passport rules
-
మారిన పాస్పోర్ట్ రూల్స్..
పాస్పోర్టుల (Passport) జారీకి సంబంధించిన నిబంధనలలో భారత ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది. పాస్పోర్టుల జారీ కోసం సమర్పించే పుట్టినరోజు తేదీ రుజువుకు సంబంధించిన నిబంధనలకు సవరణలు ప్రకటిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. పాస్పోర్ట్ (సవరణ) నిబంధనలు, 2025 లో భాగమైన ఈ మార్పులు పాస్పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడం, అవసరమైన డాక్యుమెంటేషన్లో ఏకరూపతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.నిబంధనల్లో కీలక మార్పులు2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లలకు జనన మరణాల రిజిస్ట్రార్, మునిసిపల్ కార్పొరేషన్ లేదా జనన, మరణాల నమోదు చట్టం, 1969 ప్రకారం అధికారం ఉన్న ఏదైనా ఇతర అథారిటీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం మాత్రమే పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువు అని కొత్త నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఈ మార్పు శిశువులకు జనన ధృవీకరణ పత్రాన్ని పొందాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అలాగే పుట్టిన తేదీని అధికారిక రికార్డులలో ఖచ్చితంగా నమోదు చేసేలా చేస్తుంది.2023 అక్టోబర్ 1 కంటే ముందు పుట్టినవారికి..2023 అక్టోబర్ 1 కంటే ముందు జన్మించిన వారికి పుట్టిన తేదీకి సంబంధించి అనుమతించదగిన రుజువులు మరింత సరళంగా ఉంటాయి. ఈ కింది డాక్యుమెంట్లను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆమోదిస్తారు.జనన మరణాల రిజిస్ట్రార్, మునిసిపల్ కార్పొరేషన్ లేదా జనన మరణాల నమోదు చట్టం, 1969 ప్రకారం అధికారం ఉన్న మరేదైనా అథారిటీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం.దరఖాస్తుదారు పుట్టిన తేదీని కలిగి ఉన్న గుర్తింపు పొందిన పాఠశాల లేదా గుర్తింపు పొందిన విద్యా బోర్డు జారీ చేసిన బదిలీ లేదా స్కూల్ లీవింగ్ లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్.దరఖాస్తుదారు పుట్టిన తేదీతో ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డు.దరఖాస్తుదారు పుట్టిన తేదీ ఉండే సర్వీస్ రికార్డ్ ఎక్స్ట్రాక్ట్ లేదా వేతన పెన్షన్ ఆర్డర్ కాపీలు (ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి). వీటికి సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా దరఖాస్తుదారు అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జి అధికారి ధ్రువీకరణ ఉండాలి.దరఖాస్తుదారు పుట్టిన తేదీతో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్.దరఖాస్తుదారు పుట్టిన తేదీతో కూడిన ఎన్నికల సంఘం జారీ చేసిన ఎలక్షన్ ఫోటో ఐడీ కార్డు.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా ప్రభుత్వ కంపెనీలు జారీ చేసే పాలసీ బాండ్. ఇందులో బీమా పాలసీ హోల్డర్ పుట్టిన తేదీ ఉంటుంది.దరఖాస్తుదారులపై ప్రభావంకొత్త నిబంధనలు ప్రధానంగా 2023 అక్టోబర్ 1 లేదా తరువాత జన్మించిన పిల్లల తల్లిదండ్రులను ప్రభావితం చేస్తాయి. వారు పాస్పోర్ట్ దరఖాస్తులకు పుట్టిన తేదీ ఏకైక రుజువుగా జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. ఈ మార్పు డాక్యుమెంటేషన్ ప్రక్రియను ప్రామాణీకరించడం, పుట్టిన తేదీ రికార్డులలో వ్యత్యాసాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2023 అక్టోబర్ 1 కంటే ముందు జన్మించినవారిపై మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదు. పాస్పోర్ట్ కోసం వారు ఎప్పటిలాగే వివిధ రకాల డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్లను సమర్పించవచ్చు. -
