seemandhra congress
-
నేడు ఢిల్లీలో ఏఐసీసీ,స్క్రీనింగ్ కమిటీల భేటీ
-
మార్కెటింగ్ పాఠాలు నేర్చుకుంటున్న సీమాంద్ర కాంగ్రెస్ నేతలు
-
అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన ఎంపీలు
-
కొత్త డ్రామాలకు తెరతీసిన సీమాంద్ర మంత్రులు
-
విభజించండి అని చెప్పింది సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే : డి.శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించడం మినహా మరో మార్గం లేదని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే అధినేత్రి సోనియాగాంధీకి చెప్పారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వెల్లడించారు. తన సమక్షంలోనే వారు ఆ మాటలు చెప్పారని పేర్కొన్నారు. అయినా వారి పేర్లను తానిప్పుడు బయటపెట్టదల్చుకోలేదన్నారు. ఇప్పుడు ఆ నేతలు సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భిన్నంగా మాట్లాడుతూ ఉండొచ్చని తెలిపారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలను శుక్రవారం మీడియా సమావేశంలో డీఎస్ కొట్టిపారేశారు. ‘‘మంత్రులు రాజీనామా చేశారా? అదంతా ఒట్టిమాట. ఎవరూ రాజీనామా చేయరండీ. వాళ్లు చేసింది తక్కువ.. మీడియాలో చూపుతోంది ఎక్కువ’’అని అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించాలని సీఎం చెబుతున్న మాటలను డీఎస్ తోసిపుచ్చారు. ‘‘తెలంగాణపై నిర్ణయమే జరగదని అన్నారు కదా! అలాగే కేబినెట్ నోట్ కూడా ఇప్పట్లో రాదన్నారు. ఏమైంది? వచ్చింది కదా.. కేంద్రం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. రోడ్మ్యాప్ ప్రకారమే వెళుతోంది. నిజానికి అసెంబ్లీలో విభజన తీర్మానమే ఉండదు. రాజ్యాంగం ప్రకారం కేంద్ర కేబినెట్ విభజన నోట్ను ఆమోదించి రాష్ట్రపతికి పంపుతుంది. ఆ తరువాత రాష్ట్రపతి శాసనసభ అభిప్రాయం మాత్రమే కోరతారు. పార్టీల అభిప్రాయమా? వ్యక్తుల అభిప్రాయమా? అనేది వారి ఇష్టం. అంతే తప్ప ఓటింగ్ ఉండదు. ఒకవేళ ఒత్తిడి చేసి ఓటింగ్ తీసుకున్నా దానిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం కేంద్రానికి లేదు’’ అని వివరించారు. సీమాంధ్ర నేతలు ఇప్పటికైనా సమైక్యవాదాన్ని పక్కనపెట్టి విభజనవల్ల తలెత్తే సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తే మంచిదన్నారు. కేంద్రానికి విభజన ఎంత ముఖ్యమో సీమాంధ్ర అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని, అందులో భాగంగా పెద్ద ఎత్తున ప్యాకేజీతో ఆ ప్రాంతాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. నిజాం కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, దానిలో సీమాంధ్రుల పాత్ర ఏమీ లేదని డీఎస్ చెప్పారు. -
రాజీనామాలు వద్దు.. పార్టీలోనే ఉందాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించేవరకు ఎవరూ రాజీనామా చేయకుండా కొనసాగాల్సిన అవసరం ఉందని సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్ర విభజన జరగకుండా అన్ని మార్గాలను అనుసరించాలని నిర్ణయించారు. కాంగ్రెస్లోనే కొనసాగుతూ సమైక్య నినాదంతో ప్రజల్లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకు మంత్రులు, ఇతర సీనియర్ నేతలతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అలాగే న్యాయ పోరాటానికి వీలుగా మంత్రులు ఏరాసు ప్రతాప్రెడ్డి, వట్టి వసంతకుమార్లతో కమిటీని ఏర్పాటుచేశారు. అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజనకు పూనుకుంటే, దానిపై న్యాయపోరాటం చేయాలని, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, కొండ్రు మురళి, గంటా శ్రీనివాసరావు, తోట నర్సింహం, పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, పార్థసారథి, డొక్కా మాణిక్యవరప్రసాద్, కాసు కృష్ణారెడ్డి, మహీధర్రెడ్డి, గల్లా అరుణకుమారి, అహ్మదుల్లా, సి.రామచంద్రయ్య, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్రెడ్డి, సాకే శైలజానాథ్లతోపాటు 44 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘‘అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు వెళ్తారనుకోవడం లేదు. దాన్ని అడ్డుకోవడానికి ఎవరూ రాజీనామా చేయొద్దంటున్నాను. మంత్రులు కూడా రాజీనామా చేయొద్దు’’ అని అన్నట్లు తెలిసింది. ఉద్యోగులు ఎంతో కాలం సమ్మె చేయలేరని, రాజకీయ పార్టీలు దాన్ని కొనసాగించాల్సిన అవసరముంటుందని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. సరైన భరోసా ఇస్తే వారు సమ్మె విరమించడానికి సానుకూలంగానే ఉన్నారన్నారు. అసెంబ్లీతో సంబంధం లేకుండానే కేంద్రం పార్లమెంటులో విభజన బిల్లును ప్రవేశపెడుతుందన్న ప్రచారం సాగుతోందని విప్ రుద్రరాజు పద్మరాజు తదితరులు పేర్కొన్నారు. తాను సమైక్యవాదినని గట్టిగా వాదిస్తున్నా.. తన కార్యాలయంపైనా ఉద్యమకారులు దాడులు చేశారని మంత్రి టీజీ వెంకటేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. సమైక్య నినాదంతో పార్టీ యంత్రాంగాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ ప్రకటించాలని మంత్రి శైలజానాథ్... పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను కోరారు. దీంతో సీనియర్ మంత్రులు, నాయకులతో కమిటీని ఏర్పాటు చేస్తానని బొత్స చెప్పారు. తాను పార్టీలోనే కొనసాగుతానని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫునే పోటీచేస్తానని మంత్రి ఆనం నారాయణరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ఉందని, తాను పోటీ చేయాలనుకోవడం లేదని జేసీ పేర్కొన్నారు. కేంద్రం రూపొందిం చిన ఆర్డినెన్సును చించి పారేయాలని రాహుల్గాంధీ పేర్కొన్నం దున బొత్స ఆయనతో మాట్లాడి తెలంగాణ తీర్మానాన్ని కూడా అలాగే చించే లా చూడాలని సమావేశంలో మరో నేత పేర్కొన్నారు. దాడులు చేసేవారిపై ఫిర్యాదు చేస్తే కేసులు ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడ్డారని తెలిసింది. విజయనగరంలో తన నివాసంపై జరిగిన దాడి గురించి బొత్స ప్రస్తావించి, అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. దాడులు చేసిన వారిపై కేసులు నమోదైతే తప్పనిసరిగా పోలీసులు చర్యలు తీసుకుంటారని సీఎం స్పష్టంచేశారు. హామీ పత్రం ఇచ్చేందుకు సిద్ధం: గంటా సమావేశం అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీఎన్జీవోలు గత 60 రోజులకు పైగా చేస్తున్న సమ్మెను విరమించాలని ఒక విజప్తి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాడే బాధ్యతను తాము తీసుకుంటామని ఉద్యోగులకు ఒక హామీ పత్రం సైతం ఇచ్చేందుకు సిద్ధమన్నారు. ఎంపీలు, కేంద్ర మంత్రులు సైతం రాజీనామా చేయవద్దన్న అంశంపైనా చర్చ జరిగిందని తెలిపారు. ఎంపీల రాజీనామాల వల్ల పార్లమెంట్లో తమ వాదన వినిపించడానికి అవకాశం ఉండదని, అందువల్ల రాజీనామాలు వద్దన్న అభిప్రాయం వ్యక్తమైందన్నారు. మంత్రి పదవికి, పార్టీకి ఏరాసు రాజీనామా తెలంగాణపై కేంద్ర కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం గవర్నర్ నరసింహన్ను కలసి రాజీనామా పత్రాన్ని అందించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను ఫ్యాక్స్ ద్వారా గాంధీభవన్కు పంపారు. సీమాంధ్ర ప్రజల పట్ల కేంద్రం, కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూస్తున్నందుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నానని ఏరాసు తన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్కు బుద్ధప్రసాద్ గుడ్బై రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. శుక్రవారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తన రాజీనామా లేఖను పంపారు. రాజీనామా లేఖ ప్రతిని పత్రికలకు విడుదల చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకోవడం తీరని అన్యాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మౌలిక సిద్ధాంతానికి తిలోదకాలు ఇస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. -
ప్రకటనలే.. లేఖలివ్వలే!
