-
IPL 2024- WI: అలా అయితే.. సన్రైజర్స్, రాజస్తాన్కు షాక్!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ సమరానికి సమయం ఆసన్నమవుతున్న వేళ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది.మే 23, 25, 26 తేదీల్లో ప్రొటిస్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ ఆడనున్నట్లు వెల్లడించింది. జమైకాలోని సబీనా పార్కు వేదికగా ఈ మూడు మ్యాచ్లు జరుగనున్నట్లు వెల్లడించింది. కాగా విండీస్- సౌతాఫ్రికా సిరీస్ సమయంలోనే ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ నాకౌట్, క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్లు కూడా జరుగనున్నాయి.సన్రైజర్స్, రాజస్తాన్కు షాక్!ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ చేరిన జట్లలో భాగమైన ఆటగాళ్లను గనుక విండీస్- ప్రొటిస్ బోర్డులు వెనక్కి పిలిపిస్తే ఆయా ఫ్రాంఛైజీలకు తలనొప్పి తప్పదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్లోనే ఈ రెండు జట్ల ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు.ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోతున్న ఈ రెండు జట్లు గనుక కీలక సమయంలో ఆటగాళ్లను కోల్పోతే కష్టాలు తప్పవు. కాగా మే 21న ఐపీఎల్-2024 తొలి క్వాలిఫయర్, మే 22న ఎలిమినేటర్ మ్యాచ్, మే 24న రెండో క్వాలిఫయర్, మే 26న ఫైనల్ జరుగనున్నాయి.మెగా ఈవెంట్కు ముందుకాగా గత టీ20 ప్రపంచకప్నకు అర్హత సాధించలేక చతికిలపడ్డ వెస్టిండీస్.. ఆ తర్వాత స్వదేశంలో టీమిండియా, ఇంగ్లండ్లపై సిరీస్లు గెలిచి ఫామ్లోకి వచ్చింది. తాజాగా సౌతాఫ్రికాతో సిరీస్లోనూ అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది.ఇక జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్కు ముందు సొంతగడ్డపై సౌతాఫ్రికాతో సిరీస్తో విండీస్కు కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ టోర్నీ నేపథ్యంలో పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఐపీఎల్ నుంచి తమ ఆటగాళ్లను వెనక్కి పిలిపించేందుకు సమాయత్తమైన విషయం తెలిసిందే.ఐపీఎల్-2024లో భాగమైన వెస్టిండీస్, సౌతాఫ్రికా ఆటగాళ్లు వీరేవిండీస్ ప్లేయర్లురోవ్మన్ పావెల్ (రాజస్తాన్ రాయల్స్), షిమ్రాన్ హెట్మెయిర్ (రాజస్తాన్ రాయల్స్), అల్జారీ జోసెఫ్ (ఆర్సీబీ), షాయ్ హోప్ (ఢిల్లీ క్యాపిటల్స్), షమర్ జోసెఫ్ (లక్నో సూపర్ జెయింట్స్), నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్), ఆండ్రీ రస్సెల్ (కోల్కతా నైట్ రైడర్స్), రొమారియో షెఫర్డ్ (ముంబై ఇండియన్స్).సౌతాఫ్రికా ఆటగాళ్లుఐడెన్ మార్క్రమ్ (సన్రైజర్స్ హైదరాబాద్), హెన్రిచ్ క్లాసెన్ (సన్రైజర్స్ హైదరాబాద్), మార్కో జాన్సన్ (సన్రైజర్స్ హైదరాబాద్), గెరాల్డ్ కోట్జీ (ముంబై ఇండియన్స్), క్వింటన్ డికాక్ (లక్నో సూపర్ జెయింట్స్), కేశవ్ మహరాజ్ (రాజస్తాన్ రాయల్స్), డేవిడ్ మిల్లర్ (గుజరాత్ టైటాన్స్), అన్రిచ్ నోర్జే (దక్షిణాఫ్రికా), కగిసో రబడ (పంజాబ్ కింగ్స్), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్).చదవండి: గుజరాత్ టైటాన్స్ జట్టు మొత్తానికి భారీ జరిమానా.. గిల్కు ఏకంగా! -
పదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు
