PP rajan thackre
-
'ఉరి శిక్ష విధిస్తారని అనుకోలేదు'
ముంబయి: ఉరి శిక్ష విధిస్తారని తాను అస్సలు ఊహించలేదని అనూహ్యపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేసిన నేరస్తుడు చంద్రభాన్ అన్నాడు. తాను అసలు ఎలాంటి నేరం చేయలేదని అనవసరంగా తనపై ఈ నేరాన్ని రుద్దుతున్నారని చెప్పాడు. కోర్టు తీర్పు వినగానే కోర్టు హాల్లోనే కూలబడ్డ చంద్రభాన్ సనాప్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడు. మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అనూహ్యపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను చంద్రభాన్ హత్య చేసినట్లు కోర్టు తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో 2012నాటి ఢిల్లీ అత్యాచారానికి సంబంధించిన స్పందనే వచ్చిందని కోర్టు తెలిపింది. మహిళలకు సురక్షితంగా ఉన్న ముంబై ప్రతిష్టను ఈ నేరం దెబ్బతీసిందని కూడా కోర్టు పేర్కొంది. అతడు అరుదై నేరం చేశాడని, అందుకే ఉరి శిక్ష విధిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు సమాజానికి ఓ సంకేతం కావాలని, గట్టి హెచ్చరిక గా ఉంటుందని పేర్కొంది. -
అనూహ్య హంతకుడికి ఉరిశిక్ష
-
అనూహ్య హంతకుడికి ఉరిశిక్ష
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసులో దోషీ చంద్రభాన్కు ఉరిశిక్ష విధించారు. శుక్రవారం ముంబై కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముంబై కోర్టు చంద్రభాన్ను దోషీగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. శిక్షను ఈ రోజు ఖరారు చేసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ.. 2014 జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్ వద్ద అనూహ్య అదృశ్యమైంది. టాక్సీ డ్రైవర్ చంద్రభాన్ ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ కేసులో చంద్రభాన్కు శిక్ష ఖరారుకు సంబంధించి బుధవారం కోర్టులో వాదనలు జరిగాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజన్ థాక్రే.. చంద్రభాన్కు ఉరి శిక్ష విధించాలని కోర్టును కోరారు. చంద్రభాన్ క్రూరమైన నేరానికి పాల్పడ్డాడని, అనూహ్యను అత్యాచారం చేసి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చివేశాడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి కేసుల్లో కోర్టులు కఠినంగా వ్యవహరించాయని, చంద్రభాన్కు అత్యంత కఠిన శిక్ష విధించాలని రాజన్ థాక్రే కోర్టుకు విన్నవించారు. -
'చంద్రభాన్కు ఉరిశిక్ష విధించండి'
ముంబై: తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసులో దోషీగా తేలిన చంద్రభాన్కు ఈ నెల 30న శిక్ష ఖరారు చేయనున్నారు. ఈ కేసులో శిక్ష విధింపుపై బుధవారం ముంబై కోర్టులో వాదనలు జరిగాయి. తుది తీర్పును 30కి వాయిదా వేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజన్ థాక్రే దాదాపు 80 నిమిషాల పాటు వాదనలు వినిపించారు. చంద్రభాన్కు ఉరి శిక్ష విధించాలని రాజన్ థాక్రే కోర్టును కోరారు. చంద్రభాన్ క్రూరమైన నేరానికి పాల్పడ్డాడని, అనూహ్యను అత్యాచారం చేసి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చివేశాడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి కేసుల్లో కోర్టులు కఠినంగా వ్యవహరించాయని, చంద్రభాన్కు అత్యంత కఠిన శిక్ష విధించాలని రాజన్ థాక్రే కోర్టుకు విన్నవించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ.. 2014 జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్ వద్ద అనూహ్య అదృశ్యమైంది. టాక్సీ డ్రైవర్ చంద్రభాన్ ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. ముంబై కోర్టు చంద్రభాన్ను దోషీగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
'చంద్రభాన్కు ఉరిశిక్ష విధించండి'