Municipal elections
-
కిరాయి రౌడీలకు మద్యం పట్టించి.. తునిలో రెచ్చిపోయిన టీడీపీ
-
టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి.. ఇదే రిపీట్ అవుతుంది: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: కూటమి నేతలు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా ఖూనీ చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఎన్నికల్లో బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై కేసులు పెట్టి బెదిరించారని మండిపడ్డారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అని ప్రశ్నించారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు రెచ్చిపోయారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారు. పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అరాచకం చేశారు. మా పార్టీ కౌన్సిలర్లపై కేసులు పెట్టించి బెదిరించారు. కిడ్నాప్ చేసి తమవైపు లాక్కున్నారు. మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులన్నీ వైఎస్సార్సీపీ నేతలే గెలిచారు. ఇప్పుడు ప్రత్యేకంగా వైఎస్ చైర్మన్గా టీడీపీ వారు ఉండటం వల్ల వారికి వచ్చే లాభమేంటి?.అధికారం ఉందనే అహంకారంతో పదవులను కైవసం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూటమి నేతలు నేర్పుతున్న పాఠాలు భవిష్యత్తులో అన్ని పార్టీలు అవలంభిస్తాయి. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?. నెల్లూరులో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ పోలీసులను అడ్డు పెట్టుకుని డిప్యూటీ మేయర్ను గెలిచారు. అసలు ఒక్క కౌన్సిలర్ని కూడా గెలవలేని టీడీపీ.. ఇప్పుడు వైస్ చైర్మన్లను గెలవాలని చూస్తోంది. దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా టీడీపీ మారింది. దొడ్డిదారిలో పదవులు పొందటం ద్వారా టీడీపీ ఏం సాధిస్తుంది?. ఇలా పదవులు పొందటం రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి వారికి ప్రజలే తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
టీడీపీ నేతల అరాచకం.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా
Municipal Elections Updates..👉ఏపీలో కూటమి నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఎన్నికల్లో బలం లేకపోయినా అధికారంలో ఉన్నారనే అహంకారంతో టీడీపీ నేతలు పోటీకి దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు.👉పాలకొండలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా. ఎన్నిక జరగకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు. 👉తుని వైఎస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. దీంతో, మూడోసారి వాయిదా పడినట్టు అయ్యింది. శాంతి భద్రతల సమస్య కారణంగా ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. 👉కాకినాడ..తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా టీడీపీ గుండాల దౌర్జన్యం. మున్సిపల్ చైర్మన్ సుధా బాలు ఇంటి వద్ద వేలాదిగా మోహరించిన పచ్చ గుండాలు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన పది మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్లోకి వెళ్లారు. కోరం లేకపోవడంతో ఎన్నిక జరగకుండా పచ్చనేతలు అడ్డుకుంటున్నారు. ఎన్నికలు సజావుగా జరపాలని హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న టీడీపీ నేతలు. ఇక.. టీడీపీ నేతలకు పోలీసులు వంతపాడుతున్నారు. దీంతో, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించనున్నారు. టీడీపీ నాయకులు యనమల డైరెక్షన్లోనే వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పచ్చ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. పల్నాడులో ప్రజాస్వామ్యం ఖూనీ.. 👉పిడుగురాళ్లలో పట్ట పగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. అరాచకానికి ఐకాన్గా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మారారు. పిడుగురాళ్లలో మొత్తం 33 వార్డులు ఉండగా.. గతంలో 33 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవని తెలుగుదేశం. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ను తన వైపునకు తిప్పుకున్న యరపతినేని. బలం, అర్హత లేకపోయినా వైస్ చైర్మన్ పదవి కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన శ్రీనివాసరావు.👉పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయించారు. బెదిరించి, భయపెట్టి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ వైపునకు తిప్పుకున్నారు. 29వ వార్డు కౌన్సిలర్ మునీరా రెండు ఇళ్లను కూల్చే చేయించిన యరపతినేని. కౌన్సిలర్లు అందరినీ ఒక లాడ్జిలో బంధించి బస్సులో నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చిన తెలుగుదేశం నేతలు. వైఎస్ చైర్మన్ పదవి కైవసం చేసుకున్నట్టు యరపతినేని ప్రకటన. 👉తునిలో మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు దాడిశెట్టి రాజాపై దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడే ఉన్నా.. వారిని అడ్డుకోకపోవడం గమనార్హం. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ సుధా బాలు భర్త ఏలూరి బాలు, తొండంగి వైఎస్సార్సీపీ నేత గంగబాబు, తుని ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతా శ్రీనుతో పాటుగా మరో ముగ్గురు కౌన్సిలర్ల భర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. అనంతరం, తుని టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 👉దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు. దీనిపై కచ్చితంగా కోర్టుకు వెళ్తాం. వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తునిలో 30 స్థానాల్లో 30 కౌన్సిలర్లను వైఎస్సార్సీపీ గెలిచింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. టీడీపీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేడు. తొమ్మిది మందిని మభ్యపెట్టి లాక్కున్నారు. చైర్పర్సన్ ఇంటి చుట్టూ వేలాది మంది మోహరించారు. కోర్టులు, వ్యవస్థలు అంటే టీడీపీకి లెక్కలేదు అంటూ మండిపడ్డారు. కాకినాడ..👉తుని మున్సిపల్ ఎన్నిక సందర్భంగా సెక్షన్ 163(2) అమలు చేసిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఈ నేపథ్యంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమ్మికూడరాదని ఆదేశాలు జారీ. కానీ, టీడీపీ గుండాలకు వర్తించని సెక్షన్ 163(2).👉మున్సిపల్ చైర్మన్ సుధా బాలు ఇంటి వద్ద వందలాదిగా గుమిగూడిన పచ్చ మూకలు. మున్సిపల్ కౌన్సిలర్లు బయటకు రాకుండా అడ్డుకుంటున్న టీడీపీ గుండాలు. సుధా బాలు నివాసం వద్దకు వెళ్ళిన జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా. ఈ క్రమంలో రాజాను కూడా అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు. రంగంలోకి దిగిన పోలీసులు.. టీడీపీ వారికే వత్తాసు. వైఎస్సార్సీపీ నేతలను అక్కడి నుంచి పంపిచేస్తున్న పోలీసులు. కాకినాడ..👉తునిలో మరోసారి టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మున్సిపల్ చైర్మన్ సుధాబాబు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పచ్చమూకలు అడ్డుకున్నాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు.. వారిని అడ్డుకోలేదు. టీడీపీ నేతలకు పోలీసుల సహకారం అందిస్తూ.. తొండగి మండలం వైఎస్సార్సీపీ నేత గంగబాబుతో పాటుగా పలువరి నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారు. కూటమి అరాచకం..👉ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో పలుచోట్ల జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పచ్చ నేతలు యధేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. బలం లేకపోయినా అధికార మదంతో పోటీకి దిగుతున్నారు టీడీపీ నేతలు. కాగా, నేడు తుని, పాలకొండ, పిడుగురాళ్లలో డిప్యూటీ చైర్మన్, చైర్మన్ల ఎన్నికల జరగనుంది. ఇప్పటికే ఇక్కడ రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ స్థానాల్లో టీడీపీకి బలం లేకపోయినా పచ్చ నేతలు అధికార మదంతో పోటీలో నిలబడ్డారు. కూటమి నేతలు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నా పోలీసులు మాత్రం తమకు ఏదీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.👉ఇక, పిడుగురాళ్లలో కూటమి ప్రభుత్వానికి కోరం లేకున్నా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలతో, దౌర్జన్యాలతో లోబరుచుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి మద్దతిచ్చేది లేదని 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మున్నీరా సైదావలి తేల్చి చెప్పడంతో ఆదివారం టీడీపీ నేతలు బరితెగింపునకు పాల్పడ్డారు. కౌన్సిలర్ ఇంటితో పాటు, ఆయన బంధువుకు చెందిన నిర్మాణంలో ఉన్న ఇంటిని మున్సిపల్ అధికారులను అడ్డుపెట్టుకుని పొక్లెయిన్తో కూల్చివేయించారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు, శానిటేషన్ సిబ్బందితో పాటు టీడీపీకి చెందిన రాయపాటి సాంబశివరావు, షేక్ ఇంతియాజ్ తదితరులు, ఆ పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని దగ్గరుండి మరీ రెండు ఇళ్లను కూల్చివేయించారు.ఇప్పటికే రెండు సార్లు అరాచకాలు 👉పిడుగురాళ్ల మున్సిపాల్టీలో 33 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 33 వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. చైర్పర్సన్గా కొత్త వెంకటసుబ్బారావు, వైస్ చైర్మన్లుగా కొమ్ము ముక్కంటి, షేక్ నసీమా జైలాబ్దిన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ముక్కంటి మృతితో ఈ నెల 3న వైఎస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ జీవో ఇచ్చింది. అయితే, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకుండా పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు అడ్డుపడటంతో ఎన్నిక 4వ తేదీకి వాయిదా పడింది. 4వ తేదీ కూడా టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్ల వద్ద ఉండి ఇళ్లల్లోంచి వారిని బయటకు రానివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో మళ్లీ సోమవారానికి వాయిదా పడింది. -
మున్సిపల్ ఎన్నికలలో కూటమి అరాచకాలు
-
పోలీసుల తీరుపై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి అడ్డదారిలో గెలుపు
-
కూటమి కాలకేయుల సాక్షిగా.. ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి, సాక్షి, అమరావతి, నెట్వర్క్: ఆదిమ తెగల్లోనూ కానరాని అకృత్యాలు టీడీపీ కూటమి సర్కారు పాలనలో ఆవిష్కృతమయ్యాయి! పట్టపగలు.. తిరుపతి నడి రోడ్డుపై పోలీసులు, జనం సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. తాలిబన్లు.. ఐసిస్.. హమాస్ ఉగ్రమూకలను తలదన్నే రీతిలో మునిసిపల్ ఉప ఎన్నికల్లో పచ్చ ముఠాలు దాడులకు తెగబడి విధ్వంసం, భయోత్పాతం సృష్టించాయి! పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. అసలు ఒక్క సీటు కూడా గెలవని చోట్ల.. తమకు ఏమాత్రం సంఖ్యా బలం లేని చోట్ల భయపెట్టి నెగ్గేందుకు కూటమి పార్టీలు కుతంత్రాలకు దిగాయి. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి బరి తెగించాయి. బల ప్రయోగం, అక్రమాలు, అరాచకాలు, ప్రలోభాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం తెచ్చేలా వ్యవహరించాయి. మునిసిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ గుర్తులతో జరిగాయి. అలాంటిది.. ఒక పార్టీ గుర్తుపై నెగ్గిన వారిని భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి ఇంత దారుణంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంటే.. అసలు ఇక ఎన్నికలు ఎందుకు? పార్టీ గుర్తులు ఎందుకు? అని ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరికత, ఆధునిక పోకడలు ఏమాత్రం ఎరుగని ఆటవిక జాతులు.. ప్రజాస్వామ్యం అంటే పరిచయం లేని దేశాల్లో మాత్రమే కనిపించే ఘటనలు ఏడుకొండలవాడి సాక్షిగా చోటు చేసుకోవడం నివ్వెరపరుస్తోందని పేర్కొంటున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో నెగ్గేందుకు కూటమి పార్టీల గూండాలు అరాచకం సృష్టించారు. ఉప ఎన్నికలో పాల్గొనేందుకు వాహనంలో వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సు ఆపి రాడ్లతో అద్దాలు పగలగొట్టి లోపలకు చొరబడి దాడులకు తెగబడ్డారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లపై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. మహిళా కార్పొరేటర్ల ఆర్తనాదాలు ఖాకీల చెవికెక్కలేదు. కార్పొరేటర్లను బలవంతంగా లాక్కెళుతున్న కూటమి గూండాల వాహనాలకు పోలీసులు దగ్గరుండి దారిచ్చి సాగనంపడం నివ్వెరపరుస్తోంది. పోలీసుల సాక్షిగా కూటమి గూండాలు చిత్తూరు, తిరుపతిలో సృష్టించిన అరాచకం ఇదీ!! రాష్ట్రంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే వాతావరణం లేదని అధికార మదంతో టీడీపీ నేతలు సవాల్ విసరడంపై ప్రజాస్వామ్యవాదుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు నగర కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులతో ఐదు చోట్ల ఎన్నికలు వాయిదా పడటం గమనార్హం.వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సును అడ్డుకుంటున్న టీడీపీ నాయకుడు అన్నా రామచంద్రయ్య, గూండాలు అర్ధరాత్రి నుంచి అరాచకం..మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు. గత ఐదు రోజులుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేయడంతోపాటు రాత్రిపూట పోలీసులను వారి ఇళ్లకు పంపి కేసులు బనాయిస్తామంటూ బెదిరించారు. ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాలులో సోమవారం డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే కుయుక్తులతో కూటమి నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమయ్యారు. వారంతా చిత్తూరులో ఉన్నారని తెలుసుకుని ఆదివారం అర్ధరాత్రి రిసార్ట్స్లో చొరబడ్డారు. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, పులిగోరు మురళి, జేబీ శ్రీనివాసులు, అనుచరులు గదుల తలుపులు బాదుతూ వీరంగం సృష్టించారు. గదుల్లో ఉన్న మహిళలు, చిన్నారులు ఆందోళనతో భూమన అభినయరెడ్డికి సమాచారం ఇవ్వడంతో పార్టీ శ్రేణులతో కలసి అక్కడకు చేరుకున్నారు. టీడీపీ మూకలు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కార్పొరేటర్లంతా సోమవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో తిరుపతిలోని భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. బస్సుని అడ్డుకుని.. అద్దాలు ధ్వంసం చేసిడిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కోసం సోమవారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లంతా భూమన నివాసం నుంచి ప్రత్యేక బస్సులో ఎస్వీ యూనివర్సిటీలోని సెనెట్ హాలు వద్దకు బయలు దేరారు. దాదాపు 25 మంది కార్పొరేటర్లు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం అందులో ఉండగా వర్సిటీ సమీపంలో వారి బస్సును కూటమి గూండాలు అడ్డుకున్నారు. సుమారు 500 మంది ఒకేసారి బస్సుపైకి దూసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే రాడ్లతో అద్దాలను పగులగొట్టారు. లోపలకు చొరబడి బస్సు తలుపు తెరిచారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లు అమరనాథరెడ్డి, అనీష్రాయల్, మోహన్కృష్ణ యాదవ్, బోగం అనిల్, వెంకటేష్పై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో కార్పొరేటర్లను బలవంతంగా ఎక్కించారు. బస్సులో ముందు వైపు కూర్చున్న మహిళా కార్పొరేటర్లను నెట్టుకుంటూ లోపలకు చొరబడడంతో భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. కార్పొరేటర్లను కాపాడకపోగా మిగిలిన వారిపై దౌర్జన్యానికి దిగారు.ఎంపీ, సాక్షి ప్రతినిధులపై దాడికార్పొరేటర్లతో పాటు బస్సులో ఉన్న ఎంపీ గురుమూర్తిపై కూడా కూటమి గూండాలు దాడికి యత్నించారు. ఈ అరాచకాలను చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధి, ఫోటోగ్రాఫర్పై దాడి చేశారు. ఎమ్మెల్యే కుమారుడు మదన్, సునీల్ చక్రవర్తి ఫోటోగ్రాఫర్ చేతిలోని రూ.రెండు లక్షలు విలువచేసే కెమెరాను ధ్వంసం చేశారు. సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధిపై కూడా దాడికి తెగబడ్డారు. ఉదయం 10.15 గంటల నుంచి 10.45 వరకు యధేచ్ఛగా సాగిన విధ్వంసంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కోరం లేదని డూప్లికేట్ కార్పొరేటర్లతో..నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తే గెలుపు తమదేనని ధీమాతో ఉన్న కూటమి నేతలకు వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. కిడ్నాప్నకు గురైన కార్పొరేటర్లను ప్రవేశపెట్టే వరకు తాము ఉప ఎన్నికలో పాల్గొనబోమని మిగతావారు వర్సిటీ సెనెట్ హాలు బయటే ఆగిపోయారు. ఉప ఎన్నిక జరగాలంటే కోరం ఉండాలి. అంటే.. 50 మంది కార్పొరేటర్లలో సగం మందైనా ఉంటేగానీ ఉప ఎన్నిక ప్రారంభం కాదు. దీంతో కూటమి నేతలు మరో ఎత్తుగడ వేశారు. నలుగురు జనసేన మహిళలకు మాస్క్లు అమర్చి సెనెట్ హాలు లోపలకు పంపేందుకు యత్నించారు. ఈ కుట్రలను పసిగట్టిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం హాలు వద్దకు చేరుకోవడంతో ఆ యత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఉప ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి శుభం బన్సల్ ప్రకటించారు. నలుగురితో బలవంతంగా వీడియో...డిప్యూటీ మేయర్ పదవిని కైవశం చేసుకునేందుకు టీడీపీ మూకలు కిడ్నాప్ చేసిన నలుగురు కార్పొరేటర్ల చేత బలవంతంగా మాట్లాడించి ఓ వీడియోను విడుదల చేశారు. గొడవల కారణంగా తాము సురక్షిత ప్రాంతానికి చేరుకున్నామంటూ ఒకే డైలాగ్ నలుగురితో చెప్పించి వీడియో తీశారు. అది ఒకే ప్రాంతంలో చేసినట్లు తెలుస్తోంది. పక్కన ఎవరో బలవంతంగా చెప్పిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నలుగురి వీడియోలను టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్వర్మ తన ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం గమనార్హం. కాగా భూమన అభినయ్పై అక్రమ కేసు బనాయించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.అడ్డదారిలో స్టాండింగ్ కమిటీ కైవశంగుంటూరు స్టాండింగ్ కమిటీని టీడీపీ అడ్డదారిలో కైవశం చేసుకుంది. 56 మంది సభ్యులకుగానూ కేవలం 11 మంది బలం మాత్రమే ఉన్న కూటమి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి తమవైపు తిప్పుకుంది. స్వయంగా ఎమ్మెల్యేలను కార్పొరేటర్ల ఇళ్లకు పంపి పచ్చ కండువా కప్పారు. సోమవారం స్టాండింగ్ కమిటీ ఎన్నిక సందర్భంగా బ్యాలెట్ పేపర్పై సీరియల్ నంబర్లు వేసి బెదిరింపులకు దిగి గెలుపొందారు. కాగా కార్యాలయం బయట కూటమి సభ్యులు డబ్బులు పంచుకుంటూ మీడియాకు చిక్కారు.సగం చోట్ల వాయిదా...పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు తిరుపతి నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. నోటిఫి కేషన్ జారీ చేసిన సగం చోట్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడడం గతంలో ఎప్పుడూ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాయిదా పడిన ఐదు చోట్ల మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ⇒ టీడీపీ కూటమికి బలం లేకపోయినా నూజివీడు మున్సిపాల్టీలో వైస్ చైర్మన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్లు, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులను అధికారం అండతో చేజిక్కించుకుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైర్మన్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైస్ చైర్మన్, కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ పదవిలో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమైంది. ⇒ కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా తొమ్మిది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరించి లొంగదీసుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇందుకోసం మంత్రి కొలుసు పార్ధసారథి ఆదివారం రాత్రి కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. ⇒ హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 కౌన్సిలర్లకు వైఎస్సార్సీపీ 29, టీడీపీ 6 గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ 13 మందిని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లను కూడా ఉపయోగించుకుని ౖచైర్మన్ పదవిని మోసపూరితంగా తమ పరం చేసుకున్నారు.⇒ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 కార్పొరేటర్లకు 54 సీట్లను వైఎస్సార్సీపీ గెలిచినా.. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని అధికార దుర్వినియోగంతో టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బెదిరింపులు, ప్రలోభాలతో వారిని తమ వైపు తిప్పుకుని ఆ పదవిని అక్రమంగా కైవశం చేసుకున్నారు. ⇒ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్ పదవులను బెదిరింపులకు గురి చేసి టీడీపీ మద్దతుదారులకు కట్టబెట్టారు. 20 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉండగా 12 మందిని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు. ఫిరాయిపుదారుడిని వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి పదవి దక్కేలా చేశారు. ⇒ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో బలం లేకపోయినా రెండు డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ అక్రమంగా చేజిక్కించుకుంది. కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లున్న టీడీపీ రెండు డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడాన్ని బట్టి ఆ పార్టీ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ⇒ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఒక్క కౌన్సిలర్ కూడా లేని టీడీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విఫలయత్నం చేసింది. అక్కడున్న మొత్తం 33 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వారంతా మున్సిపల్ కార్యాలయానికి వెళుతుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గడువు లోపు వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఎన్నికను వాయిదా చేశారు. ⇒ కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అడ్డగోలుగా తమ పరం చేసుకునేందుకు టీడీపీ యత్నించింది. అక్కడి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే అయినా వారి తరఫు అభ్యర్థిని నామినేషన్ వేయకుండా పోలీసుల సాయంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా కమిషనర్ ఎన్నికను వాయిదా వేశారు.డిప్యూటీ మేయర్ ఎన్నిక నిష్పాక్షికంగా జరిగేలా చూడండి సాక్షి, అమరావతి: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో జిల్లా ఎస్పీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక నిష్పాక్షికంగా, ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నిక జరిగే ఎస్వీ యూనివర్సిటీ, సెనెట్ హాల్ బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్పై హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ, పాలకొండపై కాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని భర్తీ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నాదెండ్ల హారిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఖాళీగా ఉన్న 19 వార్డుకు ముందు ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎం.స్వర్ణకుమారి దాఖలు చేసిన వ్యాజ్యంపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
తిరుపతిలో కూటమి గూండాగిరి
-
హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ కుట్ర రాజకీయాలు
-
అప్డేట్స్.. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అరాచకాలు
Election Update.. ఏపీలో నేడు 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై ప్రత్యక్షంగా దాడులు చేస్తూ భయభంత్రులకు గురిచేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్తే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, ఉద్రిక్తర పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు..బుచ్చి మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కామెంట్స్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ డౌర్జన్యాలకు పాల్పడింది. బుచ్చికి నగర పంచాయతీ హోదా ఇచ్చింది వైఎస్ జగన్ వైఎస్జగన్ బొమ్మను చూసే మాకు, కౌన్సిలర్లకు ఓట్లు వేశారు పార్టీ మారిన కౌన్సిలర్లకు మేము ఎక్కడా తక్కువ చెయ్యలేదు.. కానీ వారు మోసం చేసి వెళ్లిపోయారు.. ప్రలోభాలకు లొంగకుండా ఆరుగురు కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ పక్కన నిలబడ్డారూ.. వారికి మంచి భవిష్యత్తు కల్పిస్తాం..టీడీపీకి ఓట్లు వేసిన వారు వెన్నుపోటుదారులయ్యారు: మాజీ మంత్రి కాకాణి టీడీపీ తరపున ఓట్లు వేసిన వారందరూ వెన్నుపోటుదారులులాగా మిగిలిపోయారు ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారికే టీడీపీ వైస్ చైర్మన్ పదవి ఇచ్చింది. మంత్రి నారాయణకి ఫిరాయింపు చట్టాల మీద అవగాహన లేదు.. విప్ దిక్కరించిన వారందరూ అనర్హులవుతారు వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన అరుగుర్ని వైఎస్ జగన్ వద్దకు తీసుకెళ్తాం.. వారికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం ఎవరికో పుట్టిన బిడ్డను తెచ్చుకుని.. తమ బిడ్డగా టీడీపీ చెప్పుకోవడం సిగ్గుచేటు ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో.. కార్యకర్తలకు అండగా ఉంటాం మేము రోడ్డెక్కి ప్రతిదాడులు చేస్తే.. జిల్లా అగ్నిగుండం అవుతుంది.. మా కార్యకర్తల జోలికి రావొద్దు.. క్యాష్, పేమెంట్స్ కోసం కార్పొరేటర్స్ టీడీపీ వైపు వెళ్లారు.తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలుతమ పార్టీ కార్పొరేటర్లు ను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని, ఇవాళ కూడా ఎన్నిక సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు హైకోర్టులో పిటిషన్కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని పిటిషన్విచారణ జరిపిన హైకోర్టురక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని పిటిషనర్కు కోర్టు ఆదేశంకార్పొరేటర్లు బయల్దేరి వెళ్లే దగ్గర నుంచి సెనేట్ హాల్కు చేరుకునే వరకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలుతాడేపల్లి:అసలు చంద్రబాబు మనిషేనా: మాజీ మంత్రి జోగి రమేష్ అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసి పదవులు గెలుపొందారురాష్ట్రంలో ఏ కార్పోరేషన్, మున్సిపాలిటీల్లోనూ టీడీపీకి బలం లేదుకానీ మావారిని కిడ్నాప్ చేసి గెలుపొందటం సిగ్గుచేటుమా కార్పోరేటర్లు వెళ్లే బస్సు మీద దాడి చేయడం దారుణంతిరుపతి ప్రతిష్టను దిగజార్చారుఅధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదు2019లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోదీని తిట్టారుఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్లి మోదీని మెచ్చుకుంటూ, కేజ్రివాల్ని తిట్టారుఅసలు చంద్రబాబు ఒక మనిషేనా? ఆయనకు సిగ్గుందా?సిద్దాంతాలు, విలువలు లేని ఏకైక మనిషి చంద్రబాబుఐటీ రైడ్స్ నుంచి రక్షించుకోవటానికే చంద్రబాబు ఢిల్లీ ప్రచారానికి వెళ్లారుఇది కూటమి ప్రభుత్వం కాదు, కుట్రల ప్రభుత్వంవైసీపి కార్పొరేటర్లను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి గెలవాలని చూస్తున్నారుపవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారుఈ దాడులు, దౌర్జన్యాలపై ఈసీ స్పందించాలిఅధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ఈసీ అడ్డుకోవాలిఎన్టీఆర్ జిల్లా:కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందిఎమ్మెల్సీ,మొండితోక అరుణ్ కుమార్రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ ఎన్నికలే అందుకు నిదర్శనంఎలాగైనా గెలవాలని వైసీపీ కౌన్సిలర్లను అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేశారుటీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారుసైకిల్ గుర్తు పై గెలిచిన వారు కేవలం ఆరుగురేఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారు 13 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకుని గెలవాలని చూశారువైఎస్సార్సీపీ కౌన్సిలర్లను చేర్చుకుని కూడా ఎన్నికలను నిర్వహించుకోలేకపోయారునందిగామ ఎమ్మెల్యే ఓ డమ్మీ ఎమ్మెల్యేఎంపీకి , ఎమ్మెల్యేకి పొసగడం లేదని మీ అనుకూల మీడియాల్లోనే చెబుతున్నారుపార్టీ విప్ ను టీడీపీ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారని వార్తలొస్తున్నాయిమీరు డమ్మీ ఎమ్మెల్యే అని మేం చెప్పడం లేదు...మీ పార్టీవాళ్లే చెబుతున్నారు13 మంది సభ్యుల బలం ఉందని చెప్పుకుంటున్న మీరు ఎందుకు ఎన్నిక జరుపుకోలేకపోయారువైఎస్సార్సీపీ కౌన్సిలర్ మంద మరియమ్మ ఇంటిని ప్రొక్లెయినర్లతో కూల్చేశారుటీడీపీకి ఓటేయకపోతే నీ ఇంటిని కూల్చేసినట్లు నిన్ను కూడా కూల్చేస్తామని మరియమ్మను హెచ్చరించారుబెదిరించి,భయపెట్టి మంద మరియమ్మను టీడీపీలో చేర్చుకున్నారుతమకు లొంగకపోతే బెదిరిస్తున్నారు...భయపెడుతున్నారు...ఆస్తులను ధ్వంసం చేస్తున్నారుకూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నందిగామలో అరాచకాలు పెరిగిపోయాయిప్రభుత్వం రాగానే జగనన్న వాక్ను ధ్వంసం చేశారుమేం చేపట్టిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారుగత ఐదేళ్లలో నందిగామలో రాజకీయంగా ఒక్క 307 కేసు కూడా పెట్టలేదుకానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 307 కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధిస్తున్నారునందిగామ మున్సిపల్ ఛైర్మన్,మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక పై మేం కోర్టుకు వెళ్లాంఛైర్మన్,వైస్ ఛైర్మన్ పదవుల్లో ఉన్నవారు చనిపోతే ఆ వార్డులలో ఎన్నికల కోసం మేం కోర్టుకు వెళ్లాంనందిగామలో టీడీపీ అంతర్గత ప్రజాస్వామ్యం నడిపిస్తున్నారుకౌన్సిలర్లను ఐదు గంటలుగా బంధించారు.. ఫోన్లు లాక్కున్నారుస్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు సూచిస్తున్నాఇంకా ఎన్నాళ్లు డమ్మీ ఎమ్మెల్యేగా ఉంటారునందిగామ నియోజకవర్గాన్ని అపహాస్యం చేశారుటీడీపీ ప్రలోభాలకు గురిచేసిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లంతా మాతో టచ్ లో ఉన్నారుసరైన సమయంలో సరైన ట్విస్ట్ ఇస్తాం ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు..విజయవాడ..రాష్ట్ర ఎన్నికల కమిషన్కి వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదుతిరుపతి డిప్యూటీ మేయర్, ఇతర ఎన్నికల్లో టీడీపీ, జనసేన అరాచకాలపై ఫిర్యాదుఈసీకి ఫిర్యాదు చేసిన దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మికుట్రలతో టీడీపీ విజయం..ఏలూరు..కుట్రలతో నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ను దక్కించుకున్న టీడీపీబలం లేకపోయినా గెలిచేందుకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసిన మంత్రి పార్ధసారధితీవ్ర ఉత్కంఠ నడుమ ఎన్నికకు హాజరైన 30 మంది కౌన్సిలర్లుఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గైర్హాజరు14 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లలో టీడీపీకి ఓటేసిన ఒక వైఎస్సార్సీపీ కౌన్సిలర్18 ఓట్లు రావడంతో టీడీపికి దక్కిన నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిమున్సిపల్ వైస్ చైర్మన్ గా పగడాల సత్యనారాయణగతంలో వైఎస్సార్సీపీ నుంచి గెలిచి వైస్ చైర్మన్ గా పనిచేసిన పగడాల సత్యనారాయణసత్యనారాయణను టీడీపీలో చేర్చుకుని మళ్లీ అతన్నే వైస్ చైర్మన్గా చేసిన టీడీపీ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా..తిరుపతి జిల్లా..డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా వేసిన ఎన్నికల అధికారులుటీడీపీ అడ్డదారుల్లో గెలిచింది: కాకాణి నెల్లూరు జిల్లా..మాజీ మంత్రి కాకాణి కామెంట్స్..తెలుగుదేశం పార్టీ అడ్డదారుల్లో గెలిచింది.పార్టీ తరఫున అభ్యర్థికి బీఫామ్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఆ పార్టీ ఉంది.వైఎస్సార్సీపీ ధిక్కరించిన అందరిపై వేటు తప్పదువైఎస్సార్సీపీ నైతికంగా విజయం సాధించింది..తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోనూ జిల్లాలోనూ ఇదే చివరి విజయం అవుతుందిన్యాయస్థానాన్ని ఆశ్రయించి.. విప్ ధిక్కరించిన కార్పొరేటర్స్పై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకుంటాం..నిస్సిగ్గుగా ఎన్నికల్లో టీడీపీ ప్రవర్తించింది.టీడీపీ విజయం అనైతికం: తోపుదుర్తిఅనంతపురం జిల్లా..మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్స్..హిందూపురంలో టీడీపీ విజయం అనైతికం38 వార్డులకు గాను 30 వార్డుల్లో వైఎస్సార్సీపీకి బలం ఉందిఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరించి.. ప్రలోభాలకు గురి చూసి వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ను లాక్కున్నారుఎమ్మెల్యే బాలకృష్ణ ఓ డాకూలా అరాచకాలు చేస్తున్నారుచంద్రబాబు, బాలకృష్ణలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు.హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను అడ్డుకుంటాంముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల ద్రోహిహంద్రీనీవా కాలువలను వెడల్పు చేయకుండా లైనింగ్ పనులకు టెండర్లు పిలవడం దుర్మార్గంమంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలి టీడీపీలో వర్గపోరు.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా..టీడీపీలో చిచ్చు రాజేసిన నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికనందిగామ మున్సిపల్ చైర్మన్ కోసం కొట్లాటచైర్మన్ కోసం ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే8వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలతకు ఎంపీ కేశినేని చిన్ని మద్దతుస్వర్ణలతకు బీఫామ్ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానంతనకు తెలియకుండా బీఫామ్ ఇవ్వడంతో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫైర్నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏమిటంటూ నిలదీత14వ వార్డు కౌన్సిలర్ సత్యవతికి ఇవ్వాలని పట్టుపడుతున్న ఎమ్మెల్యే సౌమ్యఅధిష్టానం వద్దకు చేరిన ఎంపీ, ఎమ్మెల్యే పంచాయతీనేను ప్రకటించే అభ్యర్థే ఫైనల్ అంటున్న ఎమ్మెల్యే సౌమ్యఅభ్యర్ధి ఎవరో తేలకపోవడంతో ఎన్నిక వాయిదా పడే అవకాశం పల్నాడు జిల్లాలో ఎన్నిక వాయిదా..పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా10 గంటల లోపు వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన గురజాల ఆర్డీఓ మురళినందిగామలో ఎన్నిక వాయిదాఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదారేపటికి చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదాకోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి టీడీపీ అన్ని విధాలా ఓడిపోయింది.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డినెల్లూరులో చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్..టీడీపీ అన్ని విధాలా ఓడిపోయింది.. పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టుకోలేక చేతులు ఎత్తేసింది.టీడీపీకి సపోర్ట్ చేసిన కార్పొరేటర్లలో ఏ ఒక్కరికీ రాజకీయ భవిష్యత్తు ఉండదు.వైఎస్సార్సీపీకి రాజీనామా చేయకుండా.. టీడీపీలో ఉన్న వారిపై అనర్హత వేటు తప్పదు.గెలిచింది టీడీపీ అభ్యర్థినా.. ఇండిపెండెంట్ అభ్యర్థి అనేది కూడా ఎన్నికల అధికారి చెప్పలేదు.ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. పార్టీ ఫిరాయింపుదారులను ప్రజా క్షేత్రంలో దోషులుగా నిలబెడతాం..తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలి: లేళ్ల అప్పిరెడ్డిఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలిప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించ వద్దుదాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసిందిఅలాంటప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించటం ఎందుకు?ఈ పరిస్థితులపై నిన్ననే మేము ఈసీని కలిసి ఫిర్యాదు చేశాంపోలీసు బలగాలను పెంచాలని కోరాంమా కార్పొరేటర్లను కాపాడాలని కోరినా ఫలితం లేదు144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి ఎలా వస్తారు?వారిని పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారు?ఏపీలో దిక్కుమాలిన పాలన కొనసాగుతోందివైఎస్సార్సీపీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను టీడీపీ తమ వైపు నిస్సిగ్గుగా లాక్కుంటోందిప్రలోభాలకు గురిచేయటం, బెదిరించటం, దాడులకు పాల్పడటం అనే మూడు ప్లాన్లతో వ్యవహరిస్తున్నారుతిరుపతిలో మా కార్పొరేటర్లపై దాడి చేశారుమావాళ్లు ప్రయాణిస్తున్న బస్సును ధ్వంసం చేశారుబీసీ వర్గానికి చెందిన మేయర్ శిరీష మీద దాడికి యత్నించారుఆ బస్సులో మహిళా కార్పొరేటర్లు ఉన్నారుఎస్సీ ఎంపీ గురుమూర్తి మీద దాడికి యత్నించారునిన్న ఈసీని కలిసి కూటమి అరాచకాలపై ఫిర్యాదు చేశాంపోలీసులపై నమ్మకం లేదని చెప్పాంఈరోజు జరిగిన దాడులపై మళ్ళీ ఈసీని కలుస్తాంతిరుపతి ప్రతిష్టను టీడీపీ నేతలు దిగజార్చారుగతంలో లడ్డూ వ్యవహారం, అంతకుముందు అమిత్షా పై దాడి చేశారుప్రపంచవ్యాప్తంగా తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగించారు.హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ..శ్రీసత్యసాయి జిల్లా..హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీపార్టీ ఫిరాయింపులతో హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీ నేతల బరితెగింపువైఎస్సార్సీపీకి చెందిన 16 మందిని లాగేసుకున్న టీడీపీవైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు ప్రలోభాలు పెట్టి.. బెదిరించిన టీడీపీ నేతలు23 మంది సభ్యుల మద్దతుతో మున్సిపల్ చైర్మన్ పదవి సొంతం చేసుకున్న టీడీపీహిందూపురంలో మొత్తం 38 వార్డులు తిరుపతి మేయర్ శిరీష కామెంట్స్..కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు.పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు.మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?.మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా దాడి చేశారు.మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు.మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి.మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్లో పాల్గొనం. నూజివీడులో ఉత్కంఠ..ఏలూరు..నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.32 మంది కౌన్సిలర్లలో టీడీపీ గెలిచింది ఏడుఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్వైఎస్సార్సీపీ బలం 24 , టీడీపీ బలం 8బలం లేకపోయినా వైస్ చైర్మన్ ఎన్నికకు పోటీపడుతున్న టీడీపీవైస్ చైర్మన్ ఎన్నిక కోసం ప్రలోభాలకు తెరతీసిన పచ్చ పార్టీ.ఫార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన మంత్రి కొలుసు పార్థసారథిరాత్రికి రాత్రి ఏడుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి చేర్చుకున్న పచ్చ పార్టీ.వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల చేరికతో 15కు పెరిగిన టీడీపీ బలంఎక్స్ అఫీషియో సభ్యుడిగా మంత్రి పార్థసారథి ఓటుమంత్రి ఓటుతో సమం కానున్న బలాబలాలునూజివీడు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఇరు పార్టీల కౌన్సిలర్లుమహిళలపై దాడి అమానుషం: గడికోటవైఎస్సార్ జిల్లా..లక్కిరెడ్డిపల్లి జెడ్పీటీసీ ఇంటిని పరిశీలించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి.శ్రీకాంత్ రెడ్డి కామెంట్స్..నిన్న రాత్రి జాండ్లపల్లిలో జెడ్పీటీసీ రమాదేవి ఇంటిపై దాడికి దిగిన టీడీపీ మూకలుఇంటిని పూర్తిగా ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు.. కనిపించిన వాహనాల్ని దహనం చేసిన వైనం.ఇంట్లో ఉన్న జెడ్పీటీసీ రమాదేవి, గర్భిణీగా ఉన్న ఆమె కోడలిపై దాడి.జెడ్పీటీసీ భర్త రెడ్డయ్యను హత్య చేసేందుకే పథకం ప్రకారం దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు.ప్రజలకు సేవ చేసే జెడ్పీటీసీ ఇంటిపై దాడికి దిగడం దుర్మార్గంబీసీ వర్గానికి చెందిన ఆమె ఇంటిపై దాడికి దిగడం కూటమి ప్రభుత్వ అరాచకానికి పరాకాష్టసొంత డబ్బులతో గ్రామంలో అభివృద్ధి చేసే వ్యక్తి జెడ్పీటీసీ కుటుంబంకూటమి ప్రభుత్వంలో బీసీలకు ఇచ్చే రక్షణ ఇదేనా చంద్రబాబు?ప్రశాంతంగా తయారు చేసిన నియోజకవర్గాన్ని కక్షల దిశగా తీసుకెళ్తున్నారు.ఇది మంచి పరిణామం కాదు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆలోచించాలిబీసీ నాయకులపై ఈ విధంగా ఇళ్లలో దూరి దాడిచేయడం, కనిపించిన వాహనాలను దగ్ధం చేయడం దారుణంమీకు సిగ్గుందా.. ఇలాంటి దాడులతో మా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరువృద్ధురాలు , గర్భిణీలపై కూడా దాడి చేయడం సిగ్గుమాలిన చర్యఎవరైతే దాడికి పాల్పడ్డారో.. వారిపై వెంటనే చర్యలు తీసుకోండి.ఆ రోజు ఎంపీడీవోపై దాడి జరగకపోయినా ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్ కల్యాణ్ బీసీలపై దాడి జరిగితే ఎక్కడకు వెళ్లాడు?కార్యకర్తలు, నాయకులకు మేమంతా తోడుగా ఉంటాం.జిల్లా అధికారులు చిత్తశుద్ధితో దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలి.కాకినాడ..కాకినాడలో పోలీసులు ఓవరాక్షన్..తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలలో పోలీసుల ఓవరాక్షన్మున్సిపల్ చైర్మన్ సుధా బాలుతో పాటుగా కౌన్సిలర్లను కౌన్సిల్ హల్లోకి అనుమతించని పోలీసులుఉదయం 11 గంటలకు లోనికి అనుమతి ఇస్తామని మున్సిపల్ కార్యాలయం గేట్లు మూసివేసిన పోలీసులుఉదయం 10 గంటలకు కౌన్సిల్ హల్లో ఉండాలని.. లేదంటే లోనికి అనుమతించమని మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లకు ఆదేశాలు.చైర్మన్ ఛాంబర్లో కూర్చుంటామని చెప్పినా లోనికి అనుమతించని పోలీసులు.పోలీసుల తీరుపై కౌన్సిలర్ల ఆగ్రహంనెల్లూరు..కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి.కార్పొరేటర్స్తో కలిసి కార్పొరేషన్కి బయల్దేరిన ఎమ్మెల్సీ, సిటీ ఇంచార్జ్ చంద్రశేఖర్ రెడ్డి.ఇప్పటికే విప్ జారీ చేసిన వైఎస్సార్సీపీ..ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారందరూ వైఎస్సార్సీపీ అభ్యర్డికి ఓటేయ్యాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తివిప్ ధిక్కరిస్తే వేటు తప్పదని హెచ్చరిక.తిరుపతి..మేయర్ డాక్టర్ శిరీష వ్యక్తిగత సహాయకుడు నచికేతన్పై టీడీపీ నేతలు దాడి.టీడీపీ నాయకులు అన్నారాం చంద్రయ్య, కార్యకర్తల హల్చల్ఈ క్రమంలో దాడి ఘటపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్న మేయర్ అట్టందర్తిరుపతి..భూమన నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో ఎస్వీ యూనివర్సిటీకి బయలుదేరిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకోనున్న ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం విజయవాడ..నందిగామ, నూజివీడు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలుబలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలుఅనారోగ్య కారణాలతో మృతి చెందిన నందిగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులుచనిపోయిన వారి వార్డులకు ఎన్నికలు జరపకుండానే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక పెడుతున్న కూటమి ప్రభుత్వంచనిపోయిన కౌన్సిలర్ల వార్డులకు ఎన్నికలు జరపకుండా చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికకు ఎన్నిక పెట్టడంపై అభ్యంతరంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీనేడు తీర్పునివ్వనున్న కోర్టుకోర్టులో ఉన్నప్పటికీ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక పెట్టిన కూటమి ప్రభుత్వంఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభపెట్టి తమ పార్టీలోకి చేర్చుకున్న టీడీపీనూజివీడిలోనూ ప్రలోభాలకు తెర తీసిన టీడీపీ నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికబలం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ దక్కించుకోవడానికి టీడీపీ కుట్రలురాత్రికి రాత్రి వైఎస్సార్సీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లను పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ హిందూపురంలో టీడీపీ కుట్రలు..వైఎస్సార్సీపీ చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామాతో హిందూపురంలో ఎన్నికహిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ కుట్ర రాజకీయాలు.ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు.టీడీపీ బరితెగింపు రాజకీయాలు.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తాడేపల్లి..నేడు డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికఖాళీ అయిన పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీకార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపార్టీ నిర్ణయించిన అభ్యర్థికి ఓటెయ్యాలని ఆదేశంపార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని ఆదేశాలువిప్ ధిక్కరిస్తే అనర్హత వేటు వేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంతిరుపతి..తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సర్వం సిద్దంఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తివైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అందరికీ విప్ జారీ.విప్ ఉల్లంఘిస్తే సభ్యత్వం రద్దు చేస్తామన్న విప్ రాధాకృష్ణ రెడ్డితిరుపతి..తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో కార్పొరేటర్లకు విప్ జారీ చేసిన వైఎస్సార్సీపీడిప్యూటీ మేయర్ ఎన్నికలు ఒకటవ డివిజన్ కార్పొరేటర్ ఆదం రాధాకృష్ణ రెడ్డి విప్గా నియామకంతిరుపతి కార్పొరేషన్ 46 మంది డివిజన్ కార్పొరేటర్లకు వాట్సాప్ ద్వారా విప్ ఆదేశాలువిప్ను ధిక్కరిస్తే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరికతిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ టీమ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్హిందూపురంలో 144 సెక్షన్..శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో 30 యాక్ట్, 144 సెక్షన్ విధింపు. చైర్మన్ ఎన్నిక అనంతరం విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్లు లేదన్న డీఎస్పీ మహేష్తిరుపతి..పద్మావతిపురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుభూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులువైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు కొనసాగుతున్న బెదిరింపులు, పోలీసుల వేధింపులుఆటో నగర్లో కార్పొరేటర్ ఉమా అజయ్కు చెందిన షాపును ధ్వంసం చేసిన మున్సిపల్, రెవెన్యూ అధికారులుకూటమికి మద్దతు ఇవ్వకుంటే మిగిలిన ఆస్తులు విధ్వంసానికి దిగుతామని హెచ్చరికలు తిరుపతి కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్, ఏలూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లకు ఎన్నికలు జరగనుండగా.. నందిగామ మున్సిపాలిటీ, హిందూపురం మున్సిపాలిటీ, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, నూజివీడు మున్సిపాలిటీ, తుని మున్సిపాలిటీ, పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్ పర్సన్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాలకు హాజరై డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు.తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లలో ఒక్కో డిప్యూటీ మేయర్, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులతోపాటు ఏలూరు జిల్లా నూజివీడు, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో ఒక్కో వైస్ చైర్మన్, నెలూర్లు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. -
చంఢీగఢ్ మేయర్ ఎన్నికలు: సుప్రీం కోర్టు సీరియస్
చంఢీగఢ్: చంఢీగఢ్లో మేయర్ ఎన్నికల వివాదంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ కౌన్సిలర్ మనోజ్ సోంకర్ చేతిలో ఓటమి పాలైన ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ ధరోర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. మేయర్ ఎన్నికలకు సంబంధించిన బాలెట్ పేపర్లు, ఒరిజినల్ రికార్డులు, వీడియో ఫుటేజీని పంజాబ్, హర్యానా కోర్టు రిజిస్ట్రార్కు అందజేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి బాలెట్ పేపర్లను తారుమారు చేశారని స్పష్టంగా తెలుస్తోంది? ఈ చర్యతో అతను ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటానికి ప్రయత్నించారా? అని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి తాము అనుమతించమని సుప్రీంకోర్టు పేర్కొంది. చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో చోటుచేసుకున్న అవకతవకలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని పేర్కొంది. ఇక.. ఫిబ్రవరి 7న జరగాల్సిన చంఢీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు తిరిగి ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. చంఢీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్లో మొత్తం 36 ఓట్లు ఉండగా.. బీజేపీ మేయర్ అభ్యర్థికి 16 ఓట్లు, ఆప్ అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. 8 మంది ఆప్-కాంగ్రెస్ సభ్యుల ఓట్లు చెల్లవని ప్రకటించారు. ఈ ఫలితాలపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మోసపూరితంగా ఈ ఎన్నికల్లో గెలిచిందని మండిపడింది. -
‘కేజ్రీవాల్ ఒక అడాల్ఫ్ హిట్లర్’
చంఢీఘర్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను నియంత అడాల్ఫ్ హిట్లర్తో పోల్చాడు. ఇప్పటికే.. హర్యాణలోని చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేస్తాయని ఇటు ఆప్ నేత రాఘవ్ చద్దా.. అటు కాంగ్రెస్ నేత పవన్ కుమార్ బన్సల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై నేడు కొన్ని గంటల ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేజ్రీవాల్ భేటీ కూడా అయ్యారు. వారి భేటీ ముగిసిన అనంతరమే పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ను నియంత అడాల్ఫ్ హిట్లర్తో పోల్చాడు. కేజ్రీవాల్ పాలన హిట్లర్ నియంత పాలన వలే ఉంటుందని మండిపడ్డారు. మొదట ఆప్ పార్టీ కార్యాలయాల్లో డా.బీఆర్ అంబేద్కర్, భగత్సింగ్ల వంటి మహనీయుల ఫొటోలను తొలగించాలని.. వాటి స్థానంలో నియంత అడాల్ఫ్ హిట్లర్ ఫొటోలు పెట్టుకోవాలని దుయ్యబట్టారు. ఆప్ నేతలంగా అడాల్ఫ్ హిట్లర్ వలే ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చంఢీఘర్ మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిలో భాగంగా కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. ఆప్కు మేయర్ పదవి, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి అని కూడా చర్చించుకున్నారు. అయితే ఇప్పటివరకు ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకపోవటం గమనార్హం. ఇక.. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు రావొచ్చని ఇరు పార్టీల కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. చదవండి: Flight Delays: శశి థరూర్కు సింధియా కౌంటర్ -
షాకిచ్చిన ఓటర్లు.. మృతి చెందిన అభ్యర్థికి తిరుగులేని విజయం.. కారణం ఇదే!
