sathupally mla
-
'బాబును ప్రశ్నించే హక్కు కేసీఆర్ కు లేదు'
-
'బాబును ప్రశ్నించే హక్కు కేసీఆర్ కు లేదు'
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యం ఇచ్చిందే టీడీపీ ఆ పార్టీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. చంద్రబాబు ఇక్కడ ఎందుకుంటున్నారని ప్రశించే హక్కు కేసీఆర్ లేదని అన్నారు. తెలంగాణలో ఉండే అన్ని హక్కులు టీడీపీకి ఉన్నాయని చెప్పారు. టీడీపీ తనకు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా సోమవారం పరేడ్ మైదానం జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో చంద్రబాబుపై కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కిరికిరి నాయుడు అని, తమ రాష్ట్రం వదిలి పొమ్మన్నా పోవడం లేదంటూ ధ్వజమెత్తారు. -
ప్రశ్నించే హక్కు ప్రజలు మాకిచ్చారు: వీరయ్య
హైదరాబాద్: ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలు తమకిచ్చారని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ప్రశ్నించినందుకు తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా.. రేవంత్రెడ్డి ఇంటిపై దాడి చేయడం దారుణమన్నారు. రేవంత్రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో చెమటచుక్క రాల్చినవారికి రేపు కేబినెట్ లో చోటు దక్కే అవకాశలున్నాయని ఆరోపించారు. ఇకనైనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అధ్యక్షుడు కేసీఆర్ తీరు గమనించి నిజాలెంటో తెలుసుకోవాని వీరయ్య అన్నారు.