public mobilization arrangements
-
జిల్లాల వారీగా ఎంతెంత..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన సభ’కు జన సమీకరణపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దృష్టి సారించారు. పాత జిల్లాల వారీగా, ఆయా జిల్లాల మంత్రులకు బాధ్యతలను ఇప్పటికే అప్పగించారు. సెప్టెంబర్ 2న జరిగే ఈ సభకు ఏయే జిల్లా నుంచి ఎంత మంది వస్తున్నారు, వారికి రవాణా ఏర్పాట్లు ఎలా, వాటికి బాధ్యులు ఎవరు వంటి క్షేత్రస్థాయి విషయాలను కూడా కేసీఆర్ అడిగి తెలుసుకుంటున్నారు. హైదరాబాద్ పరిసరాల్లోని జిల్లాల నుంచి, హైదరాబాద్కు రవాణాసౌకర్యాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాల నుంచి ఎక్కువ మందిని సమీకరిం చాలని మంత్రులను ఆదేశించారు. బహిరంగసభ సాయంత్రానికి ఉన్నా, ప్రజలు మాత్రం మధ్యాహ్నంలోపుగానే మైదానానికి చేరుకు నేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కొంగర కలాన్లో జరుగుతున్న ఈ సభకు, ఔటర్ రింగురోడ్డుకు సమీప గ్రామాల వారంతా సభా ప్రాంతానికి మధ్యాహ్నంలోగానే చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిగిలిన దూర ప్రాంత జిల్లాల నుంచి 3 గంటల లోపుగానే మైదానానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రులను, బాధ్యులను కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల్లోనే మంత్రులు.. ఉమ్మడి జిల్లాకు ఇన్చార్జి మంత్రులు మొత్తంగా జిల్లా నుంచి జన సమీకరణ బాధ్యతలను నెత్తికెత్తుకున్నారు. వారు జిల్లాల్లోనే విస్తృతంగా పర్యటిస్తూ జన సమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రవాణా ఏర్పాట్లలో ఇబ్బందులు రాకుండా ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులతో మాట్లాడుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు లేదా పార్టీ ఇన్చార్జీలతో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఏయే నియోజకవర్గం నుంచి ఎంతమంది ఈ సభకు వచ్చే అవకాశం ఉంది, వారిని తరలించడానికి చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేదానిపై ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్చార్జి నుంచి నివేదికలను తీసుకుంటున్నారు. మంత్రులంతా ఏర్పాట్ల పర్యవేక్షణలో ఉంటూ ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పరిష్కరిస్తూ, తాము తీసుకుంటున్న చర్యలను కేసీఆర్కు నివేదిస్తున్నారు. గ్రామాలవారీగా బాధ్యులు జన సమీకరణకు గ్రామాల వారీగా బాధ్యులను ఏర్పాటుచేసి, లక్ష్యాలను నిర్దేశించారు. రవాణాసౌకర్యాలు, భోజనాలు, ఇతర అవసరాలను స్థానిక ఎమ్మెల్యేలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జీలు ఈ బాధ్యతలను చూస్తున్నారు. ఒక్కో గ్రామానికి ఒకరు లేదా ఇద్దరు మండలస్థాయి నేతలకు జన సమీకరణ బాధ్యతలను అప్పగించారు. గ్రామం నుంచి సభకు వ్యక్తులను తరలించడం నుంచి, వారు తిరిగి గ్రామానికి చేరే వరకు ఆ గ్రామ నాయకులతోపాటు, ఇన్చార్జిగా బాధ్యతలను తీసుకున్న నేత చూసుకోనున్నారు. -
అధికార యంత్రాంగం.. జనసమీకరణం
శ్రీకాకుళం పాతబస్టాండ్: సాధారణంగా ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అధికారిక ఏర్పాట్లు చేయడం అధికార యంత్రాంగం బాధ్యత. జనసమీకరణ ఏర్పాట్లను అధికార పార్టీ నేతలే చూసుకుంటారు. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఈ నెల 17, 18 తేదీల్లో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారు కాగా.. అధికారిక ఏర్పాట్లతోపాటు జనసమీకరణ బాధ్యత కూడా జిల్లా అధికారుల పైన రుద్దారు. దాంతో ఆ ఏర్పాట్ల కోసం వారు మల్లగుల్లాలు పడుతున్నారు. బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి విలేకరులను కూడా అనుమతించకుండా జనసమీకరణపైనే ప్రధానంగా చర్చించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జన సమీకరణకు ఏ శాఖ ఎంత ఖర్చు చేయాలి, ఎవరు ఎన్ని వాహనాలు ఏర్పాటు చేయాలి, ఏ శాఖ ఎంతమంది జనాన్ని తరలించాలి.. తదితర అంశాలను చర్చించినట్లు తెలిసింది. మొదటిరోజు నరసన్నపేటలో జరిగే రైతు సదస్సుకు 25 వేల మంది రైతులను, అనంతరం శ్రీకాకుళం వరకు జరిగే రోడ్డుషోకు వేలమంది జనాన్ని పోగేయాలని నిర్దేశించారు. ఇక రెండోరోజు రణస్థలంలో జరిగే మహిళా సంఘాల సమావేశానికి 30 వేలకు తక్కువ కాకుండా మహిళలను తరలించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు సమాచారం. రైతు సదస్సుకు 400 బస్సులు, మహిళా సదస్సుకు 500 బస్సులను సిద్ధం చేయాలని నిర్ణయించారు. రైతుల సమీకరణ బాధ్యతను డ్వామా పీడీకి, మహిళల సమీకరణ బాధ్యతను డీఆర్డీఏ పీడీకి అప్పగించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీల విషయంలో టీడీపీ ప్రభుత్వం సాచివేత విధానం అనుసరిస్తుండటం పై ఆయా వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఈ తరుణంలో వస్తున్న ముఖ్యమంత్రి పర్యటనను అధికార పార్టీ నేతలు తెలివిగా అధికారులపైకి నెట్టేశారు.జన సమీకరణలో విఫలమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. పర్యటన ఇలా... తాత్కాలికంగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు ఈ నెల 17న ఉదయం హెలికాప్టర్లో నరసన్నపేటకు చేరుకుంటారు. అక్కడ రైతు సదస్సులో పాల్గొని, అనంతరం రోడ్షో ద్వారా శ్రీకాకుళం చేరుకుంటారు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. తర్వాత జిల్లా పరిషత్ లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. రాత్రి శ్రీకాకుళం ఆర్అండ్బీ అతిధి గృహంలో బస చేస్తారు. 18న ఉదయం కలెక్టరేట్ సమీపంలో ఉన్న డచ్ బంగ్లా వద్ద పర్యాటకాభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ నుంచి పైడిభీమవరం వెళ్లి వీకేపీ ఫార్మాలో కొత్త యూనిట్లకు ప్రారంభ, శంకుస్థాపనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రణస్థ లం చేరుకొని మహిళా సంఘాల సభ్యులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి విశాఖపట్నం వెళతారు.