* అవి తూతూ మంత్రపు రాజీనామాలే * ప్రకటనలు చేసి స్పీకర్కు లేఖలు పంపని నేతలు * రాజీనామాలు చేసినట్టు ప్రకటించిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు పార్లమెంట్కు.. * స్పీకర్ ఫార్మాట్లో కాకుండా విరుద్ధమైన ఫార్మాట్లో రాజీనామాలిచ్చిన మరికొందరు * వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి మాత్రమే స్పీకర్కు రాజీనామా లేఖలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ తీసుకున్న హడావుడి నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర మంత్రులు, ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధుల రాజీనామాలు పెద్ద ప్రహసనంగా మిగిలాయి. ఆయా నాయకుల రాజీనామాలన్నీ ఒక డ్రామాను తలపిస్తున్నాయి. రాజీనామాలు చేసిన వారిలో నలుగురైదుగురు మాత్రమే స్పీకర్ ఫార్మాట్లో శాసనసభ కార్యాలయానికి లేఖలు అందించారు. పైకి గంభీరమైన ప్రకటనలు చేసినప్పటికీ ఇతర నేతలు అలా లేఖలేవీ సమర్పించలేదు. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే నిర్ణీత ఫార్మాట్లో కాకుండా ఆమోదానికి వీల్లేని రీతిలో రాజీనామా పత్రాలు సమర్పించడం విశేషం. పదవులను వదులుకోవడం ఇష్టంలేకే వీరు అలాంటి ఫార్మాట్లో లేఖలిచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చిత్తశుద్ధితో రాజీనామా చేయాలనుకొనేవారు తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఏకవాక్యంతో స్పీకర్కు ఏకవాక్య లేఖను సమర్పిస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రకటనకు ముందే వైఎస్సార్ సీపీ రాజీనామాలు.. తెలంగాణపై కాంగ్రె స్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడానికి ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించడం తెలిసిందే. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ వారు రాజీనామాలు సమర్పించారు. ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయడంలో కాంగ్రెస్ వైఫల్యానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి, మరో ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డిలు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా తన పదవికి రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీ నుంచి మొత్తం పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికైన వారంతా రాజీనామాలు సమర్పించగా కాంగ్రెస్, టీడీపీలలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ముందే తెలిసినా రాజీనామాలు చేయలేదు.. ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తారన్న సంగతి మా పార్టీ నేతలకు ముందే తెలుసు. అయినప్పటికీ అంతవరకు నిరీక్షించి నిర్ణయం వెలువరించిన రోజున రాజీనామాలపై వీరంతా తర్జనభర్జనపడ్డారు. పదవుల్లో కొనసాగుతూనే అధిష్టానం చెప్పినట్లు నడచుకొనే తీరులో వారి వ్యవహారం సాగుతోంది’ అని కాంగ్రెస్కే చెందిన ద్వితీయ శ్రేణి నాయకుడొకరు వ్యాఖ్యానించారు. రాజీనామా లేఖలను స్పీకర్ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉండగా.. కొందరు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, కొందరు సీఎంకు సమర్పించారు. ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్కుమార్, పెంచికర్ల రమేష్బాబు, జేసీ దివాకర్రెడ్డి, గాదె వెంకటరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆది నారాయణరెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, మురళీకృష్ణ, ఆనం వివేక్, సుధాకర్లు శాసనసభ కార్యాలయంలో లేఖలు అందించారు. కారుమూరి నాగేశ్వరరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వంగా గీత, కన్నబాబు, పంతం గాంధీమోహన్, బంగారు ఉషారాణిలు బొత్సకు రాజీనామాపత్రాలు ఇచ్చినట్టు చెప్పుకున్నారు. ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాసరావు, మళ్ల విజయప్రసాద్, పాముల రాజేశ్వరి, ముత్యాలపాపలు కూడా రాజీనామా పత్రాలు సమర్పించారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, టి.