బెంగళూరు: భారత్లో దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు పర్యటన ఖరారైంది. వచ్చే జూన్, జూలైలో పూర్థిసాయి ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా భారత్తో దక్షిణాఫ్రికా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్లు ఆడుతుంది. ముందుగా బెంగళూరులో జూన్ 16న వన్డే సిరీస్ మొదలవుతుంది. 19న రెండో వన్డే, 23న మూడో వన్డేతో 50 ఓవర్ల ఫార్మాట్ ముగుస్తుంది. వన్డే సిరీస్ ముగిశాక ఏకైక టెస్టు పోరు జూన్ 28 నుంచి చెన్నైలో జరుగుతుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇది కేవలం మూడో టెస్టు కానుంది. దక్షిణాఫ్రికాలోని పార్ల్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు 2002లో... భారత్లోని మైసూరు వేదికగా రెండో టెస్టు 2014లో జరిగాయి. ఆ తర్వాత ఈ రెండు జట్లు టెస్టు ఫార్మాట్లో మరో మ్యాచ్ ఆడలేదు. దక్షిణాఫ్రికాతో ఆడిన రెండు టెస్టుల్లోనూ భారతే నెగ్గింది. ఏకైక టెస్టు ముగిశాక బెంగళూరులో ఈ రెండు జట్ల మధ్య జూలై 5, 7, 9 తేదీల్లో మూడు టి20ల సిరీస్ జరుగుతుంది. -
SA T20 WC Squad: మార్క్రమ్ సారథ్యంలో బరిలోకి దక్షిణాఫ్రికా
టి20 ప్రపంచకప్లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు. గత ఏడాది మార్చిలో తొలిసారి దక్షిణాఫ్రికా టి20 జట్టుకు కెపె్టన్గా ఎంపికైన మార్క్రమ్ సారథ్యంలోనే సఫారీ బృందం ఈ మెగా టోర్నీలో పోటీపడనుంది.వికెట్ కీపర్ రికెల్టన్, పేసర్ బార్ట్మన్ తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికయ్యారు. డికాక్, కొయెట్జీ, ఫోరŠూట్యన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, నోర్జే, రబడ, షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. -
T20 WC SA Squad: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2024 కోసం సౌతాఫ్రికా తమ జట్టు ప్రకటించింది. మెగా టోర్నీ నేపథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. ఐసీసీ ఈవెంట్లో ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలో తలపడే టీమ్లో అన్రిచ్ నోర్జే, క్వింటన్ డికాక్లకు చోటు ఇవ్వడం గమనార్హం.కాగా ఇటీవలే వీరిద్దరిని సౌతాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బోర్డు తప్పించిన విషయం తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా పేసర్ ఆన్రిచ్ నోర్జే గతేడాది సెప్టెంబరు నుంచి అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉండగా.. వరల్డ్కప్-2023 టోర్నీ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు డికాక్.అన్క్యాప్ట్ ప్లేయర్ల పంట పండింది!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో సత్తా చాటిన ఇద్దరు అన్క్యాప్ట్ ప్లేయర్ల పంట పండింది. ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని రియాన్ రికెల్టన్, ఒట్నీల్ బార్ట్మన్లు ఏకంగా ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించారు. ఎంఐ కేప్టౌన్ తరఫున రికెల్టన్ 530 పరుగులతో సౌతాఫ్రికా టీ20 లీగ్లో టాప్ స్కోరర్గా నిలవగా.. సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ తరఫున బరిలోకి దిగిన బార్ట్మన్ 18 వికెట్లతో రాణించి జట్టును వరుసగా రెండోసారి చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు సౌతాఫ్రికా పెద్దపీటవేయడం గమనార్హం. ఇక ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్లు కూడా మెగా ఈవెంట్లో భాగం కానున్నారు. కాగా జూన్ 1న ప్రపంచకప్నకు తెరలేవనుండగా.. జూన్ 3న సౌతాఫ్రికా న్యూయార్క్ వేదికగా శ్రీలంకతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం సౌతాఫ్రికా జట్టు ఇదే:ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, గెరాల్డ్ కొయోట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబడ, రియాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.ట్రావెలింగ్ రిజర్వ్స్: నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి. -
