Savita Bhatti
-
కనీసం 200 కోట్ల స్కామ్, 20 క్రిమినల్ కేసులు ఉండాలి!
న్యూఢిల్లీ: ఎవరైనా ఆ రాజకీయ పార్టీలో చేరాలంటే కనీసం 200 కోట్ల రూపాయల స్కామ్ చేసి ఉండాలి లేదా వారిపై 20 క్రిమినల్ కేసులైనా ఉండాలి. ఈ పార్టీ గురించి తెలుసుకోవాలని ఉందా? ప్రముఖ హాస్య నటుడు జస్పాల్ భట్టీ అకాలమృతితో ఆయన సతీమణి నటి సవితాభట్టీ కొంత ఢీలాపడ్డారు. ఆ తరువాత ఆమె మళ్లీ రాజకీయాలలో బిజీ అయిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా ఆమె ఛత్తీస్ఘడ్ నుంచి లోక్సభకు పోటీ చేయవలసి ఉంది. చివరి నిమిషంలో ఎందుకో ఏమో ఆమె పోటీ చేయకూడదని నిర్ణయించుకుని విరమించుకున్నారు. బహుశా ఆమె రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటారని అనుకున్నారు. ఊహించని విధంగా టపీమని ఆమె మళ్లీ సీన్లోకి వచ్చారు. భర్త స్థాపించిన నాన్సెన్స్ క్లబ్ నుంచి నోటా పార్టీని ప్రకటించారు. పార్టీ గుర్తుగా కరెన్సీని ఎంచుకున్నారు. దానికి ఓ పాటను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈసారి ఎన్నికల సంఘం(ఇసి) ఓటర్లకు ఒక ప్రత్యేక అవకాశం కల్పించింది. బ్యాలెట్ పత్రంలో నన్ ఆఫ్ ది అబవ్-నోటా (పైవారెవరూ కాదు) అనే ఆప్షన్ ఇవ్వనుంది. పార్టీ పేరు పెట్టడానికి దానిని ప్రేరణగా తీసుకున్నట్లు నోటా పార్టీ అధ్యక్షురాలు సవితా భట్టీ తెలిపారు. అయితే తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని, తీసుకోనని స్పష్టం చేశారు. తమ పార్టీలో చేరడానికి కొన్ని ప్రధాన అర్హతలు కావాలని ఆమె ప్రకటించారు. కనీసం 200 వందల కోట్ల రూపాయల కుంభకోణం చేసి ఉండాలి లేదా 20 క్రిమినల్ కేసులైనా ఉన్నవారు పార్టీలో చేరేందుకు అర్హులని ఆమె చెప్పారు. మరో విషయం కూడా ఆమె చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అడుగడుగునా దాడులు ఎదురవుతున్నాయి. ఈ దాడులను దృష్టిలో పెట్టుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు. తమ అభ్యర్థులకు వస్తాదులు, మల్లయోధులు వంటివారితో శిక్షణ శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఇందు కోసం డబ్ల్యూడబ్ల్యూఇ మల్లయోధులతో మాట్లాడినట్లు తెలిపారు. కొత్తకొత్త కిక్స్, జంప్స్ గురించి చర్చిస్తున్నట్లు ఆమె తనదైన శైలిలో వివరించారు. ఎన్నికల ప్రక్రియలో జరిగే అవినీతిని తన టివి షోలలో జస్పాల్ భట్టీ ఎండగడుతూ ఉండేవారు. ఆయన సతీమణి సవితా బట్టీ కూడా దానిని కొనసాగిస్తున్నారు. -
ఆ పార్టిలో చేరాలంటే 25 కేసులుండాలి
చండీగఢ్: అవినీతిపరులు, నేరస్థుల కోసం సెటైరిస్ట్, కమెడియన్ దివంగత జస్పాల్ భట్టీ భార్య సవిత నోటా అనే పేరుతో పార్టీ స్థాపించారు. పోటీ చేయడానికి వాళ్లయితే సులువుగా దొరుకుతారనేది ఆవిడ ఉద్దేశం. అయితే తన పార్టీలో సభ్యత్వం పొందాలంటే రూ. 200 కోట్లకు పైగా అవినీతికి పాల్పడి ఉండాలని, కనీసం 25 క్రిమినల్ కేసులైనా ఎదుర్కొంటూ ఉండాలని సవిత షరతులు పెట్టారు. పనిలో పనిగా పక్కపార్టీల్లోని కళంకిత నేతలనందర్నీ ఆహ్వానించారు. నీతిపరులను, అవినీతిపరులను విభజించి పాలించడమే తన పార్టీ విధానమని ఆమె ప్రకటించారు. ఇంత బహిరంగంగా ఇలాంటివి ప్రకటిస్తే ఎవరు చేరతారు, అసలు ఓట్లు పడతాయా అని అనుకుంటున్నారా. ఇది ఉత్తుత్తి పార్టీ మాత్రమే. ఇక్కడి కమర్షియల్ సెక్టార్ 17 ప్లాజాలో ఆమె నోటా పార్టీ పేరుతో ఒక వ్యంగ్య నాటిక (స్పూఫ్)ను మంగళవారం ప్రదర్శించారు. -
'ఆప్'లో చేరిన మాజీ బ్యూటీ క్వీన్
ముంబై: బాలీవుడ్ నటి, మోడల్, మాజీ బ్యూటీ క్వీన్ గుల్ పనాగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమె చండీగఢ్ లోక్సభ సాన్థం నుంచి పోటీ చేయనున్నారు. చండీగఢ్ సీటు ముందుగా దివంగత నటుడు, వ్యంగ్యకారుడు జస్పాల్ భట్టి భార్య సవిత భట్టి(53)కు కేటాయించారు. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన వారం రోజుల తర్వాత ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. స్థానిక ఆప్ నాయకులు సహకరించడం లేదంటూ పోటీలో నిలిచేందుకు ఆమె విముఖత వ్యక్తం చేశారు. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసుందుకు గుల్ పనాగ్కు మార్గం సుగమైంది. గుల్ పనాగ్ తండ్రి మాజీ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్ ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నారు. చండీగఢ్లో జన్మించిన గుల్ పనాగ్ 1999లో మిస్ ఇండియా టైటిల్ గెల్చుకున్నారు. మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్నారు. మూడేళ్ల క్రితం చండీగఢ్ గురుద్వారాలో ఆమె వివాహం చేసుకున్నారు.