17 నుంచి నాలుగో విడత సమైక్య శంఖారావం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం యాత్రను ఈ నెల 17వ తేదీన చిత్తూరు జిల్లా నగరి నుంచి పునఃప్రారంభిస్తారని పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. సంక్రాంతి పండుగ కారణంగా ఈ నెల 13 నుంచి నాలుగు రోజుల పాటు యాత్రకు జగన్ విరామం ఇచ్చిన సంగతి విదితమే. ఈ యాత్రలో భాగంగా 17న సాయంత్రం పుత్తూరు పట్టణంలో బహిరంగ సభ జరుగుతుందని రఘురాం పేర్కొన్నారు.