శ్రీలంక కెప్టెన్ సరికొత్త చరిత్ర.. అత్యంత అరుదైన రికార్డు
శ్రీలంక స్టార్ చమరి ఆటపట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో విజయవంతమైన లక్ష్య ఛేదనలో అత్యధిక స్కోరు నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్గా రికార్డులకెక్కింది. ఓవరాల్గా ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మాక్స్వెల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్గా నిలిచింది. ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా సౌతాఫ్రికా మహిళా జట్టుతో బుధవారం జరిగిన మూడో వన్డే సందర్భంగా చమరి ఆటపట్టు ఈ ఫీట్ నమోదు చేసింది. కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడే నిమిత్తం శ్రీలంక వుమెన్ టీమ్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో టీ20 సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది పర్యాటక శ్రీలంక. అదే జోరులో వన్డే సిరీస్ను కూడా కైవసం చేసుకోవాలని సంకల్పించింది. అయితే, తొలి మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించడంతో ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో అదరగొట్టి రెండో వన్డేలో ఆతిథ్య సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో వన్డేలో శ్రీలంక అద్బుత ప్రదర్శన కనబరిచింది. పోఛెఫ్స్ట్రూమ్లో బుధవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన లంక మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా ఓపెనర్, కెప్టెన్ లారా వల్వార్ట్ అజేయ శతకంతో ఆకట్టుకుంది. 147 బంతుల్లో 23 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 184 పరుగులు సాధించింది. మిగతా వాళ్లలో లారా గుడాల్ 31, మరిజానే క్యాప్ 36, నదీనే డి క్లెర్క్ 35 రన్స్ చేయగా..మిగతా వాళ్లు నిరాశపరిచారు. వల్వార్ట్ అద్బుత సెంచరీ వృథా అయితే, వల్వార్ట్ అద్భుత సెంచరీ కారణంగా సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళా జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక ఈ మ్యాచ్లో శ్రీలంక గెలుపులో కెప్టెన్ చమరి ఆటపట్టుదే కీలక పాత్ర. ఈ వెటరన్ ఓపెనర్ 139 బంతుల్లో 26 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 195 పరుగులతో చివరి వరకూ అజేయంగా నిలిచింది. 44.3 ఓవర్లో మూడో బంతికి సిక్స్ బాది లంకను విజయతీరాలకు చేర్చింది. రికార్డు విజయం కూడా ఇక ఈ మ్యాచ్లో ఆటపట్టుకు తోడుగా మరో ఓపెనర్ విష్మి గుణరత్నె(26) రాణించగా.. ఆరో నంబర్ బ్యాటర్ నీలాక్షి డి సిల్వ అజేయ అర్ధ శతకం(50)తో దుమ్ములేపింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న చమరి ఆటపట్టు.. వన్డేల్లో విజయవంతమైన రన్ ఛేజ్లో 195 పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్గా చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకుంది. ఇక శ్రీలంక వన్డేల్లో ఛేజ్ చేసిన భారీ స్కోరు కూడా ఇదే! వన్డేల్లో సక్సెస్ఫుల్ రన్ఛేజ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్లు 1. గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా)- అఫ్గనిస్తాన్ మీద- 2023 వరల్డ్కప్- 201 రన్స్(నాటౌట్) 2. చమరి ఆటపట్టు(శ్రీలంక)- సౌతాఫ్రికా మీద- 2024- 195 రన్స్(నాటౌట్) 3. షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా)- బంగ్లాదేశ్ మీద- 2011- 185 రన్స్(నాటౌట్) 4. మహేంద్ర సింగ్ ధోని(ఇండియా)- శ్రీలంక మీద- 2005- 183 రన్స్(నాటౌట్) 5. విరాట్ కోహ్లి(ఇండియా)- పాకిస్తాన్ మీద- 2012- 183 రన్స్. చదవండి: ‘టైమ్’ టాప్–100 జాబితాలో రెజ్లర్ సాక్షి -
