Punjab election results 2017
-
సిద్ధూ జాక్ పాట్!
చండీగఢ్: మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ జాక్ పాట్ కొట్టారు. అమృత్ సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఎటువైపు వెళతారనే దానిపై ఎన్నికలకు ముందు చాలా చర్చ జరిగింది. చివరకు ఆయన గెలుపు గుర్రంవైపే అడుగులు వేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంతంగా ఆవాజ్–ఎ–పంజాబ్ పార్టీని స్థాపించారు. అయితే సొంత పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం సరిపోదన్న ఆలోచనతో ఆయన తెలివిగా అడుగులు వేశారు. అకాలీదళ్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయం గ్రహించి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. సిద్ధూ చేరికతో కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం చేకూరినట్టైంది. ఇంతకుముందు తన భార్య నవజ్యోత్ కౌర్ పోటీ చేసిన అమృత్ సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగి భారీ విజయాన్ని అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం కావడంతో ఆయనకు కీలక పదవి దక్కే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి ఇవ్వొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పంజాబ్ విజయాన్ని రాహుల్ గాంధీకి కానుకగా ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన సిద్ధూ మాట నిలబెట్టుకున్నారు. ఉప ముఖ్యమంత్రి ఎవరనేది రాహుల్ గాంధీ చెబుతారని అమరీందర్ సింగ్ ప్రకటించడంతో సిద్ధూకు డిప్యూటీ సీఎం పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం మొదలైంది. -
‘ఆరంభం మాత్రమే.. దూసుకెళ్తాం’
చండీగఢ్: పంజాబ్ విజయం ఆరంభం మాత్రమేనని, కాంగ్రెస్ ఇక దూసుకెళ్తుందని మాజీ క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. అధికార అకాలీదళ్ గర్వం కారణంగానే ఓడిపోయిందని వ్యాఖ్యనించారు. దుష్టులను ప్రజలు ఓడించారని, ఎన్నికల్లో ధర్మమే గెలిచిందని పేర్కొన్నారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ కొత్త సంవ్సతర కానుక అని వర్ణించారు. పంజాబ్ గెలుపుతో కాంగ్రెస్ కు పునరుత్తేజం వచ్చిందని, ఇక్కడి నుంచే తమ పార్టీ విస్తరిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అమృత్ సర్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ధూ ముందంజలో ఉన్నారు. -
‘ఆరంభం మాత్రమే.. దూసుకెళ్తాం’