Santhi kumari
-
తెలంగాణ సీఎస్ ను కలవనున్న టీకాంగ్రెస్ బృందం
-
‘రెరా’ చైర్పర్సన్గా సీఎస్ శాంతికుమారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్పర్సన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్కుమార్ కూడా రెరా చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆయన్ను జనవరి 12న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయింపు సబబేనని, అక్కడకు వెళ్లిపోవాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. రెరా చైర్మన్ పదవి ఖాళీ అయింది. రెరా చైర్మన్తోపాటు సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీచేసింది. చైర్మన్, సభ్యుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 3 (శుక్రవారం)తో గడువు ముగిసింది. ఇప్పటికే పలువురు మాజీ సీఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, టౌన్ప్లానింగ్లో విశేష అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి రావడానికి కనీసం నెలరోజులు పడుతుందని భావిస్తున్నారు. కొత్త వారిని నియమించే ప్రక్రియ పూర్తయ్యే వరకు రెరా చైర్పర్సన్గా సీఎస్ శాంతికుమారిని నియమిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ఉత్తర్వులిచ్చారు. -
తెలంగాణ సీఎస్పై గవర్నర్ తమిళిసై ఫైర్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలంగాణ చీఫ్ సెక్రెటరీ (CS) శాంతికుమారిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ కామెంట్స్ చేశారు. సుప్రీం కోర్టులో తనపై వేసిన రిట్ పిటిషన్పై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై గవర్నర్ తమిళిసై ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ సీఎస్గా బాధ్యతలు తీసుకున్నాక.. ఒక్కసారి కూడా రాజ్భవన్కి రాలేదన్నారు. మర్యాదపూర్వకంగా తనను కలువలేదన్నారు. అధికారింగా కూడా రాలేదు.. ప్రోటోకాల్ లేదు. కనీసం ఆమె ఫోన్లో కూడా మాట్లాడలేదని సీరియస్ అయ్యారు. ఢిల్లీ కన్నా రాజ్భవన్ దగ్గరగా ఉందంటూ సెటైరికల్ పంచ్ ఇచ్చారు. ఈ ట్వీట్ని శాంతికుమారికి ట్యాగ్ చేశారు. ఈమధ్యే సీఎస్గా బాధ్యతలు తీసుకున్న శాంతికుమారి.. గవర్నర్ ముందు.. 10 బిల్లులు పెండింగ్ ఉన్నాయనీ.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించేలా చెయ్యాలని కోరుతూ సుప్రీంకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు. 5 నెలలు గడిచినా బిల్లుల్ని గవర్నర్ ఆమోదించలేదని ఆమె పిటిషన్లో పేర్కొనడం సంచలనంగా మారింది. Dear @TelanganaCS Rajbhavan is nearer than Delhi. Assuming office as CS you didn't find time to visit Rahbhavan officially. No protocol!No courtesy even for courtesy call. Friendly official visits & interactions would have been more helpfull which you Don't even intend. — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 3, 2023 -
కథ కంచికి.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎన్నో దశాబ్దాల పాటు ‘పేదింటి’కి పెన్నిధిగా నిలిచిన గృహనిర్మాణ శాఖ కథ కంచికి చేరింది. వేల కుటుంబాలకు నీడను కల్పించిన ఆ శాఖ ఇప్పుడు రోడ్లు–భవనాల శాఖలో విలీనమైంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విలీనానికి సంబంధించి కొన్నిరోజుల కింద జరిగిన కేబినెట్ భేటీలోనే తీర్మానించినా శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గృహనిర్మాణ శాఖలో అంతర్భాగమైన హౌసింగ్ కార్పొరేషన్ (గృహనిర్మాణ సంస్థ), హౌసింగ్ బోర్డు (గృహ నిర్మాణ మండలి), రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్బోర్డుకు అనుబంధంగా ఏర్పాటైన డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (డీఐఎల్) తదితర విభాగాలన్నీ రోడ్లు–భవనాల శాఖ పరిధిలోకి వెళ్లిపోయాయి. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లకు పనిలేకుండా పోయింది. పేదల ఇళ్లకు సంబంధించి డబుల్ బెడ్రూం పథకాన్ని తొలుత హౌసింగ్ కార్పొరేషన్ పర్యవేక్షించినా.. దాని ఆధ్వర్యంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. సీఎం కేసీఆర్ దీనిపై ఏసీబీతో విచారణకు ఆదేశించి, ఆ శాఖలోని ఉద్యోగులను ఇతర కార్పొరేషన్లు, శాఖల పరిధిలోకి మార్చారు. దీంతో హౌసింగ్ కార్పొరేషన్ నామమాత్రంగా మారింది. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం అమలును జిల్లా కలెక్టర్లకు అప్పగించటంతో.. రుణాలు తీసుకోవడానికే ఇది పరిమితమైంది. ఒకప్పుడు వందలాది ఉద్యోగులతో కళకళలాడిన ఈ సంస్థలో ప్రస్తుతం 50 మందే ఉన్నారు. వీరికీ లెక్కలు క్రోడీకరించడం మినహా పనిలేకుండా పోయింది. ఇప్పుడు వీరు ఆర్ అండ్ బీ పరిధిలోకి వెళ్తున్నారు. హౌసింగ్ బోర్డు, ‘స్వగృహ’ కథ కంచికే! అల్పాదాయ, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలకు ఇళ్లు నిర్మించి ఇచి్చన హౌసింగ్ బోర్డు.. పేదలకు చవకగా ఇళ్లు కట్టించేందుకు 2007లో ప్రారంభమైన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ల పరిస్థితీ ఇంతే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గృహ నిర్మాణ కార్యకలాపాలు చేపట్టకపోవడంతో వీటికి ఎలాంటి పని లేకుండా పోయింది. అప్పట్లోనే కట్టి అసంపూర్తిగా మిగిలిన వాటిని ఉన్నవి ఉన్నట్టుగా అమ్ముకోవటానికే స్వగృహ కార్పొరేషన్ పరిమితమైంది. ఇక ఈ రెండు విభాగాల కథ కంచికి చేరినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేదల గృహ నిర్మాణం అన్నది ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటి కావడంతో హౌజింగ్ కార్పొరేషన్ మాత్రం కొనసాగే వీలుందని అంటున్నారు. ఇక పోలీసు సిబ్బందికి ఇళ్లు నిర్మించే పోలీసు హౌసింగ్ కార్పొరేషన్, వైద్యారోగ్య సిబ్బందికి ఇళ్లు నిర్మించి ఇచ్చే సంస్థలను కూడా ఆర్అండ్బీ శాఖ పరిధిలోకి తీసుకురానున్నట్టు సమాచారం. పూర్తికాని ఆస్తుల పంపకం రాష్ట్రం విడిపోయాక హౌసింగ్బోర్డు ఆస్తుల పంపకం వివాదంగా మారింది. దీనిని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 9వ షెడ్యూల్లో చేర్చారు. రాజీవ్ స్వగృహ ఆస్తులను మాత్రం ఎక్కడివి అక్కడే పద్ధతిలో రెండు రాష్ట్రాల మధ్య పంచారు. దాని అప్పులను కూడా పంచగా.. తెలంగాణకు రూ.900 కోట్ల రుణాలు వచ్చాయి. ప్రస్తుతం సర్కారు స్వగృహ ఆస్తులను క్రమంగా వేలం వేస్తోంది. మూసీ వరదలతో తెరపైకి ‘హౌజింగ్ బోర్డు’! గృహనిర్మాణ శాఖలో ప్రధాన విభాగంగా ఉన్న హౌసింగ్ కార్పొరేషన్ కంటే కొన్ని దశాబ్దాల ముందే హౌసింగ్ బోర్డుకు బీజం పడింది. 1908లో మూసీ వరదలతో దెబ్బతిన్న హైదరాబాద్ నగరాన్ని పునరుద్ధరించటంతోపాటు విశాలమైన రహదారుల నిర్మాణం, మెరుగైన పారిశుధ్య వ్యవస్థ ఏర్పాటు, వరదలతో నిరాశ్రయులైన వారికి ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్.. హైదరాబాద్లో ప్రత్యేకంగా ‘సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు’ను ప్రారంభించారు. మూసీ వరదలతో దెబ్బతిన్న నగరాన్ని ఆ బోర్డు ఆధ్వర్యంలోనే పునరుద్ధరించారు. వేల సంఖ్యలో ఇళ్లను నిర్మించి ఇచ్చారు. తర్వాత సికింద్రాబాద్ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు 1931లో ‘టౌన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్టు’ను ఏర్పాటు చేశారు. 1956లో ఈ రెండింటినీ విలీనం చేస్తూ గృహనిర్మాణ మండలి (హౌజింగ్ బోర్డు)ను ఏర్పాటు చేశారు. ఆసియాలోనే అతిపెద్ద హౌజింగ్ కాలనీ కూకట్పల్లి హౌజింగ్ బోర్డు (కేపీహెచ్బీ) కాలనీ.. ఒకప్పుడు ఆసియాలోనే మారుమోగిన పేరు. ఇక్కడ ఏడు ఫేజ్లలో అల్పాదాయ, మధ్య ఆదాయ, ఎగువ మధ్య ఆదాయ వర్గాలకు ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ పేర్లతో హౌజింగ్ బోర్డు దాదాపు 9 వేల ఇళ్లను నిర్మించింది. అప్పట్లో ఆసియాలోనే ఇది అతిపెద్ద హౌజింగ్ కాలనీ. అంతకుముందు హైదరాబాద్లో తొలి హౌసింగ్ బోర్డు కాలనీగా విజయనగర్ కాలనీని నిర్మించారు. తర్వాత మౌలాలి, ఎస్సార్ నగర్, వెంగళరావునగర్ కాలనీలను కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రధాన పట్టాణాల్లోనూ కాలనీలు నిర్మించారు. ప్రభుత్వం నుంచి నిధులు లేకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో ఇది కొనసాగింది. అయితే 1980 దశకం చివరికి వచ్చేసరికి ప్రైవేటు బిల్డర్ల హవా మొదలై.. హౌజింగ్ బోర్డు ప్రాభవం తగ్గుతూ వచి్చంది. అడపాదడపా కొన్ని కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టినా సింగపూర్ టౌన్షిప్, మలేíÙయా టౌన్షిప్లు మినహా పెద్దగా గుర్తుండిపోయే ప్రాజెక్టులు లేవు. చివరిగా ఉమ్మడి రాష్ట్రంలో ఔటర్ రింగ్రోడ్డు సమీపంలోని రావిర్యాలలో ఇళ్లను నిర్మించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏ ప్రాజెక్టూ చేపట్టలేదు. మొత్తంగా తెలంగాణ పరిధిలో 20వేలకుపైగా ఇళ్లను బోర్డు స్వయంగా నిర్మించింది. వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్తో.. చెన్నారెడ్డి సీఎంగా ఉండగా హౌజింగ్ బోర్డుకు చైర్మన్గా వ్యవహరించిన ధర్మారెడ్డి దీనికి భారీగా ల్యాండ్ బ్యాంకు సిద్ధం చేశారు. కూకట్పల్లి నుంచి మాదాపూర్ వరకు ఏకంగా 6 వేల ఎకరాల భూమిని సమీకరించారు. తర్వాత ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రత్యేకంగా డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (డీఐఎల్)ను ప్రారంభించి... కొన్ని వేల ఎకరాలను దానికి బదలాయించారు. కానీ కొన్ని బడా సంస్థలు వందల ఎకరాల భూమిని తీసుకుని బోర్డుకు పూర్తి డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టి నష్టపర్చాయి. ఇప్పటికీ ఆ వివాదాలు కొనసాగుతున్నాయి. జేఎన్టీయూ సమీపంలో హౌజింగ్ బోర్డు ఉద్యోగులకు 1978లో కాలనీని నిర్మించారు. దానికి ధర్మారెడ్డి పేరే పెట్టుకున్నారు. అప్పట్లో ఉద్యోగులకు రూ.5.80కు గజం చొప్పున స్థలాన్ని కేటాయించటం గమనార్హం. పీజేఆర్ టు కేసీఆర్.. పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చే పథకం తొలుత సంక్షేమశాఖ అ«దీనంలో ఉండేది. 1990లలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న పి.జనార్దన్రెడ్డి ప్రత్యేకంగా గృహనిర్మాణ శాఖను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి అంగీకరించడంతో ప్రత్యేక శాఖగా ఏర్పాటైంది. నాటి నుంచి వివిధ విభాగాలు, కార్పొరేషన్లతో విస్తరించి.. పేదలు, మధ్యతరగతి ఇళ్లు కట్టించిన గృహనిర్మాణ శాఖ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కాలగర్భంలోకి వెళ్లిపోయింది. వైఎస్సార్ హయాంలో చరిత్ర సృష్టించి.. పేదల కోసం నిరంతరం తపించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల గృహ నిర్మాణ పథకానికి కొత్త నిర్వచనం చెప్పారు. పాదయాత్ర సమయంలో జనం బాధలను ప్రత్యక్షంగా చూసిన ఆయన.. ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతంలోనే ఏకంగా 18 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దానిని చాలా రాష్ట్రాలు అనుసరించాయి. వైఎస్సార్ కన్నుమూసిన తర్వాత ఆ పథకం క్రమంగా నీరుగారుతూ వచ్చింది. దివిసీమ ఉప్పెన నిరాశ్రయులకు ఇళ్ల నిర్మాణంతో మొదలు.. 1977లో కృష్ణా–గుంటూరు ప్రాంతాలను కుదిపేసిన దివిసీమ ఉప్పెనలో నిరాశ్రయులైన పేదలకు గూడు కల్పించేందుకు నాటి చెన్నారెడ్డి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే.. క్రమంగా గృహనిర్మాణ సంస్థ ఆవిర్భావానికి దారితీసింది. 1979లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని చేపట్టి.. ప్రత్యేకంగా దివిసీమలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. తర్వాత ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు.. ఈ కార్యక్రమాన్ని మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కట్టించే పథకంగా మార్చారు. ఏటా లక్షన్నర చొప్పున ఇళ్లు నిర్మించేలా పంచవర్ష ప్రణాళికను చేపట్టారు. -
మంత్రి వర్సెస్ ముఖ్యకార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి మధ్య అధికార పోరు కొనసాగుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆమెకు ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించింది. సీఎం కార్యాలయంలోనూ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో ముఖ్యకార్యదర్శిగా ఆమె కొనసాగుతున్నారు.ఎక్కువ మంది ఉద్యోగులు, విస్తృతమైన నెట్వర్క్ ఉండే వైద్య, ఆరోగ్య శాఖపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించట్లేరని, దీంతో సాధారణ వ్యవహారాలపై ప్రభావం పడుతోందని మంత్రి పేషీ అధికారులు చెబుతున్నారు. పట్టని మంత్రి హామీలు! లక్ష్మారెడ్డి తీసుకున్న నిర్ణయాలు, ప్రకటనల అమలు విషయంలో ముఖ్యకార్యదర్శి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల నీట్లో ఉత్తీర్ణత సాధించిన కొందరు రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో కౌన్సెలింగ్కు హాజరయ్యారు. అక్కడ జరిగిన కౌన్సెలింగ్లో సీటు పొంది ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారు మన రాష్ట్రంలోని కౌన్సెలింగ్కూ హాజరయ్యారు. ఆ సందర్భంగా కస్టోడియన్ సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుందనే విషయంలో కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అంగీకరించలేదు. ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి సి.లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. అయితే ముఖ్యకార్యదర్శి దీన్ని పట్టించుకోలేదని తెలిసింది. సీఎం ప్రకటన అమల్లోనూ జాప్యం సీఎం కేసీఆర్ ఇటీవల జోగుళాంబ గద్వాల జిల్లా వెళ్లారు. గట్టు మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకలకు పెంచుతామని, వెంటనే ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించారు. ఈ హామీ ఉత్తర్వుల ప్రక్రి య వెంటనే చేపట్టలేదు. కాస్త ఆలస్యంగా జూలై 19న ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చేందుకూ సీఎం ఇచ్చిన హామీ అమలు కాలేదని మంత్రి పేషీ అధికారులు చెబుతున్నారు. మరో 10 ఆస్పత్రుల అప్గ్రేడ్ అంశం లోనూ ఇలాగే జరుగుతోందని సమాచారం. కాగా, శాంతికుమారికి సచివాలయంలోనీ సీ బ్లాక్లో ఒక పేషీ, డీ బ్లాక్లో మరో పేషీ కేటాయించారు. సీఎంవో కార్యాలయ అధికారి హోదాలో ప్రగతిభవన్లోనూ ఒక పేషీ ఉంది. వైద్య, ఆరోగ్య శాఖ పరిపాలనా వ్యవహారాలపై వెంటనే నిర్ణయాలు తీసుకునేందుకు డీ బ్లాక్లోని పేషీలో అందుబాటులో ఉండాలి. అయితే చాలా తక్కువ సమయమే ఈ పేషీలో ఉంటున్నారని, దాంతో వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు పెండింగ్లో ఉంటున్నాయని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సీ బ్లాక్కు అనుమతి తీసుకున్న వారినే అనుమతిస్తారు. ఈ పరిస్థితితో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సైతం శాంతికుమారిని కలిసే పరిస్థితి ఉండట్లేదు. వైద్య, ఆరోగ్య శాఖ సమస్యలపై సచివాలయానికి వచ్చే ప్రతి ఒక్కరు మంత్రి పేషీకి వస్తున్నారు. ఇలా వచ్చే వారి సమస్యలను పరిష్కరించే ఉన్నతాధికారి అందుబాటులో లేకపోవడంతో మళ్లీ సచివాలయానికి రావాల్సి వస్తోంది. ఇలా ఎన్నిసార్లు వచ్చినా తాము ఏమీ చేయలేకపోతున్నామని మంత్రి పేషీ వర్గాలు చెబుతున్నాయి. -
ప్రమోషన్ల జాతర
-
ప్రమోషన్ల జాతర