వన్డే వరల్డ్కప్ వేదికలు ఖరారు
తదుపరి జరుగబోయే వన్డే వరల్డ్కప్కు సంబంధించిన వేదికలు ఖరారైయ్యాయి. 2027 అక్టోబర్, నవంబర్లలో షెడ్యూలైన ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రస్తుతానికి సౌతాఫ్రికాలో జరుగబోయే మ్యాచ్లకు సంబంధించిన వేదికలు ఖరారైయ్యాయి. సౌతాఫ్రికాలో ఐసీసీ గుర్తింపు పొందిన మైదానాలు మొత్తం 11 ఉండగా.. వాటిలో ఎనిమిదింట వరల్డ్కప్ మ్యాచ్లు జరుగనున్నాయి. వాండరర్స్, ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్, కింగ్స్మీడ్, గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్, పార్ల్ అండ్ న్యూలాండ్స్లోని బోలాండ్ పార్క్, బ్లూమ్ఫోంటెయిన్లోని మాంగాంగ్ ఓవల్, తూర్పు లండన్లోని బఫెలో పార్క్ మైదానాలు 2027 క్రికెట్ వరల్డ్కప్ మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనున్నాయి. బెనోని, జేబీ మార్క్స్ ఓవల్, డైమండ్ ఓవల్ మైదానాల్లో వసతులు సక్రమంగా లేనందుకు వాటిని పక్కకు పెట్టారు. చాలా అంశాలను (హోటల్స్, ఎయిర్పోర్ట్లు, స్టేడియం కెపాసిటీ తదితర అంశాలు) పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ ఎనిమిది వేదికలను వరల్డ్కప్ మ్యాచ్ల కోసం ఎంపిక చేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫోలెట్సీ మోసెకీ తెలిపారు. జింబాబ్వే నమీబియాలో జరుగబోయే మ్యాచ్లకు సంబంధించిన వేదికలు త్వరలోనే ఖరారుకానున్నాయి. కాగా, 2027 వరల్డ్కప్కు ఆతిథ్య దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత సాధించగా.. నమీబియా ఆఫ్రికన్ క్వాలిఫైయర్ను అధిగమిస్తే అర్హత సాధిస్తుంది. ఈ మెగా టోర్నీకి వన్డే ర్యాంకింగ్స్లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉండే జట్లు నేరుగా అర్హత పొందనుండగా.. మిగిలిన నాలుగు స్థానాలు గ్లోబల్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ల ద్వారా నిర్ణయించబడతాయి. ఈ టోర్నీలో పాల్గొనే 14 జట్లు గ్రూప్కు ఏడు చొప్పున రెండు గ్రూపులు విభజించబడతాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. అనంతరం సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. 2003 వరల్డ్కప్ తరహాలోనే ఈ ప్రపంచకప్లోనూ గ్రూప్ దశలో జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. -
బస్సు లోయలో పడి 45 మంది మృతి
కేప్ టౌన్: ఈస్టర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని బస్సు ప్రమాదం కబళించింది. దక్షిణాఫ్రికాలోని లింపొపొ ప్రావిన్స్లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోగా ఒక్క చిన్నారి గాయాలతో సజీవంగా బయటపడింది. బోట్స్వానాకు చెందిన వీరంతా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈస్టర్ ఉత్సవాలకు వెళ్తున్నారు. అదుపు తప్పిన బస్సు కొండప్రాంతంలోని ఎంమట్లకలా వద్ద వంతెన బారియర్లను ఢీకొట్టింది. ఆ పక్కనే ఉన్న 164 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ముక్కలైన బస్సులో భారీగా మంటలు చెలరేగి కొందరు సజీవ దహనం కాగా, మరికొందరు