Richest People In World
-
ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల విద్యార్హతలు
ప్రపంచంలో అత్యంత ధనవంతులు(Richest People)గా ఉన్నవారు తమ స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తూంటారు. అందులో భాగంగా చాలామంది తమ సృజనాత్మకతను, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. అందుకు తమ విద్యాభ్యాసం ఎంతో తోడ్పడుతుంది. ప్రపంచంలోని టాప్ ధనవంతుల విద్యార్హతలు(Educational Qualifications) తెలుసుకుందాం.ఎలాన్ మస్క్ నికర విలువ: 400 బిలియన్ డాలర్లు, కంపెనీలు టెస్లా, స్పేస్ఎక్స్యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఆర్ట్స్ ఇన్ ఫిజిక్స్, సైన్స్ ఇన్ ఎకనామిక్స్ విభాగంగా బ్యాచిలర్స్ పూర్తి చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి మెటీరియల్స్ సైన్స్లో పీహెచ్డీ ప్రోగ్రామ్లో చేరిన కొన్ని రోజులకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కలిసి తన వ్యాపారాలు ప్రారంభించారు.జెఫ్ బెజోస్ నికర విలువ: 239.4 బిలియన్ డాలర్లు, కంపెనీలు - అమెజాన్ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు.మార్క్ జుకర్ బర్గ్ నికర విలువ: 211.8 బిలియన్ డాలర్లు, కంపెనీలు మెటా-ఫేస్బుక్హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ, కంప్యూటర్ సైన్స్ చదివారు.లారీ ఎల్లిసన్ నికర విలువ: 204.6 బిలియన్ డాలర్లు, కంపెనీలు-ఒరాకిల్యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ ఎట్ అర్బానా-చాంపైన్ నుంచి ప్రీ-మెడికల్ స్టూడెంట్గా చేరాడు. కానీ డిగ్రీ పూర్తి కాకముందే చదువు ఆపేశాడు. తర్వాత కొంత కాలానికి యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చదివినా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు.బెర్నార్డ్ అర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ నికర విలువ: 181.3 బిలియన్ డాలర్లు, కంపెనీలు ఎల్వీఎంహెచ్-లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీఎకోల్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇన్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.లారీ పేజ్ నికర విలువ: 161.4 బిలియన్ డాలర్లు, కంపెనీలు గూగుల్ (ఆల్ఫాబెట్ ఇంక్.)యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ పట్టా పొందారు.సెర్గీ బ్రిన్ నికర విలువ: 150 బిలియన్ డాలర్లు, కంపెనీలుయూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ చేశారు.వారెన్ బఫెట్ నికర విలువ: 146.2 బిలియన్ డాలర్లు, కంపెనీలు బెర్క్షైర్ హాత్వేయూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పట్టా పొందారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: ఇంటి అద్దె క్లెయిమ్ విధానంలో ఈ పొరపాట్లు వద్దు..స్టీవ్ బామర్ నికర విలువ: 126 బిలియన్ డాలర్లు, కంపెనీలు మైక్రోసాఫ్ట్హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ ఇన్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చేరారు. కానీ మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం రావడం వల్ల చదువు మధ్యలోనే ఆపేశారు.జెన్సెన్ హువాంగ్ నికర విలువ: 120.2 బిలియన్ డాలర్లు, కంపెనీలు ఎన్విడియాఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు. -
ఈ ఏడాది ప్రపంచ కుబేరులు వీరే.. జాబితా ఇదే!
ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న తరుణంలో వ్యాపారవేత్తలు తమదైన రీతిలో బిజినెస్ చేస్తూ నువ్వా.. నేనా అన్నట్లు ముందుకు దూసుకెళ్తున్నారు. ఇటీవల ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 10 మంది జాబితా విడుదల చేసింది. ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ప్రపంచ కుబేరుడిగా మళ్ళీ టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) నిలిచాడు, ఆ తరువాత స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ, జెఫ్ బెజోస్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో స్టీవ్ బాల్మెర్ (మైక్రోసాఫ్ట్), సెర్గీ బ్రిన్ (గూగుల్) నిలిచారు. టాప్ 10 ప్రపంచ కుబేరుల జాబితా ఇలాన్ మస్క్ (Elon Musk) - 227.8 బిలియన్ డాలర్స్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ - 179.3 బిలియన్ డాలర్స్ జెఫ్ బెజోస్ - 174.0 బిలియన్ డాలర్స్ లారీ ఎల్లిసన్ - 134.9 బిలియన్ డాలర్స్ మార్క్ జుకర్బర్గ్ - 130.2 బిలియన్ డాలర్స్ బిల్ గేట్స్ - 119.9 బిలియన్ డాలర్స్ వారెన్ బఫెట్ - 119.2 బిలియన్ డాలర్స్ లారీ పేజీ - 118.7 బిలియన్ డాలర్స్ స్టీవ్ బాల్మెర్ - 115.4 బిలియన్ డాలర్స్ సెర్గీ బ్రిన్ - 113.8 బిలియన్ డాలర్స్ -
ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్?
