-
బొమ్మల తయారీలోకి రిలయన్స్ రిటైల్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ స్థానికంగా బొమ్మల తయారీలోకి ప్రవేశించనుంది. బొమ్మలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా హర్యానా కంపెనీ సర్కిల్ ఈ రిటైల్తో భాగస్వామ్యానికి తెరతీసింది. తద్వారా బొమ్మల బిజినెస్లో సమీకృత కార్యకలాపాలను నిర్వహించే ప్రణాళికల్లో ఉన్నట్లు రిలయన్స్ రిటైల్ సీఎఫ్వో దినేష్ తలుజా పేర్కొన్నారు. కంపెనీ ఇప్పటికే సుప్రసిద్ధ బ్రిటిష్ బొమ్మల బ్రాండ్ హామ్లేస్తోపాటు, దేశీ బ్రాండు రోవన్ విక్రయాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మల బిజినెస్లో డిజైన్ నుంచి షెల్ఫ్వరకూ రిలయన్స్ రిటైల్ వ్యూహాత్మకంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఈ సందర్భంగా పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. వెరసి బొమ్మల డిజైనింగ్, తయారీ, రిటైల్ మార్కెటింగ్ తదితరాలను చేపట్టడం ద్వారా టాయ్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. -
టాయ్స్లో ‘రోవన్’ ద్వారా రిలయన్స్ విస్తరణ
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ ఎక్కువ అమ్మకాలు నమోదయ్యే ఆట బొమ్మల మార్కెట్లో ‘రోవన్’ బ్రాండ్ ద్వారా వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తోంది. చిన్న సైజు షాపుల రూపంలో రోవన్ బ్రాండ్ను మరింత మందికి చేరువ చేయాలన్న ప్రణాళికతో ఉంది. టాయ్స్ పంపిణీ వ్యాపారాన్ని ఇప్పటి వరకు రోవన్ ద్వారా నిర్వహిస్తుండగా, దీన్నే ప్రధాన బ్రాండ్గా కస్టమర్ల ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని గురుగ్రామ్లో మొదటి ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ తెరవనుంది. తన టాయ్స్ అవుట్లెట్లో రోవన్ బ్రాండ్ ఆటబొమ్మలే కాకుండా, ఇతర బ్రాండ్ల అందుబాటు ధరల్లోని వాటినీ ఉంచనుంది. రిలయన్స్ రిటైల్ కింద బ్రిటిష్ టాయ్ రిటైల్ బ్రాండ్ హ్యామ్లేస్ కూడా ఉన్న విషయం తెలిసిందే. దీన్ని 2019లో కొనుగోలు చేసింది. హ్యామ్లేస్ ప్రీమియం టాయ్స్కు సంబంధించిన బ్రాండ్గా కొనసాగనుంది. రోవన్ బ్రాండ్ను 500–1000 చదరపు అడుగుల విస్తీర్ణం సైజు అవుట్లెట్స్తో, బడ్జెట్ ఆటబొమ్మలతో నిర్వహించాలన్నది సంస్థ ప్రణాళికగా రియలన్స్ రిటైల్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ గౌరవ్జైన్ తెలిపారు. -
కొండపోత వాన..
♦ పుదుచ్చేరి వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం ♦ బలహీనపడిన రోవాన్ ♦ తిరుమలలో విరిగిపడిన కొండచరియలు ♦ దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మరో 24 గంటలు వర్షాలు సాక్షి, నెట్వర్క్: దక్షిణ కోస్తా రైతన్నను వణికించిన వాయుగుండం ఎట్టకేలకు తీరందాటింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారకముందే బలహీనపడింది. ఇది ఉత్తర దిశగా పయనిస్తూ సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో పుదుచ్చేరికి సమీపంలో తీరాన్ని దాటింది. దీని ప్రభావానికి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా, కృష్ణా, ప్రకాశంతోపాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిశాయి.వరి, పత్తి, టమోటా, కంది పంటలు దెబ్బతిన్నాయి. చెన్నైతోపాటు నాలుగు జిల్లాలు వర్షాలకు అతలాకుతలమయ్యాయి. అంచనాలకు అందని రోవాన్ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారుతుందని, సోమవారం అర్థరాత్రి తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) ఆదివారం అంచనా వేసింది. అయితే సోమవారం మధ్యాహ్నానికే పుదుచ్చేరి వద్ద దాటవచ్చని అంచనాకు వచ్చింది. ఆదివారం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పయనించిన వాయుగుండం సోమవారం తీవ్ర వాయుగుండగా బలపడ్డాక వేగాన్ని 7 కిలోమీటర్లకు తగ్గించుకుంది. దీంతో ఆ అంచనాలకు భిన్నంగా రాత్రి వరకూ వాయుగుండం తీరం దాటకుండా సముద్రంలోనే స్థిరంగా కొనసాగుతూ వచ్చింది. ఇది వాతావరణ అధికారులను కూడా గందరగోళంలోకి నెట్టింది. మరోవైపు రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. అదేసమయంలో కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు,ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. తమిళనాడులో ఆరుగురి మృతి ఈశాన్య రుతు పవనాలు, వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం వర్షాలకు ఆరుగురు బలయ్యారు. తిరుమల రెండో ఘాట్లో కూలిన కొండచరియలు సాక్షి,తిరుమల: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుపతి నుంచి తిరుమల వెళ్లే రెండో ఘాట్రోడ్డులో పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా మూడుకిలోమీటర్ల మేర రోడ్డు మార్గాన్ని మూసివేసి వాహనాలు రెండో ఘాట్ ద్వారా తిరుమలకు మళ్లించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 5 గంటల వరకు రెండో ఘాట్రోడ్డు మూసివేయాలని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు ఇంజనీర్లను ఆదేశించారు. 14వ కిలోమీటరు వద్ద చైన్లింక్ కంచె నిర్మించిన ప్రాంతంలో సుమారు వంద టన్నుల రాళ్లు కుప్పకూలడంతో పైభాగంలోని రోడ్డు కూడా ప్రమాదకర పరిస్థితికి చేరింది. ఇంజనీర్లు వెంటనే రాళ్లను తొలగించే పనులు చేపట్టారు.
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
'అనాగరికుడు'! గేటుతీసుకుని లోపలికొచ్చి..
‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి..
బ్రహ్మ నారదుల పరస్పర శాపాలు..
అమెరికాలో కాల్పులు.. పదిమందికి గాయాలు
Nikhil Anil Brijlal Kumar Sharma: ముంబైకర్ నిఖిల్..
ఈ టీమిండియా స్టార్ల సక్సెస్ వెనుక హీరోలు తండ్రులే..!
నాన్నతో సెల్ఫీ: లవ్యూ డాడీ.. నువ్వే స్ఫూర్తి.. (ఫొటోలు)
మొబైల్ ఆర్డర్ పెడితే.. ఏమొచ్చిందో తెలుసా? ఖంగుతిన్న కస్టమర్
గంగలో భక్తుల పుణ్యస్నానాలు.. తీరంలో సందడి
Revathi Pillai: తానొక.. డిజిటల్ స్టార్.. అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్..
Advertisement