నందికొట్కూరు మార్కెట్యార్డ్ వైస్ చైర్మన్ హత్య
నందికొట్కూరు: కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ పడగవిప్పాయి.కొంతకాలం నుంచి ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఒక్కసారిగా శనివారం ఫ్యాక్షన్ ఉదంతం కలకలం సృష్టించింది. నందికొట్కూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా ఉన్న సాయిఈశ్వరుడిని కొంతమంది దారుణంగా హత్య చేశారు. వేటకొడవళ్లతో దాడి చేసిన ప్రత్యర్థులు అతన్ని దారుణంగా హతమార్చారు. గతంలో వారి మధ్య చవిచూసిన విభేదాలే ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.