న్యూయార్క్, సాక్షి: ఓవైపు ఎలక్ట్రిక్ కార్ల తయారీ, మరోపక్క స్పేస్ఎక్స్తో ప్రయోగాలు.. వెరసి ఏడాది కాలంగా ఈ ఇంజినీర్ సరికొత్త రికార్డులను సాధిస్తూనే ఉన్నాడు. అతడే టెస్లా ఇంక్ చీఫ్ ఎలన్ మస్క్. బుధవారం టెస్లా ఇంక్ షేరు 3 శాతం బలపడటంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 716 బిలియన్ డాలర్లను అధిగమించింది. దీంతో కంపెనీ ప్రమోటర్గా 20 శాతం వాటా కలిగిన మస్క్ వ్యక్తిగత సంపద 181.1 బిలియన్ డాలర్లను తాకింది. వెరసి ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్కు చేరువయ్యాడు. జెఫ్ బెజోస్ సంపద 183.4 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. ప్రస్తుతం అమెజాన్ మార్కెట్ విలువ 1.57 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అమెజాన్లో బెజోస్ 11 శాతం వాటాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. 2017 అక్టోబర్ నుంచీ జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలుస్తుండటం విశేషం! (జుకర్బర్గ్ను దాటేసిన ఎలన్ మస్క్?) ఏడాది కాలంలో ఏడాది కాలంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయంతో టెస్లా ఇంక్ చీఫ్ ఎలన్ మస్క్ పలు రికార్డులను సాధిస్తూ వస్తున్నారు. మరోపక్క అమెజాన్ బెజోస్కు చెందిన బ్లూ ఒరిజిన్ కంపెనీకి ప్రయివేట్ అంతరిక్ష సేవల్లో స్పేస్ ఎక్స్ప్లొరేషన్ టెక్నాలజీస్ కార్ప్ ద్వారా సైతం మస్క్ పోటీనిస్తుండటం గమనార్హం! కాగా.. గత ఏడాది కాలంలోనే మస్క్ సంపద ఏకంగా 150 బిలియన్ డాలర్లమేర జంప్చేసింది. తద్వారా ప్రపంచంలోనే వేగవంతంగా సంపదను పెంచుకున్న నలుగురిలోనూ మస్క్ చోటు సాధించారు. ఈ కాలంలో టెస్లా షేరు ఏకంగా 743 శాతం దూసుకెళ్లింది. కొన్ని త్రైమాసికాలుగా కంపెనీ లాభాలు ఆర్జించడం ద్వారా అమెరికా స్టాక్ ఇండెక్స్ ఎస్అండ్పీ-500లో చోటు సాధించడం ఇందుకు ప్రధానంగా దోహదపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎస్అండ్పీ-500కు ప్రాతినిధ్యం వహించే కంపెనీలలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. (అమెజాన్.. జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డ్) ఆటో దిగ్గజంగా బుధవారం(6న) టెస్లా షేరు పుంజుకోవడంతో మార్కెట్ విలువ రీత్యా టెస్లా ఇంక్ ప్రపంచంలోనే నంబర్ వన్ ఆటో దిగ్గజంగా మరింత బలపడింది. నిజానికి పూర్తిస్థాయి ఆటో కంపెనీ కాకున్నప్పటికీ కంపెనీ మోడల్-3 ఎలక్ట్రిక్ కార్లను ప్రపంచంలోనే అత్యధికంగా విక్రయిస్తోంది. అయితే ఆటో దిగ్గజాలు ఫోర్డ్ మోటార్, జనరల్ మోటార్స్ విక్రయిస్తున్న కార్ల సంఖ్యతో పోలిస్తే ఇవెంతో తక్కువ అయినప్పటికీ మార్కెట్ విలువలో వీటిని గతేడాదిలోనే అధిగమించేసింది. టెస్లాలో మస్క్కు అదనంగా స్టాక్ అప్షన్లు సైతం ఉన్నాయి. వీటి విలువ 40 బిలియన్ డాలర్లుగా అంచనా. 2012, 2018లలో కంపెనీ నుంచి వీటిని మస్క్ పొందారు. (ఈ కొత్త కుబేరుడు- ఆసియాలోనే టాప్) టాప్-5 ఇలా గతేడాది ప్రపంచంలోని టాప్-500 కుబేరుల సంపదకు 1.8 ట్రిలియన్ డాలర్లు జమయ్యింది. అయితే టాప్-5 కుబేరుల వాటానే దీనిలో 100 బిలియన్ డాలర్లుకావడం గమనార్హం. తదుపరి 20 మంది మొత్తం సంపద 50 బిలియన్ డాలర్లు ఎగసింది. వెరసి సంపద సృష్టిలోనూ టాప్లో ఉన్న కంపెనీలే రికార్డులు సాధించినట్లు నిపుణులు ప్రస్తావిస్తున్నారు. కాగా.. ఇటీవల చైనాకు చెందిన బాటిల్డ్ వాటర్ కంపెనీ అధినేత జాంగ్ షంషాన్ తొలిసారి ప్రపంచ సంపన్న వ్యక్తుల జాబితాలో ఆరో ర్యాంకును కైవసం చేసుకోవడం విశేషం. 15.2 బిలియన్ డాలర్ల సంపదతో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ను సైతం వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే. -
85=350 కోట్లు!