దూరంగా పడిపోయారు. ఘటనలో డ్రైవర్ సహా మొత్తం 45 మంది ప్రాణాలు కోల్పోగా ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రమే సజీవంగా బయటపడింది. మంటల్లో కొందరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో నుజ్జయిన బస్సులో ఇరుక్కుపోయాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎనిమిదేళ్ల చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పొరుగు దేశం బొట్స్వానాకు చెందిన బాధితులంతా దక్షిణాఫ్రికాలోని మోరియా పట్టణంలో ఘనంగా జరిగే ‘జియోన్ క్రిస్టియన్ చర్చి’ ఈస్టర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫొసా బొట్స్వానా అధ్యక్షుడు మసిసితో ఫోన్లో మాట్లాడారు. ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈస్టర్ పండుగ రద్దీ సమయంలో రోడ్డు ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను సైతం చేపట్టినప్పటికీ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. #BREAKING : Bus Accident Kills 45 In South Africa At least 45 people were killed as a result of a bus accident, South Africa's Department of Transportation said. An 8-year-old girl is reportedly the only survivor. The crash occurred near Mamatlakala in the northern province of… pic.twitter.com/15tGAbdAM0 — upuknews (@upuknews1) March 29, 2024 బ్రిడ్జి పై నుంచి కింద పడి నేలను ఢీకొట్టిన తర్వాత బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. దీంతో ప్రమాదంలో మరణించిన కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మాడిపోయాయి. కొన్ని మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకుపోగా మరికొన్ని చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలంలో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు బోట్సువానా నుంచి మొరియా పట్టణానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి.. ప్రముఖ సైకాలజిస్ట్ కన్నుమూత -
సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన క్రికెట్ సౌతాఫ్రికా
2024-25 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ ప్రకటించింది. ఈ జాబితాలో స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే పేరు కనిపించలేదు. గతేడాది కాలంలో నోర్జే జాతీయ జట్టుకు అడపాదడపా ప్రాతినిథ్యం వహించడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. సౌతాఫ్రికా గతేడాదికాలంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 37 మ్యాచ్లు ఆడగా.. నోర్జే కేవలం తొమ్మిది మ్యాచ్ల్లో మాత్రమే ఆడాడు. సీఎస్ఏ సెంట్రల్ కాంట్రాక్ లిస్ట్లో నోర్జే పేరుతో పాటు సిసండ మగాల, వేన్ పార్నెల్, కీగన్ పీటర్సన్ పేర్లు కూడా కనిపించలేదు. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన టెస్ట్ కెప్టెన్ డీన్ ఎల్గర్, టీ20లకు మాత్రమే పరిమతమైన క్వింటన్ డికాక్ పేర్లను సైతం సీఎస్ఏ అధికారులు తొలగించారు. కొత్తగా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆశించిన కైల్ వెర్రిన్, డేవిడ్ బెడింగ్హమ్లకు మొండిచెయ్యి ఎదురైంది. పేస్ బౌలర్ నండ్రే బర్గర్, ఓపెనింగ్ బ్యాటర్ టోనీ డి జోర్జీ కొత్తగా కాంట్రాక్ట్ దక్కించుకోగా.. అండీల్ ఫెహ్లుక్వాయో ఏడాది గ్యాప్ తర్వాత తిరిగి కాంట్రాక్ట్ను పొందాడు. గతేడాది మొత్తం 20 మంది సెంట్రల్ కాంట్రాక్ట్ పొందగా.. ఈ ఏడాది ఆ సంఖ్యను 18కే కుదించారు. మహిళల విషయానికొస్తే.. సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్స్ సంఖ్య 15 నుంచి 16కు పెరిగింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన షబ్నిమ్ ఇస్మాయిల్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోగా.. కొత్తగా అయండ హ్లుబి, ఎలిజ్-మారి మార్క్స్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. 