p balaraju
-
'బాక్సైట్పై రోజుకో రకంగా మాట్లాడుతున్న బాబు'
విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రోజుకో రకంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పి.బాలరాజు ఆరోపించారు. బుధవారం విశాఖపట్నంలో 2010లో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, నాటి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, సివేరి సోమల బాక్సైట్ తవ్వకాలపై అసెంబ్లీలో మాట్లాడిన రికార్డ్లను మాజీ మంత్రి బాలరాజు విడుదల చేశారు. అనంతరం బాలరాజు మాట్లాడుతూ... బాక్సైట్పై ఆంధ్రయూనివర్శిటీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. సదరు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏజెన్సీలో ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఈ నెలాఖరులోగా అసెంబ్లీకి టి.బిల్లు: బొత్స
తెలంగాణ బిల్లు ఈ నెలాఖరుకల్లా అసెంబ్లీకి వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ తమకు తెలిపారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం బొత్స హైదరాబాద్లో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం గ్రామాల్లో నిర్వహించాలని మొదట్లో తామంతా అనుకున్నామని తెలిపారు. అయితే రచ్చబండ కార్యక్రమం మండల కేంద్రాల్లో నిర్వహించాలని తమతో సీఎం కిరణ్ సూచించారని, దాంతో ఆ కార్యక్రమాన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం కార్యాలయానికి , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజుల మధ్య సమాచారం లోపం ఉందని బొత్స అభిప్రాయపడ్డారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా సీఎం కిరణ్ విశాఖలో పలు గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమాలపై సీఎం కార్యాలయం తనకు సమాచారం అందించలేదని మంత్రి పి.బాలరాజు మీడియా సమావేశంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.