పాస్పోర్ట్ నిబంధనల్ని మార్చండి
చెన్నై: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకున్న వారు దేశం విడిచి పారిపోకుండా పాస్పోర్టు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తనను విధుల నుంచి తొలగించడం అన్యాయమంటూ మంగళం అనే అంగన్వాడీ కార్యకర్త వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు పైవిధంగా స్పందించింది. ‘రుణ ఎగవేత దారులు చట్టం నుంచి తప్పించుకునేందుకు సుదూర దేశాలకు పారిపోతున్నారు. వారు తమ పాస్పోర్టులను రుణం పొందిన బ్యాంకు లేదా సంస్థ వద్ద సరెండర్ చేసేలా నిబంధనలు మార్చాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. రుణం పూర్తిగా చెల్లించేవరకు రుణదాత వద్దే పాస్పోర్టు ఉండాలి. ఉంచకపోతే పాస్పోర్టు తాత్కాలికంగా రద్దుచేయాలని, పాస్పోర్టు రెన్యూవల్కు కోర్టు అనుమతి ఉండాలని తెలిపింది. మంగళం అనే అంగన్వాడీ కార్యకర్త..అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తన బంధువు పాస్పోర్టుతో సింగపూర్ వెళ్లడంతో ప్రభుత్వం ఆమెను విధుల నుంచి తొలగించడంపై కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు ఆమెను మందలిస్తూ వారం రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మంగళంతోపాటు ఆమె బంధువుకు రేషన్కార్డు తదితర ప్రభుత్వ సౌకర్యాలను ఉపసంహరించాలంది. -
పాస్పోర్ట్లో తండ్రి పేరు అవసరమా!
న్యూఢిల్లీ: 'నా పేరు ప్రియాంక గుప్తా. చిత్రహింసలు పెట్టే భర్త నుంచి దూరంగా ఉంటోన్న నేను.. ఒక్కగానొక్క బిడ్డ (గరీమా)ను ఉన్నత చదువులు చదివించా. ఇప్పుడు ఆమెకు మంచి ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే గరీమా పాస్ పోర్ట్ కు దరఖాస్తు చేసుకుంది. అప్లికేషన్ లో తండ్రి పేరు రాయాల్సిన చోట ఖాళీ వదిలేసింది. అధికారులు మాత్రం తండ్రి పేరు తప్పనిసరిగా పేర్కొనాల్సిందేనని అంటున్నారు. విడిపోయినా, చనిపోయినా తండ్రి పేరు రాయాల్సిందేనంటున్నారు. మేడం.. నన్ను, నా కూతురిని దారుణంగా హింసించిన ఆ వ్యక్తి పేరును వాడుకోవడం కాదుకదా కనీసం పలకడం కూడా మాకు ఇష్టం లేదు. గౌరవ న్యాయస్థానాలు ఎన్నెన్నో మంచి తీర్పులు చెప్పాయి. మా సమస్యపైనా అలాంటి పరిష్కారాన్నే కోరుతున్నాం. మా అభ్యర్థనను మన్నించి పాస్ పోర్టులో తండ్రి పేరు తప్పనిసరనే నిబంధనను సవరించగలరు'.. ఇది ఢిల్లీకి చెందిన ప్రియాంక అనే మహిళ కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీకి రాసిన లేఖలోని సారాంశం. దాదాపు 45 వేల మంది ఈ లేఖను సమర్థించడంతో మంత్రి మనేకా గాంధీ రంగంలోకి దిగారు. పౌరుల పాస్ పోర్టుకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న తండ్రి పేరు నిబంధనను మార్చాల్సిందిగా మనేకా శుక్రవారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఒక లేఖ రాశారు. దేశంలో సింగిల్ పేరెంట్స్ సంఖ్య పెరుగుతోన్న దృష్ట్యా నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందని మనేకా అభిప్రాయపడ్డారు. ఆమె అభ్యర్థనపై విదేశాంగ శాఖ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. రెండు నెలల కిందట ఢిల్లీ హైకోర్టు ఓ తీర్పు చెబుతూ.. దరఖాస్తు దారులను ఇష్టం లేకపోతే పాస్ పోర్టులో తండ్రి పేరు పేర్కొనాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. దీనిపై త్వరలోనే ఓ శాశ్వత పరిష్కారం లభిస్తుందని మనేకా ఆశాభావం వ్యక్తం చేశారు.