NRI voter
-
వారి మనసంతా ఇక్కడే!
సిరిసిల్ల: విదేశాల్లో స్థిరపడ్డ వారంతా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి చూపుతున్నారు. వారంతా నిత్యం ఇక్కడ ఉన్న మిత్రులతో టచ్లో ఉంటున్నారు. పోలింగ్ సరళి, స్థానిక రాజకీయాలపై చర్చిస్తున్నారు. జనం ఎటు వైపు ఓట్లు వేశారు.. ఎంత పోలింగ్ జరిగింది.. ఎవరు గెలుస్తారంటూ.. ఫోన్లలో మిత్రులను ఆరా తీస్తున్నారు. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో శనివారం రాత్రి నుంచే మిత్రులకు, బంధువులకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా అంతటా వలసలే.. కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గల్ఫ్ దేశాల్లో 1.20 లక్షల మంది ఉపాధి పొందుతుండగా వారి కుటుంబాలకు చెందిన మరో 5 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాలకు చెందిన వారు గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల సమయంలో వాళ్లంతా ఓటుహక్కు వినియోగించుకోలేకపోయినా కుటుంబసభ్యులతో ఫోన్లో టచ్లో ఉన్నారు. ప్రతీక్షణం ఎన్నికల సరళిపై ఆరా తీశారు. ఎన్నారై పాలసీపై ఆశలు.. కేరళ తరహాలో విదేశీ విధానంపై తెలంగాణ ప్రభు త్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని గల్ఫ్ వలసజీవులు ఆశిస్తున్నారు. నిజానికి వీసా ఉండి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి తక్కువ వడ్డీతో బ్యాంకు రుణవసతి కల్పించడం, గల్ఫ్ సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం, నకిలీ ఏజెంట్లను కట్టడిచేయడం, చట్టబద్ధమైన ఏజెన్సీల ద్వారా గల్ఫ్ దేశాలకు పంపడం, పొరుగుదేశాలకు వెళ్లేవారికి ఏదో ఒక రంగంలో నైపుణ్య శిక్షణనివ్వడం, అక్కడి పరిస్థితులపై ముందే అవగాహన కల్పించడం వంటి విధానాలను ఎన్నారై పాలసీలో రూపొందించాలని గల్ఫ్ వలస జీవులు కోరుతున్నారు. రూ.వంద కోట్ల బడ్జెట్ను ఏటా కేటాయిస్తూ గల్ఫ్ వలసజీవుల ఇబ్బందులను పరిష్కరించాలని వలస కార్మికులు కోరుతున్నారు. మనుషులు అక్కడే ఉన్నప్పటికీ మనసులు మాత్రం ఎన్నికల ఫలితాలపైనే ఉన్నా యి. తమ సొంత నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు.. మెజార్టీ ఎంత వస్తుందని ఆరా తీస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి.. మాది వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం శివంగాలపల్లె. నేను మలేసియాలో దశాబ్దకాలంగా ఉద్యోగం చేస్తున్న. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ పరిశీలిస్తున్న. ప్రచార సభలను కూడా టీవీల్లో చూశాను. ఎన్నికల సరళి, ఎగ్జిట్ పోల్స్ను కూడా తెలుసుకుంటున్నాం. ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో అనే ఆసక్తి మా దగ్గర ఉండే తెలంగాణ వాసులు అందరిలోనూ ఉంది. – శివంగాల రమేశ్, మలేసియా ఏ పార్టీ గెలుస్తుందోనని.. మాది సిరిసిల్ల. ఎక్కడ ఉన్నా.. ఇండియాలో.. ప్రధానంగా మన తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని చూస్తున్నాం. సోషల్ మీడియా, వాట్సాప్లలో వచ్చే వాటిని పరిశీలిస్తుంటాం. ఇటీవల ఇక్కడ వీకెండ్స్లో రాజకీయాలపైనే చర్చలు సాగుతున్నాయి. ఈసారి తెలంగాణలో ఎన్నికలు భిన్నంగా ఉన్నా యి. ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఉంది. – నక్క శశికుమార్, హాంకాంగ్ గల్ఫ్కార్మికుల బాధలు తీరాలి మాది కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం. ఎవరు గెలిచినా గల్ఫ్ కార్మికుల బాధలు తీర్చే ప్రభుత్వం రావాలి. నిజానికి ఎన్ఆర్ఐ పాలసీ తెస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. గల్ఫ్ కార్పొరేషన్ లాంటివి ఏర్పాటు చేస్తామన్నారు. కానీ అమలు కాలేదు. గల్ఫ్ కార్మికులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రభుత్వాలు రావాలని ఆశిస్తున్నాం. ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఉంది. – ఎస్వీ రెడ్డి, దుబాయ్ -
ఓటుకు వారు దూరమే..
