Rajkamal
-
అది చూసి వణికి పోయాం!
ఊహించని సంఘటనలు జరగడమే జీవితం. అయితే ఒక్కోసారి ఎదురైన భయంకర సంఘటలను ఎప్పటికీ మరువలేం. మేల్నాట్టు మరుమగన్ చిత్ర యూనిట్ అలాంటి సంఘటనే చవి చూసిందట. ఉదయ క్రియేషన్స్ పతాకంపై మనో ఉదయకుమార్ నిర్మిస్తున్న చిత్రం మేల్నాట్టు మరుమగన్. రాజ్కమల్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆండ్రియన్ నాయకిగా పరిచయం అవుతోంది. కాగా వీఎస్.రాఘవన్, అంజలిదేవి, అశోక్రాజ్, శాంతయ్య ముఖ్యపాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఎంఎస్ఎస్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్లో జరిగిన ఒక ప్రాణ భయం లాంటి సంఘటన గురించి దర్శకుడు తెలుపుతూ ఇటీవల చిత్రంలోని యారో ఇవన్ యార్ ఇవనో అనే పాటను చిత్రీకరించడానికి కొత్తగిరి ప్రాంతానికి వెళ్లామని తెలిపారు. అక్కడ తాను, ఛాయాగ్రాహకుడు తదితర చిత్ర యూనిట్ ఒక ఇంట్లో బస చేశామన్నారు. ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లినా, బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చినా తనకు ముందుగా తెలియజేయాలని ఆ ఇంటి యజమాని హెచ్చరించాడన్నారు. ఇది ప్రమాదకరమైన ప్రాంతం అని, పులులు తిరుగుతుంటాయని చెప్పాడన్నారు. తామూ అతను చెప్పినట్లే నడుచుకున్నామని తెలిపారు. అతను తుపాకీ చేతపట్టి తమను క్షేమంగా తీసుకెళ్లేవాడని చెప్పారు. ఆ వ్యక్తి ఇంట్లో ఒక పెద్ద వేట కుక్కను పెంచుకున్నాడని తెలిపారు. ఒక రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చామన్నారు. ఉదయం లేచి చూడగా ఇంటి యజమాని పెంచుకున్న కుక్క కనిపించకపోవడంతో ఏమైందని అడగ్గా అతను సీసీ కెమెరాలో నమోదైన సన్నివేశాలను చూపించాడన్నారు. అది చూసి తాము భయంతో వణికి పోయామన్నారు. ఆ రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక చిరుతపులి వచ్చి ఈ కుక్కను చంపేసింది. తాము కాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే ఆ చిరుతపులి బారిన పడేవాళ్లమన్న సంఘటనను తలచుకుంటేనే భయంతో వణుకుపుడుతోందన్నారు. అలా పలు కష్టాలను ఎదుర్కొని తెరకెక్కిస్తున్న చిత్రం మేల్నాట్టు మరుగన్ అని దర్శకుడు చెప్పారు. చెన్నై, మహాబలిపురం, తిరుచ్చి, తంజావూర్లలో చిత్రీకరణను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. -
అది చూసి వణికి పోయాం!
తమిళసినిమా: ఊహించని సంఘటనలు జరగడమే జీవితం. అయితే ఒక్కోసారి ఎదురైన భయంకర సంఘటలను ఎప్పటికీ మరువలేం. మేల్నాట్టు మరుమగన్ చిత్ర యూనిట్ అలాంటి సంఘటనే చవి చూసిందట. ఉదయ క్రియేషన్స్ పతాకంపై మనో ఉదయకుమార్ నిర్మిస్తున్న చిత్రం మేల్నాట్టు మరుమగన్. రాజ్కమల్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆండ్రియన్ నాయకిగా పరిచయం అవుతోంది. కాగా వీఎస్.రాఘవన్, అంజలిదేవి, అశోక్రాజ్,శాంతయ్య ముఖ్యపాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఎంఎస్ఎస్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్లో జరిగిన ఒక ప్రాణ భయం లాంటి సంఘటన గురించి దర్శకుడు తెలుపుతూ ఇటీవల చిత్రంలోని యారో ఇవన్ యార్ ఇవనో అనే పాటను చిత్రీకరించడానికి కొత్తగిరి ప్రాంతానికి వెళ్లామని తెలిపారు.అక్కడ తాను, ఛాయాగ్రాహకుడు తదితర చిత్ర యూనిట్ ఒక ఇంటిలో బస చేశామన్నారు. ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లినా, బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చినా తనకు ముందుగా తెలియజేయాలని ఆ ఇంటి యజమాని హెచ్చరించాడన్నారు. ఇది ప్రమాదకరమైన ప్రాంతం అని, పులులు తిరుగుతుంటాయని చెప్పాడన్నారు. తామూ అతను చెప్పినట్లే నడుచుకున్నామని తెలిపారు.