రెజ్లర్ సతీశ్ యాదవ్కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు క్రీడల్లో భాగంగా జరిగిన రెజ్లింగ్ ఈవెంట్లో ఆర్. సతీశ్లాల్ యాదవ్కు స్వర్ణ పతకం లభించింది. హైదరాబాద్ సిటీ పోలీసులోని కమాండో వింగ్లో పనిచేస్తున్న 27 ఏళ్ల సతీశ్ పురుషుల 70 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో విజేతగా నిలిచాడు. వైజాగ్లో ఇటీవల జరిగిన ఈ పోటీల్లో సతీశ్ జూడో క్రీడాంశంలోనూ బరిలోకి దిగి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. రెండు పతకాలు సాధించిన సతీశ్ను నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ అభినందించారు.