సాక్షి, నిజామాబాద్: ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ప్రవాసులకు ఓటు హక్కు వినియోగించుకునే వీలు లేకుండా పోతోంది. వయోవృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ సిబ్బందికి, దేశ భద్రతను కాపాడుతున్న సైనికులకు సర్వీస్ ఓటింగ్ విధానం అమలు చేస్తున్న ఎన్నికల కమిషన్ ప్రవాసుల విషయంలో ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేకపోయింది. ఫలితంగా జిల్లాలో దాదాపు 2.90 లక్షల మంది గల్ఫ్ వలస కార్మికులతో పాటు ఇతర దేశాల్లో ఉంటున్న వారు ఓటు హక్కుకు దూరమవుతున్నారు. విదేశాల్లో ఆన్లైన్ ఓటింగ్ విధానం అమలులో ఉంది. పోలింగ్ బూత్కు స్వయంగా వెళ్లి ఓటు వేయని వారు ఆన్లైన్లో ఓటింగ్కు పాల్గొనడానికి దరఖాస్తు చేసుకుంటే ఆయా దేశాల్లో ఓటింగ్ సౌకర్యం కల్పిస్తోంది. మన దేశంలో వలస కార్మికుల కోసం ప్రాక్సీ ఓటింగ్ విధానం అమలు చేయడానికి గతంలో కసరత్తు చేశారు. సాంకేతిక కారణాలతో ఈ విధానం అమలులోకి రాకముందే స్వస్తి పలికారు. ప్రాక్సీ ఓటింగ్ విధానం అమలులోకి వచ్చి ఉంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న వలస కార్మికులతో పాటు ఇతర దేశాల్లో ఉపాధి పొందుతున్న ప్రవాసులకు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలు ఉండేది. కనీసం రానున్న స్థానిక సంస్థల, పార్లమెంట్ ఎన్నికల సమయంలోనైనా వలస కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునే వీలు కల్పించేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇవి కూడా చదవండి: మూడోసారీ విజయం నాదే.. : వేముల ప్రశాంత్రెడ్డి -
ఎల్లలు దాటిన రాజకీయ చైతన్యం! ఎన్నారై వాయిస్..
సాక్షి, కరీంనగర్: 'ఏ దేశమేగినా ఎక్కడున్నా ఓటే తమ అభిమతమని చాటుతున్నారీ యువత. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగమే తమ నినాదమని ధీమాగా చెబుతున్నారు. బాల్య వయసులో పాఠ్యాంశంలోని అంశాలు, యువ వయసులో జిల్లా, రాష్ట్ర, జాతీయ రాజకీయాలను గమనిస్తున్న సదరు యువత ఓటెత్తుతామని అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో దేశంలో ఉపాధి పొందుతున్నారు. ఏళ్లుగా అక్కడే స్థిరపడగా.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలొచ్చాయంటే స్వదేశీబాట పడుతున్నారు. జిల్లా నుంచి వేల సంఖ్యలో అమెరికా, స్విట్జర్లాండ్, లండన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, రష్యా తదితర దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. సదరు దేశాల్లో ఓటు ప్రాధాన్యమెక్కు వ. ఓటేయకుంటే శిక్షలున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల క్రమంలో వందల మంది కరీంనగర్కు చేరుకోగా.. ఓటేసేందుకు మేమొచ్చాం.. మీరు ఓటేసేందుకు వస్తారుగా అంటూ సహచర స్నేహితులను చైతన్యపరుస్తున్నారు. ఈ సందర్భంగా వారి వాయిస్ వినిపించారు.' రాజకీయాలంటే ఆసక్తి! అమెరికాలోని పెన్సుల్వెనియా ప్రాంతంలో స్థిరపడిన ఉనుకొండ రాజీవ్కుమార్ది నగరంలోని విద్యానగర్. సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్నాడు. కంపెనీ అమెరికాలో అవకాశం కల్పించగా.. తన ప్రతిభతో అక్కడే స్థిరపడ్డాడు. ఎన్నికలొచ్చాయంటే రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి చూపుతుంటాడు. ఆయా పార్టీల మేనిఫెస్టోలు, అభ్యర్థుల నేర చరిత్ర తదితర వివరాలను ఆరా తీస్తూనే ప్రచార సరళిని పరిశీలిస్తుంటాడు. తీరా పోలింగ్ సమయానికి భారత్ రావడం.. ఓటేయడం ప్రతీసారి చేస్తుంటానని, ఇటీవలే మన దేశానికి వచ్చానని చెబుతున్నారు రాజీవ్. -
అన్నా జర గుర్తుపెట్టుకో..
ఆర్మూర్: అన్నా మనోళ్లను మన పార్టీకే ఓటు వేయ మని ఫోన్ చేసి చెప్పన్నా అంటూ పలు రాజకీయ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు గల్ఫ్ దేశాల్లో ఉ పాధి కోసం వెళ్లిన వారికి ఫోన్లు చేసి చెబుతున్నారు. స్థానికంగా ఉన్న పరిచయాలను వినియోగించుకొని బంధు, మిత్రుల ఓట్లు తమ పార్టీకి రాబట్టుకొనే ప నిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొననుంది. ఆయా పార్టీల నుంచి పోటీ లో ఉన్న అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూ సు కు పోతున్నారు. అయితే వారి గెలుపు కోసం పని చే స్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు గ్రామాల్లో నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన వారి వివరా ల ను సేకరిస్తున్నారు. వారికి ఫోన్లు చేసి తమ పార్టీ అ భ్యర్థి విజయం సాధిస్తే వారి కుటుంబ సభ్యులకు పింఛన్ ఇప్పిస్తామని, ఇంటికి రోడ్డు వేయిస్తామంటూ నమ్మబలుకుతున్నారు. గల్ఫ్లో ఉన్న వారు గ్రామాల్లో ఉన్న సమయంలో తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మరీ వారి కుటుంబ సభ్యుల కు ఫోన్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బీ ఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువు రు ద్వితీయ శ్రేణి నాయకులు ఒక అడుగు ముందు కు వేసి గల్ఫ్ దేశాల్లో ఆర్మూర్ ప్రాంతీయులు ఉండే ప్రాంతాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయా లని సంకల్పించారు. అందులో భాగంగా ఆ యా పార్టీలకు చెందిన పలువురు నాయకులు దు బాయి కి వెళ్లనున్నారు. అక్కడ ప్రవాస భారతీయులతో స మావేశాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న ట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి సుమారు పది లక్షల మంది గ్రామీణులు గల్ఫ్ దేశా ల్లో ఉంటున్నందున వారితో చెప్పించి కు టుంబ స భ్యుల ఓట్లు రాబట్టుకొనే ప్రయత్నాలను ముమ్మ రం చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఇందు కోసం ఆయా పార్టీల నాయకులు బృందాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. -
ఎన్నారైలు విదేశాల్లోనే ఓటు వేయొచ్చు.. వారి కోసం ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్
ప్రవాస భారతీయ (ఎన్నారై) ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీబీపీఎస్)ను అమలు చేసే ప్రతిపాదన పరిశీలనలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు సమాధానమిస్తూ.. 1 జనవరి 2023 నాటికి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 20A ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న 1,15,696 మంది భారతీయ పౌరులు భారతీయ ఓటర్ల జాబితాలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నారై ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయడానికి ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961ను సవరించే ప్రతిపాదనను భారత ఎన్నికల సంఘం చేపట్టిందని న్యాయ మంత్రి కిరణ్ రిజీజు తెలిపారు. ప్రతిపాదన అమలులో ఉన్న లాజిస్టికల్ సవాళ్లను పరిష్కరించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఈ విషయం చర్చిస్తున్నట్లు చెప్పారు. విదేశీ ఓటర్లు వ్యక్తిగతంగా లేదా ప్రాక్సీ (నామినేటెడ్ ఓటరు) ద్వారా ఓటు వేయడానికి వీలుగా ప్రజాప్రాతినిధ్య (సవరణ) బిల్లు, 2018 పేరుతో భారత ఎన్నికల సంఘం సిఫార్సు చేసిన బిల్లును ఆగస్టు 9, 2018న లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదించినట్లు న్యాయ మంత్రి తెలిపారు. అయితే 16వ లోక్సభ రద్దు కారణంగా ఈ బిల్లు కూడా రద్దయిందని పేర్కొన్నారు. -
