-
ముందు ఉట్టి కొడదాం!
'ఉట్టి కొట్టలేనమ్మ.. స్వర్గానికి నిచ్చెనలు వేసింది' అన్న చందంగా, భూమిపై బతకడం చేతకాని మనిషి అంతరిక్షంలో కాలనీలు కట్టి కాపరం చేస్తానంటున్నాడు. ఆ దిశగా ఆధునిక మానవుడు పరిశోధనలు ముమ్మరం చేస్తున్నాడు. కానీ, అది అంత తేలిక కాదు, పైగా మనిషిని మనిషే చంపుకొని తినే దారుణమైన పరిస్థితులు వస్తాయని కొందరు శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. కరోనా వంటి ఊహాతీతమైన వ్యాధులు వచ్చి, మనిషిని పట్టి పీడిస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎటువంటి వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని మనిషి భయపడుతూనే ఉన్నాడు. కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తూ వుంటే శాస్త్రవేత్తలు సైతం కంగారుపడిపోతున్నారు. సామాన్య మానవులు బెంబేలెత్తి పోతున్నారు. ఇది ఇలా ఉంటుండగానే, భూమి నుంచి దూరంగా వెళ్ళి, వేరే స్పేస్ లో జీవించవచ్చు అనే విశ్వాసాన్నీ పెంచుకుంటున్నాడు. ఇది కొత్తగా పుట్టిన కోరిక కాదు. ఎప్పటి నుంచో మనిషి ఆలోచిస్తున్నాడు. కరోనా కాలానికి ముందే కొందరు శాస్త్రవేత్తలు అంతరిక్ష జీవనాన్ని ప్రచారంలోకి తెచ్చారు. సాధ్యాసాధ్యాలపై ఇంకా విస్తృతంగా అధ్యాయనాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త ప్రపంచంలోకి అడుగు పెడదాం, కొత్త లోకాల్లో విహరిద్దాం అని మనిషి ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. భూమిపై ఏదైనా విపత్తు వచ్చినా, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వసతులు, వనరులు సరిపోకపోయినా.. పైకెళ్లి జీవించాలనే ఆలోచనలకు శాస్త్రవేత్తలు మరింత పదునుపెడుతున్నారు. అంగారక గ్రహం లేదా చంద్రమండలంపై కాలనీలు నిర్మంచి జీవించవచ్చు అని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు కూడా! భూమి నుంచి ఆహారాన్ని పంపించే పరిస్థితులపైనా దృష్టి సారిస్తున్నారు. ఇవ్వన్నీ సాధించడానికి సుదీర్ఘకాలం వేచి చూడాల్సిందేనని అర్థం చేసుకోవాలి. ఆ మధ్య ఎడిన్ బర్గ్ యూనివర్సిటీకి చెందిన చార్లెస్ కొకెల్ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. పాత విషయాలను కొన్నింటిని గుర్తు చేశారు. నిజంగా భూమి నివాసయోగ్యం కానప్పుడు అంతరిక్షం వైపు చూడవచ్చు. కానీ, దానిని సాధించాలంటే ఇంకా ఎన్నో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు. 19వ శతాబ్దంలో నార్త్ వెస్ట్ పాసేజ్ను వెతకాడానికి కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ బయలుదేరారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో దారి తప్పారు. అత్యుత్తమ సాంకేతికత అందుబాటులో ఉన్నా, వారంతా ఒకరినొకరు చంపుకుతినే దారుణమైన దుస్థితి వచ్చిందని ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ గుర్తుచేస్తున్నాడు. అంతరిక్షంలో కూడా అటువంటి పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నాడు. వనరులు, వసతులతో పాటు ఆహారకొరత ప్రధాన సమస్యగా నిలుస్తుందని ఆయన భావిస్తున్నాడు. డాక్టర్ కామెరన్ స్మిత్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంతరిక్షంలో మానవ మనుగడ వేళ్లూనుకోవాలంటే? వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. గ్రహాంతర వాసులకోసం వెతుకులాట కూడా ఇప్పటికే మొదలైంది. అంతరిక్షంలోకి వెళ్లబోయే ముందు, ఈ భూమిని పవిత్రంగా, పచ్చగా కాపాడుకోవడం ముఖ్యం. స్వార్థం శృతి మించి, కోరికలు, విలాసాలు ఆకాశాన్ని అంటిన ఆధునిక మానవుడు సహజ వనరులను ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నాడు. తత్ఫలితంగా అడువులు అంతరించి పోతున్నాయి, జీవనదులు ఇంకిపోతున్నాయి. భూమి క్రుంగిపోతోంది, సముద్ర మట్టాలు పెరిగి పోతున్నాయి. అగ్ని గోళాలు బద్ధలై పోతున్నాయి. ఒక్కటేమిటి? విశ్వరూపమే మారిపోతోంది. ప్రకృతిని అందినకాడికి అంతం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో రుతువుల గమనం మారిపోయింది. భూమి వేడెక్కిపోతోంది. అతివృష్టి అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు ప్రబలి పోయాయి. ఆణువణువూ కాలుష్య కాసారంగా మారింది. పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం అంతా కలుషితమై పోయింది. ఇంటాబయటా అంతా కాలుష్యమే. దీనికి ముందుగా మనిషి మనసే అత్యంత కలుషితమై పోయింది. అందుకే, కొంగ్రొత్త వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మంచినీరే కాదు, మంచిగాలి కూడా కొనడానికి కూడా దొరకని దుస్థితి వచ్చేసింది. పల్లెల ముఖచిత్రం మారిపోయింది. చేతివృత్తులు ఎగిరిపోయాయి. వ్యవసాయ విధానమే మారిపోయింది. ఆహారరక్షణపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతరిక్షానికి ఆహార సరఫరా సంగతి తర్వాత చూద్దాం. ముందుగా, భూమిపై పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార ఉత్పత్తి జరగడమే ప్రమాదంలో పడింది. ఆధునిక మానవుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమై పోతోంది. భూమిని పాడుచెయ్యడమే కాక, గ్రహాలను సైతం పాడు చెయ్యడానికి మనిషి తయారవుతున్నాడని కొందరు శాస్త్రవేత్తలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో, కరోనా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలకుండా చూడడం శాస్త్రవేత్తల ప్రథమ కర్తవ్యం. ప్రకృతిని, భూభాగాన్ని రక్షించుకోవడం మానవాళి ప్రాథమిక అవసరం. సహజ వనరులను నిలబెట్టు కోవడం అత్యంత ముఖ్యమైన అంశం. వీటన్నిటిపై దృష్టి సారించడమే అందరి తక్షణ కర్తవ్యం. సమాంతరంగా అంతరిక్ష పరిశోధనలు కొనసాగించుకోవచ్చు. అన్నింటి కంటే ముందుగా, మంచి వైపు మనిషి మారితే? అంతా మంచే జరుగుతుందని విశ్వసిద్దాం. - మాశర్మ -
సమన్వయంతో సమగ్రాభివృద్ధి
శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ అవశ్యం పరిశ్రమల స్థాపనకు ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకోవాలి కేంద్ర మంత్రి సుజనా చౌదరి విజయవాడ : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి వై.సుజనాచౌదరి అన్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సబ్-కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రంలో సాంకేతిక పరిశోధన సంస్థ ఒక్కటి కూడా లేకపోవటం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. పరిశ్రమల స్థాపనతో ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని, దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచనమేరకు పరిశ్రమలు ఉండాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకొని వాటిని ఆర్థికాభివృద్ధి కేంద్రాలు, ఆదాయ వనరుల కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సుజనా సూచించారు. దుర్గగుడి ఫ్లైఓవర్కు ఈ నెలలోనే శంకుస్థాపన... రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణానికి తక్కువ సమయంలో డీపీఆర్ అనుమతులు పొంది ఈ నెలలోనే శంకుస్థాపనకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ను సద్వినియోగం చేసుకుని ఏ విధంగా ట్రాఫిక్ తగ్గించవచ్చో పరిశీలించాలని సీఆర్డీఏ కమిషనర్కు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి యోగా ఏర్పాటుకు అవసరమైన 20 ఎకరాల భూమిని సమకూరిస్తే కేంద్ర నిధులతో ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్ర బీసీ సంక్షేమం, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో గోల్డు కవరింగు పరిశ్రమలకు సాంకేతికపరమైన తోడ్పాటు అందిస్తే చైనా మార్కెట్ను మించి అభివృద్ధి సాధించవచ్చని సూచించారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ స్నోబార్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తే పర్యాటక రంగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి కష్టసమయంలో రూ.8,500 కోట్లు తీసుకు రావటంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి కృషి చేశారని అభినందించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ నగరంలో అందుబాటులో ఉన్న జిల్లా పరిషత్ భూమిని వినియోగించుకోవాలని మంత్రిని కోరారు. సమావేశంలో ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), ఎమ్మెల్యేలు గద్దె రామ్మెహన్, బొండా ఉమామహేశ్వరరావు, జలీల్ఖాన్, బోడే ప్రసాద్, వల్లభనేని వంశీ, శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, ఎ.రామకృష్ణ పలు ప్రధాన సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గంధం చంద్రుడు, అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికను అందజేశారు. నగర మేయర్ కోనేరు శ్రీధర్, సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్, నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement