new RBI governor
-
మొదలైన ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష
ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ బుధవారం ప్రారంభమైంది. కొత్త ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ వడ్డీ రేట్లు, పరపతి విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ కీలకంగా చూసేది ద్రవ్యోల్బణాన్నే. వినియోగ ధరల ఆధారిత సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం) డిసెంబర్ త్రైమాసికానికి 4.5 శాతానికి తగ్గుముఖం పడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 4.8 శాతంగా ఉంటుందన్నది ఎస్బీఐ రీసెర్చ్ అంచనా. జనవరి నెల ద్రవ్యోల్బణం 4.5 సమీపంలో ఉండొచ్చని పేర్కొంది. ‘‘ద్రవ్యపరమైన ఉద్దీపనలు, వాణిజ్య యుద్ధాల పరంగా అనిశి్చతుల మధ్య ఆర్బీఐ రిస్్కలను సమతుల్యం చేయాల్సిన సున్నితమైన టాస్క్ను ఎదుర్కొంటున్నది. కనీసం స్వల్పకాలానికి రేట్ల తగ్గింపు పరంగా ఆర్బీఐకి వెసులుబాటు ఉంది’’అని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో పావు శాతం చొప్పున రేట్ల కోతలకు వెళ్లొచ్చని.. విరామం అనంతరం తిరిగి అక్టోబర్లో మళ్లీ రేట్ల కోత ఆరంభించొచ్చని తెలిపింది. మొత్తం మీద 0.75 శాతం మేర రేట్ల తగ్గింపు అవకాశాలను అంచనా వేస్తోంది. -
ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 26వ గవర్నర్గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను ప్రభుత్వం నియమించింది. ఆయన పేరును కేబినెట్ నియామకాల కమిటీ ఖరారు చేసింది. బుధవారం మల్హోత్రా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీ కాలం మూడేళ్లు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంతదాస్ మంగళవారం పదవీ విరమణ చేస్తారు.అపార అనుభవం... 56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుండి కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుసహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇంతక్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషిస్తున్నారు.సమన్వయానికి మారుపేరు... ఉర్జిత్ పటేల్ ఆకస్మిక ని్రష్కమణ తర్వాత 2018 డిసెంబర్ 12న దాస్ ఆర్బీఐ 25వ గవర్నర్గా నియమితులయ్యారు. మూడేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన పదవీ కాలాన్ని మరో మూడేళ్లు కేంద్రం పొడిగించింది. ఈ పొడిగించిన పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. సెంట్రల్ బ్యాంక్ వద్ద మిగులు నిధుల బదిలీ సమస్యపై ఆర్బీఐ– ప్రభుత్వానికి మధ్య సంఘర్షణ నేపథ్యంలోనే పటేల్ ఆకస్మిక రాజీనామా చోటుచేసుకుందన్న వార్తలు అప్పట్లో వెలువడ్డాయి. ఉర్జిత్ రాజీనామా నేపథ్యంలో అనిశి్చతిని ఎదుర్కొన్న మార్కెట్కు తిరిగి విశ్వాసాన్ని అందించిన వ్యక్తిగా శక్తికాంతదాస్ నిలిచారు. పలు క్లిష్ట సందర్భాల్లో కేంద్రం–ఆర్బీఐ మధ్య చక్కటి సమన్వయం సాధించడంలో ఆయన విజయం సాధించారు. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పనిచేశారు. -
ఆర్బీఐ కొత్త గవర్నర్ నియామకం
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్గా ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ రఘురామ రాజన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఉర్జిత్ పటేల్ మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. వచ్చే నెల 4న రాజన్ పదవీకాలం ముగియనుంది. ఆ మరుసటి రోజు ఉర్జిత్ ఆర్బీఐ 24వ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. 52 ఏళ్ల ఉర్జిత్ పటేల్ ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పనిచేస్తున్నారు. ఉర్జిత్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి బీఏ, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంఫిల్ చేశారు. యేల్ యూనివర్శిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. ఉర్జిత్ కెన్యా పౌరసత్వంతో గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో విధులు నిర్వహించారు. 1991-94 మధ్యకాలంలో ఐఎంఎఫ్లో పనిచేశారు. 2000-04 మధ్య కేంద్రంలోని పలు కమిటీల్లో పనిచేశారు. -
ఆర్బీఐ కొత్త గవర్నర్ను త్వరలో నియమిస్తాం
న్యూఢిల్లీ: రిజర్వ్బ్యాంక్ కొత్త గవర్నర్ నియామకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పనితీరును జైట్లీ ప్రశంసిస్తూనే.. పదవీకాలం అనంతరం మళ్లీ అధ్యాపక వృత్తిలోకి వెళ్లాలని రాజన్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు. ఆర్బీఐ గవర్నర్గా రాజన్ పదవీకాలం సెప్టెంబర్ 4తో ముగియనుంది. రెండో విడత ఆర్బీఐ గవర్నర్ పదవిని చేపట్టడానికి రాజన్ విముఖంగా ఉన్నట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. మళ్లీ అధ్యాపక వృత్తిలో వస్తానని సహచరులతో రాజన్ చెప్పినట్టు సమాచారం.