రేవంత్ సాయి సెంచరీ
సాక్షి, హైదరాబాద్: రేవంత్ సాయి (106) సెంచరీతో చెలరేగడంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ చాంపియన్షిప్లో విశాక జట్టు రెండు వికెట్ల తేడాతో విజయ్ హనుమాన్ టీమ్పై గెలిచింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఈ మ్యాచ్లో... మొదట బ్యాటింగ్ చేసిన విజయ్ హనుమాన్ 201 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్కు దిగిన విశాక 8 వికెట్లకు 204 పరుగులు చేసి నెగ్గింది. రేవంత్ అద్భుతమైన బ్యాటింగ్తో ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. జయరామ్ 76 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసినా ప్రయోజనం లేకపోయింది.
ఇతర మ్యాచ్ల స్కోరు వివరాలు
బ్రదర్స్ ఎలెవన్: 130 (అకేందర్ 37, కార్తీక్ 4/37); హైదరాబాద్ టైటాన్స్: 86 (అజీమ్ 4/42). న్యూబ్లూస్: 303/7; టీమ్స్పీడ్: 148 (సంతోష్ 78, దత్త ప్రకాశ్ 5/59, రమేశ్ 4/41). బడ్డింగ్ స్టార్: 160; మెగాసిటీ: 162/8 (అమ్రిత్ 50, భరత్ 5/62). జిందా: 321; సాయిసత్య: 274 (జైస్వాల్ 68, కులకర్ణీ 94, అవినాశ్ 3/53). కేంబ్రిడ్జ్ ఎలెవన్: 204; సీసీఓబీ: 192 (అఫ్సర్ 31, మీర్జా 48, కమ్రాన్ 4/47). నిజాం కాలేజి: 66 (నవజ్యోత్ సింగ్ 5/26, శశిఆనంద్ 5/26); బాలాజీ కోల్ట్స్: 67/3 (నవ్దీప్ 42). వీనస్ సైబర్టెక్: 211 (శ్రీకాంత్ 85, భాను 44, భరత్ 6/51); జై భగవతి: 215/7 (భరత్ 63, వికాస్ 45). ఎంసీసీ: 126 (అమే 3/13, అంకిత్ 3/29); హెచ్బీసీసీ: 130/5 (యుధీష్ 56, మాన్యుయేల్ 35, మోహిత్ సోని 5/35). గౌడ్స్ ఎలెవన్: 192 (తరుణ్ 56, నాగరాజ్ 44, ప్రవిత్ 5/44); ఎస్ఏ అంబర్పేట్: 97/2.