ఓటు.. ఐదు రకాలు
సాక్షి, అచ్చంపేట : ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతీ పౌరుడికీ రాజ్యాంగం ఓటుహక్కు కల్పించింది. ఓటు ద్వారానే ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. అయితే ఓటును ఐదు రకాలుగా విభజించారు. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. టెండర్ ఓటు, సాధారణ ఓటు, సర్వీస్ ఓటు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు కూడా ఓటర్లే. ఎన్నికల సమయంలో వీరు ఎన్నికల విధులు నిర్వహిస్తారు. వీరు కూడా ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు బ్యాలెట్ సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ను తపాలా శాఖ ద్వారా పంపించి ఓటు హక్కును వినియోగించుకుంటారు. మరికొందరు పోలింగ్ ముందు రోజే ప్రత్యేకంగా ఉద్యోగుల కోసం పోస్టల్ పోలింగ్ను ఏర్పాటు చేసి ఓటు వేయిస్తారు. ఓట్ల లెక్కింపు అయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో సందర్భంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లే అభ్యర్థుల గెలుపులో కీలకంగా మారుతాయి. టెండరు ఓటు.. ఓటరు జాబితాలో ఓటుహక్కు ఉన్న వ్యక్తి పోలింగ్ బూత్లోకి వెళ్లి ఓటు వేసేటప్పుటికే ఆ వ్యక్తి ఓటును మరొకరు వేసినా.. సదరు వ్యక్తి ఓటు వేయవచ్చు. ఇందుకోసం రిటర్నింగ్ అధికారి వద్ద తాను ఓటు హక్కును వినియోగించుకోలేదని నిరూపించాలి. పోలింగ్ అధికారి హామీతో ఓటును వినియోగించుకోవచ్చు. దీన్నే టెండరు ఓటు అంటారు. సాధారణ ఓటు.. దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు అన్ని రకాల ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కలిగి ఉండాలి. ఇదే సాధారణ ఓటు. 18 సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరూ ఓటు హక్కును పొందేందుకు అర్హులు. ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకుని ఆధారాలు చూపిస్తే ఓటుహక్కు కల్పిస్తారు. సర్వీస్ ఓటు.. సైనికుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వీసు ఓటు వేసే అవకాశం కల్పించింది. ఎన్నికల సమయంలో సైన్యంలో విధులు నిర్వహించే సైనిక ఉద్యోగులు ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉంటారు. సైన్యంలోని ప్రధాన అధికారి ద్వారా/ తపాలా శాఖ ద్వారా ఓటు పంపించవచ్చు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫరబుల్ ద్వారా కూడా పంపవచ్చు. ప్రవాస భారతీయులకూ.. ఈసారి జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కు పొందేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఆన్లైన్లో ఫారం–6ఏ ద్వారా దరఖాస్తు చేసుకుని తగిన ఆధారాలు చూపించి ఓటు హక్కును పొందవచ్చు. ఓటు హక్కును పొందిన ప్రవాస భారతీయుల ఆసక్తి మేరకు విదేశాల నుంచి వచ్చి తమ ప్రాంత ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. -
'చిరంజీవీ.. మీరూ క్యూలోనే రండి'
-
ఇక సమరమే
ఒంగోలు, న్యూస్లైన్: ఎప్పుడెప్పుడా అని జనం...రాజకీయ నాయకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎన్నికలకు ఎట్టకేలకు సమరభేరి మోగింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ బుధవారం అధికారికంగా విడుదల చేసింది. జిల్లాలో ఏప్రిల్ 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ మే 28వ తేదీలోపు ముగుస్తుంది. జిల్లాలో పరిస్థితి: జిల్లాలో మొత్తం 24,09,910 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఒకరు ఎన్ఆర్ఐ ఓటరు, 7,728 మంది సర్వీస్ ఓటర్లు. మిగిలిన 24,02,181 మంది ఓటర్లలో 11,94,231 మంది పురుషులు, 12,07,814 మంది మహిళలు, 136 మంది ఇతరులకు ఓట్లున్నాయి.