
ప్రశ్నించే హక్కు ప్రజలు మాకిచ్చారు: వీరయ్య
ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలు తమకిచ్చారని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు.
హైదరాబాద్: ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలు తమకిచ్చారని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ప్రశ్నించినందుకు తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా.. రేవంత్రెడ్డి ఇంటిపై దాడి చేయడం దారుణమన్నారు. రేవంత్రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో చెమటచుక్క రాల్చినవారికి రేపు కేబినెట్ లో చోటు దక్కే అవకాశలున్నాయని ఆరోపించారు. ఇకనైనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అధ్యక్షుడు కేసీఆర్ తీరు గమనించి నిజాలెంటో తెలుసుకోవాని వీరయ్య అన్నారు.