దావోస్: ఓ 85 మంది. వాళ్లు చాలా..చాలా...చాలా విలువైన వాళ్లు. ఎంత విలువైన వాళ్లంటే... ప్రపంచ జనాభా 700 కోట్లనుకుంటే... అందులో సగం... అంటే 350 కోట్ల మందితో సమానమన్న మాట!!!. ఎందుకంటే ప్రపంచంలో దిగువ స్థాయిలో ఉన్న సగం మంది జనాభా మొత్తం సంపద ఎంతో... ఈ 85 మందిదీ కలిపితే అంత. ఈ విలువైన కుబేరుల్లో భారతీయ కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఉన్నారు లెండి! పేదలు మరింత నిరుపేదలుగా మారుతుండగా.. సంపన్నులు తమ సంపద సౌధాలను ఆకాశానికి నిచ్చెనేసినట్లు పెంచుకుంటూ పోతున్నారంటూ ‘ఆక్స్ఫామ్’ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) నేపథ్యంలో విడుదల చేసిన ఈ నివేదికలో... అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నింటిలోనూ ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు ఎలా పెరిగిపోతున్నాయనేదాన్ని తేటతెల్లం చేసేలా పలు అంశాలున్నాయి. ‘‘సంపన్నవర్గాలు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ఆర్థిక వ్యవస్థలు తమకు అనుకూలంగా నడిచేలా చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు’’ అని ఆక్స్ఫామ్ పేర్కొంది. ఈ 21వ శతాబ్దంలో కూడా కేవలం 85 మంది కుబేరుల చేతిలో దాదాపు 350 కోట్ల జనాభాతో సమానమైన సంపద ఉండటం చూస్తే ఆర్థికంగా ఎంత ఘోరమైన అసమానత ఉందో తేటతెల్లమవుతుంది. ఈ సంపన్నులందరినీ కలిపితే ఒక రైలు పెట్టెలో సరిపోతారు. వీళ్ల సంపద మాత్రం సగం జనాభాకు సమానం’ అని ఆక్స్ఫామ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ విన్నీ బ్యాన్యిమా వ్యాఖ్యానించారు. నివేదికలో ముఖ్యాంశాలివీ... 1970 దశకం చివరినుంచీ గణాంకాలు అందుబాటులో ఉన్న 30 దేశాలను పరిశీలిస్తే.. 29 దేశాల్లో ధనికులకు పన్నుల రేట్లు భారీగా తగ్గాయి. అంటే చాలా దేశాల్లో ధనికులు మరింత సంపన్నులు అవుతుండటంతో పాటు దానిపై తక్కువ పన్నులు చెల్లిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. గత 25 ఏళ్లలో సంపద అనేది కేవలం అతికొద్ది మంది చేతుల్లోనే బందీ అయింది. మొత్తం ప్రపంచ సంపదలో దాదాపు సగం(46 శాతం) ఒక శాతం మంది సంపన్న కుటుంబాల వద్దే ఉంది. ఈ ధనిక, పేద అసమానతలను తొలగించేందుకు ప్రపంచ దేశాలు తక్షణం చర్యలు తీసుకోవాలి. డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరవుతున్న పలు దేశాల ప్రభుత్వాధినేతలు ఈ సమస్యపై దృష్టిపెట్టాలి. పన్నులు తప్పించుకునేందుకు స్వర్గధామంగా ఉన్న దేశాల్లో ఈ కుబేరులు, కంపెనీలు తమ లక్షల కోట్ల డాలర్లను దాచి పెట్టుకొని ప్రభుత్వాలకు ఎగనామం పెడుతున్నాయి. దాదాపు 21 ట్రిలియన్ డాలర్ల సంపద(ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు) నల్లధనంగా విదేశాల్లో మూలుగుతున్నట్లు అంచనా. గడిచిన 30 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పదిమందిలో ఏడుగురి మధ్య ఆర్థిక సమానతలు తీవ్రంగా పెరిగిపోయాయి. ప్రపంచ జనాభాలో 1%గా ఉన్న సంపన్నులు మాత్రం తమ ఆదాయాన్ని భారీగా పెంచుకోగలిగారు. భారత బిలియనీర్లు పదేళ్లలో పదింతలు... భారత్లోని ఐశ్వర్యవంతుల(బిలియ నీర్ల) సంఖ్య గత దశాబ్దం కాలంలోనే పదింతలు అయిందని కూడా నివేదిక పేర్కొంది. ‘పన్నుల తగ్గింపు విధానం, తమ పలుకుబడితో ప్రభుత్వాల నుంచి రాయితీలు, ప్రోత్సాహకాల రూపంలో కంపెనీలు సొమ్మును లాగేయడం వంటివన్నీ దీనికి ప్రధాన కారణాలే. అయితే, ఈ కుబేరులు పేదలకు చేసిన సాయం నామమాత్రం’ అని తెలిపింది.