safest place
-
America: 10 సురక్షిత రాష్ట్రాలు.. కాల్పుల మోతకు దూరం.. ప్రాణహానికి సుదూరం
అమెరికాలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో అప్పుడప్పుడు చోటుచేసుకునే కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తుంటాయి. గత సంవత్సరం అంటే 2024లో అమెరికాలోని పలు పాఠశాలల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. గత ఏడాదిలో 80కి పైగా అమెరికన్ పాఠశాలల్లో కాల్పుల ఘటనలు నమోదుకాగా, పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. లెక్కలేనంతమంది గాయపడ్డారు.ఇటువంటి కాల్పుల ఘటనల కారణంగానే తమ పిల్లలను అమెరికాలో చదువుకునేందుకు పంపేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. 2025లో భారతదేశం నుండి వేలాది మంది విద్యార్థులు అమెరికన్ కళాశాలలు(American colleges), విశ్వవిద్యాలయాలలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారుల భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారు. అయితే అమెరికాలోని కొన్ని రాష్ట్రల్లో ప్రశాంతమైన వాతావరణం(Calm atmosphere) ఉంది. అక్కడ విద్యార్థులు చదువుకునేందుకు పలు అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలోని 10 రాష్ట్రాలివే..అమెరికాలోని 10 సురక్షితమైన రాష్ట్రాలువ్యోమింగ్నార్త్ డకోటాసౌత్ డకోటాహవాయీవెర్మోంట్మెయిన్అలాస్కావెస్ట్ వర్జీనియారోడ్ ఐలాండ్న్యూ హాంప్షైర్అమెరికాలోని అత్యంత సురక్షితమైన ఈ రాష్ట్రాల జాబితాను ఇక్కడ జరిగిన కాల్పుల సంఘటనల ఆధారంగా తయారు చేశారు. 1966 నుండి 2024 వరకు పాఠశాలల్లో కాల్పుల సంఘటనలు అతి తక్కువగా జరిగిన రాష్ట్రాలను ఈ జాబితాలో చేర్చారు. 1966- 2024 మధ్య వ్యోమింగ్లో రెండు పాఠశాలల్లో మాత్రమే కాల్పులు జరిగాయి. నార్త్ డకోటా(North Dakota), సౌత్ డకోటాలలో మూడు సంఘటనలు, హవాయిలో నాలుగు, వెర్మోంట్లో ఐదు, మెయిన్, అలాస్కాలో ఏడు, వెస్ట్ వర్జీనియాలో ఎనిమిది, రోడ్ ఐలాండ్, న్యూ హాంప్షైర్లో ఇప్పటివరకు ఎనిమిది సంఘటనలు నమోదయ్యాయి.అమెరికాలోని ఈ రాష్ట్రాలు అత్యంత సురక్షితమైనవిగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో తక్కువ నేరాల రేట్లు, తక్కువ జనాభా, పటిష్టమైన భద్రతా విధానాలు ఉన్నాయి. వెర్మోంట్, న్యూ హాంప్షైర్ వంటి రాష్ట్రాలు కమ్యూనిటీ పోలీసింగ్తో పాటు ప్రజల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారిస్తాయి. ఇది ప్రజలకు మరింత భద్రతా భావాన్ని అందిస్తుంది. ఈ రాష్ట్రాల్లో పెద్ద నగరాలు తక్కువగా ఉండటం వల్ల నేరాల సంఖ్య కూడా తక్కువే. పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రల్లో నేరాలను అరికట్టడంతో ముందుంది.ఇది కూడా చదవండి: బోర్డింగ్ స్కూల్పై దాడి.. రష్యా- ఉక్రెయిన్ పరస్పర ఆరోపణలు -
విమానంలో ఏ సీటు భద్రం?
