ఎమ్మార్వో సుశీల ఇంటిపై ఏసీబీ దాడులు
నెల్లూరు : నెల్లూరు జిల్లా సంగెం తహసీల్దార్ సుశీల నివాసంపై శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే బెంగళూరులోని ఆమె బంధువుల నివాసంపై కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆమె వద్ద రూ. 2 కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సంగెం తాహసీల్దార్ సుశీలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు శనివారం దాడి చేశారు.