mydukur mandal
-
10 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట అటవీ ప్రాంతంలో పోలీసులు శుక్రవారం కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలించేందుకు సిద్ధంగా ఉన్న మినీ లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో అక్కడే ఉన్న స్మగ్లర్లు పరారైయారు. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
వనిపెంటలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వాహనంతోపాటు స్మగ్లర్లను పోలీసు స్టేషన్కు తరలించారు. స్మగ్లర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వనిపెంట సమీపంలో పోలీసులు ఈ రోజు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భం ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 7 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.