పీజీ ఎంట్రెన్స్ స్కాం నిందితులకు రిమాండ్
విజయవాడ : విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ ఎంట్రన్స్ కుంభకోణంలో మరో పదకొండు మంది నిందితులను సీఐడీ అధికారులు మంగళవారం మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జయకుమార్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం వారిని ఈ నెల 21వరకు రిమాండ్కు తరలించారు.
వారిలో 7వ ర్యాంకర్ పాముబయటి భరత్ కుమార్, 14వ ర్యాంకర్ చిగురుపాటి రామరావు, 15వ ర్యాంకర్ చిలకల సాయి ప్రణీత్, 26 వ ర్యాంకర్ కోవెలకారు రమణ ఉన్నారు. ఈ కుంభకోణంలో యూనివర్శిటి సిబ్బందిపై సైతం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు పరీక్ష రద్దు అయ్యేదాకా వెళ్లింది. మొత్తంమీద ఈ కుంభకోణానికి సంబంధించి 20 మంది నిందితులను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.