ఆదివారం దక్షిణకొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో వెనకవైపు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్లు వార్తలొచ్చాయి. దీంతో విమానంలో ముందువైపు లేదంటే వెనుకవైపు అసలు ఏ నంబర్ సీటులో కూర్చుంటే ప్రమాదం జరిగినా బయటపడొచ్చనే అంశంపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. తరచూ విమానప్రయాణాలు చేసే అంతర్జాతీయ ప్రయాణికులు ఈ చర్చలను తీక్షణంగా గమనిస్తున్నట్లు వార్తలొచ్చాయి. నిజంగానే వెనుకవైపు సీట్లు భద్రమా? అనే ప్రశ్న ఇప్పుడు ప్యాసింజర్లను తొలచేస్తోంది. మిగతా ప్రయాణాలతో చూస్తే భద్రమే ఎక్కడ కూర్చుంటే క్షేమంగా ఉంటామనే ప్రశ్న కంటే అసలు విమానంలో ప్రయాణమే అత్యంత భద్రమని మరో వాదన మొదలైంది. నిర్లక్ష్య డ్రైవింగ్, గతుకుల రోడ్డు, ఎత్తుఒంపులు ఉన్న చోట్ల సాంకేతిక ప్రమానాలు పాటించకుండా నిర్మించిన రోడ్లు, సరైన సూచికల వ్యవస్థ లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రయాణంతో పోలిస్తే విమాన ప్ర యాణం ఎంతో క్షేమదాయకమని వారు చెబుతున్నారు. విమానంలో ఎక్కడ కూర్చున్నా భద్ర మేనని, ఎప్పటికప్పుడు మొత్తం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీచేసి సుశిక్షుతులైన పైలట్ల పర్యవేక్షణలో విమానం ప్రయాణిస్తుందని, అ త్యంత అరుదుగా మాత్రమే, అసాధారణ వాతావరణ పరిస్థితుల్లోనే వి మా నం ప్రమాదంబారిన పడుతుంద ని విశ్లేషకులు చెబుతు న్నారు. అమెరికాలో ఎలా? ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం అమెరికా రోడ్లపై ప్రతి 10 కోట్ల వాహన ప్రయాణాల్లో కేవలం 1.18 మరణాలు సంభవిస్తున్నాయి. అదే 10 కోట్ల మైళ్ల రైలు ప్రయాణంలో 0.04 మరణాలు సంభవిస్తున్నాయి. ఇక 10 కోట్ల మైళ్ల విమాన ప్రయాణాల్లో అత్యంత స్వల్పంగా కేవలం 0.003 మరణాలు సంభవిస్తున్నాయి. అంతర్జాతీయ పౌర విమానయాన రంగ గణాంకాల ప్రకారం 2023లో ప్రతి వంద కోట్ల మంది ప్రయాణికులకు కేవలం 17 మంది మాత్రమే విమాన ప్రమాదాల్లో చనిపోయారు. 2022 ఏడాదిలో ఈ సంఖ్య 50గా ఉంది. అత్యాధునిక విమానాల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నా అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగానే అత్యల్ప స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. తోక క్షేమమే విమానం ద్రవరూప ఇంధనం(ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్)తో నడుస్తుంది. చిన్న జెట్ విమానాలను మినహాయిస్తే అంతర్జాతీయ సర్వీస్లకు వాడే భారీ పౌరవిమానాల్లో రెక్కల కింద ఈ ఇంధనాన్ని నిల్వచేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగి నిప్పురవ్వులు రాజుకుంటే రెక్కల కింద ఇంధనం భగ్గున మండి రెక్కల సమీప సీట్లలోని ప్రయాణికులు బుగ్గిపాలుకావడం ఖాయం. ఈ కోణంలో చూస్తే రెక్కల సమీపంలోని సీట్లు ప్రమాదసందర్భాల్లో అంత క్షేమదాయకం కాదని గత ప్రమాదరికార్డులు తేటతెల్లంచేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాలో పాపులర్ మెకానిక్స్ అనే మేగజైన్ 1971 నుంచి 2005 వరకు జరిగిన విమాన ప్రమాదాలను విశ్లేíÙస్తూ ఒక నివేదిక సిద్ధంచేసింది. దీని ప్రకారం తోకభాగంలో కూర్చుంటే ప్రమాదాల్లో బతికే అవకాశాలు మిగతా సీట్లతో