2024-25 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన సౌతాఫ్రికా పురుష క్రికెటర్లు.. టెంబా బవుమా, నండ్రే బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ, టోనీ డి జోర్జి, జోర్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఆండీల్ ఫెహ్లుక్వాయో, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంషి, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన మహిళా క్రికెటర్లు.. అన్నేకే బోష్, తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, లారా గుడాల్, అయాండా హ్లూబి, సినాలో జాఫ్తా, మారిజన్ కప్, అయాబొంగా ఖాకా, మసాబాటా క్లాస్, సున్ లూస్, ఎలిజ్-మారీ మార్క్స్, నోంకులులేకో మ్లాబా, తుమీ సెఖుఖునే, క్లో ట్రైయాన్, డెల్మి టక్కర్, లారా వోల్వార్డ్ట్ -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్.. 147 యేళ్ల క్రికెట్ హిస్టరీలోనే
ఆఫ్రికన్ గేమ్స్ 2024లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బోణీ కొట్టింది. ఈ గేమ్స్లో ప్రోటీస్ తృతీయ శ్రేణి జట్టు పాల్గోంటుంది. ఈ ఈవెంట్లో భాగంగా ఘనాతో జరిగిన తొలి మ్యాచ్లో 134 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ప్రోటీస్ బ్యాటర్లలో కెప్టెన్ జార్జ్ వాన్ హీర్డెన్(107) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు హెన్రిచ్ పీటర్(62) రాణించాడు. అనంతరం 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఘనా కేవలం 103 పరుగులకే కుప్పకూలింది. ఇక మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన ప్రోటీస్ కెప్టెన్ వాన్ హీర్డెన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసిన యంగెస్ట్ కెప్టెన్గా వాన్ హీర్డెన్ నిలిచాడు. వాన్ హీర్డెన్ 20 ఏళ్ల 188 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు జింబావ్వే మాజీ కెప్టెన్ టెటాండా టైబ్(21 ఏళ్ల 248 రోజులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో టైబ్ ఆల్టైమ్ రికార్డును వాన్ హీర్డన్ నిలిచాడు. చదవండి: WPL 2024: ఫైనల్లో 4 వికెట్లు.. ఆర్సీబీ క్వీన్! ఎవరీ శ్రేయాంక? -
David Miller: గర్ల్ఫ్రెండ్ను పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్.. ఫోటోలు వైరల్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి కామిలా హారిస్ను మిల్లర్ పెళ్లి చేసుకున్నాడు. గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట.. ఆదివారం వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా హారిస్ సోషల్ మీడియావేదికగా వెల్లడించారు. వారు పెళ్లికి సంబంధించిన ఫోటోలను హారిస్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. వీరి వివాహానికి పలువురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు హాజరయ్యారు. కాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ గతేడాది ఆగస్ట్లో జరిగింది. ఇక దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్ మిల్లర్ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో ప్రోటీస్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరపున 173 వన్డేలు ఆడిన మిల్లర్ 4458 పరుగులు చేశాడు. అదే విధంగా 116 టీ20ల్లో 2270 పరుగులు డేవిడ్ చేశాడు. ఇక మిల్లర్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2022 సీజన్ టైటిల్ను గుజరాత్ సొంతం చేసుకోవడంలో మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. చదవండి: WPL 2024: ప్లేఆఫ్స్కు ఢిల్లీ -