అతను తుపాకీ చేతపట్టి తమను క్షేమంగా తీసుకెళ్లేవాడని చెప్పారు. ఆ వ్యక్తి ఇంట్లో ఒక పెద్ద వేట కుక్కను పెంచుకున్నాడని తెలిపారు. ఒక రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చామన్నారు. ఉదయం లేచి చూడగా ఇంటి యజమాని పెంచుకున్న కుక్క కనిపించకపోవడంతో ఏమైందని అడగ్గా అతను సీసీ కెమెరాలో నమోదైన సన్నివేశాలను చూపించాడన్నారు.అది చూసి తాము భయంతో వణికి పోయామన్నారు1 . ఆ రోజు రాత్రి 1గంటల ప్రాంతంలో ఒక చిరుతపులి వచ్చి ఈ కుక్కను చంపేసింది. తాము కాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే ఆ చిరుతపులి బారిన పడేవాళ్లమన్న సంఘటనను తలచుకుంటేనే భయంతో వణుకుపుడుతోందన్నారు. అలా పలు కష్టాలను ఎదుర్కొని తెరకెక్కిస్తున్న చిత్రం మేల్నాట్టు మరుగన్ అని దర్శకుడు చెప్పారు. చెన్నై, మహాబలిపురం, తిరుచ్చి, తంజావూర్ లలో చిత్రీకరణను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. -
విడుదలకు సిద్ధమైన చండీకుదిరై
చండీకుదిరై చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి అయ్యాయని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు అన్భుమణి వెల్లడించారు. ఇంతకు ముందు 350కి పైగా కథలను రాసిన ఈయన పలు బుల్లి తెర సీరియళ్లకు పనిచేశారు. చండీకుదిరై చిత్రం ద్వారా వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సన్మూన్ కంపెనీ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజ్కమల్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన బుల్లితెరలో ప్రాచుర్యం పొందిన నటుడే. మానస కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో గంజాకరుప్పు, దిల్లీగణేశ్, సూర్యకాంత్, బొండామణి, రిషీఅరుళ్, పెరుమాయి ముఖ్య పాత్రలు పోషించారు. 600లకు పైగా భక్తి గీతాలను రాసి ప్రాచుర్యం పొందిన వారాశ్రీ ఈ చిత్రానికి సాహిత్యాన్ని, సంగీతాన్ని అందించారు. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈ నాగరిక రోజుల్లో ఆహారం లేకున్నా కొన్ని రోజులు జీవించగలం కానీ, చేతిలో సెల్ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి అన్నారు. ముఖ్యంగా సెల్ఫీ మోహం బాగా పెరిగిపోయిందన్నారు. అలాంటి సెల్ఫీ మోహం కారణంగా ఒక యువజంట ఎలాంటి సమస్యలకు గురయ్యారన్న ఇతి వృత్తంతో రూపొందించిన చిత్రమే చండీకుదిరై అన్నారు. విజ్ఞానాభివృద్ధి మరో పక్క వినాశనానికి దారి తీస్తుందన్న వాస్తవాన్ని ఆవిష్కరించే చిత్రం చండీకుదిరై అని తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్రానికి పి.ప్రకాశ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
మేల్నాట్టు మరుమగన్ వస్తున్నాడు
మేల్నాట్టు మరుమగన్ (విదేశీ అల్లుడు) త్వరలో తెరపైకి రానున్నాడు. డబ్బు, సంపాదన ఆశతో కొందరు విదేశాలకు పరుగులు తీస్తున్నా సంస్కృతి, సంప్రదాయాల్లో మనదేశానికి మించిన దేశం లేదు అన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం మేల్నాట్టు మరుమగన్ అని ఆ చిత్ర దర్శకుడు ఎం ఎస్ ఎస్ చెప్పారు. స్కై మూవీస్ పతాకంపై తమిళనాడు ఎస్.బహుదూర్షా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవనటుడు రాజ్కమల్ కథానాయకుడిగాను, ఆండ్రియన్ నాయకిగాను పరిచయం అవుతున్నారు. చిత్ర కథ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి కావడంతో షూటింగ్ మొత్తం తమిళనాడులోనే నిర్వహించినట్లు దర్శకుడు వెల్లడించారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని చెప్పారు. వి.కిషోర్కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ వెంటనే చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.