Rs 2 crores
-
రూ.2 కోట్ల మాదక ద్రవ్యాలు స్వాధీనం
భోపాల్: అధికమొత్తంలో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బెరాసియా రహదారిపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు తనిఖీ చేయగా రూ.2 కోట్ల విలువైన బ్రౌన్ షుగర్ లభించింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మధప్రదేశ్ లోని మన్ దీప్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న అహ్మద్ ఖాన్(26) అనే వ్యక్తి 1.75 కిలో గ్రాముల మాదక ద్రవ్యాలను సోమవారం అక్రమంగా తరలించే యత్నంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. ఆ సమయంలో క్రైం బ్రాంచ్ పోలీసుల కంటబడిన అతని చేతిలో ఉన్న బ్యాగును తనిఖీ చేయగా భారీగా బ్రౌన్ షుగర్ ఉన్నట్లు గుర్తించారు. ఆ మాదక ద్రవ్యాలను రాష్ట్రంలోని ఇతార్సి కి తరలిస్తున్నట్లు అతను పోలీసులకు తెలిపాడు. అయితే అతను చాలా కాలం నుంచి అక్రమంగా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
శ్రీరామ్ చిట్స్లో 2 కోట్ల విలువైన బంగారం చోరీ
-
ఖమ్మం శ్రీరామ్ చిట్స్లో భారీ దొంగతనం
-
శ్రీరామ్ చిట్స్లో 2 కోట్ల విలువైన బంగారం చోరీ
ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీరామ్ చిట్స్ శాఖ కార్యాలయంలో గత అర్థరాత్రి దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. దాంతో ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఉదయం మధిర పోలీసులను ఆశ్రయించారు. రూ.6 లక్షల నగదుతోపాటు కస్టమర్లు తాకట్టుపెట్టిన తొమ్మిది కిలోల బంగారం అపహరించుకు పోయారని శ్రీరామ్ చిట్స్ అధికారులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ బంగారం విలువ రూ. 2 కోట్లు ఉంటుందని శ్రీరామ్ చిట్స్ అధికారులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పోలీసులు దోపిడి జరిగిన శ్రీరామ్ చిట్స్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరలో ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసుల శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలోని భద్రత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఆ చోరీపై పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఆ ఘటన స్థానికంగా కలకలం రేపింది.