విషాదం.. క్రికెట్ దిగ్గజం కన్నుమూత
దక్షిణాఫ్రికా క్రికెట్లో విషాదం నెలకొంది. ఆ దేశ దిగ్గజ ఆటగాడు, మ్యాచ్ రిఫరి మైక్ ప్రోక్టర్ (77) కన్నుమూశారు. గుండె సర్జరీ అనంతరం వచ్చే సమస్యల కారణంగా ప్రోక్టర్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దక్షిణాఫ్రికా క్రికెట్ తొలినాళ్లలో ప్రోక్టర్ గొప్ప ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున కేవలం ఏడు టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడిన ప్రోక్టర్.. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఘనమైన రికార్డు కలిగి ఉన్నాడు. ప్రోక్టర్ 401 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 21936 పరుగులు, 1417 వికెట్లు పడగొట్టాడు. ప్రోక్టర్ ఖాతాలో 48 సెంచరీలు, 70 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. ప్రోక్టర్ అంతర్జాతీయ కెరీర్లో ఆడిన ఏడు మ్యాచ్లు (1967-70 మధ్యలో) ఆస్ట్రేలియాతోనే ఆడాడు. ఇందులో 41 వికెట్లు పడగొట్టి, 25.1 సగటున 226 పరుగులు చేశాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ప్రోక్టర్ పేరిట ఆరు వరుస సెంచరీల రికార్డు ఉంది. 1970లో రొడేషియా తరఫున అతను ఈ ఫీట్ సాధించాడు. కౌంటీల్లో 13 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు గ్లోసెస్టర్షైర్కు ప్రాతినిథ్యం వహించిన ప్రోక్టర్.. 1971లో ఆ కౌంటీ తరఫున వరుసగా నాలుగు మ్యాచ్ల్లో నాలుగు సెంచరీలు సాధించాడు. టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్పై నిషేధం విధించిన సిడ్నీ టెస్ట్కు ప్రోక్టర్ రిఫరిగా వ్యవహరించాడు. ప్రోక్టర్ రిఫరి విధుల నుంచి వైదొలిగిన అనంతరం జాతీయ జట్టు చీఫ్ సెలక్టర్గా కూడా వ్యవహరించాడు. -
వరుస సెంచరీలతో దూసుకుపోతున్న కేన్ మామ.. సెంచరీ నంబర్ 45
టెస్ట్ క్రికెట్లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ సెంచరీల దాహం తీరడం లేదు. గత ఆరు మ్యాచ్ల్లో ఆరు శతకాలు బాదిన కేన్ మామ.. తాజాగా మరో సెంచరీ చేశాడు. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హ్యామిల్టన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్లో కేన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఛేదనలో కేన్ అజేయ సెంచరీతో (133 నాటౌట్) చెలరేగి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేన్ టెస్ట్ కెరీర్లో ఇది 32వ శతకం. ఈ సెంచరీతో కేన్ ఫాబ్ ఫోర్లో (కోహ్లి, రూట్, స్మిత్, కేన్) అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కేన్ విలియమ్సన్- 32 (98 మ్యాచ్లు) స్టీవ్ స్మిత్- 32 (107 టెస్ట్లు) జో రూట్- 30 (138 టెస్ట్లు) కోహ్లి- 29 (113 టెస్ట్లు) ఫిబ్రవరి 3న ఫాబ్ ఫోర్లో నాలుగో స్థానంలో ఉన్న కేన్.. ఫిబ్రవరి 16 వచ్చే సరికి టాప్ ప్లేస్కు చేరాడు. తాజా సెంచరీతో కేన్ సాధించిన మరిన్ని ఘనతలు.. గత ఏడు టెస్ట్ల్లో ఏడు సెంచరీలు.. గత నాలుగు ఇన్నింగ్స్ల్లో మూడు