pittapuram
-
లోకహితం కోసం ప్రాణాలర్పించిన అసురుడు..!
గయాసురుడు... పేరుకే అసురుడు కానీ ఎంతో మంచి మనసున్న దైవభక్తి పరాయణుడు. అతడొకసారి విష్ణువును గురించి గొప్ప తపస్సు చేసి, తనను తాకిన వారికి మోక్షం లభించే విధంగా వరం పొందాడు. తన శక్తితో శరీరాన్ని కొన్ని యోజనాల పొడవు, వెడల్పు విస్తరించి, జీవించసాగాడు. దాంతో ప్రతివారూ గయుణ్ణి తాకి మోక్షం ΄పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోవడంతో ఇంద్రుడికి, యమధర్మరాజుకు పని లేకుండా పోయింది. దాంతో వారిద్దరూ కలిసి బ్రహ్మవద్దకు వెళ్లి, ఈ విషయాన్ని గురించి మొరపెట్టుకున్నారు. సృష్టికి విరుద్ధంగా జరుగుతున్న ఈ వైచిత్రి గురించి త్రిమూర్తులు పరిపరివిధాలుగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఇంద్రుడు గయాసురుడి వద్దకెళ్లాడు. ‘‘గయాసురా! లోకకల్యాణం కోసం మేమంతా కలసి ఒక యజ్ఞం చేయదలచుకున్నాము. ఆ యజ్ఞాన్ని చేసేందుకు అనువైన ప్రదేశం కోసం అన్వేషించగా పరమ పవిత్రమైన నీ శరీరమే అందుకు తగినదనిపించింది. కనుక నీవు అనుమతిస్తే, నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తాము’’ అని అడిగాడు ఇంద్రుడు. గయాసురుడు అందుకు ఆనందంగా అంగీకరించి, తన శరీరాన్ని పెంచి ఉత్తరదిశగా తలను ఉంచి పడుకున్నాడు. సకల దేవతలు, రుషులు అందరూ ఈ ప్రాంతానికి చేరుకోగా, బ్రహ్మదేవుడు యజ్ఞం ఆరంభించాడు. అయితే, యజ్ఞంలో ప్రజ్వరిల్లుతున్న అగ్నితత్వాన్ని తట్టుకోలేక గయుడి తల కదలడం ప్రారంభించింది. బ్రహ్మ సూచన మేరకు ‘దేవవ్రత’ అనే శిలను గయుడి తల మీద ఉంచి, ఆ శిలమీద విష్ణువు నిల్చున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యజ్ఞవేడిమిని, తన భారాన్ని మౌనంగా భరిస్తున్న గయాసురుడిని చూసి హృదయం ద్రవించిపోయిన విష్ణువు ‘‘వత్సా! ఏదైనా వరాన్ని కోరుకో’’ అని అడిగాడు. అందుకు గయాసురుడు ‘‘దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్ల, అంతకన్నా పరమ పవిత్రమైన నీ పాదధూళి సోకడం వల్ల నా జన్మ ధన్యమైంది. నేను ఇంతకుముందు నేను కోరుకున్న వరం ఎంతో అనుచితమైనదైనప్పటికీ, మీ భక్తుడినైన నన్ను సంహరించలేక, ఈ విధంగా చేశారని నాకు అర్థమైంది. అందుకు క్షమాపణలు కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని కోరేది ఒకటే! నా తలపై ఉంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలో కానీ, మరెక్కడైనా కానీ, నన్ను తలచుకుంటూ పిండప్రదానాలు, పితృదేవతల పూజలూ చేస్తే వారి పితరులు తరించేటట్లు, వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి’’ అని కోరుకున్నాడు. నిష్కల్మషమైన హృదయంతో గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణువు అనుగ్రహించాడు. గయుడి శరీరాన్ని ఉంచిన ప్రదేశమే గయ. పాదాలను ఉంచిన ప్రదేశం పాదగయ. రాక్షసుడైనప్పటికీ, లోకహితం కోరుకున్న గయుడు ధన్యుడైనాడు. ‘‘నేను మిమ్మల్ని కోరేది ఒకటే! నా తలపై ఉంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ దాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలో కానీ, మరెక్కడైనా కానీ, నన్ను తలచుకుంటూ పిండప్రదానాలు, పితృదేవతల పూజలూ చేస్తే వారి పితరులు తరించేటట్లు, వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి’’ – డి.వి.ఆర్(చదవండి: ఆరోగ్య.. సంతాన ప్రదాత : మల్లూరు నరసింహస్వామి) -
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
-
స్నేహితురాలితో మేడపై ఆడుకుంటూ...