విజయకుమార్లు తమ పదవులకు రాజీనామా చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు జుట్టు జగన్నాయకులు, కొర్లభారతి, మీసాల నీలకంఠం నాయుడు, బొడ్డేపల్లి సత్యవతి.. సీఎం కిరణ్కుమార్రెడ్డిని కలిసి రాజీనామా పత్రాలు ఇచ్చారు. ఐదుగురు మంత్రుల రాజీనామా.. కాంగ్రెస్ తెలంగాణ తీర్మానానికి నిరసనగా రాజీనామాలు చేస్తామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో మంత్రులంతా అంగీకరించారు. చివరకు సీఎం సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ఐదుగురు మంత్రులు రాజీనామాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి లేఖలు అందించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, కాసు కృష్ణారెడ్డి, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్రెడ్డి, అహ్మదుల్లాలు సీఎంకు రాజీనామా లేఖలు ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. మరునాడు విశ్వరూప్, మహీధర్రెడ్డిలు సీఎంను కలసి లేఖలు అందించారు. కొండ్రు మురళీమోహన్, శత్రుచర్ల విజయరామరాజులు రాజీనామాలు సమర్పించారు. అయితే వీరిలో కొందరు సచివాలయంవైపు రానప్పటికీ ఇంటి వద్ద ఎప్పటిలాగే తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంపీలదీ అధిష్టానం దారే కాంగ్రెస్ ఎంపీలు కూడా రాజీనామాల డ్రామాను రక్తికట్టించారు. ఎవరూ రాజీనామాలు చేయవద్దని, అసెంబ్లీ, పార్లమెంటులో విభజన అంశంపై వాదనలు గట్టిగా వినిపించాల్సి ఉంటుందని పిలుపునిచ్చిన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఆ మేరకు లేఖను పార్లమెంటుకు అందించారు. ఎస్పీవై రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, సాయిప్రతాప్, హర్షకుమార్, లగడపాటి రాజగోపాల్, కేవీపీ రామచంద్రరావు, మాగుంట సుబ్బరామిరెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి రాజీనామాలు ఫ్యాక్స్ల ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపించారు. రాయపాటి సాంబశివరావు అమెరికా నుంచి ఫ్యాక్స్ద్వారా రాజీనామా లేఖను పంపినట్టు సన్నిహితుల ద్వారా చెప్పించారు. అయితే వీరు రాజీనామా చేసినా అధిష్టానం సూచనల మేరకు వ్యూహాత్మకంగా నడుస్తున్నారన్న విమర్శలున్నాయి. పార్లమెంటు సమావేశాలకు హాజరవుతూ పార్టీ నిర్దేశించిన విధంగా ఆహార భద్రత బిల్లుపై ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ ఎంపీలే చెబుతున్నారు. టీడీపీ.. అటు రాజీనామాలు, ఇటు సభల్లో ఆందోళనలు.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ నేతల్లాగానే నాటకాలు ఆడుతున్నారన్న విమర్శలు సీమాంధ్ర నేతల నుంచి వస్తున్నాయి. తెలంగాణకు ఆ పార్టీ తరఫున చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చారు. కేంద్రం దాని ఆధారంగా రాష్ట్ర విభజనకు సిద్ధపడుతుండగా వారంతా ఆందోళనలకు దిగుతున్నారని అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో రాజీనామాలు చేయిస్తున్నట్లు కొత్త నాటకానికి తెరలేపినా ఆ ఉత్తుత్తి రాజీనామాల డ్రామాలో కూడా ఆయన భాగస్వామి కాకుండా దూరంగా ఉండిపోయారంటూ సీమాంధ్ర నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు విభజనను స్వాగతిస్తుండగా ఆ పార్టీ ఎంపీలు హరికృష్ణ, మోదుగుల వేణుగోపాల్రెడ్డి, సుజనా చౌదరి, సీఎం రమేష్, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్లు.. విభజనకు వ్యతిరేకంగా రాజీనామాలు సమర్పించారు. అయితే రాజీనామా చేసినా తిరిగి సభకు వెళ్తూ నినాదాలతో సభను అడ్డుకొనే ప్రయత్నాలు సాగించారు. ఇవన్నీ సీమాంధ్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నాలేనన్న విమర్శలున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అబ్దుల్ ఘనీ, పరసా రత్నం, బీద మస్తాన్రావు, బల్లి దుర్గాప్రసాద్, రామకృష్ణ, కందుల నారాయణరెడ్డి, శివరామరాజు, బూరుగుపల్లి శేషారావు, వి.జోగేశ్వరరావు, జయమంగళం వెంకటరమణ, దాసరి బాలవర్ధన్రావు, అశోక్ గజపతిరాజు, ముద్దు కృష్ణమనాయుడు, కోళ్ల లలితకుమారి, వెలగపూడి రామకృష్ణబాబు, జి.రామానాయుడు, సోములు రాాజీనామాలు సమర్పించామని ప్రకటించారు. వీరంతా స్పీకర్ ఫార్మాట్లో కాకుండా అందుకు విరుద్ధమైన ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించడంతో అవన్నీ ఆమోదానికి పనికిరానివిగా మారాయి. కాగా, కాంగ్రెస్, టీడీపీల నుంచి డజనుకు మించి రాజీనామా లేఖలు స్పీకర్ కార్యాలయానికి అందలేదని అసెంబ్లీ సచివాలయ అధికారులు చెప్పడం కొసమెరుపు. -
'సీమాంధ్ర కాంగ్రెస్ ధర్నాలో పాల్గొనడం లేదు'
ఢిల్లీ: రేపు ఢిల్లీలో సీమాంధ్ర కాంగ్రెస్ నిర్వహించనున్న ధర్నాలో తాను పాల్గొనడం లేదని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. ఆంటోని కమిటీ ముందు రాష్ట్ర విభజన సమస్యలను మాత్రమే వివరిస్తానన్నారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమ జ్వాలలు ఎగసి పడుతున్న తరుణంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డొక్కా మాణిక్య ప్రసాద్.. కాంగ్రెస్ ధర్నాలో తాను పాల్గొనడం లేదని తెలిపారు. ఆంటోని కమిటీ ముందు సీమాంధ్రపై స్పష్టత ఇవ్వాలని, ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో వివరించాల్సిందిగా కోరతానని ఆయన తెలిపారు.