీడీపీ హయాంలో 33 డివిజన్లో నుంచి గెలిచిన గంపన్న డిప్యూటీ మేయర్గా పనిచేశారు. టీడీపీకి బాగా పట్టున్న డివిజన్గా పేరుంది. అలాంటి చోట తొలిసారి బరిలో నిలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి సాకే చంద్రశేఖర్ ఏకంగా 2,067 ఓట్ల మెజార్టీ సాధించి జయకేతనం ఎగురవేశారు. పురం...వైఎస్సార్ సీపీ పరం హిందూపురం మున్సిపాల్టీలో 38 వార్డులుండగా.. 29 వార్డులు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. 31 వార్డు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి చిన్నమ్మ ఏకంగా 1,136 ఓట్లతో చిరస్మరణీయమైన విజయం దక్కించుకున్నారు. 30 వార్డులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆసీఫుల్లా 1,002 ఓట్ల మెజార్టీ సాధించారు. 21 వార్డులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి మారుతీరెడ్డి.. తొలి సారిగా బరిలో నిలిచి 988 ఓట్ల మెజారీ్ట సాధించారు. దుర్గంపై.. ఎగిరిన వైఎస్సార్ సీపీ జెండా = రాయదుర్గంలో 32 వార్డులుండగా... 30 వార్డుల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. 25వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి కె.నసీమా 700 ఓట్లు, 19వ వార్డులో శారదాదేవి 660 ఓట్లు, 30వ వార్డులో గోరంట్ల ఉష 657 ఓట్లమెజార్టీతో విజయం సాధించారు. మున్సిపాలిటీల్లో ఘన విజయం ధర్మవరం మున్సిపాలిటీ చరిత్రను సృష్టించింది. ధర్మవరంలో 40 వార్డులుండగా 40 స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిపొంది క్లీన్స్వీప్ చేశారు. గుత్తిలో 25 వార్డులుండగా 24 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. కదిరిలో 36 వార్డులుండగా 30 వార్డులను, మడకశిరలో 20 స్థానాలకు 15 వార్డులు, కళ్యాణదుర్గంలో 24 వార్డులకు 19 వార్డులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మిగిలిని అన్ని మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్సీపీ సత్తా చాటింది. -
నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు
సత్తెనపల్లి/కంచరపాలెం (విశాఖ ఉత్తర): నిన్నమొన్నటివరకు విశేష సేవలందించి అందరి ప్రశంసలు పొందిన ఇద్దరు వలంటీర్లు నేడు కౌన్సిలర్, కార్పొరేటర్గా ఎన్నికై రికార్డు సృష్టించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మునిసిపాలిటీలో 12వ వార్డు నుంచి వైఎస్సార్సీపీ తరఫున వలంటీర్ లోకా కల్యాణి బరిలోకి దిగారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన సరికొండ జ్యోతిపై 504 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విశాఖలో.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో ఓ వార్డు వలంటీర్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 47వ వార్డు కంచర్లపాలెం అరుంధతినగర్ కొండవాలు ప్రాంతానికి చెందిన కంటిపాము కామేశ్వరి గతంలో వార్డు వలంటీర్గా పనిచేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన ఆమె తన సమీప ప్రత్యర్థిపై 3,898 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. చదవండి: తాడిపత్రి ఎక్స్అఫిషియో ఓట్ల కేటాయింపులో ట్విస్ట్ -
చంద్రబాబు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి : మంత్రి కొడాలి నాని
-
‘బాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టొద్దు’
సాక్షి, తాడేపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెప్పారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన వీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నవారే నాయకులని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును మళ్లీ ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రజలకు ఏం కావాలో సీఎం జగన్మోహన్రెడ్డికి తెలుసు అని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని కొడాలి నాని హితవు పలికారు. ఎన్నికలకు ముందు ఒక మాట.. ఎన్నికలైన తర్వాత చంద్రబాబుది మరో మాట ఉంటుందని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్రెడ్డిని చూసి చంద్రబాబు చాలా నేర్చుకోవాలన్నారు. చంద్రబాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగు పెట్టకూడదని అన్నారు. అమరావతిలో ఉన్న రైతులను చంద్రబాబు రోడ్డుపైకి తెచ్చారని కొడాలి నాని మండిపడ్డారు.మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు చూశారని కొడాలి నాని మండిపడ్డారు. ఇప్పటికైనా దొంగల్ని వదిలేసి అమరావతి ప్రజలు ఆలోచించాలన్నారు. ఎల్లో మీడియాలో వస్తున్న విష ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అమరావతి ప్రాంతానికి ఏం కావాలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లండిని తెలిపారు. హైదరాబాద్లో చంద్రబాబు, లోకేష్ పాచిపనులు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కుల, మత, పార్టీలు లేకుండా అందరినీ సీఎం జగన్ సమానంగా చూస్తున్నారని గుర్తుచేశారు. పేద ప్రజలకు సమానంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని తెలిపారు. దొంగ మాటలు చెప్పి ఎన్నికల్లో లబ్ది పొందాలని చంద్రబాబు చూశారని కొడాలి నాని మండిపడ్డారు. నీచ రాజకీయాలు చేసే బాబు మున్సిపల్ ఫలితాలపై ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్, బీజేపీ, ఎల్లో మీడియా కలిసి ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మలేదని తెలిపారు. చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది -
ఏపీ లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు :విజయ సాయి రెడ్డి
-
నా భర్తకు చేసిన అవమానమే ఇప్పుడు వాళ్లకు: లక్ష్మీ పార్వతి
-
వైఎస్సార్సీపీ ప్రభంజనం
-
టీ డి పి అహంభావాన్ని ప్రజలు పీకేశారు : కన్నబాబు
-
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది
-
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది
సాక్షి, తాడేపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో 100 శాతం వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందని తెలిపారు. సీఎం జగన్ పాలనకు ప్రజలు పట్టం కట్టారని చెప్పారు.22 నెలల సంక్షేమ సీఎం పాలనకు ప్రజలు ఘన విజయం అందించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి, నిజాయితీ, నిబద్ధతకు ప్రజలెప్పుడూ మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నామని చెప్పారు. ఎక్కడైతే టీడీపీ గెలిచిందో అక్కడ ఎక్స్ ఆఫీషియో సభ్యులతో ఫామ్ చేస్తామని తెలిపారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, దౌర్జన్యాలు చేసినా ప్రజలు వైఎస్సార్సీపీనే నమ్మారని తెలిపారు. ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్నామని, ప్రజలపై తనకు నమ్మకం ఉందని జగన్ చెప్పారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని చేసినా ప్రజలు తమవైపే ఉన్నారని సీఎం చెప్పారని వ్యాఖ్యానించారు. ఈ విజయాన్ని ఇచ్చిన పట్టణ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా బాధ్యతగా పని చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మేయర్, చైర్మన్ ఎంపిక పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని చెప్పారు. టీడీపీని ఒక సామాజికవర్గ పార్టీగా మారుస్తున్నారని సొంత పార్టీ వారే అంటున్నారని తెలిపారు. మాయ మాటలు, మోసం చేసే వ్యక్తికి ఓటు ఎలా వేస్తారని అన్నారు. అమరావతి, విశాఖ ఉక్కు అంటూ బాబు రాజకీయం చేయబోయాడని అందుకే ప్రజలు ఆయన ఆలోచనకు బుద్ధి చెప్పారని తెలిపారు. తండ్రీకొడుకులు ఎలా మాట్లాడారో రాష్ట్రమంతా చూశారని బొత్స మండిపడ్డారు. చదవండి: మున్సి‘పోల్స్’ ఫలితాలు: వైఎస్సార్సీపీ ప్రభంజనం -
ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న సంక్షేమ పాలనను ఆశీర్వదించారు : ఎం పి మోపిదేవి వెంకటరమణ
-
వాళ్లు హైదరాబాద్కే పరిమితమైతే మంచిది: రోజా
సాక్షి, తిరుపతి: మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు సీఎం జగన్మోహన్రెడ్డి మంచి గిఫ్ట్ ఇచ్చారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అఖండ మెజారిటీలతో అత్యధిక సీట్లను గెలిపించారని, వార్ వన్ సైడ్ అనే విధంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాదులో రెస్ట్ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లు ఇక అక్కడే పరిమితమైతే మంచిదని తెలిపారు. ప్రజల విశ్వాసం ఉంటే ఎంతటి ఘన విజయాలు సాధించవచ్చని మున్సిపల్ ఎన్నికలు నిరూపించాయని చెప్పారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే రకంగా ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కడున్నారో వెతుక్కొని మరీ ప్రజలు ఓట్లు వేశారని తెలిపారు. ఇంత అభిమానం పొందడం సీఎం జగన్కే సాధ్యమైందని తెలిపారు. చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా జగన్కే సాధ్యమని పేర్కొన్నారు. చదవండి: నా భర్తకు చేసిన అవమానమే ఇప్పుడు వాళ్లకు: లక్ష్మీ పార్వతి మున్సి‘పోల్స్’ ఫలితాలు: వైఎస్సార్సీపీ ప్రభంజనం.. -
నా భర్తకు చేసిన అవమానమే ఇప్పుడు వాళ్లకు: లక్ష్మీ పార్వతి
సాక్షి, తాడేపల్లి: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీడీపీకి చెంప పెట్టు అని ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన కొడుకును వారసుడిగా చేయాలన్న ఆశయం పోయిందని, లాక్కున్న పార్టీని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించుకున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు టీడీపీ పార్టీని భూస్థాపితం చేశాడని, ఇక తండ్రీ కొడుకులు పాలు, కూరగాయలు అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. తన భర్తకు చేసిన అవమానం ఇప్పుడు వాళ్లకు వచ్చిందని తెలిపారు. సీఎం జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడని లక్ష్మీపార్వతి తెలిపారు. నిజమైన ఎన్టీఆర్ అభిమానులైతే ఇకనైనా చంద్రబాబును వదిలేయండని చెప్పారు. టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడం కష్టమని తెలిపారు. మరో 30 ఏళ్లు సీఎం జగన్ ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు. తన భర్తను అవమానించిన పార్టీ ఉంటే ఏమిటి ఊడితే ఏమిటని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు పని అయిపోయిందని, ఆత్మ విమర్శ చేసుకోవడానికి తన మైండ్ కూడా చెడిపోయిందని ధ్వజమెత్తారు. బాబు చేసిన పాపాలు తన కొడుకు రూపంలో శాపంగా మారాయని ఆమె విమర్శించారు. చదవండి: ‘ఇక టీడీపీ లేదు, దాని తోక పార్టీలు లేవు’ -
‘ఇక టీడీపీ లేదు, దాని తోక పార్టీలు లేవు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయంతో ముందుకు వెళుతోందని పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. పట్టణ ఓటర్లు 20 మాసాల తర్వాత తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారని అన్నారు. అర్బన్లో తనకేదో బలముందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం పేరిటి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి గెలవాలని అనుకున్నాడని మండిపడ్డాడు. 21 మాసాల సీఎం జగన్ పరిపాలనకు ప్రజలు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ప్రజలు సీఎం జగన్కు పట్టం కట్టారని తెలిపారు. ఇంత బ్రహ్మాండమైన విజయం ఏ అధికార పక్షానికి రాలేదని, ఇంత వైఫల్యం ఏ ప్రతిపక్షానికి రాలేదని తెలిపారు. రాష్ట్రంలో నిజమైన హీరో వైఎస్ జగన్ అని ప్రజలు నిరూపించారని అంబటి తెలిపారు. చంద్రబాబు, ఆయన కుమారుడు ఫలితాలు వస్తున్న వేళ ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. పాచి పనులు చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్లారా అని ప్రశ్నించారు. బాబు ఈవీఎం టాంపరింగ్ అన్నాడు. కానీ బ్యాలెట్ పేపర్లోను అదే మెజార్టీ వచ్చిందని తెలిపారు. ఏకగ్రీవాలు అని విమర్శించారు, ఏకగ్రీవాలు కానీ చోట కూడా అలాంటి ఫలితాలే వస్తున్నాయని అంబటి తెలిపారు. దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్, సొంత పుత్రుడు లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో టీడీపీ తుక్కు తుక్కుగా ఓడిపోయిందని, రాష్ట్రంలో ఈ దెబ్బతో టీడీపీ కనుమరుగైపోయిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఏ ఎన్నికల్లో అయినా వైఎస్సార్సీపీదే విజయమని చెప్పారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ని ఎదుర్కొనే పార్టీ ఏదీ లేదని అంబటి స్పష్టం చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో కంటే ఎక్కువ ప్రేమను ప్రజలు ఈ ఎన్నికల్లో చూపించారని అంబటి తెలిపారు. ఇక టీడీపీ లేదు, దాని తోక పార్టీలు లేవని చెప్పారు. టీడీపీనే ప్రజలు నమ్మలేదని, ఇక వాళ్ల మేనిఫెస్టోని ఎలా నమ్ముతారని ఎద్దేవా చేశారు. ఇవాళ ఓటమి టీడీపీ పతనానికి నాంది అన్నారు. వైజాగ్, విజయవాడతో సహా అన్ని చోట్లా ప్రజలు పౌరుషం చూపించారని తెలిపారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే అమరావతికి ప్రజల మద్దతు లేనట్టే అన్నాడని, మరి గుంటూరు, విజయవాడ ప్రజలు అమరావతికి మద్దతు ఇవ్వలేదని స్పష్టమవుతోందని అంబటి తెలిపారు. చదవండి: మున్సి‘పోల్స్’ ఫలితాలు: వైఎస్సార్సీపీ ప్రభంజనం -
‘ఇక టీడీపీ లేదు, దాని తోక పార్టీలు లేవు’
-
మున్సిపల్ ఫలితాలు సీఎం జగన్ పాలనకు నిదర్శనం
సాక్షి, తాడేపల్లి: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తన రెక్కల కష్టంతో నిర్మించుకున్న పార్టీ వైఎస్సార్సీపీ అని పేర్కొన్నారు. పార్టీ గెలుపు క్రెడిట్ అంతా ఆయనను ఆశీర్వదించిన ప్రజలదేనని చెప్పారు. అక్కా చెల్లెల్లు, అన్నదమ్ములు, అవ్వతాతలు తన వైపు ఉన్నారని సీఎం జగన్కి భరోసా ఉందని, నేడు అదే నిజమైందని చెప్పారు. వారి కుటుంబంలో ఒకరిగా సీఎంను గుర్తించారని హర్షం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఫలితాలు వచ్చాయిని సజ్జల పేర్కొన్నారు. ఒక నాయకుడిపై ఇంత భరోసా చూపడం దేశంలోని ఇది తొలిసారి అని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రచారం పేరిట, ప్రజల్ని బూతులు తిట్టారని మండిపడ్డారు. ఇప్పుడు వెళ్లి హైదరాబాద్లో కూర్చున్నారని, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నారని ఎద్దేవా చేశారు. బాబును ప్రజలు చెత్తబుట్టలో వేశారని ఆయనకీ తెలుసన్నారు. దింపుడు కల్లం ఆశతో విపరీతంగా డబ్బు కూడా పంచారని మండిపడ్డారు. తాము ప్రతిపక్షం ఉండాలి అని కోరుకుంటున్నామని, కానీ, చంద్రబాబు దానికి కూడా అర్హుడను కాదు అని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇక వెంటిలేటర్ మీద నుంచి కూడా టీడీపీ కిందకు పడిపోయినట్లేనని సజ్జల పేర్కొన్నారు. చదవండి: మున్సి‘పోల్స్’ ఫలితాలు: క్లీన్స్వీప్ దిశగా దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ -
మున్సిపల్ ఫలితాలు సీఎం జగన్ పాలనకు నిదర్శనం
-
క్లీన్స్వీప్ దిశగా దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ
-
ఏపీ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు 2021
-
మున్సి‘పోల్స్’ ఫలితాలు: వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్
మున్సిపల్ ఎన్నికల చరిత్రలో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగించింది. ఫ్యాన్ దూకుడుకు టీడీపీ, బీజేపీ, జనసేన సోదిలో లేకుండా పోయాయి. మొత్తం 11 కార్పొరేషన్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. ఇక 75 మున్సిపాలిటీల్లో ఇప్పటివరకూ వైఎస్సార్సీపీ 74 స్థానాలను దక్కించుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అనంతపురం కార్పొరేషన్లో టీడీపీ ఖాతా తెరవలేదు. ధర్మవరం మున్సిపాలిటీలోనూ టీడీపీ సున్నా. గుత్తిలో ఒకటి, రాయదుర్గంలో 2 సీట్లతో టీడీపీ సరిపెట్టుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీకి సున్నా వార్డులు. యనమల రామకృష్ణుడు సొంతూరు తునిలో కూడా టీడీపీ ఖాతా తెరవలేదు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, రామచంద్రాపురంలో ఒక్క వార్డుతో.. పెద్దాపురం, గొల్లప్రోలులో రెండు వార్డులతో టీడీపీ సరిపెట్టుకుంది. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్ విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లు వైఎస్ఆర్సీపీ కైవసం కృష్ణా: ఉయ్యూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ఉయ్యూరు (20): వైఎస్ఆర్సీపీ -16, టీడీపీ -4 కృష్ణా: నందిగామ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం నందిగామ (20): వైఎస్ఆర్సీపీ -13, టీడీపీ -6, జనసేన -1 కృష్ణా: నూజివీడు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం నూజివీడు (23): వైఎస్ఆర్సీపీ -21, టీడీపీ -1, బీజేపీ -1 విశాఖ కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం విశాఖ కార్పొరేషన్ (98): వైఎస్ఆర్సీపీ -58, టీడీపీ -30, జనసేన -3 విశాఖ కార్పొరేషన్ (98): బీజేపీ -1, సీపీఐ -1, సీపీఐ(M) -1, ఇతరులు -4 యలమంచిలి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం యలమంచిలి (25):వైఎస్ఆర్సీపీ -23, టీడీపీ -1, ఇతరులు -1 నర్సీపట్నం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం నర్సీపట్నం (28):వైఎస్ఆర్సీపీ -14, టీడీపీ -12, ఇతరులు -2 అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్ అనంతపురం కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం అనంతపురం కార్పొరేషన్ (50): వైఎస్ఆర్సీపీ -48, ఇతరులు -2 రాయదుర్గం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం రాయదుర్గం (32): వైఎస్ఆర్సీపీ -30, టీడీపీ -2 మడకశిర మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం మడకశిర (20): వైఎస్ఆర్సీపీ -15, టీడీపీ -5 కల్యాణదుర్గం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం కల్యాణదుర్గం (24): వైఎస్ఆర్సీపీ -20, టీడీపీ -4 గుత్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం గుత్తి (25): వైఎస్ఆర్సీపీ -24, టీడీపీ-1 పుట్టపర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పుట్టపర్తి (20): వైఎస్ఆర్సీపీ -14, టీడీపీ -6 ధర్మవరం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ధర్మవరం (40): వైఎస్ఆర్సీపీ -40, టీడీపీ -0 హిందూపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం హిందూపురం (38): వైఎస్ఆర్సీపీ -29, టీడీపీ -6, బీజేపీ -1, ఎంఐఎం -1, ఇతరులు -1 కదిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం కదిరి (36): వైఎస్ఆర్సీపీ -30, టీడీపీ -5, ఇతరులు -1 గుంతకల్లు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం గుంతకల్లు (37): వైఎస్ఆర్సీపీ -28, టీడీపీ -7, సీపీఐ -1, ఇతరులు -1 తాడిపత్రి: వైఎస్ఆర్సీపీ -16, టీడీపీ 18, సీపీఐ 1, ఇతరులు 1 గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్ గుంటూరు కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం గుంటూరు (57): ఎస్ఆర్సీపీ-45, టీడీపీ-8, బీజేపీ+ 4, ఇతరులు 2 తెనాలి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం తెనాలి (40): వైఎస్ఆర్సీపీ-32, టీడీపీ-8 చిలకలూరిపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చిలకలూరిపేట (38): వైఎస్ఆర్సీపీ-30, టీడీపీ-8 రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం రేపల్లె (28): వైఎస్ఆర్సీపీ-26, టీడీపీ-2 సత్తెనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం సత్తెనపల్లి (31): వైఎస్ఆర్సీపీ-24, టీడీపీ-4, బీజేపీ-1, ఇతరులు -2 వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం వినుకొండ (32): వైఎస్ఆర్సీపీ-28, టీడీపీ-4 మాచర్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం మాచర్ల (31): వైఎస్ఆర్సీపీ-31, టీడీపీ-0 పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పిడుగురాళ్ల (33): వైఎస్ఆర్సీపీ -33, టీడీపీ-0 ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్ ఒంగోలు కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం ఒంగోలు (50): వైఎస్ఆర్సీపీ -41, టీడీపీ-6, జనసేన -1, ఇతరులు -2 గిద్దలూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం గిద్దలూరు (20): వైఎస్ఆర్సీపీ-16, టీడీపీ-3, ఇతరులు -1 కనిగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం కనిగిరి (20): వైఎస్ఆర్సీపీ-20, టీడీపీ-0 చీమకుర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చీమకుర్తి (20): వైఎస్ఆర్సీపీ-18, టీడీపీ-2 మార్కాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం మార్కాపురం (35): వైఎస్ఆర్సీపీ-30, టీడీపీ-5 అద్దంకి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం అద్దంకి (19): వైఎస్ఆర్సీపీ-13, టీడీపీ-6 చీరాల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చీరాల (33): వైఎస్ఆర్సీపీ-19, టీడీపీ-1, ఇతరులు 13 నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్ నాయుడుపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం నాయుడుపేట (25): వైఎస్ఆర్సీపీ 23, టీడీపీ-1, బీజేపీ-1 సూళ్లూరుపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం సూళ్లూరుపేట (25): వైఎస్ఆర్సీపీ 24, టీడీపీ-1 వెంకటగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం వెంకటగిరి (25): వైఎస్ఆర్సీపీ 25 ఆత్మకూరు (ఎం) మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ఆత్మకూరు (ఎం) (23): వైఎస్ఆర్సీపీ19, టీడీపీ-2, ఇతరులు 2 చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్ చిత్తూరు కార్పొరేషన్ వైఎస్ఆర్ సీపీ కైవసం చిత్తూరు కార్పొరేషన్ (50): వైఎస్ఆర్సీపీ -46, టీడీపీ -3, ఇతరులు -1 తిరుపతి కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం తిరుపతి కార్పొరేషన్ (49): YSRCP -48, TDP -1 మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం మదనపల్లె (35): వైఎస్ఆర్సీపీ -33, టీడీపీ -2 పుంగనూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పుంగనూరు (31): వైఎస్ఆర్సీపీ -31, టీడీపీ -0 పలమనేరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పలమనేరు (26): వైఎస్ఆర్సీపీ -24, టీడీపీ -2 నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం నగరి (29): వైఎస్ఆర్సీపీ -24, టీడీపీ -4, ఇతరులు -1 పుత్తూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పుత్తూరు (27): వైఎస్ఆర్సీపీ -22, టీడీపీ -5 కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్ కర్నూలు కార్పొరేషన్ (52): వైఎస్ఆర్సీపీ-44, టీడీపీ-6, ఇతరులు -2 గూడూరు (20): వైఎస్ఆర్సీపీ- 12, టీడీపీ-3, బీజేపీ -1, ఇతరులు - 4 డోన్ (32): వైఎస్ఆర్సీపీ- 31, ఇతరులు - 1 ఆత్మకూరు (24): వైఎస్ఆర్సీపీ- 21, టీడీపీ-1, ఇతరులు - 2 ఎమ్మిగనూరు (34): వైఎస్ఆర్సీపీ- 31, టీడీపీ-3 ఆదోని (42): వైఎస్ఆర్సీపీ- 41, టీడీపీ-1 నందికొట్కూరు (29): వైఎస్ఆర్సీపీ- 21, టీడీపీ-1, ఇతరులు -7 ఆళ్లగడ్డ (27): వైఎస్ఆర్సీపీ- 22, టీడీపీ-2, బీజేపీ - 2, ఇతరులు - 1 నంద్యాల (42): వైఎస్ఆర్సీపీ-37, టీడీపీ-4, ఇతరులు - 1 చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చిత్తూరు కార్పొరేషన్ వైఎస్ఆర్ సీపీ కైవసం చిత్తూరు కార్పొరేషన్ (50): వైఎస్సార్సీపీ -46, టీడీపీ -3, ఇతరులు -1 తిరుపతి కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం తిరుపతి కార్పొరేషన్ (49):వైఎస్సార్సీపీ -48, టీడీపీ -1 మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం మదనపల్లె (35): వైఎస్సార్సీపీ -33, టీడీపీ -2 పుంగనూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పుంగనూరు (31): వైఎస్సార్సీపీ -31, టీడీపీ -0 పలమనేరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పలమనేరు (26): వైఎస్సార్సీపీ -24, టీడీపీ -2 నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం నగరి (29):వైఎస్సార్సీపీ -24, టీడీపీ -4, ఇతరులు -1 పుత్తూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పుత్తూరు (27): వైఎస్సార్సీపీ -22, టీడీపీ -5 వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ కడప కార్పొరేషన్ వైఎస్సార్సీపీ కైవసం కడప కార్పొరేషన్ (50): వైఎస్సార్సీపీ -48, టీడీపీ -1, ఇతరులు -1 ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ప్రొద్దుటూరు (41): వైఎస్సార్సీపీ -40, టీడీపీ -1 పులివెందుల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పులివెందుల (33): వైఎస్సార్సీపీ -33, టీడీపీ-0 జమ్మలమడుగు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం జమ్మలమడుగు (20): వైఎస్సార్సీపీ -18, బీజేపీ -2 బద్వేల్ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం బద్వేల్ (35): వైఎస్సార్సీపీ -28, టీడీపీ -3, ఇతరులు -4 రాయచోటి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం రాయచోటి (34): వైఎస్సార్సీపీ -34, టీడీపీ -0 ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ఎర్రగుంట్ల (20): వైఎస్సార్సీపీ -20, టీడీపీ -0 శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్ ఇచ్ఛాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ఇచ్ఛాపురం (23): వైఎస్ఆర్సీపీ -15, టీడీపీ -6, ఇతరులు-2 పలాస మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పలాస (31): వైఎస్ఆర్సీపీ -23, టీడీపీ -8 పాలకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పాలకొండ (20): వైఎస్ఆర్సీపీ -17, టీడీపీ -3 విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్ బొబ్బిలి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం బొబ్బిలి (31): వైఎస్ఆర్సీపీ -19, టీడీపీ -11, ఇతరులు -1 పార్వతీపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం పార్వతీపురం (30): వైఎస్ఆర్సీపీ -22, టీడీపీ-5, ఇతరులు -3 సాలూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం సాలూరు (29): వైఎస్ఆర్సీపీ-20, టీడీపీ-5, ఇతరులు -4 నెల్లిమర్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం నెల్లిమర్ల (20): వైఎస్ఆర్సీపీ -11, టీడీపీ-7, ఇతరులు -2 ►విశాఖ కార్పొరేషన్ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. విశాఖ కార్పొరేషన్లో 57 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ ►పెద్దాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ♦పెద్దాపురం (29): వైఎస్సార్సీపీ -21, టీడీపీ -2, జనసేన -1 ►అమలాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ♦అమలాపురం (30): వైఎస్సార్సీపీ-19, టీడీపీ-4, జనసేన -6, ఇతరులు -1 ►గొల్లప్రోలు నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కైవసం ♦గొల్లప్రోలు (20): వైఎస్ఆర్సీపీ -18, టీడీపీ - 2 ►ముమ్మిడివరం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ♦ముమ్మిడివరం (20): వైఎస్ఆర్సీపీ - 14, టీడీపీ-6 ►ఏలేశ్వరం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ♦ఏలేశ్వరం (20):వైఎస్సార్సీపీ -16, టీడీపీ -4 ►మండపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ♦మండపేట (30): వైఎస్సార్సీపీ -22, టీడీపీ -7, ఇతరులు -1 ►ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేసింది. ఒంగోలు కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఒంగోలు (50): వైఎఎస్సార్సీపీ-41, టీడీపీ-6, జనసేన -1, ఇతరులు -2. గిద్దలూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం, గిద్దలూరు (20): వైఎఎస్సార్సీపీ-16, టీడీపీ-3, ఇతరులు -1 ►కనిగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం కనిగిరి (20): వైఎఎస్సార్సీపీ-20, టీడీపీ-0 ►చీమకుర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చీమకుర్తి (20):వైఎఎస్సార్సీపీ-18, టీడీపీ-2 ►మార్కాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం మార్కాపురం (35): వైఎఎస్సార్సీపీ-30, టీడీపీ-5 ►అద్దంకి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం అద్దంకి (19): వైఎస్సార్సీపీ-13, టీడీపీ-6 ►చీరాల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చీరాల (33): వైఎస్సార్సీపీ-19, టీడీపీ-1, ఇతరులు 13 ►అనంతపురం: హిందూపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 38 వార్డులకు ఇప్పటి వరకు 20 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయవం సాధించింది. ►చిత్తూరు: నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. నగరి (29): వైఎస్సార్సీపీ-24, టీడీపీ-4, ఇతరులు -1 ►తూర్పుగోదావరి: తుని మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్. 30 వార్డులకు 30 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►కృష్ణా: తిరువూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►విశాఖ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం. ఇప్పటి వరకు 46 డివిజన్లలో YSRCP ఆధిక్యం చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం.. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం ఎదురయ్యింది. టీడీపీ కోటలు బద్ధలయ్యాయి. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ విజయ ఢంకా మోగించింది. మదనపల్లి, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్సీపీ విజయఢంకా విజయవాడ: మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల మొదటిరౌండ్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించింది. 23 డివిజన్ల లో 18 స్థానాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 5 డివిజన్లకు మాత్రమే టీడీపీ పరిమితం కాగా, గ్లాస్ బోణి కొట్టలేదు. ఎమ్మెల్యే బాలకృష్ణ కు చేదు అనుభవం అనంతపురం: ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. హిందూపురం మున్సిపాలిటీ వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. మొత్తం 38 వార్డుల్లో 20 వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోగా, నాలుగు వార్డులకే టీడీపీ పరిమితమైంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సొంత వార్డులో టీడీపీ ఓటమి కృష్ణా జిల్లా: మచిలీపట్నం కార్పొరేషన్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సొంత వార్డులో టీడీపీ ఓటమి పాలైంది. టీడీపీ అభ్యర్థి బొడ్డు నాగలక్ష్మి పై వైసీపీ అభ్యర్థిని కొలుసు విజయగంగ విజయం సాధించారు. ధర్మవరంలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్.. అనంతపురం: ధర్మవరంలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 40 వార్డుల్లో పది వార్డులు ఏకగ్రీవం కాగా, 30 వార్డుల్లో ఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట దౌర్జన్యం అనంతపురం: కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దౌర్జన్యానికి దిగారు. అక్రమంగా కౌంటింగ్ కేంద్రంలో చొచ్చుకువెళ్లారు. 29వ వార్డులో ఆరు ఓట్లతో గెలిచిన వైఎస్సార్ సీపీ అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా కందికుంట.. అడ్డుకున్నారు. కందికుంట దౌర్జనానికి నిరసనగా ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి బైఠాయించారు. అయ్యన్నపాత్రుడికి ఎదురు దెబ్బ విశాఖ: నర్సీపట్నం లో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఎదురు దెబ్బ తగిలింది. నర్సీపట్నం మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 28 వార్డులకు గాను 16 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ►కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ తొలి రౌండ్ ఫలితాల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. 20 వార్డులకు గాను తొలి రౌండ్లో ఆరు వార్డును కైవసం చేసుకుంది. పశ్చిమలో వైఎస్సార్సీపీ హవా.. పశ్చిమగోదావరి జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతుంది. జిల్లాలో కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నరసాపురం మున్సిపాలిటీలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అభ్యర్థులను మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అభినందించారు. మచిలీపట్నం కార్పొరేషన్లో ముందంజలో వైఎస్సార్సీపీ.. కృష్ణా జిల్లా: మచిలీపట్నం కార్పొరేషన్ లో 17 డివిజన్లకు తొలి రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. 15 డివిజన్లలో వైఎస్సార్సీపీ ముందంజలో ఉంది. లోకేష్ ప్రచారం నిర్వహించిన 7 వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. ►నెల్లూరు: సూళ్లూరుపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 25 వార్డులకు ఇప్పటి వరకు 24 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు సాధించింది. ►తూర్పుగోదావరి: గొల్లప్రోలు నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 12చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►శ్రీకాకుళం: పాలకొండ నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఇప్పటి వరకు 50 మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ►నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్ చేసింది. వెంకటగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 25 వార్డుల్లో 25 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు సాధించింది. ►విజయవాడ కార్పొరేషన్లో వెలువడిన తొలి ఫలితం. 37వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి గెలుపు. ►పశ్చిమగోదావరి: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 29 వార్డులకు ఇప్పటి వరకు 25 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు సాధించింది. ►గుంటూరు: చిలకలూరిపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 38 వార్డులకు ఇప్పటి వరకు 21 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►విజయనగరం: బొబ్బిలి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 8 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ►చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్ చేసింది. తిరుపతి కార్పొరేషన్తో పాటు అన్ని మున్సిపాలిటీలు కైవసం. పుత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీ కైవసం ►కర్నూలు కార్పొరేషన్లో ఇప్పటి వరకు 10 డివిజన్ల ఫలితాల వెల్లడి.10 డివిజన్లలోనూ వైఎస్ఆర్సీపీ విజయం ►గుంటూరు కార్పొరేషన్ కైవసం దిశగా వైఎస్ఆర్సీపీ. 57 డివిజన్లకు ఇప్పటి వరకు 25 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►అనంతపురం: పుటపర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 20 వార్డులకు 14 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►కర్నూలు: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 27 వార్డులకు 22 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►విజయనగరం: నెల్లిమర్ల నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కైవసం. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►అనంతపురం: రాయదుర్గం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 32 వార్డులకు ఇప్పటి వరకు 17 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►కడప: బద్వేల్ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►తిరుపతి కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 50 డివిజన్లలో ఇప్పటి వరకు 30 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ►గుంటూరు: తెనాలి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 5 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►కృష్ణా: తిరువూరు 9వ వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం ►తూర్పుగోదావరి: రామచంద్రపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 28 వార్డులకు ఇప్పటి వరకు 15 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు. ముమ్మిడివరం నగరపంచాయతీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►పశ్చిమగోదావరి: నరసాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 31 వార్డులకు ఇప్పటి వరకు 16 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 29 వార్డులకు ఇప్పటి వరకు 17 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. ►ఉయ్యూరులో ఇప్పటి వరకు 9 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేసింది. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఓటర్లు ఫ్యాన్కే పట్టం కట్టారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. ►గుంటూరు: వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 25 వార్డులకు గాను 21 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ►చిత్తూరు: మదనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►నగరిలో 29 వార్డులకు 15 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►గుంటూరు: రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►విజయనగరం: సాలూరులో ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►విశాఖ: యలమంచిలి 1వ వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం ►నందిగామ 9, 10, 17 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►ఒంగోలు కార్పొరేషన్లో 19 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయం ►గుంటూరు కార్పొరేషన్లో 4, 24, 34, 36, 41, 44 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయం ►పుట్టపర్తిలో 20 వార్డులకు ఇప్పటి వరకు 9 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►కర్నూలు: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►27 వార్డులకు ఇప్పటి వరకు 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►గుంటూరు: సత్తెనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►28 వార్డులకు ఇప్పటి వరకు 26 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►కడప: ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్. 20 వార్డులకు 20 చోట్లా వైఎస్ఆర్సీపీ గెలుపు ►విశాఖ: యలమంచిలి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 25 వార్డులకు గాను ఇప్పటి వరకు 23 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►కర్నూలు: ఆదోని మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►42 వార్డులకుగాను ఇప్పటివరకు 22 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►నందిగామ మున్సిపాలిటీలో ఇప్పటివరకు 3 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్ ►కృష్ణా: ఉయ్యూరు 5 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►తిరుపతి: 15, 20, 26, 32, డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయం ►గుంటూరు: వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 25 వార్డులకు గాను 21 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►చిత్తూరు: మదనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 29 వార్డులకు 15 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►గుంటూరు: రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►విజయనగరం: సాలూరులో ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►విశాఖ: యలమంచిలి 1వ వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం ►నందిగామ 9, 10, 17 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►ఒంగోలు కార్పొరేషన్లో 19 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయం ►గుంటూరు కార్పొరేషన్లో 4, 24, 34, 36, 41, 44 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయం ►పుట్టపర్తిలో 20 వార్డులకు ఇప్పటి వరకు 9 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 27 వార్డులకు ఇప్పటి వరకు 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 6, 13, 24 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఇప్పటివరకు 9 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం. 1, 5, 9, 13, 14, 17, 21, 25, 29 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►కృష్ణా: పెడనలో 23 వార్డులకు గాను 8చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం. 1, 2, 3, 4, 5,. 6, 7, 8 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►విశాఖ: యలమంచిలి 5, 6, 11, 13, 14 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►శ్రీకాకుళం: పలాస మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 31 వార్డులకుగాను ఇప్పటివరకు 16 చోట్ల గెలుపు ►పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఇప్పటివరకు 7వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►ప్రకాశం: అద్దంకి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 19వార్డులకుగాను ఇప్పటివరకు 11చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►కర్నూలు: ఎమ్మిగనూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 30 వార్డులకుగాను ఇప్పటివరకు 18చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►గుంటూరు కార్పొరేషన్లో 25 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం ►వైఎస్ఆర్జిల్లా: ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 20వార్డులకు గాను ఇప్పటివరకు 17చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఇప్పటివరకు 7వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►అనంతపురం: మడకశిర మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►25 వార్డులకుగాను 11చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►ఇప్పటివరకు 33 మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీ కైవసం ►తూర్పుగోదావరి: తుని మున్సిపాలిటీ వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. 30 వార్డులకు గాను ఇప్పటివరకు 18 చోట్ల వైఎస్ఆర్ సీపీ గెలుపొందింది. మరోసారి యనమలకు ఎదురుదెబ్బ తగిలింది. మండపేటలో 1, 2, 8 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ►అనంతపురం: మడకశిరలో 2, 3, 7, 10 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది ►వైఎస్ఆర్జిల్లా: ఎర్రగుంట్లలో 11, 14 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►కృష్ణా: ఉయ్యూరు 8వ వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం ►నెల్లిమర్లలో ఇప్పటివరకు 6 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►2, 3. 4, 5, 7, 8 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►కర్నూలు: ఆత్మకూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►24 డివిజన్లకుగాను 21 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►అమలాపురం మున్సిపాలిటీలో ఇప్పటివరకు 10 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం. 1, 8, 10, 11, 12, 13, 14, 16, 17, 25 వార్డుల్లో ఫ్యాన్ హవా ►నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్. అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ ►నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, వెంకటగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపు ►చిత్తూరు: మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 35 వార్డులకు గాను ఇప్పటివరకు 19 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ►గుంటూరు కార్పొరేషన్ 34 డివిజన్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. వినుకొండ మున్సిపాలిటీ 13వ వార్డులో వైఎస్సార్సీపీ గెలిచింది. ►విజయనగరం: సాలూరు 4, 5, 6, 7 వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. పార్వతీపురం 12, 13 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. ►శ్రీకాకుళం: పలాస 6, 9, 15, 16 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఇచ్చాపురం 1, 6, 7 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ►చిత్తూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యత కొనసాగుతుంది. 50 డివిజన్లకు గాను 37 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ►కదిరి 30వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి విజయం సాధించారు. 970 ఓట్లతో గులాబ్ జాన్ గెలుపొందారు. ►ఆత్మకూరు మున్సిపాలిటీ 19వ వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ►కర్నూలు: ఆత్మకూరు మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 24 వార్డుల్లో ఇప్పటికే 20 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. ►పశ్చిమగోదావరి: నరసాపురం 23వ వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. నిడదవోలు 6వ వార్డులో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ►కర్నూలు జిల్లా డోన్ మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 32 వార్డులకు గాను ఇప్పటికే 30 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ‘కనిగిరి’లో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ కనిగిరి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ సత్తాచాటింది. 20 వార్డులకు గాను 20 గెలుచుకొని క్లీన్స్వీప్ చేసింది మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతుంది. ఇప్పటికే 18 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ.. చాలా స్థానాల్లో ముందంజలో ఉంది. కనిగిరిలో 20 వార్డులకు గాను 20 గెలుచుకొని క్లీన్స్వీప్ చేసింది. ‘గిద్దలూరు’ వైఎస్సార్సీపీ కైవసం ప్రకాశం జిల్లాలోని మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతుంది. ఇప్పటికే కనిగిరి, గిద్దలూరు మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలు స్థానాల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ల్లో వైఎస్సార్సీపీదే ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్ల్లో వైఎస్ఆర్సీపీదే ఆధిక్యం ఉంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది. ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు పాలకొండ నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు పార్వతీపురం మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు బొబ్బిలి మున్సిపాలిటీలో ఒక వార్డులో వైఎస్సార్ సీపీ గెలుపు యలమంచిలి మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు అమలాపురం మున్సిపాలిటీ 6 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు రామచంద్రపురం మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు సామర్లకోట మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తుని మున్సిపాలిటీలో 15 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ముమ్మిడివరం నగర పంచాయతీ 1 వార్డులో వైఎస్సార్ సీపీ గెలుపు కొవ్వూరు మున్సిపాలిటీలో 13 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు నరసాపురం మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తెనాలి మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు చిలకలూరిపేట మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు రేపల్లె మున్సిపాలిటీలో 4 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు సత్తెనపల్లి మున్సిపాలిటీలో 4 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు వినుకొండ మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు కనిగిరి మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 14 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు నాయుడుపేట మున్సిపాలిటీలో 23 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఆత్మకూరు మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు వెంకటగిరి మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు నూజివీడు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఉయ్యూరు నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తిరువూరు నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ధర్మవరం మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు గుత్తి మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు గుంతకల్లు మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తాడిపత్రి మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 9 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 13 వార్డుల్లో వైఎస్సార్ సీపీగెలుపు జమ్మలమడుగు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు బద్వేల్ మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీలు వైఎస్సార్ సీపీ కైవసం పులివెందుల, మాచర్ల మున్సిపాలిటీలు వైఎస్సార్ సీపీ కైవసం పుంగనూరు, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు వైఎస్సార్సీపీ కైవసం ►విశాఖ కార్పొరేషన్ 11 వార్డు జనసేన అభ్యర్థి గోనె భారతి గుండెపోటుతో మృతి చెందారు. కౌంటింగ్ ప్రారంభం ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించనున్నారు. కాగా 11 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం అవుతంది. అనంతరం ఇనీషియల్ కౌంటింగ్ ప్రారంభించి బ్యాలెట్ పేపర్లని సరిచూసుకుంటారు. తర్వాత 25 ఓట్లని ఒక బండిల్ కట్టి ఆయన డివిజన్లకి ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేస్తారు. అనంతరం 40 బండిళ్లను డివిజన్కు లేదా వార్డుకు వెయ్యిఓట్ల చొప్పున ప్రారంభిస్తారు. ఇప్పటికే నాలుగు మున్సిపాలీటీలు ఏకగ్రీవం పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో కూడా 362 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం ఏకగ్రీవ డివిజన్లు, వార్డుల సంఖ్య 490కు చేరింది. దాంతో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 1,633 డివిజన్లు, వార్డుల్లో పోలైన ఓట్లను లెక్కించి నేడు ఫలితాలు ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు ఓట్ల లెక్కింపు కోసం పురపాలక శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ చేపట్టనున్న 11 నగర పాలక సంస్థల్లో మొత్తం 2,204 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 7,412 మంది కౌంటింగ్ సిబ్బంది, 2,376 మంది కౌంటింగ్ సూపర్వైజర్లను నియమించారు. ఓట్ల లెక్కింపు చేపట్టనున్న 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 1,822 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 5,195 మంది కౌంటింగ్ సిబ్బంది, 1,941మంది కౌంటింగ్ సూపర్వైజర్లను నియమించారు. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఏలూరు నగర పాలక సంస్థ మినహా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆదివారం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరులో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రస్తుతం చేపట్టడం లేదు. ఓట్ల లెక్కింపు కోసం పురపాలక శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. -
చంద్రబాబుకు నోటీసులివ్వాలని హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: పంచాయతీఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసినా ఎస్ఈసీ చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఎస్ఈసీతో పాటు చంద్రబాబుకు నోటిసులు జారీ చేయాలని కోరగా హైకోర్టు అందుకు అంగీకరించినట్లు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది. చదవండి: చంద్రబాబు మేనిఫెస్టో.. ఓ 420 వ్యవహారం -
ఓటమి భయంతో జేసీ కంటతడి..!
సాక్షి, అనంతపురం: మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఎదురీతున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న జేసీ.. ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు. ఓటమి భయంతో ఆయన కంటతడి పెట్టారు. తాడిపత్రిలో ఏదో జరిగిపోతుందంటూ అసహనం వ్యక్తం చేశారు. అనుమతి లేని వాహనాల్లో వెళ్తూ పోలీసులతో జేసీ ప్రభాకర్రెడ్డి వాగ్వాదానికి దిగారు. సర్ది చెప్పేందుకు యత్నించిన టీడీపీ నేత రఘుపై దాడికి పాల్పడ్డారు. బూతులతో మరోసారి రెచ్చిపోయారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాడిపత్రిలో జేసీ దౌర్జన్యంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. జేసీ పవన్పై కేసు తాడిపత్రి: ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి కుమారుడు జేసీ పవన్రెడ్డిపై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. గత ఆదివారం అర్ధరాతి టీడీపీ నేత జేసీ పవన్రెడ్డి ఆ పార్టీ తరఫున తాడిపత్రిలోని హరిజనవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా భారీ కాన్వాయ్తో హరిజనవాడకు చేరుకున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడం పట్ల షాడో టీం ఫిర్యాదు మేరకు జేసీ పవన్పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. చదవండి: అయోమయంలో టీడీపీ.. చంద్రబాబు మాటలతో చేటే! మహిళను మెడవంచి కొట్టిన అశోక్గజపతిరాజు -
అయోమయంలో టీడీపీ.. చంద్రబాబు మాటలతో చేటే!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అధినేత ప్రచారంతో క్యాడర్లో మంచి ఊపు ఉత్సాహం వస్తుందని, పోలింగ్ రోజున మరిన్ని ఓట్లు రాబట్టుకోగలమని ఆశించిన విజయవాడ, గుంటూరులోని టీడీపీ నేతలు చంద్రబాబు నిస్సహాయత, నిట్టూర్పు, హావభావాలు, పరుష పదజాలంతో నిశ్చేష్టులయ్యారు. బుధవారం మునిసిపల్ ఎన్నికల పోలింగ్ జరగనున్నందున చివరి రెండు రోజులను విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో ప్రచారానికి చంద్ర బాబు కేటాయించారు. రూట్ మ్యాప్ మొదలు, సమయపాలన, నేతల మధ్య కనీస సమన్వయం... ఏ కోణంలో చూసినా ఏ విధంగానూ స్పష్టతలేమి కొట్టొచ్చినట్లు కనిపించిందని, అధినేత అసహనం అడుగడుగునా వ్యక్తం కావడంతో సీనియర్ నేతలు, కార్యకర్తలను నివ్వెరపరచిందని పరిశీల కులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి కేంద్రంగా గత ప్రభుత్వ పాలన సాగినందున రెండు నగరాలకు చెందిన ఓ మోస్తరు నాయకులు బాబును దగ్గర నుంచి గమనించిన వారే ఈమేరకు చెబుతున్నారన్నారు. రాజధానికి కేంద్ర బిందువులని నిత్యం వల్లెవేసుకునే రెండు నగరాలలో ఆయన ఎన్నికల పర్యటనను నిశితంగా పరిశీలించిన స్వపక్షీయులు జాతీయ అధ్యక్షుడి నాయకత్వ వైఫల్యాన్ని స్పష్టంగా అంచనావేసి విశ్లేషిస్తున్నారు. విజయవాడ పర్యటనకు ముందురోజు నగర నాయకులు బొండా ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్న, నాగుల్మీరా తదితరులు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)పై ధ్వజమెత్తిన తీరు పార్టీ దుస్థితిని ఎత్తిచూపింది. పారీ్టలో కొనసాగుతున్న ఏ స్థాయి నాయకులు కూడా స్వపక్షంలోని ప్రజాప్రతినిధిపై ఈ తీరున మాట్లాడిన దాఖలాలు గత కొన్నేళ్లలో లేవు. గత సాధారణ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు నామమాత్రపు ప్రజాప్రతినిధులతో సరిపెట్టుకున్న పార్టీపై అధినేత పట్టు పూర్తిగా కోల్పోయారనేందుకు విజయవాడలో విలేకరుల సమావేశంలో ఆ ముగ్గురు మాట్లాడిన తీరే నిదర్శనమని సీనియర్లు ఉదహరిస్తున్నారు. బొండా, బుద్దా, మీరాల హెచ్చరికల నేపథ్యంలో స్థానిక ఎంపీ కేశినేనిని ప్రచారంలో పూర్తిగా దూరంగా పెట్టారు. ఎక్కడా ఆయనను వాహనం దరిచేరనీయ లేదు. తన కుమార్తె శ్వేతను మేయర్గా చూడాలని ఆశించిన ఎంపీకి ఎన్నికల ప్రచార వాహనంలో కనీస స్థానం లేదంటే తమ పార్టీ దుస్థితి ఎక్కడికి చేరిందో, ఏ దిశలో ప్రయాణిస్తుందో అంచనాకు రావచ్చని సీనియర్లు విశ్లేíÙస్తున్నారు. మరోవైపు సోమవారం గుంటూరు కార్పొరేషన్ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎంపీ గల్లా జయ దేవ్ చంద్రబాబు వెంటే ఉన్నారు. విజయవాడలో తన పక్కన నిలుచోవడానికి కూడా స్థానిక ఎంపీ పనికి రాకపోగా గుంటూరు లో మాత్రం గల్లాను ఆసాంతం తన వెన్నంటే ఉంచుకోవడంలో చంద్రబాబు ఔచి త్యం ఏమిటని కేశినేని మద్దతుదారులు నిలదీస్తున్నారు. పార్టీ నాయకులపై బాబుకు కనీస పట్టు ఉందా అనే అనుమానం పార్టీ శ్రేణుల్లోనూ తలెత్తుతోంది. మొన్నటికి మొన్న కుప్పంలో ఆయన సమక్షంలోనే మీరు కాదు ఇతరులను తీసుకొచ్చి పగ్గాలు అప్పగించండని అన్నప్పుడే చంద్రబాబు భవిష్యత్, పార్టీ పరిస్థితి ఏంటో తేటతెల్లమైందని గుర్తుచేస్తున్నారు. అన్నింటా వైఫల్యాలే... గుంటూరు, విజయవాడలో చంద్రబాబు పర్యటనను పరిశీలిస్తే అన్నింటా వైఫల్యాలు కనిపించాయి. జనసమీకరణకు ఎంతైనా వెదజల్లండని అధిష్టానం ముందు నుంచే చెప్పినా, వెదజల్లినా స్పందన కరవైంది. రూట్ మ్యాప్ ఖరారులోనే తేడాలు కొట్టొచ్చినట్లు కనిపించింది. సమయపాలనలోనూ ఏమాత్రం పొంతన లేదు. దీనికంతటికీ కారణం మొదటి నుంచి అధినేత నిస్సహాయత, నిట్టూరు, అసహనం, అనిశ్చితే కారణమని చంద్రబాబును దగ్గర నుంచి దశాబ్దాలుగా చూస్తున్న పార్టీ సీనియర్ల విశ్లేషణ. ఎందుకో మా సహచరునిలో ఓర్పు, సహనం పూర్తిగా నశించిందని మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించడం బాబు స్థితికి అద్దం పడుతోంది. ఆయన మాటలతో చేటే! చంద్రబాబు విజయవాడ, గుంటూరు లో మాట్లాడిన మాటలు స్వపక్షియులకే చిర్రెత్తుకొచ్చేలా చేశాయి. అమరావతికి మద్దతు ఇవ్వకపోతే మీరు పాచి పనులకు పోతారు, అడుక్కుతింటారు, అసలు రోషం ఉందా? పౌరుషం లేదా? చీము, నెత్తురు లేదా? అంటూ నానా మాటలన్నారు. రెండు కార్పొరేషన్ల పరిధిలో పేదలు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు ఎక్కువ. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో అరవై వేల మందికి పైగా పేదలకు గృహాలను కేటాయించాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్ణయించగా చంద్రబాబు తన అనుయాయుల ద్వారా న్యాయస్థానాల్లో అడ్డుకున్నారు. అమరావతిలో పేదలకు నివాసాలు ఏర్పరిస్తే అక్కడ సామాజిక అసమానత ఏర్పడుతుందని నిస్సిగ్గుగా వ్యాజ్యంలో పొందుపరిచారు. అలాంటప్పుడు రాజధాని కోసం మీరు పోరాడాలి, మద్దతు ఇవ్వాలి, కార్పొరేషన్లలో టీడీపీని గెలిపించాలని పేదలకు ఎలా పిలుపునిస్తారని ప్రతిపక్ష పార్టీ నేతలే ప్రశి్నస్తున్నారు. పేదలకు ఆవాసాలే అక్కడ వద్దన్న నోటితో మీరు పాచిపనులు చేసుకుంటారా, రోషం, పౌరుషం లేదా అని ఎలా రెచ్చగొడతారని స్వపక్షీయులే విస్తుపోతున్నారు. అత్యంత రాజకీయ అనుభవజ్ఞడిగా తనకు తాను చెప్పుకునే తమ నేత స్థితిమితం లేని, అవగాహన రాహిత్యంతో ఉపన్యసించడం తమకే ఆశ్చర్యం కలిగించిందని వాపోతుండటం పరిశీలనాంశం. కనిపించని సీనియర్లు... విజయవాడ, గుంటూరుల్లో సీనియర్లకు పార్టీలో కొరత లేదు. రెండు కార్పొరేషన్లలో గెలుపు తప్పనిసరని, ప్రతిష్ఠతో కూడుకున్నదని చంద్రబాబు తొలినుంచీ చెపుతున్నా మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్లకు చెవికెక్కలేదు. పార్టీలో తిరుగులేని నాయకులమని చెప్పుకునే మాజీ మంత్రి దేవినేని ఉమా, సీనియర్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల నియోజకవర్గాల్లోనే పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడంతో ఇతరులెవరూ ముందుకు రావడానికి సుముఖత కనపరచిన దాఖలాలు లేవు. మొన్నటి గుంటూరు, విజయవాడ నగరాల శివారు పంచాయతీల్లో ఫ్యాను గాలి జోరున వీచింది. దీంతో రెండు కార్పొరేషన్లలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ముందుగానే టీడీపీ నేతలు అంచనాకు వచ్చారు. ఆ దృష్ట్యా సీనియర్లు కలగజేసుకోలేదని బాహాటంగానే ఆ పార్టీ నాయకులు అంటున్నారు. చదవండి: పరుష పదజాలం.. ప్రజలపై ప్రతాపం ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు -
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్రేక్ వేసింది. ఏలూరులో ఎన్నికలు నిలిపి వేయాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ సరిగా చేయడం లేదని గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఓటర్ల జాబితాను సరి చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు పాటించకుండా ఎన్నికలకు వెళ్తున్నారని ఈ ఏడాది ఫిబ్రవరిలో 14న పిటిషన్ దాఖలైంది. వార్డుల పునర్విభజన, జనగణన, కులగణన సరిగా చేయకుండానే ఎన్నికలు జరుపుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో ఎన్నికల నిర్వహణ నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ముగిసిన ప్రచారం పురపాలక ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమవ్వడంతో అక్కడ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు. మిగిలిన నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఈ నెల 10న పోలింగ్ నిర్వహించనున్నారు. చదవండి: మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ చదవండి: మహిళలు.. ఆకాశంలో సగం: సీఎం జగన్ -
మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీతకు తన జిల్లాలోనే ఎదురుదెబ్బ తగిలింది. కనగానపల్లి టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రామలింగయ్య టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్యేతో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ నుంచి పలువురు నాయాకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. టీడీపీ ఆవిర్భవం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ సర్పంచ్గా ఎంపీపీగా, పదవులు అలంకరించిన కేఎస్ ఫైరోజ్ బేగం, ఆమె భర్త జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు కేఎస్ ఉమర్తో పాటు మరో 50 కుటుంబాలకు చెందిన 200 మంది ఆదివారం వైఎస్సార్సీపీలో చెరిన విషయం తెలిసిందే. చదవండి: ఉత్తరాంధ్ర అంటే జగదాంబ సెంటర్ కాదు -
చంద్రబాబుకు అడ్డదార్లు, వెన్నుపోట్లు తెలుసు: సజ్జల
-
చంద్రబాబుకు అడ్డదార్లు, వెన్నుపోట్లు తెలుసు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: పేదల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని, ప్రజల ఆశీస్సులతోనే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు గెలిచారని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీదే విజయమని తెలిపారు. రాబోయే దశాబ్దం పాటు వైఎస్ జగనే సీఎంగా ఉండాలని ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు ఆసహనంలో మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఉక్రోశం, ఆక్రోశం ఏంటో ఆర్థం కావడం లేదు ఎద్దేవా చేశారు. మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఇంకా అహంభావం తగ్గలేదని, ప్రజలను బాబు ఘోరంగా అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. ఏ రాజకీయనేత అయినా ప్రజల ఆశీస్సులు కావాలని కోరుకుంటారని తెలిపారు. దీనికి విభిన్నంగా చంద్రబాబు ప్రచారంలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాబు అధికారంలో ఉండి 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నారని ఆగహం వ్యక్తం చేశారు. రూ.వేల కోట్లు పోసి గత ఎన్నికల్లో చంద్రబాబు గెలవాలని చూసినా సాధ్యపడలేదన్నారు. అడ్డదార్లు, వెన్నుపోట్లు ఇవే చంద్రబాబుకు తెలిసిన విద్యని, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ను ప్రజలు విశ్వసించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ప్రచారంలోనూ ప్రజలను ఘోరంగా చంద్రబాబు అవమానిస్తున్నారని, 2019లో ఒక అవకాశం రాగానే చంద్రబాబును పూర్తిగా ఓడించారని గుర్తు చేశారు. 20 నెలల పాలనలో సీఎం వైఎస్ జగన్ ప్రజల నుంచి పూర్తి నమ్మకం తెచ్చుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబును నమ్ముకుంటే పుట్టి మునుగుతుందని ప్రజలు బలంగా నమ్మారని, అందుకే పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులను భారీగా గెలిపించారని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దారుణంగా పడిపోయిందని, ఇకపై చంద్రబాబును నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. 95 శాతానికి పైగా ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పులు వచ్చాయని, వచ్చే రెండేళ్లలో మరింత వేగంగా సంక్షేమ ఫలాలు అందుతాయని సజ్జల తెలిపారు. చదవండి: మహిళపై చేయిచేసుకున్న అశోక్ గజపతి రాజు -
ఎంపీ కేశినేనిని దూరంపెట్టిన చంద్రబాబు..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన పార్టీ నగర నేతల హెచ్చరికలకు తలొగ్గారు. తన పార్టీకి చెందిన స్థానిక ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) వెంట లేకుండానే విజయవాడ నగరంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ నాయకులు నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, నాగుల్ మీరా కూడా కనిపించీ కనిపించనీయకుండా కార్యక్రమాన్ని మమ అనిపించారు. అధికారం ఉన్నంతకాలం అంతా నేనే, అన్నింటా తానే అన్నట్లు వ్యవహరించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితి మరీ విడ్డూరం. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుతో కలిసి ఆయన నడక సాగించక తప్పలేదు. ఆసాంతం అసహనం, ఆగ్రహం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం చంద్రబాబు నగరంలో ఎన్నికల ప్రచారాన్ని ఆసాంతం అసహనంతో, ఆగ్రహంతో, నిస్సహాయ స్థితిలో కొనసాగించారనేది పరిశీలకుల విశ్లేషణ. గతంలో విజయవాడలో జరిగిన బాబు ఏ పర్యటనలతో పోలి్చనా ఏమాత్రం పొంతన లేదని తేలి్చపారేశారు. జన సమీకరణకు ఎంతైనా వెదజల్లండని అధిష్టానం నుంచి అందిన ఆదేశాలను తూచా తప్పక పాటించినా ఆశించిన స్పందన లేకపోవడంతో నాయకుల్లో ఆందోళన అడుగడుగునా కనిపించింది. ప్రజలను, నాయకులను ఉద్దేశించి బాబు మాట్లాడిన తీరు విజయవాడలో టీడీపీ దుస్థితి నగరవాసులకు ఆదివారం కళ్లకు కట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడటం పరిశీలనాంశం. ఎంపీపై తిరుగుబాటుతో... పార్టీ నగర ముఖ్య నాయకులైన బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, నాగుల్మీరా శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం, ఆ వెనువెంటనే చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితర సీనియర్ నేతలు పలువురు జోక్యం చేసుకుని సర్దిచెప్పడానికి ఎంత ప్రయత్నించినా వారు ససేమిరా అనడం తెలిసిందే. మీ పర్యటనలో కేశినేని ఉన్నట్లయితే తాము పాల్గొనబోయేది లేదఅని చంద్రబాబుకే అలి్టమేటం ఇవ్వడంతో పశి్చమ, మధ్య నియోజకవర్గాల్లో ఎంపీ తన వెంట లేకుండా పార్టీ జాతీయ అధ్యక్షుడు జాగ్రత్తపడ్డారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారీ్టలు అంటే కేశినేనికి అలుసని, కుల అహంకారమని దుమ్మెత్తిపోశారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని గుంటూరు, విజయవాడ మేయర్ పీఠాన్ని ఒకే సామాజిక వర్గానికి ఇవ్వవద్దని ముఖ్య నాయకులు చేసిన సూచనలను చంద్రబాబు పెడచెవిన పెట్టడం కూడా ఇతర సామాజికవర్గాల నేతల ఆగ్రహానికి కారణమైంది. పార్టీకి, తమ సామాజికవర్గానికి రెండు జిల్లాలు కేంద్ర బిందువుల్లాంటివని వల్లెవేసే వారికి గత సాధారణ ఎన్నికల్లో, మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు కీలెరిగి వాతపెట్టారు. రెండు జిల్లాల్లోనూ రెండు ఎంపీ స్థానాలు, నాలుగు అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టారు. విజయవాడ, గుంటూరు నగర శివార్లలోని మెజార్టీ పంచాయతీలు వైఎస్సార్సీపీ మద్దతుదారులే గెలుపొందారు. మొన్నం కుప్పం, నిన్న విజయవాడలో పార్టీ పరిస్థితిని బేరీజు వేసుకున్నందునే బాబు కేశినేనిని దూరం పెట్టారని సీనియర్లు అంటున్నారు. అందువల్లే పార్టీ తరఫున మేయర్ అభ్యర్థి, కేశినేని కుమార్తె అయిన శ్వేత, ఆయా డివిజన్లలో కార్పొరేటర్ అభ్యర్థి, ఇతర ఛోటామోటా నాయకులు బాబుతో పాటు ప్రచార వాహనంపై చోటిచ్చారని గుర్తుచేశారు. మిత్రపక్షమైన సీపీఐ అభ్యర్థులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా కనిపించారు. చదవండి: విజయవాడలో చంద్రబాబుకు చేదు అనుభవం రామోజీ రూటే వేరు...నిజాలెక్కడ? -
‘గంగవరంలో పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు ఇస్తాం’
సాక్షి, విశాఖపట్నం: గంగవరంలో పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు ఇస్తామని, కాలుష్యంతో ఇబ్బంది ఉన్న గంగవరం చుట్టుపక్కల గ్రామాలను మరోచోటికి తరలిస్తామని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గంగవరం గ్రామంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగవరం పోర్టులో ఉన్న ఉద్యోగులతో సమానంగా స్థానికులకు జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సీఎం జగన్మోహన్రెడ్డి వ్యతిరేకమని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంతంగా గనులు కేటాయించాలని ప్రధాని మోదీకి ఇప్పటికే సీఎం జగన్మోహన్రెడ్డి లేఖ రాశారని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చి ఉద్యోగం రానివారికి ఉద్యోగాలు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైస్సార్సీపీ జెండా ఎగరాలన్నారు. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు గెలిస్తే నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. చదవండి: విజయవాడలో చంద్రబాబుకు చేదు అనుభవం