సాక్షి, తూర్పుగోదావరి(పిఠాపురం) : వారిద్దరూ మిత్రులు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న వీరు ఎప్పుడూ కలిసే ఉంటారు. కలిసే ఆడుకుంటారు. ఎప్పటిలానే తమ మేడపై ఆడుకుంటుండగా విద్యుత్ షాక్ రూపంలో వచ్చిన మృత్యువు ఆ స్నేహాన్ని విడదీసింది. ఒకరు అనంత లోకాల్లో కలసి పోగా మరొకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన పిఠాపురం పట్టణంలోని లయన్స్క్లబ్ ఏరియాలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. పిఠాపురం లయన్స్క్లబ్ ఏరియాలో నివాసముంటున్న చింతపల్లి రామచంద్రారెడ్డి కుమార్తె చింతపల్లి సమీర(11), వారి ఇంటికి దగ్గరలో ఉన్న ఇందనపు సుబ్బలక్ష్మి కుమార్తె ఐశ్వర్య (12) ఇద్దరు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. ఇద్దరు స్థానిక ప్రైవేటు స్కూల్లో ఏడో తరగతి చదువుతుండగా ఐశ్వర్య ఈ ఏడాది ప్రైవేటు స్కూల్ నుంచి స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాలకు మారింది. స్నేహితురాలికి జ్వరం వచ్చిందని.. స్కూలుకు వెళ్లేటప్పుడు వచ్చిన తరువాత ఇద్దరు కలుసుకుని మాట్లాడుకోవడం, ఖాళీ సమయాల్లో కలిసి ఆడుకోవడం చేస్తుంటారు. బుధవారం స్కూల్కు బయల్దేరిన ఐశ్వర్య తన స్నేహితురాలు బడికి వెళ్లడం లేదని జ్వరం వచ్చిందని తెలిసి తాను బడికి వెళ్లడం మానేసింది. తన ఫ్రెండ్ సమీర ఇంటికి వెళ్లిన ఐశ్వర్య సమీరకు తోడుగా ఉంది. జ్వరం కాస్త తగ్గడంతో ఇద్దరు మధ్యాహ్నం సమీర ఇంటి మేడపైన బంతాట ఆడుకుంటున్నారు. ఇంతలో బంతి మేడ పిట్టగోడకు బిగించి ఉన్న లైట్ వద్దకు వెళ్లి పోవడంతో దానిని తీసుకునే ప్రయత్నం చేసిన ఐశ్వర్య ఒక్కసారిగా కరెంట్ షాక్కు గురై లైట్కు అతుక్కుపోయింది. అక్కడే ఉన్న సమీర ఆమెను రక్షించే ప్రయత్నం చేసి ఆమెను లాగే ప్రయత్నంలో ఆమె కూడా కరెంట్ షాక్కు గురైంది. ఇంతలో వారి అరుపులు విన్న సమీర తల్లి నాగశివజ్యోతి పరుగున మేడపైకి వచ్చి ఇద్దరినీ రక్షించే ప్రయత్నంలో తాను కూడా కరెంట్ షాక్కు గురవుతానన్న భయంతో వెంటనే కిందకు వెళ్లి మెయిన్ ఆఫ్ చేసి వచ్చి ఇద్దరినీ విడిపించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఐశ్వర్య మృతి చెందింది. సమీరను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. కంటికి రెప్పలా పెంచుకున్న కన్న కూతురు ఇక లేదని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్న మృతురాలి తల్లి సుబ్బలక్ష్మిని ఆపడం ఎవరితరం కావడం లేదు. పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పింఛన్..టెన్షన్!
పిఠాపురం, న్యూస్లైన్ : పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం వృద్ధులను కష్టాల్లోకి నెట్టింది. గతంలో తీసుకున్న వేలిముద్రలతో వారి ప్రస్తుత వేలిముద్రలు సరిపోలడంలేదు. ఫలితంగా జిల్లాలో ఈ నెలలో సుమారు 26 వేల మంది వృద్ధులకు ఇంతవరకూ పింఛన్లు అందలేదు. దీంతో ప్రభుత్వం ఇచ్చే రూ.200 స్వల్ప మొత్తం కోసం వారు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి దాపురించింది. జిల్లాలో వివిధ పింఛన్ల కింద ప్రతి నెలా రూ.12,39,47,700 అందజేస్తున్నారు. ఈ ఏడాది మే, జూన్, జూలై నెలల్లో మూడు విడతలుగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేశారు. ఆగస్ట్ నుంచి జిల్లా అంతటా ఈ విధానం అమలులోకి వచ్చింది. అయితే నెట్వర్క సమస్యల వల్ల ఏజెన్సీలో మాత్రం దీనిని అమలు చేయడంలేదు. ఈ కొత్త విధానం అమలు కోసం కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ (సీఎస్పీ) ద్వారా 941 మందిని నియమించి, వారికి 941 బయోమెట్రిక్ యంత్రాలు అందజేశారు. లబ్ధిదార్లకు పోస్టాఫీసుల్లోను, కొన్ని పంచాయతీల్లో ఐసీఐసీఐ బ్యాంకులోను ఖాతాలు తెరిచి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అమలాపురం పోస్టల్ డివిజన్లో 132, కాకినాడ డివిజన్లో 84, రాజమండ్రిలో 148, రామచంద్రపురంలో 148, రాజోలులో 129, సామర్లకోట పోస్టల్ డివిజన్లో 300 బయోమెట్రిక్ యంత్రాలను పింఛన్ల పంపిణీకి ఉపయోగిస్తున్నారు. ఇదీ సమస్య పింఛను కోసం వెళ్లిన వృద్ధుల ఆధార్ నంబర్ను తొలుత బయోమెట్రిక్ యంత్రంలోకి ఎంటర్ చేస్తారు. వేలిముద్రలను సరిపోల్చేందుకు వారి చేతి వేళ్లను యంత్రంపై ఉంచుతారు. అవి సరిపోలిన వెంటనే వారి వివరాలు ఆన్లైన్లో అనుసంధానం అవుతాయి. అలా జరగకపోతే సంబంధిత లబ్ధిదారుడి పింఛను నిలిచిపోతోంది. ఎందుకంటే..! 2011లో ఆధార్ నమోదు జరిగింది. ఆ సమయంలో వేలిముద్రలు తీసుకున్నారు. ఆ తరువాత వృద్ధుల్లో శారీరక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా గతంలో తీసుకున్న వేలిముద్రలతో వారి ప్రస్తుత వేలిముద్రలు సరిపోలడంలేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ జిల్లాలో 2,42,876 మందికి బయోమెట్రిక్ పద్ధతిలో పింఛన్లు అందించారు. ఏజెన్సీలోని 1,05,990 మందికి కూడా పాత పద్ధతిలో పింఛన్లు పంపిణీ చేశారు. మరో 26,058 మందికి వేలిముద్రలు సరిపోలడం లేదు. దీంతో వారికి ఈ నెలలో ఇప్పటివరకూ పింఛన్లు అందలేదు. మరోపక్క నెట్వర్కులు పని చేయక కొన్నిచోట్ల, యంత్రాలు మొరాయించి కొన్నిచోట్ల పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. కొన్నిచోట్ల బ్రాంచి పోస్ట్మాస్టర్ వేలిముద్రలతో కొందరికి పింఛన్లు ఇచ్చే అవకాశం కల్పించారు. అయినప్పటికీ ఈ నెలలో ఇప్పటికీ ఇంకా వేలాదిగా వృద్ధులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సకాలంలో పింఛన్లు అందించాలని పలువురు కోరుతున్నారు.