breaking news
Nepal President
-
నేపాల్లో మార్చి 5న ఎన్నికలు
కాఠ్మండు: సామాజిక మాధ్యమాలపై నిషేధం, అవినీతి, వారసత్వరాజకీయాలతో పెల్లుబికిన ప్రజాగ్రహం ధాటికి దగ్దమైన పార్లమెంట్, సుప్రీంకోర్టు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపర్వం పరిసమాప్తి తర్వాత ఎట్టకేలకు పూర్తికాల ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులుపడ్డాయి. వచ్చే ఏడాది మార్చి నెల ఐదో తేదీన పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ శనివారం ప్రకటన చేశారు. ‘‘ దేశం అత్యంత క్లిష్టమైన, భయానక దశను చవిచూసింది. ఇప్పుడు అంతా సద్దుమణిగింది. రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థలే మనల్ని కాపాడాయి. సమైక్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ముందుకు సాగుదాం. ఆరు నెలల్లోపు పార్లమెంట్ దిగువసభకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించుకుని ప్రగతిశీల ప్రజాస్వామ్య పథంలో పయనించే అవకాశాన్ని ప్రజలకు కలి్పస్తున్నాం. సుస్థిరపాలనే లక్ష్యంగా తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం మార్చి ఐదో తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నాం. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలి. విపక్ష పార్టీలు మొదలు విద్యారి్థలోకం, పౌరసమాజం అంతా ఈ ఎన్నికల క్రతువుకు తమ వంతు సాయం అందించాలి’’ అని శనివారం విడుదలచేసిన ఒక ప్రకటనలో అధ్యక్షుడు పౌడెల్ కోరారు. శుక్రవారం దేశ తాత్కాలిక మహిళా ప్రధానిగా పగ్గాలు చేపట్టిన వెంటనే సుశీల కర్కీ చేసిన సిఫార్సు మేరకు పార్లమెంట్ను రద్దుచేశారు. అవినీతి మురికికూపంలో పొర్లాడుతున్న ప్రభుత్వంపై విద్యార్థుల్లో గూడుకట్టుకున్న ఆగ్రహం.. హఠాత్తుగా సోషల్మీడియా యాప్ల నిషేధంతో కట్టలుతెంచుకున్న విషయం విదితమే. 24 శాఖలు ఆమె వద్దే ఆదివారం ప్రధా«ని కర్కీ తన తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. శనివారం కర్ఫ్యూ ఎత్తివేశాక దేశవ్యాప్తంగా తాజా శాంతిభద్రతల పరిస్థితిపై ఆమె సమీక్ష జరిపే వీలుంది. పలువురు మంత్రులతో ఆమె దేశ, విదేశాంగ విధానాలపై చర్చించే అవకాశముంది. హోం శాఖ, విదేశీ వ్యవహారాలు, రక్షణశాఖ వంటి కీలక 24 శాఖలను ఆమె తన వద్దే అట్టిపెట్టుకోనున్నట్లు సమాచారం. కాఠ్మండులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలుండే సింగ్దర్బార్ కాంప్లెక్స్లో కొత్తగా నిర్మించిన హోం మంత్రిత్వ శాఖ భవనాన్ని ప్రస్తుతానికి ప్రధాని కార్యాలయంగా మార్చనున్నారు. ప్రధాని కార్యాలయాన్ని ఇటీవల ఆందోళనల్లో విద్యార్థి నిరసనకారులు తగలబెట్టడంతో కొత్త భవనంలోకి ఆఫీస్ను మార్చాల్సి వస్తోంది. మరోవైపు హింసాత్మక ఘటనల్లో గాయపడిన వారిని ప్రధాని పరామర్శించారు. కాఠ్మండులోని బనేశ్వర్లోని పౌర ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులతో ఆమె స్వయంగా మాట్లాడారు. తగు సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పార్లమెంట్ ప్రస్తుత కాలపరిమితిని రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలన్న అధ్యక్షుడు నిర్ణయాన్ని ప్రధాన రాజకీయపార్టీలన్నీ తప్పుబట్టాయి. నేపాల్కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(యునిఫైడ్ మార్కిస్ట్ లెనినిస్ట్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(మావోయిస్ట్ సెంటర్)లు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. రాజ్యాంగ విరుద్ధంగా కాలావధిని కాలరాయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నాయి. ఈ మేరకు దిగువసభలోని పార్టీల చీఫ్ విప్లు ఒక సంయుక్త ప్రకటనను విడుదలచేశాయి. దేశాధ్యక్షుడి చర్యలను తప్పుబట్టాయి.జస్టిస్ సుశీలకు మోదీ అభినందనలు ఇంఫాల్: నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సుశీల కరీ్కకి భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అభినందనలు తెలియజేశారు. ఆమె నియామకం మహిళా సాధికారతకు ఉజ్వలమైన ఉదాహరణ అని ప్రశంసించారు. మోదీ శనివారం మణిపూర్ సభలో మాట్లాడుతూ.. భారత్–నేపాల్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇరుదేశాలు చరిత్ర, విశ్వాసం, సాంస్కృతి సంబంధాలను పంచుకుంటున్నాయని వివరించారు. -