♦ కొత్త జిల్లాల్లో 3,252 పోస్టుల భర్తీకి ప్రభుత్వ నిర్ణయం ♦ ప్రతి కేడర్లోనూ పెరగనున్న పోస్టులు ♦ ఉద్యోగుల కేటాయింపు ప్రణాళికపై సీఎంవో సమీక్ష ♦ జిల్లాల ఆవిర్భావం రోజు నుంచే కొత్త పాలన ♦ పోలీస్, రెవెన్యూ విభాగాలు పనులు ప్రారంభించాలి ♦ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ♦ తుది నోటిఫికేషన్పై కొనసాగుతున్న ఉత్కంఠ సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో పని చేసేందుకు అదనపు ఉద్యోగులు కావాలని, మొత్తం 3,252 పోస్టులు అవసరమవుతాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించి వీటిని భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించిన ప్రభుత్వం ఉద్యోగుల కేటాయింపుల తుది ప్రణాళికపై మంగళవారం సమీక్ష నిర్వహించింది. ఆవిర్భావం రోజు నుంచే కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సిబ్బందిని అందుకు సిద్ధంగా ఉంచాలని సీఎం కార్యాలయ అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ కార్యాలయాలు మొదటి రోజు నుంచే పని చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం సీఎం అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి సచివాలయంలో వివిధ శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, వసతి సదుపాయాలతోపాటు ఉద్యోగుల కేటాయింపు, అందుకు సంబంధించిన ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. తొలి రోజు నుంచే అన్ని కేంద్రాల్లో పరిపాలన ప్రారంభించేందుకు ప్రతిపాదనలు, ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలు, రెవె న్యూ డివిజన్ కార్యాలయాలు, మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్లు తదితర కార్యాలయాల నిర్వహణకు సత్వరం ఏర్పాట్లు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కొత్తగా ఏర్పడే కేంద్రాల్లో ఎందరు ఉద్యోగులు అవసరం, ఎన్ని కేడర్ పోస్టులు అవసరం? వాటిని ఎలా భర్తీ చేయాలి? అన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అర్హతను బట్టి ఆయా శాఖల్లో పదోన్నతులు కల్పించి ఈ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి కేడర్లోనూ పోస్టులు పెరగనున్నట్లు వెల్లడించారు. ఏం మార్పులుంటాయో..? కొత్త జిల్లాలకు సంబంధించి అర్జీల పరిశీలన కొనసాగుతుండటంతో ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 11న దసరా నుంచి కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలన్నీ మనుగడలోకి వస్తాయని ఇప్పటికే పలుమార్లు సీఎం స్పష్టం చేశారు. ముసాయిదా నోటిఫికేషన్పై వచ్చిన అభ్యంతరాలు, అర్జీల దృష్ట్యా కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు సంబంధించి స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు పలుచోట్ల కొత్త జిల్లాల స్వరూపంతోపాటు డివిజన్లు, మండలాలకు మార్పులు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటన్నింటినీ ప్రభుత్వం తుది నోటిఫికేషన్లో పొందుపరచనుంది. దీంతో ముసాయిదా జారీ చేసిన తర్వాత తెర పైకి వచ్చిన మండలాలు, కొత్త డివిజన్లు ఉంటాయా? హన్మకొండ జిల్లా కేంద్ర స్వరూపం మారుతుందా? అనే సందిగ్ధత కొనసాగనుంది. న్యాయ చిక్కుల్లేకుండా దసరా ముహూర్తాన కొత్త కేంద్రాల నుంచి పరిపాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం అధికారిక ఏర్పాట్లు ముమ్మరం చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మొత్తం లక్షకుపైగా వినతులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలపై న్యాయపరమైన చిక్కులు సైతం ఎదురయ్యే అవకాశం లేకపోలేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తుది నోటిఫికేషన్ జారీ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ చిక్కులు అధిగమించేందుకు దసరా రోజునేనోటిఫికేషన్ జారీ చేసి, నిర్ణీత ముహూర్తానికి కొత్త జిల్లాలను ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.