లక్నో: ఉత్తరప్రదేశ్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మరణించిన స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకుని అందరికీ షాకిచ్చారు ఆ ప్రాంత ఓటర్లు. ప్రజల పట్ల అభ్యర్థి ప్రవర్తనే ఆమెను ఎన్నుకునేలా ప్రజలను ప్రేరేపించిందని, అందుకే ఆమెను తిరిగులేని విజయాన్ని అందించారని స్థానికులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్లో హసన్పూర్ మున్సిపాలిటీలోని 7వ వార్డు మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆసియా ఏప్రిల్ 16న 7వ వార్డు అభ్యర్థిగా తన నామినేషన్ను దాఖలు చేసింది. అయితే అనారోగ్యం కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఏప్రిల్ 20న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మృతి చెందింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం ఆసియా మృతి చెందినప్పటికీ ఆమెకే పట్టం కట్టారు. ఈ విజయంపై ఆసియా భాగస్వామి ముంతజీబ్ అహ్మద్ మాట్లాడుతూ.. ' ఆమె గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రజలకు సేవ చేయాలనే కోరికతో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రవర్తన వల్లనే ప్రజల మనసు గెలుచుకోగలిగింది. ఆమెపై ప్రజల్లో ఉన్న ప్రేమ వల్లే ఎన్నికల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ‘ఆసియా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. అయితే నామినేషన్ వేసిన కొన్ని రోజులకే ఆమె మృతి చెందింది. ఎన్నికల ఫలితాల్లో ఆమె గెలుపొందింది. దీంతో మళ్లీ ఆ వార్డులో ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని’ హసన్పూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ తెలిపారు. చదవండి: కాబోయే భర్తను అరెస్ట్ చేసిన లేడీ సింగం గుర్తుందా?.. ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూత -
ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హీట్
-
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఆయన బెదిరిస్తున్నారని, తివారీ హెచ్చరికలు చూస్తుంటే కేజ్రీవాల్ హత్యకు కుట్ర జరగుతున్నట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఆయనను ఏమీ చెయ్యలేక హత్య చేయాలనుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్పై ఎవరైనా దాడి చేయవచ్చని తివారీ అన్న మాటలకు అర్థమేంటని సిసోడియా ప్రశ్నించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, పోలీసు కేసు కూడా పెడతామని పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. మరోవైపు మనోజ్ తివారీ ఈ ఆరోపణలను ఖండించారు. ఎన్నికల్లో ఆప్ టికెట్లు అమ్ముకుందని ఆరోపించారు. ఆప్ నేత సందీప్ భరద్వాజ్ ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆయన మరణానికి కారణాలేంటో వెలికి తీయాలన్నారు. చదవండి: గుజరాత్ ఎన్నికలు: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు.. -
విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ నేత కన్నుమూత
Congress Leader Harinarayan Gupta.. కాంగ్రెస్ నేత గుండెపోటు కారణంగా అకాల మరణం పొందాడు. ఎన్నికల్లో ఓటమిని భరించలేక తనువు చాలించారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇటీవల మధ్యప్రదేశ్లోని 413 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లు, 99 నగర పాలిక పరిషత్లు, 298 నగర్ పరిషత్లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కాగా, జూలై 6, 13 తేదీల్లో రెండు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. అయితే, వీటి ఫలితాలు ఆదివారం వెల్లడించారు. ఎన్నికల్లో భాగంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడైన హరినారాయణ్ గుప్తా, మునిసిపల్ కౌన్సిల్ వార్డు నెం.9లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేశాడు. గుప్తాకు పోటీగా స్వతంత్ర అభ్యర్థి అఖిలేష్ గుప్తా బరిలో నిలిచారు. కాగా, ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి అఖిలేష్ గుప్తా 14 ఓట్ల తేడాతో ఆయనపై గెలుపొందారు. ఈ క్రమంలో తన ఓటమి వార్త విన్న హరినారాయణ్ ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం గుండెపోటు కారణంగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. ఆయన మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అములుకున్నారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్లోని తొలిసారిగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. సింగ్రౌలీలో విజయం సాధించింది. ఇక, బుర్హాన్పూర్, సత్నా, ఖాండ్వా, సాగర్లలో అధికార బీజేపీ విజయం సాధించింది. #Congress candidate Harinarayan Gupta, contesting in municipal council polls for #Rewa district in #MadhyaPradesh, died of heart attack after his election loss.https://t.co/DHTh5JMwqh — IndiaToday (@IndiaToday) July 17, 2022 ఇది కూడా చదవండి: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా -
Elections: ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం
గుహవటి: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. అసోంలోని గువాహటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, మిత్రపక్షం ఏజీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం అసోం సీఎం హిమంత్ బిస్వాస్ శర్మ.. ప్రజలకు శిరసువంచి అభివాదం చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, గువాహటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 వార్డులకు ఎన్నికలుగా జరుగగా 58 వార్డులను బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థులు 52 వార్డుల్లో గెలుపొందగా, 7 వార్డులలో పోటీ చేసిన ఏజేపీ 6 వార్డులు దక్కించుకుంది. అసోంలో తొలిసారిగా బరిలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఇక, కాంగ్రెస్ పార్టీకి మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్క వార్డు కూడా గెలుచుకోకపోవడంతో హస్తం నేతలు ఖంగుతిన్నారు. ఇదిలా ఉండగా.. మున్సిపల్ ఎన్నికలు చివరిసారిగా 2013లో జరిగాయి. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక, ఈ విజయంపై అసోం సీఎం హిమంత్ బిస్వాస్ శర్మ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భారీ విజయాన్ని అందించిన ప్రజలకు తన శిరసువంచి అభివాదం చేస్తున్నానని అన్నారు. బీజేపీ విజయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఘన విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. I bow my head to the people of Guwahati for giving @BJP4Assam & its allies a historic win in #GMCElections. With this massive mandate, people have reaffirmed their faith on our development journey under the guidance of Adarniya PM Shri @narendramodi ji.@JPNadda @BJP4India pic.twitter.com/AWZ5mqIhc3 — Himanta Biswa Sarma (@himantabiswa) April 24, 2022 -
ముఖ్యమంత్రి సింప్లిసిటీ.. కాలి నడకన పోలింగ్ బూత్కు..
భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆడంబరాలకు దూరంగా ఉంటారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన సింప్లిసిటీ వార్తల్లో నిలిచింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీఎం నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 9.10 గంటలకు ఓ సాదాసీదా ఓటరుగా కాలినడకన 53వ నంబర్ వార్డులోని ఏరోడ్రామ్ ఉన్నత పాఠశాలకు చేరుకున్న ఆయన 544వ నంబర్ పోలింగ్ బూత్లో బీఎంసీ మేయర్, కార్పొరేటర్లకు ఓటు వేశారు. నవీన్ నివాస్ నుంచి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఈ పోలింగ్ కేంద్రం ఉండడంతో సీఎం సాధారణ రక్షణ దళం సహాయంతో కాలినడకన ఓటు వేసేందుకు వెళ్లడం విశేషం. (చదవండి: 10 నిమిషాల్లో డెలివరీ ఎలా సాధ్యం?: ‘జొమోటో’కు పోలీసుశాఖ నోటీసులు) -
అస్సాం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం
గువాహటి: అస్సాంలో మున్సిపల్ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ 80 మున్సిపాల్టీలకు గాను ఏకంగా 72 మున్సిపాల్టీలను గెలుచుకుంది. ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కనీసం ఒక్క మున్సిపాల్టీని సైతం దక్కించుకోలేకపోయింది. మరియానీ, హైలాకండీ పురపాలక సంఘాలను స్వతంత్రులు గెలుచుకున్నారు. మరో ఆరు మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అస్సాం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: ఈసీ ఎవరి తొత్తు కాదు.. అన్ని పార్టీలు సమానమే: సీఈసీ సుశీల్ చంద్ర.. నేర చరితులు ఎందరంటే..) -
తృణమూల్ ప్రభంజనం.. 102 మున్సిపాల్టీలు కైవసం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో 10 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రెండోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 108 మున్సిపాల్టీలకు గాను ఏకంగా 102 మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది. ప్రతిపక్షాలను చావుదెబ్బ కొట్టింది. పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. మొత్తం 2,170 వార్డులకు గాను టీఎంసీ 1,870 వార్డులను దక్కించుకుంది. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీ 63.45 శాతం ఓట్లను సాధించింది. నాలుగు మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్న ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి ఈ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. నందిగ్రామ్ ఎమ్మెల్యే, బీజేపీ నేత సువేందు అధికారికి కంచుకోట అయిన కాంతీ మున్సిపాల్టీలో టీఎంసీ విజయం సాధించడం గమనార్హం. కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన హమ్రో పార్టీ డార్జీలింగ్ మున్సిపాల్టీని దక్కించుకుంది. తాహెర్పూర్ పురపాలక సంఘంలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ జెండా ఎగురవేసింది. బీజేపీ కనీసం ఒక్క మున్సిపాల్టీని కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవమే మిగిలింది. వారణాసిలో నేడు, రేపు మమతా ప్రచారం ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సాయంత్రం కోల్కతా నుంచి బయలుదేరి వెళ్లారు. ఆమె రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గురువారం, శుక్రవారం ప్రచారం నిర్వహిస్తారు. -
సీట్లు ఎక్కువ కావాలి.. ఒంటరిగానే పోటీ చేస్తాం
చెన్నై: తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై సోమవారం ప్రకటించారు. తమిళనాడు వ్యాప్తంగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో అన్నామలై మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ కార్యకర్తలు భావిస్తున్నందున ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అభ్యర్థుల తొలి జాబితాను త్వరలో విడుదల చేస్తామన్నారు. (చదవండి: చిక్కుల్లో డీఎంకే ఎమ్మెల్యే) 'ఇదేమి కష్టమైన నిర్ణయం కాదు. అన్నాడీఎంకే నేతలు ఓ పన్నీర్సెల్వం, ఎడప్పాడి కె. పళనిస్వామితో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయాన్ని జాతీయ నాయకులు ఆమోదించారు. ఇలాంటి ఎన్నికల్లో సీట్ల పంపకం చాలా కష్టంతో కూడుకున్న పని. మాకు 10 శాతం సీట్లు కేటాయించేందుకు అన్నాడీఎంకే ముందుకు వచ్చింది కానీ మేం ఎక్కువ శాతం సీట్లు కావాలని అడిగామ’ని అన్నామలై తెలిపారు. బీజేపీ నిర్ణయంపై అన్నాడీఎంకే అధికార ప్రతినిధి డి జయకుమార్ మాట్లాడుతూ.. కమలం పార్టీ అడిగినన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. సీట్ల పంపకం చర్చలు సామరస్యంగా జరిగినా ఫలప్రదం కాలేదన్నారు. 2024 లోక్సభ ఎన్నికలు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగుతుందా, లేదా అనేది ఏఐఏడీఎంకే అధినాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. కాగా.. సేలం, అవడి, తిరుచ్చి, మదురై, శివకాశి, తూత్తుకుడి మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు అన్నాడీఎంకే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. (క్లిక్: డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్పై వేటు) -
న్యూయార్క్లో డ్రీమర్స్కు ఓటు హక్కు
న్యూయార్క్: అమెరికా పౌరసత్వం లేకపోయినప్పటికీ న్యూయార్క్ నగరం డ్రీమర్స్కి ఓటు వేసే హక్కు కల్పించింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి దేశానికి వచ్చి ఇక్కడే పెరిగిన వారిని అక్కున చేర్చుకునే ప్రయత్నంలో భాగంగా నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 8 లక్షలకు పైగా యువత ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డ్రీమర్స్ ఓటు వేయడానికి వీలు కల్పిస్తూ న్యూయార్క్ నగర కౌన్సిల్ నెల రోజుల క్రితమే ఒక బిల్లును ఆమోదించింది. మేయర్ దానిపై ఆమోద ముద్ర వేయడంతో ఆదివారం నుంచి అది చట్టరూపం దాల్చింది. అయితే ఈ చట్టాన్ని కోర్టులో సవాల్ చేయనున్నట్టుగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. దేశ పౌరసత్వం లేని వారికి ఓటు హక్కు కల్పించిన తొలి అతి పెద్ద నగరంగా న్యూయార్క్ రికార్డు సృష్టించింది. పౌరులు కాని వారు ఇప్పటికీ అధ్యక్ష, రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు. -
తిరుగులేని శక్తిగా వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2021 సంవత్సరం అఖండ విజయాలను అందించింది. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో విజయదుందుభి మోగించి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వాగ్దానాల్లో 95 శాతం హామీలను ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదిలోనే ఆయన అమలుచేశారు. ఫలితంగా.. సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు.. అందిస్తున్న సుపరిపాలనతో వైఎస్సార్సీపీపై ప్రజాదరణ నానాటికీ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్సభ స్థానాలను (88 శాతం) దక్కించుకున్న వైఎస్సార్సీపీ.. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడమే అందుకు తార్కాణం. 1983 ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు.. 1989లో కుప్పం నియోజకవర్గానికి వలస వెళ్లారు. దొంగ ఓట్లు.. దౌర్జన్యాలు, ప్రలోభాలతో మూడు దశాబ్దాలకు పైగా చంద్రబాబు కుప్పంను తన గుప్పెట్లో పెట్టుకున్నారు. కానీ.. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ ఆయన ఆటలు సాగలేదు. టీడీపీని వైఎస్సార్సీపీ చావుదెబ్బ తీసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) మాజీ కమిషనర్ నిమ్మగడ్డ ద్వారా ఏడాదిపాటూ స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు అడ్డుకున్నప్పటికీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఆయన్ను చావుదెబ్బ తీశారు. వంద శాతం కార్పొరేషన్లు వైఎస్సార్సీపీకే.. చివరకు ఈ ఏడాది మార్చి, నవంబర్లలో రెండు విడతలుగా 13 కార్పొరేషన్లు (నగర పాలక సంస్థలు), 86 నగర పంచాయతీ, మున్సిపాల్టీలకు ఎన్నికలను ఎస్ఈసీ నిర్వహించింది. ఈ ఎన్నికల్లో వంద శాతం అంటే.. 13 కార్పొరేషన్లను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. 87 నగర పంచాయతీ, మున్సిపాల్టీల్లో 84 నగర పంచాయతీ, మున్సిపాల్టీల (98 శాతం)ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. చంద్రబాబు మూడున్నర దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కేంద్రంలోని కుప్పం మున్సిపాల్టీలో సైతం వైఎస్సార్సీపీ ఆఖండ విజయం సాధించడం గమనార్హం. గ్రామ పంచాయతీల్లోనూ పాగా మొత్తం 13,092 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తే.. 10,536 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. అంటే 80.4 శాతం గ్రామ పంచాయతీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుందన్న మాట. అదే కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలకుగానూ 74 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులే విజయం సాధించి.. టీడీపీ కోటను బద్దలుకొట్టారు. 100% జిల్లా పరిషత్లు వైఎస్సార్సీపీకే.. రాష్ట్రంలో 652 జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలు (జెడ్పీటీసీ), 9,717 మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల (ఎంపీటీసీ)కు ఎన్నికలు జరిగితే.. 642 జెడ్పీటీసీ స్థానాల (98.46 శాతం)ను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుని అఖండ విజయాన్ని సాధించింది. అలాగే, మొత్తం 13 జెడ్పీ చైర్మన్ పదవులనూ ఆ పార్టీ క్లీన్స్వీప్ చేసింది. ఇక 9,717 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. 8,380 స్థానాలు (86.24 శాతం) స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 96 శాతం మండల పరిషత్ అధ్యక్ష పదవులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని మొత్తం నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 68 ఎంపీటీసీ స్థానాలకుగానూ 63 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. ‘మండలి’లో సంపూర్ణ ఆధిక్యం శాసన మండలిలో 58 స్థానాలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ మండలిలో టీడీపీ ఆధిక్యంలో ఉంది. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడం, పలువురు టీడీపీ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఇటీవల ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేసింది. దీంతో మండలిలో వైఎస్సార్సీపీ బలం 18 నుంచి 32కు ఒక్కసారిగా పెరిగి సంపూర్ణ ఆధిక్యత సాధించినట్లయింది. దేశ చరిత్రలో రికార్డు..: గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఒకే పార్టీ అధికారంలో ఉండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో 80 శాతానికి పైగా గ్రామ పంచాయతీలతోపాటు 13 జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు.. ఇలా అన్నింటా వైఎస్సార్సీపీ అధికారంలో ఉంది. సీఎం వైఎస్ జగన్ సర్కార్ తీసుకునే సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతోనే ఇది సాధ్యమైందని వారు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. -
ఫుల్ జోష్ లో ఆప్.... తరువాత టార్గెట్ అదే
-
kuppam: పెద్దాయన యంత్రాంగం.. మిథున్ మంత్రాంగం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో ఎప్పుడు ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. తిరుపతి లోక్సభ ఎన్నిక, బద్వేలు శాసనసభ ఉపఎన్నికల్లో బాధ్యత తీసుకుని ఏకపక్ష విజయాలను అందించిన ట్రాక్ రికార్డు ఆయనది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల బాధ్యతలు తీసుకున్న పెద్దిరెడ్డి వరుసగా ఏకపక్ష విజయాలను అందిస్తూ వచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఏడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీకి జరిగిన తొలి ఎన్నికకు పెద్దాయన తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి కూడా తోడయ్యారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెద్దిరెడ్డి గత కొంతకాలంగా విస్తృతంగా పర్యటించారు. దీంతో పాటు తిరుపతి వేదికగా జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సమావేశ నిర్వహణ చూస్తూనే కుప్పం ఎన్నికల బాధ్యతను పర్యవేక్షించారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు పెద్దిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యక్తిగతంగానూ తూలనాడారు. అయినా సరే సంయమనం పాటించారు. ఆ సందర్భంలోనే బాబు వ్యాఖ్యలపై స్పందించాలని పెద్దిరెడ్డిని మీడియా కోరగా ఇప్పుడేమీ మాట్లాడనని, కుప్పంలో గెలిచిన తరువాతే మాట్లాడుతానని స్పష్టం చేశారు. బాబు విమర్శలకు దీటుగా ప్రచార ఉధృతిని పెంచి ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కుప్పంవాసులకు జరిగిన మేలును వివరించారు. మరోవైపు మిథున్రెడ్డి కుప్పంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భరత్తో కలిసి ప్రచారం నిర్వహించారు. చేతికి గాయమైనప్పటికీ ఆసుపత్రి నుంచి నేరుగా కుప్పం ప్రచారంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కొంతకాలంగా కుప్పంలో ఉంటూ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆత్మస్ఖైర్యం నింపారు. చంద్రబాబు, లోకేష్లు కార్యకర్తలను రెచ్చగొట్టి వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేయించారు. అయితే వైఎస్సార్సీపీ శ్రేణులు డీలా పడకుండా ఎక్కడికక్కడ కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. ఫలితంగా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మొత్తంగా తండ్రి, తనయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డి సారథ్యంలో వైఎస్సార్సీపీ నేతల సమష్టి కృషితో కుప్పంలో అరుదైన విజయం నల్లేరు మీద నడకలా సాగడం విశేషం. బాబు పతనం ఇలా.. ► 1989లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన బాబు 2019 వరకు గెలుస్తూ వస్తున్నారు. ► తొలిసారిగా 6,918 ఓట్ల మెజారిటీ సాధించిన బాబు.. 1994, 1999లో 60 శాతం వరకు మెజారిటీ సాధించారు. ► 2004లో 42 శాతం, 2009లో 46 శాతం మెజారిటీ వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ 28 శాతానికి పడిపోయింది. ► 2019లో జరిగిన ఎన్నికల్లో 30వేల ఓట్ల తేడాతో కేవలం 16 శాతం మెజారిటీ. ► తాజా స్థానికసంస్థల ఎన్నికల్లో శాంతిపురం, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం జెడ్పీటీసీలను, ఎంపీపీలను, 62 ఎంపీటీసీ, 74 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీని చావుదెబ్బ కొట్టింది. -
ఆ వలంటీర్.. ఇక కౌన్సిలర్!
