praneeth kumar
-
స్వగ్రామానికి విద్యార్థి మృతదేహం
నల్లమాడ : కర్నూలు జిల్లా నంద్యాలలో రైలు కిందపడి మరణించిన నల్లమాడ మండలం ఎర్రవంకపల్లికి చెందిన ప్రణీత్కుమార్(24) అనే విద్యార్థి మతదేహాన్ని స్వగ్రామానికి శనివారం తీసుకువచ్చారు. గ్రామానికి చెందిన అన్నం లక్ష్మీనారాయణ కుమారుడైన ప్రణీత్ గతంలో ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తూ, ఇటీవలే గ్రూప్స్ కోచింగ్ నిమిత్తం నంద్యాలకు వెళ్లాడు. అక్కడ గురువారం పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి అక్కడికక్కడే మతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. చెట్టంతా కుమారుడు అకాల మత్యువాతపడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదం అలుముకుంది. మతదేహాన్ని పలువురు నాయకులు, గ్రామస్తులు సందర్శించారు. -
మహిళ నుంచి పుస్తెలతాడు చోరీ
నల్గొండ: జిల్లాలోని బీబీనగర్ మండలంలోని చిన రావులపల్లి గ్రామ శివారులో గురువారం ఓ మహిళను నమ్మించి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును అపహరించి పోయారు. ఎస్ఐ ప్రణీత్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం చిన్నరావులపల్లి గ్రామానికి చెందిన బొమ్మగాని కమలమ్మ, ఎప్పటిలాగానే చిన్నరావులపల్లి నుంచి రాఘవాపూరం వెళ్లే రహదారి మధ్యలో కల్లు అమ్ముతుండగా గుర్తుతెలియని ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి కల్లు కవాలని అడగంతో కమలమ్మ భర్త వెంకటస్వామిగౌడ్ కల్లు గీసేందుకు తాడు ఎక్కగా అక్కడ ఉన్న ఇద్ధరు యువకులు కత్తలతో బెదిరించడంతో ఆమె మెడలోని నాలుగు తులాల పుస్తెల తాడును వారికి ఇచ్చింది అక్కడ నుంచి యువకులు పారిపొయినట్లు తెలిపారు, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చే స్తున్నాట్లు ఎస్ఐ తెలిపారు.