prafulla kumar mahanta
-
డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె!
గౌహతి: ఓ ఆటోడ్రైవర్ను మాజీ సీఎం కుమార్తె చెప్పుతో కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హై సెక్యూరిటీ మధ్య డ్రైవర్ను మొకాళ్లపై కూర్చొబెట్టి మాజీ సీఎం కుమార్తె చెప్పుతో కొడుతున్న దృశ్యాల్ని స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.అస్సాం రాజధాని గౌహతిలోని శివారు ప్రాంతమైన డిస్పూర్లోని రాష్ట్ర ప్రజాప్రతినిధులు నివాసం ఉండే ఎమ్మెల్యే హాస్టల్లో మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె ప్రజోయితా కశ్యప్ ఆటోడ్రైవర్ను దుర్భాషలాడుతూ చితక బాదారు.A video of an incident allegedly involving former Assam CM Prafulla Kumar Mahanta's daughter, has gone viral on social media.The footage purportedly shows her thrashing the driver and making him hold his ear, leading to accusations of mental harassment. The incident reportedly… pic.twitter.com/ibx9EKoReV— India Today NE (@IndiaTodayNE) March 3, 2025ఈ ఘటన వెలుగులోకి ప్రజోయితా కశ్యప్ స్పందించారు. బాధితుడు తన ఇంట్లో సుదీర్ఘకాలంగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎప్పుడూ తాగుతూ ఉంటాడు. తాగిన ప్రతీసారి నా గురించి చెడుగా మాట్లాడేవాడు. ఇది సరైన పద్దతి కాదని పలు మార్లు చెప్పా.ఈ విషయం అందరికి తెలుసు.ఈ రోజు మద్యం మత్తులో మా ఇంటి బాదాడు. అందుకే కొట్టా’నని తెలిపారు. అయితే, అసభ్యంగా ప్రవర్తించే డ్రైవర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారా? బాధితుడు ప్రభుత్వ డ్రైవరా? ప్రైవేట్ డ్రైవరా? అని ప్రశ్నిస్తే ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అస్సాం గణ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్లకుమార్ మహంత రెండుసార్లు అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. -
మాజీ సీఎంకు గాయాలు
గువాహటి: అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రపుల్ల కుమార్ మహంతా రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రయాణిస్తున్న కారు నాగాన్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. నిలిపివుంచిన ట్రక్కును కారు ఢీకొనడంతో ఈ దర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రపుల్లకుమార్ కుమారుడితో పాటు ముగ్గురు గాయపడ్డారు. వీరందరినీ నాగాన్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని సన్నిహితులు తెలిపారు. ప్రపుల్ల కుమార్... గువాహటి నుంచి తన నియోజకవర్గం బర్హంపూర్ కు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణాలు వెంటనే వెల్లడి కాలేదు. -
'1950 నుంచి నిర్లక్ష్యం చేశారు'
గౌహతి: ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులకు కాంగ్రెస్ నిర్లక్ష్యపు విధానాలే కారణమని అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్లా కుమార్ మహంతా మండిపడ్డారు. ఈ విధానం 1950 నుంచి కొనసాగుతుండటం వల్లే రాష్ట్రం వెనుకబడిపోయిందన్నారు. అస్సోం గణపరిషత్ (ఏజీపీ) 30 వ వార్షికోత్సవంలో భాగంగా ఆరంభ వేడుకలకు విచ్చేసిన మహంతా.. రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారశైలిపై మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో నేటి పరిస్ధితులకు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా కారణమన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అంధఃపాతాళానికి నెట్టేశాయని దుయ్యబట్టారు. ఇన్నాళ్లు కేంద్ర ఏమి అడిగినా ఇస్తుందన్న ముఖ్యమంత్రి తరుణ్ గోగయ్.. వరదల సమయంలో కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లభించడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అస్సాంలో శాంతి యుత వాతావరణంతో పాటు అభివృద్ధికి కాంగ్రెస్, బీజేపీలు ఆసక్తి కనబరచలేదని ఆయన స్పష్టం చేశారు. -