దాచేపల్లి: ఇప్పటికే పలువురు గ్రామ, వార్డు వలంటీర్లు సర్పంచ్లుగా, ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. అదే కోవలో ఇప్పుడు గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో వార్డు వలంటీర్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 12వ వార్డు నుంచి వైఎస్సార్సీపీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసిన దేవళ్ల లక్ష్మీప్రసన్న.. సమీప టీడీపీ అభ్యర్థి గోళ్ల నారాయణపై 38 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు 22 ఏళ్ల కౌన్సిలర్! వల్లూరు(కమలాపురం): వైఎస్సార్ జిల్లా కమలాపురం నగర పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డుకు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్వీ నిఖిల్రెడ్డి విజయం సాధించారు. అతని వయసు 22 ఏళ్లు మాత్రమే. డిగ్రీ చదివిన నిఖిల్రెడ్డి 95 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. -
కుప్పం ఓటమిపై సైలెంట్.. హైదరాబాద్కు చంద్రబాబు
Kuppam Municipal Election Results 2021: మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలిన వేళ చంద్రబాబు ఉండవల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. పోలింగ్కు కొద్దిరోజుల ముందు నుంచి ఉండవల్లిలోనే ఉన్న ఆయన ఫలితాలు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడిపోవడంతో ఆయన కొంత అసహనంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు టీడీపీకి పూర్తి వ్యతిరేకంగా రావడంతో ఆయన వాటిపై స్పందించలేదు. కుప్పం మునిసిపాలిటీలో గెలిస్తే మీడియాతో మాట్లాడాలని భావించినట్లు సమాచారం. కానీ అక్కడ చిత్తుగా ఓడిపోవడంతో స్పందించేందుకు ఇష్టపడలేదు. మౌనంగా ఉండవల్లి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. కొండపల్లి మునిసిపాలిటీ 10వ వార్డులో గెలిచిన స్వతంత్ర అభ్యర్థిని శ్రీలక్ష్మికి గన్నవరం ఎయిర్పోర్టులో చంద్రబాబు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. -
టీడీపీ ఓటమి సంపూర్ణం
సాక్షి, అమరావతి: మలి విడత మున్సిపల్ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. ఇటీవల జరిగిన పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తొలి విడత మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం పాలైన టీడీపీ.. తాజా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘోర ఓటమి చవిచూసింది. దీంతో టీడీపీ ఓటమి సంపూర్ణమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు వేసిన ఎత్తులు, పన్నిన వ్యూహాలు పనిచేయలేదు. అసత్య ప్రచారం, సానుభూతి కోసం ఆడిన డ్రామాలు విఫలమయ్యాయి. తాజాగా ఒక కార్పొరేషన్, 12 మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. దర్శి మున్సిపాల్టీలో మాత్రమే గెలిచింది. మరో రెండు చోట్ల పోటీ ఇవ్వగలిగింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటా ఓడిపోయింది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. అక్కడ 25 వార్డులకు ఆరింటిలోనే టీడీపీ గెలిచింది. చంద్రబాబుకు కంచుకోట అయిన కుప్పం తొలిసారి చేజారిపోవడం టీడీపీ శ్రేణులకు శరాఘాతంగా మారింది. చంద్రబాబే ఓడిపోతే ఇక పార్టీ పరిస్థితి ఏమిటనే చర్చ నాయకుల్లో మొదలైంది. సొంత నియోజకవర్గంలోనే గెలవలేని చంద్రబాబు తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో ఎలా గెలిపించగలరనే అనుమానాలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇష్టానుసారం నోరుపారేసుకున్న చంద్రబాబు.. తాజా ఫలితాల తర్వాత నోరు మెదపకుండా హైదరాబాద్ వెళ్లిపోయారు. నెల్లూరులో టీడీపీకి అవమానం నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లలో ఒక్కటీ టీడీపీకి దక్కలేదు. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, బీద రవిచంద్ర వంటి నేతలున్నా వైఎస్సార్సీపీకి పోటీ ఇవ్వలేక చేతులెత్తేశారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాల, దాచేపల్లిలో ప్రభావం చూపలేకపోయారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ప్రాతినిథ్యం వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నియోజకవర్గంలోని ఆకివీడు మున్సిపాలిటీలో జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగినా వైఎస్సార్సీపీకి పోటీ ఇవ్వలేకపోయింది. అక్కడ 20 వార్డులకు 4 వార్డుల్లో మాత్రమే అతి కష్టంమీద గెలవగలిగారు. వైఎస్సార్ కడప జిల్లాలోని రాజంపేట, కమలాపురం మున్సిపాల్టీల్లో టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కమలాపురంలో 20 వార్డులకు 5, రాజంపేటలో 20 వార్డులకు 4 వార్డుల్లోనే గెలిచింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 20 వార్డులకు రెండు వార్డులే టీడీపీకి వచ్చాయి. కర్నూలు జిల్లా బేతంచర్లలో 20 వార్డులకు కేవలం ఆరింటిలో టీడీపీ గెలిచింది. అనంతపురం జిల్లా పెనుకొండలోనూ టీడీపీ భంగపడింది. మాజీ మంత్రి పరిటాల సునీత సొంత ప్రాంతమైన ఇక్కడ 20 వార్డులకు రెండే రెండు వార్డులు వచ్చాయి. దక్కింది దర్శి ఒక్కటే ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాల్టీ ఒక్కటే టీడీపీకి దక్కింది. అక్కడ 20 వార్డులకు 13 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపాల్టీలో పోటీ ఇవ్వగలిగింది. అక్కడ 29 వార్డులకు 14 టీడీపీ, 14 వైఎస్సార్సీపీ గెల్చుకున్నాయి. ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్సీపీకి టీడీపీ పోటీ ఇచ్చినా గెలవలేకపోయింది. -
నెల్లూరు క్లీన్ స్వీప్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 54 డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. టీడీపీ నామరూపాలు లేకుండా పోయింది. బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐల ఉనికే కనిపించలేదు. ఎన్నికలు ఏవైనా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. వైఎస్సార్సీపీకి తిరుగులేదని మరోమారు రుజువైంది. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ప్రజలు 20 వార్డులకుగాను 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు కౌన్సిలర్లుగా పట్టం కట్టారు. సీఎం జగన్ రాజకీయాలకు అతీతంగా అందిస్తున్న పాలన, మంత్రి డాక్టర్ అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కష్టానికి తగ్గ ఫలితంగా మునిసిపల్ ఫలితాలను విశ్లేషకులు వర్ణిస్తున్నారు. రాష్ట్ర నేతలకు చేదు అనుభవం టీడీపీ జాతీయ, రాష్ట్ర నేతలుగా చలామణి అవుతున్న వారందరికి మునిసిపల్ పోరులో చేదు అనుభవం ఎదురైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నివాసం ఉంటున్న 20వ డివిజన్ వైఎస్సార్సీపీకి ఏకగ్రీవంగా దక్కింది. పొలిట్బ్యూరో మాజీ సభ్యుడు, కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సొంత డివిజన్లో టీడీపీ అభ్యర్థి ఘోర పరాజయం పాలయ్యారు. సోమిరెడ్డి స్వగ్రామం అల్లీపురం 2వ డివిజన్ పరిధిలో ఉంది. ఈ డివిజన్లో టీడీపీ అభ్యర్థి మేకల రామ్మూర్తి విజయం కోసం సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆయన తనయుడు ఇంటింటా ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుని తీరాలనే దిశగా అనేక ప్రలోభాలకు గురిచేశారు. అయినప్పటికీ ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నా అక్కడ సోమిరెడ్డి వర్సెస్ కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నట్లుగా ఎన్నికలు సాగాయి. ఇద్దరూ తమ అభ్యర్థులు గెలిపించుకోవాలని పోటాపోటీగా ప్రచారం చేశారు. 889 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి రామ్మోహన్ విజయం సాధించారు. మాజీ మంత్రి నారాయణ నివాసం ఉంటున్న 12వ డివిజన్ (చింతారెడ్డిపాళెం) వైఎస్సార్సీపీకి ఏకగ్రీవంగా దక్కింది. టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ నివాసం ఉంటున్న 18వ డివిజన్లోను, పార్టీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నివాసం ఉన్న 16వ డివిజన్లోను వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. -
కుప్పకూలిన బాబు కోట
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలతో మొదలైన వైఎస్సార్సీపీ జైత్రయాత్ర తాజాగా జరిగిన రెండో దశ నగరపాలక(కార్పొరేషన్), పురపాలక (మున్సిపాల్టీ), నగర పంచాయతీ ఎన్నికల్లోనూ అప్రతిహతంగా కొనసాగింది. నెల్లూరు కార్పొరేషన్తో సహా 12 మున్సిపాల్టీ, నగరపాలక సంస్థలకు తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనను ప్రజలు మరోసారి ఆశీర్వదించారు. సోమవారం పోలింగ్ జరగ్గా బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఎంపీ, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల తరహాలోనే రెండో దశ నగర, పురపాలక ఎన్నికల్లోనూ ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. ఫ్యాన్ ప్రభంజనానికి సైకిల్ నామరూపాలు లేకుండా పోయింది. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకుగానూ(ఒకటి ఏకగీవ్రం) అన్నిచోట్లా వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేసింది. ఇక్కడ టీడీపీకి కనీసం ప్రాతినిధ్యం కూడా దక్కలేదు. ఇక ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాల్టీని వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. 25 వార్డులకు కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికలు జరగ్గా ఏకగ్రీవంతో కలిపి వైఎస్సార్సీపీ అభ్యర్థులు 19 వార్డుల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ కేవలం ఆరు వార్డులకే పరిమితమైంది. పెనుకొండ, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లి, గురజాల, కొండపల్లి, జగ్గయ్యపేట, ఆకివీడు పురపాలక, నగర పంచాయతీలను కూడా వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. దర్శి నగర పంచాయతీలో మాత్రమే టీడీపీ ఉనికి చాటుకోగలిగింది. ఇక్కడ 20 వార్డులు ఉండగా వైఎస్సార్సీపీ 7 వార్డుల్లో, టీడీపీ 13 వార్డుల్లో గెలుపొందాయి. 100 % ఒకే పార్టీకి ఇదే తొలిసారి.. తొలి విడత జరిగిన ఎన్నికల్లో 12 నగర పాలక సంస్థలనూ వైఎస్సార్సీపీ సొంతం చేసుకోగా తాజాగా నెల్లూరుతో కలిపి 13 కార్పొరేషన్లలో విజయబావుటా ఎగురవేసింది. ఇక తాజా ఫలితాలతో అధికార పార్టీకి దక్కిన పురపాలక సంస్థల సంఖ్య 74 నుంచి 84కు పెరిగాయి. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన వంద శాతం నగర పాలక సంస్థలను, 97.67 శాతం పురపాలక, నగర పంచాయతీలను ఒకే పార్టీ కైవశం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సురిపాలనతో 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లను సాధించి 175 శాసనసభ స్థానాలకుగానూ 151 చోట్ల, 25 లోక్సభ స్థానాలకుగానూ 22 చోట్ల వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను అమలు చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి నాంది పలికారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో ఫలాలను అందించడం ద్వారా పరిపాలనలో నూతన అధ్యాయానికి తెరతీశారు. పరిపాలన సంస్కరణలను తెచ్చి గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే పరిపాలనను తీసుకెళ్లారు. రెండున్నరేళ్లలో దాదాపు 15 నెలలు రెండు విడతలుగా కరోనా మహమ్మారి విరుచుకుపడి ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా సంక్షేమ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ కరోనా కట్టడి చర్యలు తీసుకున్నారు. మంత్రివర్గంతో పాటు రాజ్యసభ, శాసనమండలి సభ్యులుగా, గ్రామ పంచాయతీ, నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల ఛైర్మన్లు/ఛైర్పర్సన్లుగా 50 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే అవకాశమిచ్చి సామాజిక న్యాయానికి సిసలైన నిర్వచనం చూపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరుగులేని శక్తిగా.. అవినీతికి అడ్డుకట్ట వేసి పారదర్శకమైన పరిపాలన అందిస్తుండటంపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలో 13,092 గ్రామ పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల్లో 10,536 (80.47 శాతం) పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులనే ప్రజలు గెలిపించారు. పరిషత్ ఎన్నికల్లో 9,583 ఎంపీటీసీ స్థానాలకు 8249 స్థానాల్లో (86 శాతం) విజయం చేకూర్చారు. 638 జడ్పీటీసీ స్థానాలకుగానూ 630 స్థానాల్లో (98 శాతం) అధికార పార్టీ అభ్యర్థులనే ప్రజలు ఆశీర్వదించారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్ణణ, నగర ప్రాంతాల్లోనూ వైఎస్సార్సీపీని తిరుగులేని శక్తిగా ప్రజలు తీర్చిదిద్దారని స్పష్టమవుతోంది. సాగనంపిన కుప్పం.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరువు కాపాడుకునేందుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాల్టీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. వార్డుకో ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ/మాజీ ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా నియమించారు. మాజీ మంత్రులు, . బయట ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను భారీ ఎత్తున తరలించి ప్రచారం చేసినా ప్రజలు ఆయన్ను తిరస్కరించారు. తన కుమారుడు లోకేష్ను కుప్పం పంపి దౌర్జన్యాలకు దిగేలా శ్రేణులను ప్రేరేపించి భయోత్పాతం సృష్టించారు. డబ్బులు వెదజల్లారు. ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారు. చివరకు తనదైన రీతిలో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించారు. ఆయన ఎన్ని చేసినా కుప్పం మున్సిపాల్టీ ప్రజలు ‘ఓటే’ అస్త్రంగా తిరుగులేని తీర్పు చెప్పారు. వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని చేకూర్చి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 261 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపు నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 328 డివిజన్లు, వార్డులకు, 19 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న 25 డివిజన్లు, వార్డులకు కలిపి మొత్తం 353 డివిజన్లు, వార్డు స్థానాల ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికెషన్ విడుదల చేసింది. మొత్తం 1206 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఏకగ్రీవాలతో కలుపుకుని వైఎస్సార్సీపీ 261, టీడీపీ 82, జనసేన 5, స్వతంత్ర అభ్యర్థులు ఐదు చోట్ల గెలుపొందారు. -
ఎన్నికల్లో టీడీపీ ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు: అనిల్ కుమార్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్లోని 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యుర్థులను గెలిపించిన ప్రజలకు మంత్రి అనిల్కుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థులతో టీడీపీ సరిగ్గా నామినేషన్ వేయించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఏజెంట్లను కూడా నిలుపుకోలేని పరిస్థితికి టీడీపీ దిగజారిపోయిందన్నారు. చదవండి: CM YS Jagan: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్ ఎన్నికల్లో టీడీపీ ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. తమను రాజీనామా చేసి రమ్మన అచ్చెన్నాయుడు ఈ ఎన్నికల్లో ఏం చేశారు? అని నిలదీశారు. నిజంగా దమ్ముంటే టీడీపీలో మిగిలిన 19 మంది రాజీనామా చేసి గెలవాలని, ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. 54 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై ప్రజలు బాధ్యత పెట్టారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. -
చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడింది
సాక్షి, అమరావతి: చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అన్నారు. తాజా మునిసిపల్ ఫలితాలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపునకు చిహ్నమని అభిప్రాయపడ్డారు. రాబోయే రెండు దశాబ్దాల పాటు సీఎం వైఎస్ జగనే రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఈ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు గ్రహణం పట్టిందని, రాష్ట్రంలో కార్తీక పౌర్ణమి విరబూస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో సొంత కొడుకు ఓడిపోయాడని, ఇప్పుడు సొంత నియోజకవర్గం కుప్పాన్ని కూడా చంద్రబాబు పోగొట్టుకున్నారన్నారు. ఇకపై చంద్రబాబు హైదరాబాద్లో ప్రవాసాంధ్రుడిలా విశ్రాంతి తీసుకుంటూ.. రామోజీరావును, రాధాకృష్ణను రోజూ కలుసుకుంటూ భవిష్యత్పై చర్చించుకోవచ్చని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే ఓట్లు పడవని, మంచి చేస్తేనే పడతాయని అన్నారు. ‘తనపై 11 కేసులున్నాయని, అందులో సెక్షన్ 307 కూడా పెట్టారని.. ఏం పీక్కుంటారని లోకేశ్ అడుగుతుంటే కుప్పం పీకేసుకుంటామని ప్రజలు ఈ రోజు తీర్పు ఇచ్చారు. ఏదైనా కేసు ఉంటే.. 48 గంటల్లోనే స్టే తీసుకు వస్తానని లోకేశ్ అంటున్నాడు. ఇది న్యాయవ్యవస్థను కించపరచటం కాదా. కంటెప్ట్ యాక్ట్ కింద లోకేశ్ మీద సుమోటోగా విచారణ చేపట్టిæ శిక్షించాలని హైకోర్టుకు నివేదించుకుంటున్నాను’ అన్నారు. తండ్రీకొడుకులిద్దరూ సీటు మారాల్సిందే.. చంద్రబాబుకు తన కొడుకు దేనికీ పనికిరాకుండా పోయాడన్న మనస్తాపం తప్ప ఇంకొకటేమీ మిగల్లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మొన్న మంగళగిరి సీటు పోతే, ఇప్పుడు కుప్పం కూడా పోయిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ సీట్లు మారాల్సిందేనన్నారు. కారుపై నిలబడి కాలర్ ఎగరేస్తూ బూతులు తిడితే సీట్లు రావని.. ప్రజాప్రయోజనాలు కాపాడితేనే ప్రజలు ఓట్లు వేస్తారనే విషయాన్ని గుర్తించాలని లోకేశ్కు హితవు పలికారు. మాపై బాధ్యత పెంచిన విజయం: మంత్రి ముత్తంశెట్టి ప్రజలిచ్చిన తీర్పును తాము వినయంతో, విధేయతతో స్వీకరిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ తీర్పు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపైన, రాష్ట్ర ప్రభుత్వంపైన బాధ్యతను పెంచిందని వ్యాఖ్యానించారు. సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం వరకు ఒకే పార్టీ ఉండటం దేశ చరిత్రలో జరగలేదని, మొదటిసారి ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి ఘనత నమోదైందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో ఈ తీర్పు ఇచ్చారన్నారు. -
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్
-
‘చంద్రబాబులా దౌర్జన్యాలు చేయలేదు’
-
ఎన్నిక ఏదైనా తిరుగులేని వైఎస్సార్సీపీ
-
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. అన్ని ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 స్థానాలను (8 స్థానాలు ఏకగ్రీవం) క్లీన్స్వీప్ చేసి వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీలోనూ వైఎస్సార్సీపీ ఘన విజయాన్ని సాధించింది. 25 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 19 చోట్ల విజయం సాధించారు. మరో 6 చోట్ల టీడీపీ గెలుపొందింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఓటరు దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. (చదవండి: కుప్పంలో కుప్పకూలిన టీడీపీ) దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 17, 2021 -
‘బాబు పనైపోయింది.. పార్టీని ఎన్టీఆర్ ఫ్యామిలీకి అప్పగిస్తే బెటర్’
సాక్షి, అమరావతి: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లామని అందుకు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కడుతున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టే ప్రజల మద్దతు తమకు ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్ద పీట వేశామని, చంద్రబాబులా దౌర్జన్యాలు చేయలేదని విమర్శించారు. చంద్రబాబును ప్రజలెవరూ నమ్మరని, ఆ విషయం తాజా ఎన్నికల ఫలితాలతో మరోసారి స్పష్టమైందని చెప్పారు. బాబు మళ్లీ గెలిచే పరిస్థితి లేదని ఆయన జోస్యం చెప్పారు. అందుకనే తెలుగుదేశం పార్టీనీ చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగిస్తే ఉత్తమమని నారాయణ స్వామి సూచించారు. చదవండి: వైఎస్సార్సీపీ ప్రభంజనం.. నెల్లూరు కార్పొరేషన్లో క్లీన్స్వీప్ -
Kuppam: ప్రజల మద్దతు ఫలితమే కుప్పంలో ఘన విజయం: పెద్దిరెడ్డి
-
టీడీపీని ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించు బాబూ!
