Ordnance Factories Board
-
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఎనిమిది మంది దుర్మరణం
ముంబై : మహారాష్ట్రలో ప్రమాదం సంభవించింది. ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎనిమిది మంది మరణించారు. కనీసం 5 నుండి 6 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని ఆర్కే బ్రాంచ్ విభాగంలో ఉదయం 10 గంటలకు పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పైకప్పు కూలిపోయింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జేసీబీ సాయంతో రెస్క్యూ సిబ్బంది శిధిలాలను తొలగిస్తున్నారు. శిధిలాల కింద ఉన్న బాధితుల్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్టే తెలిపారు. At least 7 people were killed and several injured in a major explosion at the ordnance factory in Bhandara; rescue efforts underway. #Maharashtra #Explosion #Bhandara #OrdnanceFactory pic.twitter.com/XP21qWEKHV— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) January 24, 2025 -
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయొద్దు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశ రక్షణ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని, ఇతర రక్షణ రంగ కర్మాగారాలను ప్రైవేటుపరం చేయొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ భద్రతతో పాటు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న74 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ మేరకు హరీశ్రావు శనివారం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాశారు. ‘డిఫెన్స్ రంగానికి చెందిన ఏడు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుంది. ఇది మేకిన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుంది’అని తన లేఖలో పేర్కొన్నారు. ‘ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి గతేడాదిలో కావాల్సినంత పని ఉండేది. దాదాపు రూ.930 కోట్ల ఆర్డర్లను సిబ్బంది సమయానికి పూర్తి చేశారు. కానీ ఈ ఏడాదిలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదు. దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ‘ఖాయిలా పరిశ్రమ’’(సిక్ ఇండస్ట్రీ)గా ప్రకటిస్తారని కారి్మకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ప్రత్యక్షంగా 2,500 మంది ఉద్యోగులతో పాటు పరోక్షంగా మరో ఐదువేల మంది ఉపాధి దెబ్బతింటుంది’అని హరీశ్రావు లేఖలో పేర్కొన్నారు. ఎద్దుమైలారం ఫ్యాక్టరీలో యంత్రాలను ఆధునీకరించాలని, ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కోరారు. అలాగే ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు. -
ధనుష్ శతఘ్నికి ధ్రువీకరణ పరీక్షలు
న్యూఢిల్లీ: బోఫోర్స్ శతఘ్నిని ఆధునీకరించి భారత్ అభివృద్ధిపరుస్తున్న ‘ధను ష్’ శతఘ్ని అభివృద్ధి ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇదివరకే ప్రాథమిక పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ ఫిరంగి ప్రస్తుతం కీలకమైన ధ్రువీకరణ పరీక్షలు ఎదుర్కొంటోంది. వచ్చే ఏడాది వరకూ ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ధ్రువీకరణ పరీక్షల్లో కూడా సత్తా చాటితే ఇక స్వదేశీ శతఘు్నల ఉత్పత్తిని పెద్ద ఎత్తున చేపట్టేందుకు మార్గం సుగమం కానుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఉత్పత్తికి ఆమోదం లభించాక సైన్యం తొలి దశలో 114 ధనుష్ శతఘు్నల తయారీ కోసం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డు(ఓఎఫ్బీ)కు రూ. 1,200 కోట్ల ఆర్డర్ను ఇవ్వనుంది. ప్రస్తుత పరీక్షలకు ఉపయోగించే ధనుష్ శతఘు్నలను ఓఎఫ్బీకి చెందిన జబల్పూర్లోని గన్ క్యారియేజ్ ఫ్యాక్టరీ తయారు చేస్తోంది.