rtc bus overturned
-
ఆర్టీసీ బస్సు బోల్తా: ఐదుగురికి గాయాలు
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని హైవే జంక్షన్ వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల్లో ఐదుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... రహదారిపై నుంచి బస్సును పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్ను నియంత్రించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా : ముగ్గురికి గాయాలు
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బస్సును రహదారిపై నుంచి పక్కకు తప్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.