కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని హైవే జంక్షన్ వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల్లో ఐదుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... రహదారిపై నుంచి బస్సును పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్ను నియంత్రించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.