పోలిస్తే 40 శాతం అధికంగా ఉంటాయి. ముందు సీట్లతో ముప్పే ప్రమాదంలో ఇంధనం అంటుకుని మంటలు చుట్టుముట్టకపోయినా ముందు సీట్లు ఒకరకంగా ప్రమాదకరమని నివేదించారు. ఎదురుగా ఏదైనా కొండను ఢీకొట్టినా, నేలపై కుప్పకూలినా, వేరే విమానాన్ని ఢీకొట్టినా, రన్వే చివరన గోడలాంటి నిర్మాణాన్ని ఢీకొట్టినా, రన్వే దాటి లోయ లేదంటే సముద్రం, సరస్సు వంటి జలాశయంలోకి దూసుకెళ్లినా ప్రమాద ప్రభావం ముందు సీట్లపైనే అధికంగా ఉంటుంది. మధ్య సీట్ల పరిస్థితి విచిత్రం మధ్య సీట్లలో కూర్చుంటే రెక్కలకు సమీపంలో ఉండటం వల్ల ఇంధనంలో మంటలొస్తే ప్రమాదమే. కానీ మంటలు చెలరేగని పక్షంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గం వీళ్లకే దగ్గరగా ఉంటుంది. తప్పించుకునే అవకాశాలు వీళ్లకే ఎక్కువ. ఏదేమైనా విమానం ప్రమాదంలో పడిన తీరు, వేగం, దిశను బట్టి విమానంలోని ముందు, వెనుక, పక్క భాగాలు దెబ్బతింటాయి. భారత్లో గంటకొకటి చొప్పున జరిగే రోడ్డు ప్రమాదాలు, ఇటీవల సర్వసాధారణమైన పట్టాలు తప్పడం వంటి రైలు ప్రమాదాలతో పోలిస్తే అత్యంత అరుదుగా జరిగే విమాన ప్రమాదాలను భూతద్దంలో చూడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చే వాళ్లు ఈ ‘సీటు క్షేమం’చర్చలో పాల్గొన్నారు. బతికే అవకాశాలు 60 శాతం అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డ్ నివేదికను విశ్లేíÙస్తూ బ్రిటన్ పాత్రికేయుడు మ్యాక్స్ ఫాస్టర్ తాజాగా ఒక విషయాన్ని బయటపెట్టారు. ‘‘విమానం నేలపై కూలినా, నీటిలో పడినా, గాల్లోనే పేలిపోయినా ముందు సీట్లలో కూర్చునే ప్రయాణికులు 49 శాతం వరకు బతికే అవకాశాలు ఉన్నాయి. రెండు రెక్కల మధ్యభాగంలోని సీట్లలో కూర్చుంటే 59 శాతం వరకు బతికే అవకాశాలు ఉన్నాయి. ఇక వెనుకవైపు అంటే తోక సమీప సీట్లలో కూర్చుంటే 69 శాతం బతికే అవకాశాలు ఉన్నాయి’’అని అన్నారు. అయితే ఇక్కడో ఘటనను తప్పక గుర్తుచేసుకోవాలని ఆయన చెబుతున్నారు. ‘1989లో అమెరికాలో యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం ప్రమాదానికి గురైనప్పుడు 269 మంది ప్రయాణికుల్లో 184 మంది బతికారు. వీరిలో చాలా మంది ముందు సీట్లలో కూర్చున్నారు’’అని ఆయన గుర్తుచేశారు. ప్రఖ్యాత ‘టైమ్’మేగజైన్ నివేదిక సైతం వెనుక సీట్లు క్షేమమని తెలిపింది. మిగతా సీట్లతో పోలిస్తే వెనుకవైపు సీట్లలో మధ్య వాటిల్లో కూర్చుంటే మరింత క్షేమమని పేర్కొంది. ఇక్కడ కూర్చుంటే మరణించే అవకాశం కేవలం 28 శాతమని, అదే విమానం మధ్యలో కూర్చుంటే ముప్పు శాతం 44 శాతంగా ఉంటుందని వెల్లడించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పాకిస్తాన్ ఇప్పుడు సురక్షితమైన ప్రదేశం : గేల్
ఢాకా : ప్రపంచంలోనే ఇప్పుడు అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో పాకిస్తాన్ ఒకటని విండీస్ స్టార్ బ్యాట్సమెన్ క్రిస్ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రసుత్తం పాకిస్తాన్లో సిరీస్ ఆడేందుకు వచ్చే జట్టులోని ఆటగాళ్లకు ఆ దేశ ప్రభుత్వం ఒక అధ్యక్షుడి స్థాయి భద్రతను కల్పిస్తుందని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్లో జరుగుతున్న బంగ్లా ప్రీమియర్ లీగ్లో గేల్ ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ తరపున ఆడేందుకు వచ్చాడు. ప్రాక్టీస్ సందర్భంగా 'పాకిస్తాన్ క్రికెట్ ఆడేందుకు అనువైన ప్రదేశం అవునా కాదా ' అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు గేల్ స్పందిస్తూ... ' ఇప్పుడు ప్రపంచంలోనే పాకిస్తాన్ దేశం అత్యంత సురక్షితమైనది. ఎందుకంటే ఆ దేశంలో క్రికెట్ ఆడేందుకు వస్తున్న ఆటగాళ్లకు అధ్యక్షస్థాయి భద్రతను కల్పిస్తున్నారు. ఒక ఆటగాడిగా ఇంతకన్నా కావలిసిందేముంటుంది' అంటూ పేర్కొన్నాడు. కాగా దశాబ్దం తర్వాత శ్రీలంక జట్టు టెస్టు సిరీస్ ఆడేందుకు పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో లంక ఆటగాళ్లకు పాక్ ప్రభుత్వం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. కాగా రెండు టెస్టుల సిరీస్ను పాకిస్తాన్ 1-0 తేడాతో గెలుచుకుంది. అయితే గేల్ ఈ మధ్యనే 40లోకి ఎంటరవ్వడంతో అతని రిటైర్మంట్పై ఊహాగానాలు వస్తున్నాయి. అయితే వాటన్నింటికి తెరదించుతూ ఇంకో ఐదేళ్ల పాటు తనకు క్రికెట్ ఆడే శక్తి ఉన్నట్లు గేల్ ఇప్పటికే ప్రకటించాడు. Chris Gayle "Pakistan is one of the safest places right now in the world" #Cricket pic.twitter.com/CNZaBNCSuu — Saj Sadiq (@Saj_PakPassion) January 9, 2020 -
ఇంటికన్నా జైలే పదిలం
పుళల్ సెంట్రల్ జైల్లోకి చుక్క వరదనీరు రాని వైనం చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై నగరాన్ని నిలువునా ముంచేసిన వర్షాలు, వరదలతో ఆవేదన చెందిన వారే కాదు ఆనందించిన వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. వర్షాలు, వరదలపై హర్షాతిరేకాలు వ్యక్తం చేసినవారంతా క్రిమినల్స్ కావడం విశేషం. ఇంటికన్నా జైలు పదిలం అంటూ పుళల్ సెంట్రల్జైలు ఖైదీలు చెబుతున్నారు. చెన్నై సెంట్రల్ ఎదురుగా, కూవం కాలువ గట్టుకు ఆనుకునే చెన్నై సెంట్రల్ జైలు ఉండేది. కొన్నేళ్ల క్రితం ఇక్కడి జైలును నగర శివార్లులోని పుళల్కు మార్చారు. 213 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో జైలు నిర్మాణం జరిగింది. ఈ జైలులో 3100 మందికి పైగా ఖైదీలు ఉంటున్నారు. నగరంలో 20 రోజులపాటు కురిసిన వర్షాలతో మునిగి పోని ప్రాంతం అంటూలేదు. అయితే భారీ వర్షాల కారణంగా జైలుకు సమీపంలోనే పుళల్ చెరువు పొంగిపొర్లుతూ ప్రమాదకరంగా ప్రవహించినా పక్కనే ఉన్న జైలులోకి వరదనీరు చుక్క కూడా ప్రవహించలేదు. నగర ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నా తాము వేళకు భోజనం, కంటి నిండా నిద్రతో సుఖంగా ఉన్నామని ఖైదీలేకాదు, అక్కడి జైలు అధికారులు ఆనందంగా చెబుతున్నారు. పైగా ముంపు ప్రాంతాల్లో తమ కుటుంబాల వారు ఎలా ఉన్నారనే సమాచారాన్ని సైతం జైలు అధికారులు ఎప్పటికప్పుడు తెలపడంతో ఖైదీలు మరింత హాయిగా కాలం గడిపారు. గిండి క్రైం పోలీస్ స్టేషన్లో రికార్డులు గల్లంతు చెన్నై నగరంలోని గిండి క్రైం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో 30 అడుగులమేర వరదనీరు ప్రవహించడంతో స్టేషన్లోని క్రిమినల్ రికార్డులన్నీ గల్లంతయ్యాయి. ఇందులో అనేకరకాల నేరగాళ్లకు సంబంధించిన రికార్డులుండడంతో పోలీసులు తలలు పట్టుకోగా, నిందితులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.