ఏనుగు చతికిలబడిపోయింది
ఒకప్పుడు ఆ ఏనుగు కదిలితే అందరూ గడగడలాడిపోయేవారు. కానీ అదే ఏనుగు ఇప్పుడు పూర్తిగా చతికిలబడిపోయింది. ఎంత చేసినా మళ్లీ లేచి నిలబడటం లేదు. ఏనుగుని నిలబెట్టేంత బలం ఎవరికీ లేదు. ఈశాన్య భారతంలోని అసొం రాష్ట్ర రాజకీయాలను మూడు దశాబ్దాలు శాసించిన అసొం గణపరిషత్ పరిస్థితి దాని ఎన్నికల గుర్తైన ఏనుగు లాగానే ఉంది. అసొం గణపరిషత్ (ఏజీపీ) లేవలేదు. లేస్తే నడవలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు 62 ఏళ్ల ప్రఫుల్ల కుమార్ మహంత కూడా పార్టీకి కొత్త ఊపిరి నింపలేకపోతున్నారు. నింగికెగిరి.... నేలరాలిన నేత.... నిజానికి ప్రఫుల్ల కుమార్ మహంత దేశంలో చాలా విలక్షణమైన ముఖ్యమంత్రి. కాలేజీ హాస్టల్ నుంచి సరాసరి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారాయన. కనీసం వార్డు మెంబర్ గానైనా పోటీ చేయకుండా ఏకంగా సీఎం అయ్యారాయన. ముఖ్యమంత్రి అయిన తరువాత పెళ్లి చేసుకున్న ఏకైక సీఎం బహుశః ఆయనేనేమో. 1980 వ దశకంలో అసొం నుంచి విదేశీయులను తరిమేయాలన్న డిమాండ్ తో జరిగిన భారీ ఉద్యమం నుంచి ప్రఫుల్ల కుమార్ మహంత పుట్టుకొచ్చారు. గువహటి విశ్వవిద్యాలయంలో మామూలు విద్యార్థిగా ఉన్న మహంత ఈ ఉద్యమంలో అసొం విద్యార్థి సంస్థ 'ఆసు' నాయకుడిగా ఉద్యమానికి సారథ్యం వహించారు. 1985 లో అసొం ఒప్పందం తరువాత ఈ ఉద్యమసంస్థలన్నీ అసొం గణపరిషత్ గా ఏర్పడ్డాయి. 1986 లో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ అనుభవరాహిత్యం, అంతర్గత కలహాలతో ఏజీపీ కొద్ది రోజులకే అన్ పాపులర్ అయిపోయింది. ప్రఫుల్ల కుమార్ మహంత తన లెక్చరర్ జయశ్రీ గోస్వామిని వివాహం చేసుకోవడం, ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన వివాహేతర సంబంధం బట్టబయలు కావడం వంటి సంఘటనలు పార్టీని మరింత దిగజార్చాయి. అయిదేళ్ల తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 1997 లో మళ్లీ అధికారంలోకి వచ్చినా ఏజీపీ తీరు మారలేదు. పార్టీ నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరో వైపు ఉల్ఫా ఉగ్రవాదం కూడా ప్రబలింది. 2000 లో జరిగిన ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచీ గత పదమూడేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ నానాటికీ బలోపేతం అవుతున్నారు. పతనం దిశగా పరుగు 2004 నుంచి జరిగిన అన్ని లోకసభ ఎన్నికల్లో ఏజీపీ పతనం దిశగా పరుగు కొనసాగిస్తూనే వచ్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 సీట్లలో ఏజీపీ కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకుని రాజకీయ మైదానం నుంచి దాదాపుగా వైదొలగింది. బంగ్లాదేశీ వలసదారులకు ప్రాతినిథ్యం వహించే ఆలిండియా యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్ ప్రధాన ప్రతిపక్షం అయింది. బంగ్లాదేశీ వ్యతిరేక ఉద్యమం నడిపిన అసొం లో బంగ్లాదేశీ వలసదారులే ప్రధాన రాజకీయ ప్రతిపక్షం అయి కూచోవడం విడ్డూరమే కాదు. విషాదం కూడా. మరో వైపు బిజెపి నానాటికీ బలపడుతోంది. ఇదే కొనసాగితే రాష్ట్ర రాజకీయాల్లో ఏజీపి కేవలం పేకాటలో జోకర్ గా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం లోకసభలో ఏజీపీకి ఒకే ఒక్క సీటు ఉంది. ఈ సారి ఎన్నికల్లో అది కూడా నిలబెట్టుకుంటుందా అన్నది అనుమానమే. రాజకీయంగా పరాజితుడైన నాయకుడిగా ప్రఫుల్ల మహంత నిలిచిపోతారా? దేశంలో పుట్టి, గిట్టిన అనేక పార్టీల్లో ఏజీపీ కూడా ఒకటిగా మిగిలిపోతుందా? లేక ఏదైనా అద్భుతం జరిగి ఏనుగు లేచి నిలబడి, మళ్లీ పరుగులు తీస్తుందా? జస్ట్ 40 రోజులాగండి.... తెలిసిపోతుంది.