Real estate acquisitions
-
రియల్టీలో పీఈ పెట్టుబడులు ప్లస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి తొమ్మిది నెలల్లో రియల్టీ రంగంలోకి ప్రయివేట్ ఈక్విటీ(Private equity) పెట్టుబడులు 6 శాతం పెరిగాయి. ఏప్రిల్–డిసెంబర్లో 2.82 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రధానంగా ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్ పార్క్లు పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ గణాంకాల ప్రకారం గతేడాది(2023–24) ఇదే కాలంలో 2.66 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు లభించాయి. అయితే డీల్స్ 24కు పరిమితమయ్యాయి. గతేడాది 30 లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తం పీఈ పెట్టుబడుల్లో విదేశీ ఫండ్స్ వాటా 82 శాతంకాగా.. దేశీయంగా 18 శాతం నిధులు లభించాయి. ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ విభాగం అత్యధికంగా 62 శాతం పెట్టుబడులను సమకూర్చుకుంది. ఈ బాటలో హౌసింగ్ 15 శాతం, ఆఫీస్ విభాగం 14 శాతం, మిక్స్డ్ వినియోగ ప్రాజెక్టులు 9 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి. ఇదీ చదవండి: భారత్ ఎకానమీ వృద్ధి కోతటాప్–10 డీల్స్ హవాతొలి 9 నెలల మొత్తం పీఈ లావాదేవీలలో టాప్–10 డీల్స్ వాటా 93 శాతమని అనరాక్(Anarock Capital) క్యాపిటల్ సీఈవో శోభిత్ అగర్వాల్ వెల్లడించారు. 1.54 బిలియన్ డాలర్ల విలువైన రిలయన్స్, ఏడీఐఏ, కేకేఆర్ వేర్హౌసింగ్ డీల్ను అతిపెద్ద లావాదేవీగా పేర్కొన్నారు. దీనితోపాటు 20.4 కోట్ల డాలర్ల విలువైన బ్లాక్స్టోన్, లోగోస్ ఈక్విటీ డీల్.. లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ రంగానికి ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. ఈ రంగం మొత్తం పీఈ పెట్టుబడుల్లో 62 శాతం వాటాను ఆక్రమించుకున్నట్లు వెల్లడించారు. -
తగ్గిన స్టాంపు డ్యూటీ
సాక్షి, హైదరాబాద్: కొన్ని రకాల స్థిరాస్తి కొనుగోళ్ల రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీని తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గింపు సోమవారంనుంచి అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలు... - వారసత్వపు ఆస్తి హక్కు కలిగిన వ్యక్తి కుటుంబంలోని వ్యక్తి నుంచి స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే (సెటిల్మెంటు)కు ప్రస్తుతం మార్కెట్ విలువలో 3 శాతంగా విధించే స్టాంపు డ్యూటీ ఒక శాతానికి తగ్గింది. - స్వార్జిత ఆస్తిని కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించే సెటిల్మెంట్కు మార్కెట్ విలువలో స్టాంపు డ్యూటీ 6 శాతం నుంచి రెండు శాతానికి తగ్గింది. - రక్త సంబంధీకులకు (కొడుకు, కూతురు తదితరులకు) బహుమతి కింద చేసే రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీ 5 శాతం నుంచి ఒక శాతానికి తగ్గింది. - రక్త సంబంధీకులు కాని ఇతర కుటుంబ సభ్యులకు (అల్లుడు, కోడలు తదితరులకు) బహుమతి కింద చేసే రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీ 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. - కుటుంబ సభ్యులకు సంబంధించి భాగ పరిష్కార ఒప్పందాల రిజిస్ట్రేషన్కు స్టాంపు డ్యూటీ ఒక శాతం నుంచి అర శాతానికి తగ్గింది. ఇలా చేసుకునే దస్తావేజులలో ఆస్తి విలువకు అరశాతం స్టాంపు డ్యూటీ ఎంత ఎక్కువైనా, గరిష్టంగా రూ. 20 వేలు చెల్లిస్తే సరిపోతుంది. - కుటుంబేతరుల భాగ పరిష్కార ఒప్పందాల రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీ 3 నుంచి ఒక శాతానికి తగ్గింది. - భాగస్వామ్య సంస్థ పునరుద్ధరణ దస్తావేజుల రిజిస్ట్రేషన్కు స్టాంపు డ్యూటీ 5 శాతం నుంచి 3 శాతానికి తగ్గింది. - భాగస్వామ్య సంస్థ రిజిస్ట్రేషన్ రద్దుకు స్టాంపు డ్యూటీ 5 శాతం నుంచి 3 శాతానికి తగ్గింది. - అధీనంలో ఉన్న ఆస్తికి తనఖా దస్తావేజు రిజిస్ట్రేషన్కు 5 శాతంగా ఉన్న స్టాంపు డ్యూటీ 2 శాతానికి తగ్గింది. - సర్టిఫికెట్ ఆఫ్ సేల్, ఆస్తి బదలాయింపు తదితరాలకు స్టాంపు డ్యూటీ 5 శాతం బదులు 4 శాతం అయింది.