నేపాల్లో నాటకీయ పరిణామాలు.. ప్రధానిగా ‘ప్రచండ’ నియామకం
కాఠ్మాండు: నేపాల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానమంత్రిగా సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ పార్టీ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’ ప్రధానిగా నియామకమయ్యారు. అధికార పంపకాలపై నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదుర్ దేవ్బాతో జరిగిన చర్చలు విఫలమైన క్రమంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలితో జతకట్టారు ప్రచండ. ఓలితో పాటు విపక్షంలోని చిన్న చిన్న పార్టీలు ప్రచండకు మద్దతు ప్రకటించాయి. దీంతో తనకు 165 మంది చట్టసభ్యుల మద్దతు ఉందని నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారిని కలిశారు. అధికారం ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరారు. ఈ క్రమంలో ఆయన్ను ప్రధానిగా నియమిస్తూ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 క్లాజ్ 2 ప్రకారం నేపాల్ తదుపరి ప్రధానిగా ప్రచండను నియమించినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. అంతకు ముందు ఆదివారం సాయంత్రం 5 గంటల్లోనే చట్టసభ్యులు మెజారిటీని కూడగట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని ప్రెసిడెంట్ కోరారు. గడువు ముగిసే సమయానికి కొద్ది గంటల ముందు ప్రచండ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. దీంతో ఆయనను నియమిస్తూ ప్రెసిడెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేసింది. ప్రచండతో పాటు సీపీఎన్-యూఎంఎల్ ఛైర్మన్ కేపీ శర్మ ఓలి, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్ఎస్పీ) ప్రెసిడెంట్ రవి లమిచ్చనే, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చీఫ్ రాజేంద్ర లింగ్దే సహా ఇతర నేతలు హాజరయ్యారు. ప్రచండకు మొత్తం 275 సభ్యుల్లో 165 మంది చట్టసభ్యుల మద్దతు లభించింది. అందులో సీపీఎన్-యూఎంఎల్ 78, సీపీఎన్-ఎంసీ 32, ఆర్ఎస్పీ 20, ఆర్పీపీ 14, జేఎస్పీ 12, జనమాత్ 6, నాగరిక్ ఉన్ముక్తి పార్టీ 3 సభ్యులు ఉన్నారు. నేపాల్ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు ప్రచండ. రొటేషన్ పద్ధతిపై ఒప్పందం.. నేపాల్ ప్రధాని పదవీ కాలం ఐదేళ్లు. పదవిని రొటేషన్ పద్ధతిలో చేపట్టాలని ఎన్నికలకు ముందు షేర్ బహదుర్ దేవ్బా, పుష్ప కమల్ దహాల్ మధ్య ఒప్పందం కుదిరింది. తొలి రెండున్నరేళ్లు తనకు పదవి ఇవ్వాలని ప్రచండ కోరగా.. అందుకు దేవ్బా నిరాకరించటంతో సంక్షోభం తలెత్తింది. విపక్ష కూటమితో చేతులు కలిపారు ప్రచండ, సహచర కమ్యూనిస్టు పార్టీ నేత, మాజీ ప్రధాని కేపీ శర్మ ఒలిని కలిశారు. రొటేషన్ పద్ధతిన ప్రధాని పదవిని పంచుకునేందుకు ఓలి అంగీకరించటంతో ప్రభుత్వ ఏర్పాటు, ప్రచండ ప్రధాని పదవి చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్ మహిళల ఆవేదన -
తిరుమలలో నేపాల్ ప్రధాని పర్యటన
తిరుమల: నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు ఈఓ అశోక్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరావు ఘనస్వాగతం పలికారు. ఆయన సతీసమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లారు. -
రాత్రంతా టెంట్లోనే నేపాల్ ప్రెసిడెంట్
ఖాట్మాండూ: భారీ భూకంపం నేపాల్ను మరుభూమిగా మార్చింది. రెండు వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది గాయపడ్డారు. పురాతన కట్టడాలు, ప్రభుత్వ కార్యాయాలు, ఇళ్లు వేలసంఖ్యలో నేలమట్టమయ్యాయి. నేపాల్ ప్రెసిడెంట్ రామ్ భరణ్ యాదవ్ సైతం రాత్రంతా ఆరుబయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేపాల్ ప్రెసిడెంట్ అధికారిక నివాసంలో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో శనివారం రాత్రి రామ్ భరణ్ యాదవ్ తన భద్రత సిబ్బందితో కలసి టెంట్లోనే బస చేశారు. నేపాల్ ప్రెసిడెంట్ కార్యాలయం 'శీతల్ నివాస్'ను 150 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ భవనంలో వంటగదితో పాటు ఇతర గదుల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాల నివాసం ప్రధాన ద్వారం భూప్రకంపనలకు దెబ్బతింది. భూకంపం వచ్చిన సమయంలో కొయిరాల ఇండోనేసియాలో ఉన్నారు.