nallapati cable vision
-
పోలీసుల స్వామిభక్తి...
ఎన్సీపీ దాడి కేసులో వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా అరెస్టుల పర్వం అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో కొనసాగుతున్న వేధింపులు కార్యాలయాన్ని ధ్వంసం చేసి, నాయకులపై దాడి చేసిన నిందితులను గుర్తించని వైనం నరసరావుపేటటౌన్: అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పోలీసు అధికారులు నడుస్తూ స్వామి భక్తిని చాటుకొంటున్నారు. నల్లపాటి కేబుల్ విజన్(ఎన్సీవీ) కార్యాలయం ధ్వంసం అనంతరం జరిగిన పరిణామాల్లో కేవలం వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. మరికొందరిని విచారణపేరుతో వేధిస్తున్నారు. దీంతో పాటు వైఎస్సార్కాంగ్రెస్పార్టీ నాయకులకు బెయిల్ రాకుండా ఉండేందుకు కుట్రపన్నుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. నరసరావుపేటలో ఇటీవల ఎన్ సీవీ కార్యాలయం ధ్వంసం చేయడంతోపాటు జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ నల్లపాటి చంద్రశేఖర్రావును తీవ్రంగా గాయపరచిన నిందితులను ఇప్పటివరకు గుర్తించని పోలీసులు, బాధితులైన ఎన్సీవీ యాజమాన్యంపై నాన్బెయిల్బుల్ కేసులు నమోదు చేసిన విషయం విదితమే. కేసులో అరెస్టయి సబ్జైల్లో ఉన్న ఎన్సీవీ అధినేత నల్లపాటి రామచంద్రప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లాం కోటేశ్వరరావులకు బెయిల్ రాకుండా ఉండేందుకు దేశం నాయకుల వత్తిడితో పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేసులో ఫిర్యాదుదారుడైన షేక్ జానిమౌలాలి ప్రభుత్వ వైద్యశాల నుంచి నాలుగు రోజుల క్రితమే డిశ్చార్జ్ అయినా ఇంకా వైద్యశాలలోనే ఉన్నాడని పోలీసులు కోర్టుకు సమర్పించడం విమర్శలకు బలాన్ని చేకూరుస్తోంది. జాని మౌలాలి విషయంపై వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ టి.మోహన్ శేషుప్రసాద్ను వివరణ కోరగా మూడురోజుల క్రితం వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయి వెళ్ళినట్టు ధ్రువీకరించారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వేళ బెయిల్పై విడుదలైతే మరోకేసులో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కౌన్సిలర్ కేసులో అత్యుత్సాహం .. కౌన్సిలర్ శీలు బాబురావు పెట్టిన కేసులో పోలీసులు అత్యుత్సాహంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అనుమానితుల పేరుతో శనివారం రాత్రి జొన్నలగడ్డ, పమిడిపాడు, సాతులూరు గ్రామాలకుచెందిన సుమారు పదిమందిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. వారిని కలుసుకొనేందుకు బంధువులు, గ్రామస్తులు స్టేషన్కు వెళ్ళగా వారిపట్ల దురుసుగా వ్యవహరించినట్లు బంధువులు చేప్పారు. స్టేషన్లో ఉన్న వారిపై విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
నరసరావుపేటలో మరోసారి ఉద్రిక్తత
-
నరసరావుపేటలో మరోసారి ఉద్రిక్తత
నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఎన్సీవీ కార్యాలయంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడిని నిరసిస్తూ ఆ పార్టీ సోమవారం ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తఫా, పార్టీ నేతలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే పోలీసులు ర్యాలీని అడుగడుగునా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు నిన్నటి దాడి ఘటనను నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ ఇవాళ పట్టణంలో బంద్కు పిలుపునిచ్చింది. అయితే టీడీపీ వర్గీయులు మాత్రం బంద్ను భగ్నం చేసేందుకు యత్నిస్తూ దుకాణాలను బలవంతంగా తెరిపించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా నరసరావుపేటకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్వహిస్తున్న ఎన్సీవీ(నల్లపాటి కేబుల్ విజన్) కార్యాలయంపై టీడీపీ వర్గీయులు ఆదివారం దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసుల సమక్షంలోనే వైర్లు కత్తిరించి ప్రసారాలను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి రామిరెడ్డిపేటలోని కేబుల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో వారిపై కూడా టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నరసరావుపేట జెడ్పీటీసీ షేక్ నూరుల్ అక్తాబ్ తలకు, పట్టణ అధ్యక్షుడు ఎస్.ఎ.హనీఫ్ భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యేకు చెందిన క్వాలిస్ కారు ధ్వంసమవ్వగా.. పోలీసు జీపు అద్దం పగిలిపోయింది. అయితే పోలీసులు దాడికి పాల్పడిన వారిని వదిలేసి వైఎస్సార్సీపీ వర్గీయులైన ఎన్సీవీ అధినేత నల్లపాటి రాము, పమిడిపాడు నాయకుడు లాం కోటేశ్వరరావులను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్కు తరలించడం గమనార్హం. -
విపక్షం ‘కేబుల్స్’ కట్!
-
విపక్షం ‘కేబుల్స్’ కట్!
