ఆర్టీసీ బస్సు బోల్తా : ముగ్గురికి గాయాలు | Three passengers injured in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా : ముగ్గురికి గాయాలు

Published Tue, Nov 10 2015 8:15 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బస్సును రహదారిపై నుంచి పక్కకు తప్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement