raghumareddi
-
అతితక్కువ ధరకు సోలార్పవర్!
టెండర్లలో దేశంలోనే కొత్త రికార్డు సగటున యూనిట్కు రూ.6.72 వచ్చేవారంలో టెండర్ల ఖరారు సాక్షి, హైదరాబాద్: సోలార్విద్యుత్ టెండర్లలో కొత్తరికార్డు నమోదైంది. తెలంగాణలో సగటున రూ.6.72కే ఒక యూనిట్ విద్యుత్ లభ్యం కానుం ది. సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి దేశంలో అత్యల్ప సగటురేటు ఇదేనని తెలంగాణ ఎస్పీడీసీఎల్ అధికారులు ధ్రువీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సోలార్పవర్ సగటు యూనిట్ రేటు రూ.6.80గా నమోదైంది. అక్కడితో పోలిస్తే కంపెనీలు బిడ్లు దాఖలు చేయడంలో పోటీపడ్డారు. దీంతో సగటురేటు తక్కువగా నమోదైందని టీఎస్ ఎస్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రఘుమారెడ్డి తెలిపారు. టెండర్ల పరిశీలన ఇటీవలే పూర్తయింది. వారం రోజుల్లో ఎంపికైన కంపెనీల కు ఇండెంట్ లెటర్లు పంపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముందుకొచ్చిన కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. 15 నెలల వ్యవధిలో కంపెనీలు విద్యుత్ సరఫరా చేయాలి. ఆలస్యమైతే జరిమానా విధించే నిబంధనలున్నాయి. ఒప్పంద సమయంలో ఒక్కొక్క యూనిట్కు రూ.20 లక్షల చొప్పున డిస్కంలకు ఆయా కంపెనీలు బ్యాంకుగ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. విద్యుత్ సరఫరాకు నిర్దేశించిన గడువు పూర్తయ్యాక ఆరునెలలు దాటితే ఆ గ్యారంటీ మొత్తాన్ని డిస్కంలు జప్తు చేసుకుంటాయి. తొలిసారి 500 మెగావాట్ల కొనుగోలు రాష్ట్రంలో విద్యుత్తు కొరతను అధిగమించేందుకు టీఎస్ఎస్పీడీసీఎల్ గతనెలలో 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. దాఖలైన బిడ్లలో ఒక కంపెనీ కనిష్టంగా రూ.6.45 రేటును పేర్కొంది. టెండర్లలో పాల్గొన్న 108 కంపెనీలకు 1840 మెగావాట్ల సౌరవిద్యుత్ సమకూర్చే సామర్థ్యం ఉంది. అయితే, ముందుగా 500 మెగావాట్లు కొనుగోలుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో తక్కువరేటు ప్రాతిపదికన రూ.6.45 నుంచి రూ.6.90 వరకు ధర కోట్ చేసిన 33 కంపెనీలకు టెండర్లు దక్కే అవకాశముం ది. ఇప్పటికే అధికారులు జాబితాను ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో రెండు మెగావాట్ల నుంచి 100 మెగావాట్లను ఉత్పత్తి చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీలు ఉన్నాయి. తక్కువరేటు కంపెనీల ఆసక్తి దృష్ట్యా 500 మెగావాట్లకు మించి విద్యుత్తు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. -
బకాయిల వసూళ్లలో అలసత్వాన్ని సహించం
మహబూబ్నగర్ అర్బన్ : లక్ష్యాల మేరకు విద్యుత్ బకాయిల ను వసూలు చేయడంలో ఆలసత్వాన్ని సహించేది లేదని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మహబూబ్నగర్ పట్టణంలోని విద్యుత్ భవన్ సమావేశ మందిరంలో విద్యుత్ శాఖకు చెందిన డీఈఈలు, ఏఈఈలు తదితర క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో సీఎండీ సమీక్షా సమావేశం నిర్వహిం చా రు. ఐఆర్ పోర్టు మీటర్లు బిగించినందున బిల్లులు ఎక్కవ నమోదయ్యాని, అందుకే ఔట్ స్టాండింగ్ పెరిగిందని పలువురు ఏడీఈలు, ఏఈలు చెప్పడంతో సీఎండీ వారిపై మండిపడ్డారు. ఐఆర్ మీటర్ల సాకుచూపి టార్గెట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని మందలించారు. ఈ సందర్భంగా డివిజన్, మండలాల వారీగా విద్యుత్ రెవెన్యూపై సమగ్ర వివరాలు సేకరించారు. వినియోగదారులకు విద్యు త్ సేవలు అందించడం ఎంత ముఖ్యమో వారినుంచి బకాయిలు వసూలు చే యడం కూడా అంతే ముఖ్యమన్నారు. పెండింగ్ బకాయిలను రాబట్టుకోవడం లో అధికారులు అన్నిరకాల ప్రయత్నా లూ చేయాలని సూచిం చారు. నెలాఖరులోగా గృహావసరాలు, వాణిజ్య సముదాయాల బిల్లులతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన బకాయిలను పూర్తిగా వసూలు చేయాలని, లేకుంటే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించా రు. కరెంటు ఉత్పత్తి, సరఫరా ఆశాజనకంగా ఉన్నప్పటికీ విని యోగదారులు పెండింగ్ బిల్లులు ఎం దుకు ఇవ్వరని గద్దించారు. ఖరీఫ్ పంట లు చేతికొస్తున్నందున రైతులకు నచ్చజెప్పి వ్యవసాయరంగ బకాయిలను 100 శాతం వసూ లు చేయలని సూచించారు. బిల్లుల వ సూలులో కొడంగల్ సబ్ డివిజన్ పూర్తి గా వెనుకబడిందని, ఇదే పరిస్థితి కొనసాగితే కఠినచర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. సమావేశంలో సంస్థ ఆపరేషన్ విభాగం డెరైక్టర్ నాగేందర్, రంగారెడ్డి సీజీఎం పాండ్యానాయక్, వివిధ విభాగాల డీఈఈలు, తదితరులు పాల్గొన్నారు.