సాక్షి, అమరావతి: టీడీపీని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు అప్పగించి, చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటే ప్రజలు సంతోషిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ప్రజలు ఛీత్కరించడంతో టీడీపీ శాశ్వతంగా భూస్థాపితమైందన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనకు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. టీడీపీ చంద్రబాబు సొంత పార్టీ కాదని, ఎన్టీఆర్ స్థాపిస్తే వెన్నుపోటు పొడిచి లాక్కున్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ప్రాణాలు పోవటానికి కారణమైన వ్యక్తి.. ఇప్పుడు పార్టీని కూడా అసమర్థతతో నాశనం చేశాడని విమర్శించారు. ‘ఇప్పటికే చంద్రబాబుకు 72 ఏళ్లు వచ్చాయి. తక్షణమే కుప్పం ఫలితాలతోనైనా చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని, తనయుడు లోకేశ్తో కలిసి హైదరాబాద్కు వెళ్లి ఆరోగ్యం కాపాడుకోవాలని హితవు పలికారు. కుప్పం మునిసిపల్ కౌంటింగ్ను స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రికార్డు చేయాలంటూ హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని, తీరా ఫలితాలను చూసి వైఎస్సార్సీపీ మ్యానిప్యులేట్ చేసిందంటూ చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డారని మండిపడ్డారు. చంద్రబాబు ఇక కుప్పంలో పోటీ చేస్తాడనుకోవడం లేదు వైఎస్సార్ తనయుడు జగన్మోహన్రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చూసిన చంద్రబాబు తన కొడుకు లోకేశ్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని మదనపడుతున్నారని పెద్దిరెడ్డి అన్నారు. కుప్పంలో ఓటమి భయంతోనే పోలింగ్కు ముందు తమను దుర్భాషలాడారన్నారు. ‘లోకేశ్ అయితే పెద్దిరెడ్డి గాడు అని మాట్లాడారు. మా నాన్న చాలా సాఫ్ట్. నేను పెద్ద రౌడీని’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రౌడీలు కాబట్టే కుప్పంలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మునిసిపల్ ఎన్నికల్లో వారిని ప్రజలు పూర్తిస్థాయిలో తిరస్కరించారన్నారు. మరోసారి చంద్రబాబు, లోకేశ్, ఆయన అనుచరులు ఇష్టానుసారం మాట్లాడితే తగిన విధంగా స్పందిస్తానంటూ మంత్రి హెచ్చరించారు. మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. ఈ ఓటమితో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తాడని అనుకోవటం లేదన్నారు. తనను టార్గెట్ చేస్తూ పుంగనూరులో పోటీ చేయాలనుకుంటే ఆహ్వానిస్తామన్నారు. తామెప్పుడూ సీరియస్గా తీసుకోలేదు కాబట్టే చంద్రబాబు కుప్పంలో గెలుస్తున్నారన్నారు. కాలేజీలో చదువుతున్నప్పుడు చంద్రబాబు తనకు సీనియర్ అని, తాము వేర్వేరు గ్రూపులకు నాయకులుగా ఉన్నామని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లోనే తాను యూనివర్సిటీకి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అయ్యానని, అప్పుడు పోటీ ఎందుకు పెట్టలేదో చంద్రబాబునే అడగాలని పెద్దిరెడ్డి చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి, పార్టీ నేతలకు సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, చిత్తూరు జిల్లా పార్టీ నేతలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అభినందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రి పెద్దిరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అభినందనలు తెలిపారు. -
చంద్రబాబు రాజకీయ జీవితానికి పులిస్టాప్ ..?
-
కుప్పంలో చంద్రబాబు బిగ్ షాక్
-
కుప్పంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫోటోలు
-
కుప్పంలో కుప్పకూలిన టీడీపీ
Kuppam Municipal Election Results 2021: కుప్పంలో చంద్రబాబుకు బిగ్షాక్ తగిలింది. ఇప్పటికే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లను కోల్పోయిన టీడీపీ.. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ బొక్కబోర్లా పడింది. మున్సిపాలిటీలోని 25 వార్డుల్లో 19 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. మొదటి రౌండ్లో 15 వార్డులకుగాను 13 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించగా.. టీడీపీ కేవలం రెండు వార్డులకే పరిమితమైంది. తర్వాత వెలువడిన ఫలితాల్లోనూ టీడీపీ అభ్యర్థులు తేరుకోలేకపోయారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమ పాలనకు కుప్పం మున్సిపాలిటీ ప్రజలు పట్టం కట్టారు. ఇక 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందంటూ చెప్పుకునే చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీని కాపాడుకోలేకపోయారు. మొత్తంగా టీడీపీ కేవలం 6 స్థానాలకే పరిమితమై పరాభవాన్ని మూటగట్టుకుంది. ► కుప్పం మున్సిపాలిటీలో మొత్తం స్థానాలు 25 ► 19 వార్డుల్లో వైఎస్సార్సీపీ గెలుపు, 6 వార్డుల్లో టీడీపీ గెలుపు ► 1,2,3, 4, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15,16,17, 21, 23, 25 వార్డుల్లో వైఎస్సార్సీపీ గెలుపు ►5, 11, 18, 19, 20, 22, వార్డుల్లో టీడీపీ విజయం -
నెల్లూరులో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
-
నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్
AP Municipal Elections 2021 Results Live Updates: 04: 57PM ► కృష్ణా: జగ్గయ్యపేట మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 31 వార్డుల్లో.. వైఎస్సార్సీపీ-17, టీడీపీ-14 వార్డుల్లో విజయం సాధించాయి. 04: 20PM ► జగ్గయ్యపేట మున్పిపాలిటీని కైవసం చేసుకునే దిశంగా వైఎస్సార్సీపీ ► రెండో రౌండ్లో 11 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ► ఇప్పటికే 8 వార్డులను గెలుచుకున్న వైఎస్సార్సీపీ ► కాకినాడలో ఉప ఎన్నిక జరిగిన 4 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ► కాకినాడలోని 3, 9, 16, 30వ డివిజన్లలో వైస్సార్సీపీ గెలుపొందింది. 03: 54PM ► రాజంపేట మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 29 వార్డుల్లో వైఎస్సార్సీపీ-24, టీడీపీ-4, ఇండిపెండెంట్-1 వార్డులో విజయం సాధించాయి. ► గురజాల నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్సీపీ 16, టీడీపీ-3, జనసేన-1 వార్డులో విజయం సాధించాయి. ►ఆకివీడు నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్సీపీ-12, టీడీపీ-4, జనసేన-3 వార్డుల్లో విజయం సాధించాయి. 03:32PM కృష్ణా: కొండపల్లిలో ముగిసిన కౌంటింగ్ ► కొండపల్లిలో 29 స్థానాల్లో వైఎస్సార్సీపీ-14 స్థానాల్లో విజయం, టీడీపీ- 14 స్థానాల్లో విజయం, ఇండిపెండెంట్-1 స్థానంలో గెలుపు 03:15PM ► నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ ► నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ ప్లాప్ షో ► బొక్కబోర్లాపడ్డ సైకిల్ ► 54కి గాను 54 డివిజిన్లలో వైఎస్సార్సీపీ గెలుపు ►కార్పొరేషన్ ఎన్నిక జరిగిన 46 డివిజన్లలో 46 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ►ఏకగ్రీవాలతో కలిపి 54 డివిజన్లను కైవసం చేసుకొన్న వైఎస్సార్సీపీ ►క్లీన్ స్వీప్తో మరో చరిత్ర సృష్టించిన వైఎస్సార్సీపీ 02:29PM విశాఖపట్నం: జీవీఎంసీ 31వ వార్డు కార్పొరేటర్గా వైఎస్సార్సీపీ అభ్యర్థి బీపిన్ కుమార్ జైన్ విజయం సాధించారు. జీవిఎంసీలో 61వ డివిజన్లో వైఎస్సార్సీపీ విజయం ► 2028 ఓట్ల మెజార్టీతో కొణతాల సుధ(వైఎస్సార్సీపీ) గెలుపొందారు. కృష్ణాజిల్లా: ► కొండపల్లి మున్సిపాలిటీ 19వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగిరాము గెలుపొందారు. ► 26వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి గుంజా శ్రీనివాసు విజయం సాధించారు. ► కొండపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి మండే చంద్రశేఖర్ బాబు గెలుపొందారు. 01:40PM కుప్పం గెలుపుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభినందించిన సీఎం వైఎస్ జగన్ 01:36PM మొదటి రౌండ్లోనే కుప్పం మున్సిపల్ ఫలితం రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠగా ఎదురుచూసిన కుప్పం మున్సిపల్ ఎన్నిక ఫలితం మొదటి రౌండ్లోనే తేలిపోయింది. మొదటి రౌండ్లో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ 15 వార్డులకు గాను 13 వార్డులను కైవసం చేసుకున్నారు. దీంతో 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీలో మొదటి రౌండ్లోనే వైఎస్సార్సీపీ 13 స్థానాలను గెలుచుకొని మున్సిపాల్టీని తమ ఖాతాలోకి వేసుకున్నారు. టీడీపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. 01:00PM నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికే 20 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించగా, మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. 12:50PM ►నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ►నెల్లూరు కార్పొరేషన్ 27 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం ►ఇప్పటి వరకు 9 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ ►కుప్పం, ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో వైఎస్సార్సీపీ గెలుపు 12:40PM ►నెల్లూరు కార్పొరేషన్ 7 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం ►14,27,28,33,39,41,53 డివిజన్లలో వైఎస్సార్సీపీ గెలుపు ►మరో 32 డివిజన్లలో వైఎస్సార్సీపీ ఆధిక్యం 12:15PM ►కుప్పంలో రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం ►16 వార్డు నుంచి 25 వార్డుల ఓట్ల లెక్కింపు ►హైకోర్టు ఆదేశాలతో కొనసాగుతున్న కుప్పం కౌంటింగ్ ప్రక్రియ 11:55AM వైఎస్సార్ జిల్లా కమలాపురం రౌడీలకు ప్రజలు బుద్ధి చెప్పారు కమలాపురం మున్సిపల్ ఎన్నికల విజయంపై ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పందించారు. 'ఈ ఎన్నికల్లో కమలాపురం రౌడీలకు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగాయి, ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి ఓటు చేశారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు. 15 వార్డుల్లో గెలుపొందాం. ఓడిన 5 వార్డుల్లో కూడా స్వల్ప మెజారిటీతో ఓడిపోయాము. ఛైర్మెన్ అభ్యర్థి ఖరారుపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం' అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. 11:45AM నెల్లూరు జిల్లా ►బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయితీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 20 వార్డుల్లో.. 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించగా.. టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. 11:15AM నెల్లూరు ►కార్పొరేషన్ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదల ►39వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్థి సన్ను నాగమణి 1390 ఓట్లతో విజయం ►టీడీపీ కంచుకోట డివిజన్లలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థుల ముందంజ కుప్పంలో వైఎస్సార్సీపీ హవా ►మొదటి రౌండ్లో 14 వార్డులకుగాను 12 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. 11:05AM ►రాజంపేట మున్సిపల్ వైఎస్సార్సీపీ కైవసం ►రాజంపేటలో 24వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ►దాచేపల్లి, కమలాపురం, ఆకివీడు, గురజాల, పెనుగొండలో నగర పంచాయతీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. దర్శి మున్సిపాలిటీలో టీడీపీ విజయం ► దర్శి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ-7, టీడీపీ- 13 వార్డుల్లో విజయం సాధించింది. ► దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► దాచేపల్లిలో 11 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం, టీడీపీ-7 వార్డులు, ఇండిపెండెంట్-1, బీజేపీ-1 వార్డులో గెలుపొందాయి. 10:50AM ►గురజాల నగరపంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► గురజాల 16 వార్డుల్లో వైఎస్సార్సీపీ కైవసం ► గురజాల 3 వార్డుల్లో టీడీపీ, ఒక వార్డులో జనసేన విజయం ► కమలాపురం నగరపంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ►కమలాపురంలో 15 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం ►మొత్తం 20 వార్డుల్లో.. వైఎస్సార్సీపీ-15, టీడీపీ-5 వార్డుల్లో విజయం సాధించాయి. ► బేతంచర్ల నగరపంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► 14వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం కుప్పంలో వైఎస్సార్సీపీ హవా ►మొదటి రౌండ్లో 14 వార్డులకుగాను 14 వార్డుల్లోనూ వైఎస్సార్సీపీ ఆధిక్యం.. ఇందులో ఇప్పటికే వైఎస్సార్సీపీ ఐదు వార్డుల్లో విజయం సాధించింది. నెల్లూరు జిల్లా ►కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్లో వైఎస్సార్సీపీ హవా ►37 డివిజన్లలో ముందంజ 10:40AM ►ఆకివీడు నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం మొత్తం 20 వార్డుల్లో 12 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ► పెనుకొండ మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం ►మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్సీపీ-18, టీడీపీ-2 వార్డుల్లో విజయం సాధించాయి. 10:30AM బుచ్చి నగరపంచాయితీలో దూసుకు పోతున్న వైఎస్సార్సీపీ ►డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్ ఇప్పటి వరకు విడుదలైన ఫలితాలు. ►ఒకటో వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి కత్తి నాగరాజు 273 ఓట్ల మెజార్టీతో విజయం.. ►మూడో వార్డు లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రత్యూష విజయం.. ►నాలుగో వార్డ్ లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మాచర్ల సుప్రజా విజయం.. ►7వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి షకీలా విజయం.. ►18వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి జయంతి విజయం.. ►9వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి యరటపల్లి శివారెడ్డి విజయం.. ►14 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి చీర్ల ప్రసాద్ ముందంజ.. ►15 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి కంట అనంతమ్మ ముందంజ.. అనంతపురం ►పెనుకొండ నగర పంచాయతీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం ►మొత్తం 20 వార్డులకుగాను 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం 10:25AM కుప్పంలో వైఎస్సార్సీపీ హవా ►మొదటి రౌండ్లో 14 వార్డులకుగాను 10 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం 10:20AM ►పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఫ్యాన్ జోరు ►మొత్తం 20 వార్డులకుగానూ 13 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 10:18AM కర్నూలు జిల్లా ►బేతంచర్ల నగర పంచాయితీ ఎన్నికల్లో 14 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మధుసూదన్ రావు గెలుపు ►బేతంచర్ల నగర పంచాయితీ ఎన్నికల్లో 20 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి జి శకుంతల గెలుపు అనంతపురం జిల్లా ►పెనుకొండ నగర పంచాయతీ లో వైఎస్సార్ సీపీ హవా ►మొత్తం 20 వార్డుల్లో 10 వార్డులు వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఆధిక్యత 10:12AM వైఎస్సార్ జిల్లా.. కమలాపురం 2 వార్డు వైసీపీ అభ్యర్థి షేక్ మోహమ్మద్ సాదిక్ 324 ఓట్లతో భారీ విజయం ►18 వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి కుప్పూరి సుదర్శన్ రెడ్డి 18 ఓట్లతో విజయం ►3 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ నూరి 134 ఓట్లతో విజయం ►కమలాపురం 13 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం ► రాజంపేట 4వ వార్డులో వైసీపీ అభ్యర్థి మర్రి రవి కుమార్ విజయం ►21వ వార్డులో పోలా రమణా రెడ్డి వైఎస్సార్సీపీ విజయం 10:02AM గురజాల ►నగర పంచాయతీలో 2 వార్డు లో 377 మెజార్టీ వైసిపి గెలుపు ►గురజాల 15వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మన్యం కన్యాకుమారి 101 ఓట్లతో గెలుపు 10.02AM: చిత్తూరు జిల్లా: ►కుప్పం 1,2,7 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం 9:50AM గుంటూరు: ►దాచేపల్లి 13వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి వందనపు లక్ష్మి 159 ఓట్లమెజార్టీతో గెలుపు ►దాచేపల్లి 6వ వార్డు టీడీపీ అభ్యర్థి 94 ఓట్లతో గెలుపు ►గురజాల ఒకటో వార్డువైఎస్సార్సీపీ అభ్యర్థి లింగా చారి 456 ఓట్లతో గెలుపు ►అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ లోని 17వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి రామాంజనేయులు విజయం ►18 వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నందిని విజయం 9:45 AM అనంతపురం: ►పెనుకొండ నగర పంచాయతీ లో వైఎస్సార్ సీపీ బోణీ ►14, 18 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల ఆధిక్యత వైఎస్సార్ జిల్లా.. కమలాపురం ►17 వార్డు వైసీపీ అభ్యర్థి కలవ నాగమణి 27 ఓట్ల మెజార్టీతో విజయం వైఎస్సార్ జిల్లా.. కమలాపురం ►9 వార్డు లో వైసీపీ అభ్యర్థి మారుజోళ్ళ శ్రీనివాసులు రెడ్డి 42 ఓట్లతో విజయం.. ►10 వార్డులో వైసీపీ అభ్యర్థి గెంటెమ్ సుగంధి 81 మెజార్టీతో విజయం.. వైఎస్సార్ జిల్లా.. కమలాపురం ►16 వార్డు వైసీపీ అభ్యర్థి కొప్పు షాహీనా బేగం 144 ఓట్లతో విజయం 9.40AM వైఎస్సార్ జిల్లా ►కమలాపురం మునిసిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం 09:22AM చిత్తూరు జిల్లా ►కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో మొదటి రౌండ్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఆధిక్యంలో ఉన్నారు. ►14వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మునిస్వామి ఏకగ్రీవ ఎన్నిక ►నగిరి మున్సిపాలిటీ 17వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి గంగాధరం ఏకగ్రీవం 09:14AM బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో వార్డుల వారీగా పార్టీలకు వచ్చిన పోస్టల్ బ్యాలెట్ వివరాలు మొత్తం పోస్టుల బ్యాలెట్ లు - 114 వైఎస్సార్సీపీ - 66 టీడీపీ - 20 బీజేపీ - 27 సీపీఎం - 1 వైఎస్సార్ జిల్లా ►కమలాపురం 11 వార్డులో 83 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి కొప్పోలి సలీల విజయం ►కమలాపురం 15వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి చవారెడ్డి సంధ్యారాణి 129 ఓట్ల మెజారిటీతో విజయం 08:44AM గుంటూరు జిల్లా ►ప్రారంభమైన గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ►ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన అధికారులు ►ఓట్లను కట్టలు కడుతున్న అధికారులు 08:40AM నెల్లూరు జిల్లా ►ప్రారంభమైన కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ►పోస్టల్ బ్యాలెట్లు లెక్కస్తున్న సిబ్బంది 08:37AM తూర్పుగోదావరి జిల్లా ►కాకినాడ నగరపాలక సంస్థ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం ►3,9,16,30. డివిజన్లకు ఈ నెల 15 న జరిగిన పొలింగ్ ►మొత్తం 15 మంది అభ్యర్ధులు పోటి, 51.46 % పోలింగ్ నమోదు ►రంగరాయ మెడికల్ కళశాలలో కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు ►8 టేబుళ్ళు ఏర్పాటు, మధ్యహన్నం కల్లా వెలువడనున్న ఫలితాలు 08:31AM ప్రకాశం జిల్లా ►దర్శి నగర పంచాయతీకి సంబంధించి ఏపీ మోడల్ స్కూల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. ►19 వార్డులకు కౌంటింగ్ కోసం 38 టేబుల్స్ ఏర్పాటు ►100 మంది సిబ్బందిని ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు 08:21AM కృష్ణా జిల్లా ►తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్ లు ►స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ హాల్ కు బ్యాలెట్ బాక్సులు తరలింపు ►మొదటగా ఓట్లను వేరు చేసి కట్టలు కట్టనున్న కౌంటింగ్ సిబ్బంది ►తొలిఫలితం 11 గంటలకు తెలిసే అవకాశం ►16 టేబుళ్ల పై కౌంటింగ్ ►రెండు రౌండ్లలో ముగియనున్న కౌంటింగ్ ►ఏజెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తున్న పోలీసులు ►కౌంటింగ్కు పకడ్భందీ చర్యలు.. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు 08:17AM కర్నూలు జిల్లా ►ప్రారంభమైన బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికలకు కౌంటింగ్ ►మొత్తం 20 వార్డులకు సంబంధించి కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ ►20 వార్డులకు గాను 20 టేబుళ్ల ఏర్పాటు ►ఒకటే రౌండ్లో ముగియనున్న ఓట్ల లెక్కింపు. ►11 గంటలలోపే వెలువడనున్న ఫలితాలు 08:10AM చిత్తూరు జిల్లా ►కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం ►పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మూడుకు గానూ ఒక్కటి కూడా నమోదు కాలేదు. 08:00AM నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఆయా మునిసిపాలిటీల్లో 325 డివిజన్లు, వార్డులకు సోమవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 325 స్థానాలకు 1,206 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. మొత్తం 23 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇక సోమవారం జరిగిన పోలింగ్లో 8,62,066 మందికిగాను 5,14,086 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉ.8 గంటలకు లెక్కింపు ప్రారంభం ఓట్ల లెక్కింపు బుధవారం ఉ.8 గంటలకు ప్రారంభిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అనంతరం సాధారణ ఓట్లు లెక్కిస్తారు. సా.5 గంటలలోపు అన్ని మున్సిపాలిటీల్లో పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 23 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కించడానికి 450 టేబుళ్లు ఏర్పాటుచేశారు. కౌంటింగ్ సూపర్వైజర్లుగా 534 మందిని, అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్లుగా 3,792 మందిని నియమించారు. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉండగా ఏకగ్రీవమైన 8 డివిజన్లు పోను మిగిలిన 46 డివిజన్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆయా డివిజన్లలో పోలైన ఓట్లు లెక్కించడానికి 142 టేబుళ్లు ఏర్పాటుచేశారు. అదే విధంగా కుప్పంలో 24 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 14 టేబుళ్లు సమకూర్చారు. లెక్కింపు ప్రక్రియ చిత్రీకరణ ఇక అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్ని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లోని పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించినట్లు తెలిపారు. కుప్పం మున్సిపాలిటీలో పోలింగ్ స్టేషన్ల వెలుపల చిన్నచిన్న ఘటనలు మినహా, పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా సాగినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు, ఇతర అధికారుల నుంచి నివేదికలు అందాయన్నారు. అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే పోలింగ్ జరిగిందని.. రీపోల్ నిర్వహించాలన్న వినతులు అందలేదన్నారు. -
టీడీపీ అక్రమాలపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు
సాక్షి, అమరావతి: మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకు, అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి సోమవారం ఫిర్యాదు చేశారు. వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలలో అలజడులు, ఆటంకాలు సృష్టించాలని, శాంతిభద్రతల సమస్య నెలకొనేలా చేయాలని చంద్రబాబు ప్రయత్నించారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ కోరుకుంటోందని తెలిపారు. చంద్రబాబు రాబోయే ఓటమికి సాకులు వెదుకుతున్నారని, దానిలో భాగంగా కుప్పంలో దొంగఓట్లు అంటూ కొత్తపల్లవి అందుకున్నారని విమర్శించారు. ఓడిపోయే సమయంలో ఇలాంటి సాకులు రెడీ చేసిపెట్టుకునే అలవాటు చంద్రబాబుకు ఉందనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు అక్రమాలపై తాము చేసిన ఫిర్యాదుకు తగిన ఆధారాలు కూడా ఎన్నికల కమిషనర్కు అందచేశామని చెప్పారు. కమిషనర్ను కలిసిన వారిలో నవరత్నాల అమలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణమూర్తి కూడా ఉన్నారు. -
పెళ్లి పందిరి నుంచి పోలింగ్ కేంద్రానికి..
కుప్పం: కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కుప్పం 23వ వార్డు మునస్వామిపురానికి చెందిన దిలీప్కు, మంకలదొడ్డికి చెందిన రజినీతో సోమవారం ఉదయం పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో వివాహం జరిగింది. మునిసిపాలిటీలో దిలీప్కు ఓటు ఉండడంతో పెళ్లి పందిరి నుంచి పెళ్లి దుస్తులతో పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. 23వ వార్డు పోలింగ్ జరుగుతున్న ఆర్ పేట పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకుని ఓటుపై తనకు ఉన్న మమకారాన్ని చాటుకున్నాడు. -
ఏపీ మున్సిపల్ ఎన్నికలు; 59.63% పోలింగ్
సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతోపాటు, వివిధ మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డుల్లో పోలింగ్ సోమవారం ముగిసింది. 325 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు నిర్వహించగా 8,62,066 మంది ఓటర్లకు గాను 5,14,086 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 59.63% పోలింగ్ నమోదైంది. అనంతపురం జిల్లా పెనుకొండ మున్సిపాలిటీలో 82.63%, అత్యల్పంగా నెల్లూరు కార్పొరేషన్లో 52.25% పోలింగ్ నమోదైంది. నెల్లూరు కార్పొరేషన్లో 46 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 52.25 శాతం మంది ఓటు వేశారు. కుప్పం మున్సిపాలిటీలో 24 వార్డులకు పోలింగ్ జరిగింది. ఇక్కడ 37,664 మంది ఓటర్లు ఉండగా 28,942 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మందకొడిగా పోలింగ్ ఎన్నికల సరళి మందకొడిగా సాగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తొమ్మిది గంటల వరకూ కేవలం 10.12% పోలింగ్ నమోదైంది. 11 గంటలకు 24.96%, మ.ఒంటి గంటకు 41.02%.. 3 గంటల సమయానికి 50 శాతానికి పోలింగ్ జరిగింది. ఇలా మొత్తంగా 59.63% ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా విజయనగరం కార్పొరేషన్లో 65.04%, అత్యల్పంగా అనంతపురం కార్పొరేషన్లో 37.58% పోలింగ్ నమోదైంది. నగర పంచాయతీలు, పట్టణాలే మిన్న ఓటు హక్కు వినియోగించుకోవడంలో నగరాలతో పోలిస్తే పట్టణాలు, నగర పంచాయతీ ప్రజలే చైతన్యం కనబర్చారు. నెల్లూరు కార్పొరేషన్లోని 46 డివిజన్లతో పాటు, వివిధ కార్పొరేషన్లలోని 10 డివిజన్లు కలిపి 56 డివిజన్లలో కేవలం 49.89% మంది మాత్రమే ఓటు వేశారు. అదే పట్టణాలు, నగర పంచాయతీల్లో 72.19% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
దొంగ ఓట్లు వేసే ఛాన్సే లేదు..
-
వైఎస్సార్ జిల్లాలో కోనసాగుతున్న మున్సిపల్ పోలింగ్
-
పెనుగొండలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్
-
కిక్కిరిసిపోతున్న ఓటర్ క్యూ లైన్..
-
కుప్పంలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
-
కుప్పంలో మరోసారి రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
-
ఐడీ కార్డులు చూపించాలంటూ మాజీ మంత్రి దాదాగిరి
-
నెల్లూరు నగర పోరుకు సర్వం సిద్ధం
-
కుప్పానికి టీడీపీ దొంగ ఓటర్లు
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి టెన్షన్ రోజురోజుకీ ఎక్కువవుతుండడంతో ఆ పార్టీ నేతలు దొంగ ఓటర్లను రంగంలోకి దించుతున్నారు. ఇలాగైనా పరువు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతూ అడ్డదారులు తొక్కుతున్నారు. పోలింగ్కు ఇంకా ఒక్కరోజే సమయం ఉండడంతో డబ్బులు, మందు పంపిణీ పూర్తిచేయడంతో పాటు దొంగ ఓట్లు వేయించి లబ్ధిపొందాలని ప్రలోభాలకు తెరలేపారు. నిజానికి.. కుప్పంలో పనులు దొరక్క అనేకమంది బెంగళూరుకు వలస వెళ్లిపోయారు. వారంతా అక్కడే స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. వారిలో సుమారు 35 వేల మందికి అటు కుప్పంలోనూ.. ఇటు బెంగళూరులోనూ ఓటు హక్కు ఉంది. అలాగే, వీరికి అక్కడ ఇక్కడ ఆధార్, రేషన్ కార్డులు ఉన్నాయి. పింఛను, బియ్యం రెండుచోట్లా తీసుకుంటున్నారు. దీంతో వీరిలో అధిక శాతం మందిని టీడీపీ నేతలు తీసుకొచ్చి ఓట్లు వేయిస్తుండడంతో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధిస్తూ వస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ విషయాన్ని 2019 ఎన్నికల్లో అప్పటి వైఎస్సార్సీపీ అభ్యర్థి దివంగత చంద్రమౌళి గుర్తించారు. పక్కా వివరాలతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో 25 వేల ఓట్లను తొలగించారు. మరో 10వేల ఓట్లను వివిధ కారణాలతో తొలగించలేదు. వారందరినీ టీడీపీ నేతలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు పిలిపిస్తున్నట్లు సమాచారం. దొంగ ఓటర్లకు ప్రత్యేక శిక్షణ బెంగళూరు, కేజీఎఫ్, పలమనేరు నుంచి మరో 5 వేల మందితో దొంగ ఓట్లు వేయించుకునేందుకు టీడీపీ నేతలు రవాణా సదుపాయాలుఏర్పాటుచేశారు. ఇలా వచ్చేవారి కోసం కుప్పానికి దూరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. వీరికి ప్రత్యేకంగా ఓటరు ఐడీ కార్డులు, స్లిప్పులు సిద్ధంచేసినట్లు సమాచారం. వాటితో సోమవారం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాక ఏం చేయాలో టీడీపీ నేతలు శిక్షణనిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్దకు దొంగ ఓటర్లు చేరుకున్నాక.. వారిని ఎవరైనా గుర్తిస్తే వైఎస్సార్సీపీ వారు పంపించారని చెప్పమని తర్ఫీదు ఇచ్చారు. ఎవరూ అడ్డుకోకపోతే సైకిల్ గుర్తుకు ఓటేయమంటున్నారు. వలంటీర్లకు బెదిరింపులు టీడీపీ నేతలు వలంటీర్ల ఇళ్లకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మాజీ జెడ్పీటీసీ రాజ్కుమార్ తన అనుచరులతో శుక్రవారం రాత్రి ఓ మహిళా వలంటీర్ ఇంటికి వెళ్లి తీవ్రస్థాయిలో బెదిరించారు. శనివారం మరో ముగ్గురు మహిళా వలంటీర్ల నివాసాలకు టీడీపీ నేతలు వెళ్లి బెదిరించినట్లు బాధితులు వాపోతున్నారు. కొత్తదారుల్లో నగదు పంపిణీ ఇక ఎన్నికల్లో డబ్బులు పంపిణీని ఇప్పటివరకూ నేరుగా ఇళ్లకు వెళ్లి ఇవ్వడమే చూశాం. కానీ, కుప్పంలో టీడీపీ నేతలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్న చిల్లర దుకాణాలు, చిన్నచిన్న బంకులు, మెడికల్ షాపులు, టీ బంకులను కేంద్రాలుగా ఎంచుకున్నారు. టీడీపీ అభ్యర్థులు ఈ దుకాణాల్లో డబ్బులు, పేర్లు, కోడ్ నంబర్లు స్లిప్పై వేసి ఇస్తారు. అభ్యర్థులు ప్రచారానికి వెళ్లినప్పుడు ఓటర్లకు ఓ నంబర్ కోడ్తో ఉన్న స్లిప్ ఇస్తారు. దానిని వారు చెప్పిన దుకాణంలో ఇస్తే డబ్బులు ఇచ్చేస్తారు. ఈ తరహా డబ్బుల పంపిణీ శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం ప్రారంభం కానున్నట్లు టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. మరోవైపు.. టీడీపీ నేతలు అన్ని వార్డులకు రెబల్ అభ్యర్థులుగా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయించారు. వీరంతా టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా రెబల్ అభ్యర్థులను స్వతంత్రులుగా ప్రకటిస్తారు. వీరిపై పోలీసుల నిఘా పెద్దగా ఉండదు. దీనిని టీడీపీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా 3వ వార్డు స్వతంత్ర అభ్యర్థి వేలు టీడీపీ అభ్యర్థి తరఫు డబ్బులు పంచుతూ పోలీసులకు దొరికిపోయాడు. అతని నుంచి రూ.50,500 స్వాధీనం చేసుకున్నారు. స్వతంత్రులుగా ఉన్న టీడీపీ అభ్యర్థుల ద్వారా ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అలాగే.. ఎక్కువ సంఖ్యలో ఓట్లు కలిగిన వారికి పెద్దమొత్తంలో డబ్బులు లేదా బహుమతులు ఇవ్వటానికి టీడీపీ అన్ని ఏర్పాట్లుచేసినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. -
Kuppam: డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేతలు
సాక్షి, చిత్తూరు: టీడీపీ నేతలకు కుప్పం టెన్షన్ పట్టుకుంది. ఓటమి భయంతో పచ్చ నేతలు కొత్త డ్రామాకు తెరతీశారు. ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కనీసం కుప్పం మున్సిపాలిటీలోనైనా పరువు దక్కించుకోవాలని ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు తెరలేపింది. కుప్పంలో ఓటర్లకు భారీగా టీడీపీ నగదు పంపిణీ చేస్తోంది. డబ్బులు తీసుకోండి.. ఓటేయండి అంటూ టీడీపీ ఓపెన్ ఆఫర్ ఇస్తోంది. వార్డుల వారీగా తిరుగుతూ టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారు. కుప్పంలో చంద్రబాబు పరువు కాపాడేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ నేతలు.. ఓటుకు రూ.4వేలు పంచుతున్నారు. చదవండి: ‘కుప్పంలో విజయానికి లోకేష్ ఐదు వేలు పంచడం సిగ్గుచేటు’ ఓటర్లకు డబ్బులు పంచుతూ టీడీపీ నేతలు మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. కుటుంబంలో నలుగురికి మించి ఉంటే, టీవీ, ఫ్రిడ్జ్లను కూడా టీడీపీ నేతలు ఆఫర్ ఇస్తున్నారు. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో ఓటమి భయం వెన్నాడుతుండటంతో టీడీపీ నేతలు అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. ఎలాగైనా కుప్పంలో గెలవాలని చంద్రబాబు, లోకేశ్.. తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు, లోకేష్ అరాచకాలు: ఎంపీ మిథున్రెడ్డి గత రెండు వారాలుగా కుప్పంలో చంద్రబాబు అరాచకాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రలోభాల పర్వానికి కూడా టీడీపీ తెరలేపిందన్నారు. చంద్రబాబు హయాంలో కుప్పం నియోజకవర్గాన్ని ఏవిధంగానూ అభివృద్ధి చేయలేదన్నారు. చదవండి: లోకేశ్ ప్రచారం.. డబ్బు పంపిణీ.. -
కుప్పంలో ప్రలోభాలు.. అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు
-
ప్రచారాల్లో దూకుడు పెంచిన వైఎస్సార్సీపీ
-
పొలిటికల్ కారిడర్ 12 November 2021
-
ప్రగతి పధంలో పెనుకొండ..
