paidi talli
-
అంబరాన్నంటిన ‘సిరి’ సంబరం
-
అంబరాన్నంటిన ‘సిరి’ సంబరం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం విజయనగరంలో మంగళవారం కన్నుల పండువగా సాగింది. మధ్యాహ్నం 3.55 గంటలకు అమ్మవారి ప్రతిరూపంగా పూజారి ఆశీనులుకాగా చదురుగుడి నుంచి ఊరేగింపు కదిలింది. 3 లాంతర్ల జంక్షన్ నుంచి కోట సెంటర్కు సిరిమాను మూడు సార్లు వచ్చి వెళ్లడంతో సాయంత్రం 5.35కు ఉత్సవం ముగిసింది. కాగా పూజారిని కిందకు దించే యత్నంలో సిరిమానును మోసే బండికి కట్టిన పక్కరాటలు కొద్దిగా విరిగాయి. అక్కడివారు కర్రలను ఊతంగా ఉంచి పూజారిని కిందకు దించారు. -
పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవాలు ప్రారంభం
విజయనగరం: పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా తొలిఘట్టం తోలేళ్ల ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఏపీ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సోమవారం తెల్లవారు జామున అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. మహోత్సవాల కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.