- అధికారపక్షం దాష్టీకం నరసరావుపేటలో టీడీపీ రాళ్లదాడి - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సహా పలువురికి గాయాలు - కర్నూలులో సీపీఎం చానల్పైనా దాడి - పోలీసు, రెవెన్యూ అధికారులే పాత్రధారులు నరసరావుపేట/కర్నూలు : అధికారపార్టీ పూర్తిగా బరితెగిస్తోంది. గిట్టని పత్రికలు, చానళ్లపై రకరకాల మార్గాలలో ప్రతాపం చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ.. తన తప్పులను ఎత్తిచూపుతున్న కేబుల్ చానళ్ల నిర్వాహకులపైనా దాడులకు తెగబడుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ఆధ్వర్యంలో ఎన్సీవీ కేబుల్ కార్యాలయంపై జరిగిన రాళ్లదాడిలో పలువురికి గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డితో పాటు పలువురు నాయకులు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసుల సమక్షంలోనే కేబుల్ వైర్ల కత్తిరింపు జరగడం గమనార్హం కాగా.. దాడికి గురైన వైఎస్సార్సీపీ నేతలనే అదుపులోకి తీసుకోవడం అధికార పార్టీ బరితెగింపునకు ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు కర్నూలులోనూ తెలుగుటీడీపీ నేతులు ఇదే తరహా దాష్టీకానికి పాల్పడ్డారు. సీపీఎంకు చెందిన సీమ కమ్యూనికేషన్ చానల్ను రెవెన్యూ, పోలీసు అధికారులను ప్రయోగించి నిలిపివేయించింది. చానల్ కార్యాలయాన్ని సీజ్ చేయడానికి వచ్చిన పోలీసులను, రెవెన్యూ అధికారులను ఆందోళనకారులు దిగ్బంధించడంతో ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకుంది. నరసరావుపేటలో టీడీపీ వర్గీయుల వీరంగం నరసరావుపేటకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్వహిస్తున్న ఎన్సీవీ(నల్లపాటి కేబుల్ విజన్) కార్యాలయంపై టీడీపీ వర్గీయులు ఆదివారం దాడిచేశారు. పోలీసుల సమక్షంలోనే వైర్లు కత్తిరించి ప్రసారాలను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి రామిరెడ్డిపేటలోని కేబుల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో వారిపై కూడా టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నరసరావుపేట జెడ్పీటీసీ షేక్ నూరుల్అక్తాబ్ తలకు, పట్టణ అధ్యక్షుడు ఎస్.ఎ.హనీఫ్ భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యేకు చెందిన క్వాలిస్ కారు ధ్వంసమవ్వగా.. పోలీసు జీపు అద్దం పగిలిపోయింది. అయితే పోలీసులు దాడికి పాల్పడిన వారిని వదిలేసి వైఎస్సార్సీపీ వర్గీయులైన ఎన్సీవీ అధినేత నల్లపాటి రాము, పమిడిపాడు నాయకుడు లాం కోటేశ్వరరావులను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్కు తరలించడం గమనార్హం. ఆర్డీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ధర్నా ఈ సంఘటనపై గాయపడిన నాయకులతో ఫిర్యాదు చేయించి ఆర్డీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యేడాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధర్నాకు దిగారు. దాడి ఘటనను పూర్తిగా ఖండిం చారు. ఇంత కిరాతకమైన ప్రభుత్వాన్ని తామెప్పుడూ చూడలేదన్నారు. కర్నూలులో తీవ్రస్థాయికి కేబుల్ వార్! కర్నూలు నగరంలో కేబుల్ వార్ తీవ్రస్థాయికి చేరింది. అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ సిటీ కేబుల్ ప్రసారాలు కొనసాగుతున్నాయి. ఏడాది కిందట సీపీఎం ఆధ్వర్యంలో సీమ కమ్యూనికేషన్ చానల్ను ఏర్పాటు చేశారు. దీనిపై ఆగ్రహించిన అధికార పార్టీ నేతలు.. జిల్లాలో అనుమతులు లేకుండా ప్రసారాలు చేస్తున్నారంటూ పోలీసులను అడ్డం పెట్టుకొని ఆరు నెలల కిందట కార్యాలయాన్ని సీజ్ చేశారు. దీంతో సీమ కమ్యూనికేషన్ నిర్వాహకులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని జీ నెట్వర్క్ అనుమతులతో ప్రసారాలను పునరుద్ధరించారు. ఇదే సమయంలో జెమినీ చానల్ ప్రసారాలకు సంబంధించిన అనుమతులు సైతం సీమ కమ్యూనికేషన్కే దక్కడంతో రెండు వర్గాల మధ్య కేబుల్ వార్ తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలోనే గతనెలలో మున్సిపల్ అధికారులు సీమ కమ్యూనికేషన్కు సంబంధించిన వైర్లను తొలగించడంతో ఆపరేటర్లు ఆందోళన చేశారు. తాజాగా ఆదివారం సాయంత్రం గాయత్రి ఎస్టేట్లో ఉన్న సీమ కమ్యూనికేషన్స్ చానల్పై పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు జరిపారు. అధికారుల నిర్బంధం : పీస్ చానల్ ద్వారా నిషేధిత ప్రసారాలను నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదుపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు కర్నూలు ఆర్డీవో రఘుబాబు, డీఎస్పీలు రమణమూర్తి, వినోద్కుమార్,ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు చానల్ కార్యాలయాన్ని సీజ్ చేసేందుకు వెళ్లారు. వారిని సీపీఎం నాయకులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. మూడో అంతస్తులో చానల్ కార్యాలయం ఉండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు కిందికి దిగకుండా నిర్బంధించారు.