-
టీడీపీకి గట్టి గుణపాఠం చెప్తారు
-
జోరువానలోనూ వైఎస్సార్సీపీ ప్రచార జోరు..
-
కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి
-
ఉనికి చాటుకునేందుకు ప్రతిపక్ష పార్టీల ఆరాటం
-
అబ్దుల్ అజిజ్ నారాయణకు ఎంతకు అమ్ముడు పోయారో చెప్పాలి
-
కుప్పంలో టీడీపీ ‘నంద్యాల’ జిత్తులు
సాక్షి, తిరుపతి/అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు లేకపోవడంతో ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. 2017లో నంద్యాల ఉపఎన్నిక సమయంలో ప్రయోగించిన జిత్తులను మరోసారి తెరపైకి తెస్తోంది. ఇందులో భాగంగా.. చంద్రబాబు కనుసన్నల్లో ప్రలోభాలు, విధ్వంసాలకు పాల్పడుతోంది. మాజీమంత్రి అమర్నాథ్రెడ్డి, పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు వీటి అమలుకు రంగంలోకి దిగారు. అలాగే.. మంగళవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో టీడీపీ నేతలు ఓటర్లను లోబర్చుకునేందుకు బేరసారాలు సాగించారు. ప్రచారం ముసుగులో వీరు ఓటర్ల నివాసాల్లోకి వెళ్లి గంపగుత్తుగా ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలోని ఉమ్మడి కుటుంబాలపై కూడా టీడీపీ నేతలు గురిపెట్టారు. ఒక ఇంట్లో పది, అంతకుమించి ఓట్లు ఉంటే రూ.25 వేలు నుంచి రూ.50వేలు వరకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 50 ఓట్లకు మించి ఉన్న వారికి భారీ నజరానాలివ్వాలని నిర్ణయించారు. డబ్బులు తీసుకోని వారికి ఆ స్థాయిలో బహుమతులిచ్చేందుకు సైతం ఏర్పాట్లుచేస్తున్నారు. ఫ్రిడ్జ్, 40 అంగుళాల టీవీలు, బుల్లెట్ వాహనాలు, ట్రాక్టర్ల వంటివి ఇచ్చేందుకు ఆశపెడుతున్నారు. అసంతృప్తివాదులకు తాయిలాలు ఇక చంద్రబాబు పాలనలో సాయం కోసం వెళ్లి నిరాశతో వెనక్కి వచ్చిన వారిని కూడా గుర్తించే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. వారు అడిగిన పనులను ఇప్పుడు చేసిపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం వారు ఐదు కుటుంబాలను కలిసినట్లు తెలిసింది. కానీ, టీడీపీ నేతలపై ఆ ఇళ్లవారు ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ నాయకులు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా ఓటర్లు ససేమిరా అన్నట్లు తెలిసింది. దీంతో టీడీపీ నేతలు నేరుగా చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిస్తున్నారు. అయితే.. ఓటర్లు ఆ నేతలకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ విషయంపై టీడీపీ నేతలు మంగళవారం సాయంత్రం మరోసారి చంద్రబాబుతో సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడినట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇలాంటి వారినందరినీ వెంటనే గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు ఆ నేతలకు ఆదేశించారు. బుల్లెట్లు, ట్రాక్టర్లు బహుమతులు దీంతో అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉంటున్న ద్వితీయ, తృతీయశ్రేణి కార్యకర్తలు కొందరిని గుర్తించారు. గత నాలుగు రోజులుగా నేతలు వారి ఇళ్లకెళ్లి బుజ్జగిస్తూ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరినట్లు తెలిసింది. అందుకు ప్రతిఫలంగా బుల్లెట్ బైకులు కొనిస్తామని హామీ ఇచ్చినట్లు కుప్పంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అంతేకాక.. ఎన్నికలు అయ్యేంత వరకు పెట్రోల్ ఖర్చులు, మందు, విందు తదితర వాటిన్నింటికి ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. అలాగే.. వ్యవసాయ భూములుండి పార్టీ కోసం పనిచేసి ఎలాంటి లబ్ధిపొందలేకపోయిన వారికి ట్రాక్టర్లు బహుమతిగా ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇంకా ద్వితీయశ్రేణి నాయకుల్లో 500 వరకు ఓటు బ్యాంకు ఉన్న వారికి ఏకంగా కార్లు ఇస్తామని హామీలిస్తున్నారు. ఇలా ఇన్ని రకాలుగా టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నా ఓటర్ల నుంచి వారికి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లూ బాబుగారు మాకేమీ చేశారంటూ నిలదీస్తుండడం కొసమెరుపు. వార్డుల వారీగా వ్యూహాలు ఇక తొలిసారిగా చిత్తూరు జిల్లాతో ఏమాత్రం సంబంధంలేని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి కుప్పం బాధ్యత అప్పగించారు. బాబు కూడా రోజుకు మూడు, నాలుగుసార్లు టెలీకాన్ఫరెన్స్లు నిర్వహించి వార్డుల వారీగా దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే, వ్యూహాత్మకంగానే ఒక్కో వార్డుకు నలుగురైదుగురితో నామినేషన్ల వేయించారు. అవసరమైతే పోలీసులు, ఎన్నికల అధికారులపై దాడులు చేయగల కరడుగట్టిన నాయకులు, వారి అనుచరులను అక్కడ మొహరించారు. ఎంతైనా ఇద్దాం.. కుప్పంలో గెలుద్దాం కుప్పం మున్సిపాల్టీలో ఎలాగైనా గెలిచేందుకు చంద్రబాబు తన శక్తియుక్తులు అన్నింటినీ ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక మున్సిపాల్టీపై ఆయన పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకాడొద్దని.. ఓటర్లకు ఎంతైనా ఇద్దామని నాయకులకు ఆయన పదేపదే చెబుతున్నట్లు తెలిసింది. దశాబ్దాలుగా తన కంచుకోటగా ఉన్న కుప్పం జేజారిపోతుందేమోననే భయం ఆయన్ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో కుప్పం టీడీపీ కోటకు బీటలు వారడంతో ఆయనకు తీవ్ర భంగపాటు ఎదురైంది. దీంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఇప్పుడు కుప్పం మున్సిపాల్టీ కూడా చేజారితే తన పరువు పోవడమే కాకుండా దాని ప్రభావం పార్టీ మీద తీవ్రంగా ఉంటుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. అందుకే కుప్పం మున్సిపాల్టీలో గెలవడమే లక్ష్యంగా సాధారణ ఎన్నికల స్థాయిలో పనిచేస్తున్నారు. అవసరమైతే కుప్పం పర్యటనకు రెడీ ఇక అవసరమైతే ఒకరోజు స్వయంగా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ, ఒక్క కుప్పం మున్సిపాల్టీ కోసం ఆయన వెళ్తే చులకనగా ఉంటుందని ముఖ్య నేతలు అభిప్రాయపడడంతో దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. అక్కడ ఏ చిన్న గొడవ జరిగినా దాన్ని సాకుగా చూపి పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం రాత్రి ఎన్నికల అధికారితో కావాలని గొడవకు దిగి నానా రభస సృష్టించారు. ఈ ఘటనను చూపించి కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. కానీ, చివరి నిమిషంలో ఆ ఆలోచన విరమించుకున్నారు. ప్రచార గడువు ముగిసే లోపు ఏదో ఒక సాకుతో చంద్రబాబు కుప్పం వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
కుప్పం పేరు వింటేనే హడలిపోతున్న చంద్రబాబు
-
అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ
-
టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు
-
చంద్రబాబు మళ్ళీ డ్రామాలాడుతున్నాడు
-
YSRCP నేతలకు బ్రహ్మరధం పడుతున్న ప్రజలు
-
నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది
-
బాబుపై పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
-
Kuppam Municipality: కుప్పంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి..
కుప్పంరూరల్, కుప్పం(చిత్తూరు జిల్లా): కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని నాల్గో వార్డు కమతమూరుకు చెందిన దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భరత్ ఆధ్వర్యంలో కమతమూరుతో పాటు కత్తిమానుపల్లి, గుండ్లపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. అలాగే కుప్పం మునిసిపాలిటీకి చెందిన టీడీపీ సీనియర్ నేత అడవి కొట్టాలు సుబ్రమణ్యం కూడా వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన చూసి పార్టీలో చేరినట్టు వారు చెప్పారు. చదవండి: Municipal Elections: బాబులో కుప్పం టెన్షన్ -
Municipal Elections: బాబులో కుప్పం టెన్షన్
సాక్షి, తిరుపతి: 2019 సార్వత్రిక ఎన్నికలు మొదలు నిన్న మొన్నటి స్థానిక సంస్థలు, తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక వరకు వరుస ఓటములతో ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు తాజాగా కుప్పం మున్సిపల్ ఎన్నికల రూపంలో మరో టెన్షన్ వెంటాడుతోంది. కుప్పం ఎన్నికల్లో ఇప్పుడు ఓటమి పాలైతే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మరోసారి పరాభవం ఖాయమని ఆయన బెంబేలెత్తిపోతున్నారు. అందుకే కుప్పంపై ఆయన ‘ప్రత్యేక’ దృష్టిపెట్టి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. చదవండి: Andhra Pradesh: ‘కోవిడ్’లోనూ కొలువులు కుట్రలు, కుతంత్రాలకు పన్నాగం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఈనెల 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీడీపీ శ్రేణులు మాత్రం చంద్రబాబు ఒత్తిడి తట్టుకోలేక ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇక్కడి పరిస్థితులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరతీశారు. వాటిని పక్కాగా అమలుచేసేందుకు ఆయన, లోకేశ్.. టీడీపీ నేతలు, ఇన్చార్జ్లుగా ఉన్న మాజీమంత్రి అమరనాథ్రెడ్డి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానితో రోజూ ఫోన్లో మాట్లాడుతున్నారు. టీడీపీ శ్రేణులు ఏం చేయాలో ఏ రోజుకా రోజు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎంతైనా ఖర్చు చేయండి నిజానికి.. కుప్పం మున్సిపల్ ఎన్నికలు చంద్రబాబును తీవ్రంగా కలవరపెడుతున్నాయి. దీంతో ఎన్నికలను అధిగమించేందుకు భారీగా డబ్బులు, మద్యం, బహుమతులు పంపిణీ చేసేందుకు వెనుకాడొద్దని పార్టీ శ్రేణులకు ఆయన స్పష్టంచేసినట్లు విశ్వసనీయ సమాచారం. డబ్బు ఎంతైనా ఖర్చుచేయాలని.. అవసరమైన మొత్తం తాను పంపుతానని ఇన్చార్జ్లకు చెప్పినట్లు తెలిసింది. ఈ ఖర్చు బాధ్యతలను చంద్రబాబు తన పీఎస్ దొరస్వామినాయుడుకు అప్పగించినట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. రోజువారీ ప్రచారం నిమిత్తం ఎప్పటికప్పుడు కూలీలకు డబ్బులు, మద్యం, బిర్యాని పంపిణీ కూడా చేయమని ఆదేశాలు జారీచేశారు. అలాగే, ఏపీలో మద్యం కొనుగోలు చేయవద్దని, పక్కనే ఉన్న కర్ణాటక మద్యంతోపాటు నాటుసారా తెప్పించుకోమని సూచించినట్లు సమాచారం. మద్యం కోసమే ప్రత్యేకంగా ఓ టీంని నియమించారు. ఇక ఓటర్లకు ఎంత ఇవ్వాలో తాను తరువాత చెబుతానని బాబు చెప్పినట్లు తెలిసింది. దాడి చేయండి.. ఎదురు కేసులు పెట్టండి ఇక కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ప్రయోజనం కలిగేలా వైఎస్సార్సీపీ శ్రేణులే టార్గెట్గా దాడులు చేయమని కూడా చంద్రబాబు సూచనలు చేసినట్లు కుప్పం టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను కొట్టి.. వారిపైనే తిరిగి కేసు పెట్టాలని ఇన్చార్జ్లకు సూచనలు అందాయి. ఇందులో భాగంగానే శుక్రవారం వీ కోట టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ రంగనాథ్ తన అనుచరులతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులు తప్ప మిగిలిన వారికి ఇక్కడ ఏం పని అని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి గణపతి ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన రంగనాథ్ అనుచరులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. అదే విధంగా ఎన్ఎఫ్సీ కళాశాల వద్ద కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థి మునస్వామి, బంధువు వెంకటేష్పై స్థానికేతరులైన టీడీపీ శ్రేణులు దాడిచేశారు. దాడిచేసిన వారే బాధితులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం బాబు ఆదేశాలకు అద్దంపడుతున్నాయి. కుప్పానికి పరిటాల, జేసీ వర్గీయులు కుప్పంలో అలజడులు సృష్టించి తద్వారా ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల, జేసీ వర్గీయులను దింపనున్నారు. అల్లర్లలో ఆరితేరిన వారిని కుప్పం ఎన్నికలకు వాడుకునేందుకు ప్రణాళికలు రూపొందించారు. వారంతా ఒకట్రెండు రోజుల్లో కుప్పానికి చేరుకోనున్నారు. వీరి కోసం కుప్పం శివారుల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేసినట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. వీరు వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకుని టీడీపీ ప్రచారాల్లో రచ్చచేయాలని.. వీలైతే దాడులు చేయాలని ప్రణాళికలు రచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనల ద్వారా తన అనుకూల మీడియా ద్వారా వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయించేందుకు కూడా చంద్రబాబు ఓ ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిసింది. వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టుచేయడం ఈ బృందం బాధ్యత. -
అనంతపురం జిల్లాలో కార్పొరేషన్ ఎన్నికల సందడి
-
ఏపీలో ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
-
చంద్రబాబు హయాంలో కుప్పంలో అభివృద్ధి లేదు: పెద్దిరెడ్డి