occult ritual
-
ప్రేమ వేధింపులు: పెళ్లైన యువతి ఇంటిముందు చేతబడి
సాక్షి, నల్గొండ : ప్రేమ పేరుతో కొత్త రకం వేధింపులకు దిగాడో వ్యక్తి. తన ప్రేమను ఒప్పుకోక పోవడంతో చేతబడి పేరుతో బెదిరింపులు మొదలుపెట్టాడు. నల్గొండకు చెందిన కూడతల మురళి అనే వ్యక్తి ఓ పెళ్లైన యువతిని ప్రేమిస్తున్నాడు. తనను ప్రేమించాలంటూ ఆమెపై వేధింపులకు దిగాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలని ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. యూట్యూబ్, ఫేస్ బుక్లో చూసి చేతబడి నేర్చుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి అత్తారింటి ముందు చేతబడి పూజలు నిర్వహించాడు. చేతబడికి భయపడి అమ్మాయి అత్తింటి వాళ్లు ఆమెను వదిలేస్తారని భావించాడు. అయితే అలా జరగలేదు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మురళిని అరెస్ట్ చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. -
క్షుద్ర పూజలకు మట్టి తీశాడని...
సాలూరు: క్షుద్ర పూజ జరిపేందుకు తన ఇంటి ముంగిట మట్టిని తీసుకువెళ్తున్న ఒడిశాకు చెందిన గిరిజన యువకుడ్ని పట్టుకుని పట్టణ పోలీసులకు అప్పగించిన ఘటన సాలూరు పట్టణంలోని బంగారమ్మ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...కాలనీలో నివాసముంటున్న చుక్క వెంకటరమణ ఇంటి ముంగిట మట్టిని ఒడిశా రాష్ట్రం రాళ్లగడ్డ సమీపంలోని పుక్కిలి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు జయరాం తీసుకుని వెళుతుండగా అక్కడ వున్న మహిళలు అతడ్ని ప్రశ్నించారు. దీంతో ఆ యువకుడు తనను ఈ ఇంటి ముంగిట వున్న మట్టిని తీసుకురమ్మని రామా కాలనీకి చెందిన పల్లి వెంకటరావు పురమాయించాడని చెప్పినట్టు స్థానికులు తెలి పారు. ఆ మట్టి ఎందుకని ప్ర శ్నిస్తే పూజలు చేయడానికని ఆ యువకుడు బదులి వ్వడంతో దేహశుద్ది చేసి, పట్టణ పోలీసులకు అప్పగిం చా రు. ఇదిలా వుండగా చుక్క వెంకటరమణ కుటుం బానికి, పల్లి వెంటకరావు కుటుంబానికి వైరం నడుస్తుందని, అందుకే క్షుద్ర పూజలు జరిపించి, తమ కు టుంబాన్ని నాశనం చేసేందుకు వెంకటరావు కుట్ర ప న్నాడని వెంకటరమణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
వర్షాల కోసం నరబలి?
రాంచి: ఒకవైపు మండే ఎండలు జనం గుండెల్లో దడ పుట్టిస్తోంటే మరోవైపు జార్ఖండ్లో వానల కోసం ఓ వ్యక్తిని బలి ఇచ్చిన సంఘటన ప్రకంపనలు రేపింది. రాజధాని రాంచికి సమీపంలోని గుల్మా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ఇంట్లోకి చొరబడిన కొంతమంది దుండగులు ఒంటరిగా ఉన్న 55 సంవత్సరాల థెపా ఖారియాపై దాడిచేసి, హత్య చేసి తలను ఎత్తుకపోయారని పోలీసులు తెలిపారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్ అజయ్ కుమార్ ఠాకూర్ సోమవారం అందించిన సమాచారం ప్రకారం.. ఒంటరిగా నివసించే థెపా ఆదివారం మార్కెట్కు రాకపోవడంతో.. అనుమానం వచ్చిన ఇరుగు పొరుగువారు, ఇంటిని తలుపులు పగలగొట్టి చూడగా రక్తపు మడుగులో పడివున్న అతని మొండెం కనిపించింది. దీంతో షాక్కు గురైన వారు పోలీసులకు సమాచారం అందించారు. మనిషి తలను వరి పొలాల్లో తగులబెడితే విస్తారమైన వానలు కురుస్తాయనీ, మంచి పంటలు పండుతాయనే మూఢ నమ్మకంతోనే కొంతమంది దుండగులు ఖారియాను హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ దురాచారాన్ని ప్రశ్నించేవాళ్లు లేరని, వాళ్లు ఎవరినయినా చంపుతారనీ, అనాదిగా జరుగుతున్న ఈ అకృత్యాన్ని అడ్డుకునేవారు లేకపోయారని సోదరుడు జత్రూ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది గ్రామస్తులు ఇలా బలి ఇవ్వడానికి పవిత్రంగా భావిస్తుండగా... హతుని బంధువులు మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. మండుతున్న ఎండలు జార్ఖండ్లో మరింత తీవ్రంగా ఉన్నాయి. స్థానికంగా అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. మరోవైపు జూన్ రెండవ వారం వరకూ రుతుపవనాల రాక ఆలస్యం కావటంతో వానలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఈ దారుణానికి తెగబడ్డారని సమాచారం. కాగా జార్ఖండ్లో 2012 , 2013 సంవత్సరాల్లో ఇలాంటి సంఘటనలు నమోదైనట్టు తెలుస్తోంది.