సెంచరీలు 4 & 132 వర్సెస్ఇంగ్లండ్ 1 & 121* వర్సెస్ శ్రీలంక 215 వర్సెస్ శ్రీలంక 104 & 11 వర్సెస్ బంగ్లాదేశ్ 13 & 11 వర్సెస్ బంగ్లాదేశ్ 118 & 109 వర్సెస్ సౌతాఫ్రికా 43 & 133* వర్సెస్ సౌతాఫ్రికా ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు.. విరాట్ కోహ్లీ - 80 డేవిడ్ వార్నర్ - 49 రోహిత్ శర్మ - 47 జో రూట్ - 46 కేన్ విలియమ్సన్ - 45* న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు (32). కేన్ వరుస శతకాలతో (3) విరుచుకుపడటంతో న్యూజిలాండ్ తొలిసారి (92 ఏళ్ల చరిత్రలో) దక్షిణాఫ్రికాపై టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్ట్ స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా 242 (డి స్వార్డ్ట్ 64) & 235 (బెడింగ్హమ్ 110) న్యూజిలాండ్ 211 (కేన్ 43) & 269/3 (కేన్ 133 నాటౌట్) 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్ కూడా గెలిచిన న్యూజిలాండ్ 2-0 తేడాతో సఫారీలను క్లీన్ స్వీప్ చేసింది. -
ఆసీస్ క్రికెటర్ అద్భుత ప్రదర్శన.. బంతితో రాణించి, బ్యాట్తో డబుల్ సెంచరీ
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాటర్ అన్నాబెల్ సదర్ల్యాండ్ అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తొలుత బంతితో రాణించిన (3/19) అన్నాబెల్.. ఆతర్వాత బ్యాట్తో విశ్వరూపం ప్రదర్శించింది. ఈ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కేవలం 248 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి ఔరా అనిపించింది. ఈ మ్యాచ్లో మొత్తం 256 బంతులు ఎదుర్కొన్న అన్నాబెల్ 210 పరుగులు చేసి ఔటైంది. ఆన్నాబెల్.. టెయిలెండర్లు ఆష్లే గార్డ్నర్ (65), కిమ్ గార్త్ (49 నాటౌట్), సోఫీ మోలినెక్స్ (33) సహకారంతో డబుల్ సెంచరీ పూర్తి చేసింది. అంతకుముందు కెప్టెన్ అలైసా హీలీ (99), బెత్ మూనీ (78) కూడా రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 575 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో క్లాస్, టైరాన్ తలో 3 వికెట్లు, డి క్లెర్క్ 2, టక్కర్ ఓ వికెట్ పడగొట్టారు. దీనికి ముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 76 పరుగులకే ఆలౌటైంది. డార్సీ బ్రౌన్ (5/25), అన్నాబెల్ (3/19), తహిళ మెక్గ్రాత్ (2/4) సౌతాఫ్రికాను కుప్పకూల్చారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో సూన్ లస్ (26), పదో నంబర్ ప్లేయర్ క్లాస్ ఝ(10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇది రెండో రోజు మాత్రమే. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. ప్రస్తుతం ఆసీస్ 499 పరుగుల ఆధిక్యంలో ఉంది. సౌతాఫ్రికా మహిళా జట్టుకు ఇది తొలి టెస్ట్ మ్యాచ్. -
మాటల్లో వర్ణించలేని క్యాచ్.. మాయ చేసిన గ్లెన్ ఫిలిప్స్
క్రికెట్ చరిత్రలో మరో అద్భుతమైన క్యాచ్ నమోదైంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యంకాని రీతిలో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఫిలిప్స్ పట్టిన ఈ క్యాచ్ను మాటల్లో వర్ణించలేని పరిస్థితి. గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్ తన కుడివైపుకు గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకున్నాడు. ఫిలిప్స్ ఈ క్యాచ్ పట్టాక న్యూజిలాండ్ ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. Glenn Phillips takes an OUTRAGEOUS catch. The flying Bird.#INDvsENG #INDvENGpic.twitter.com/NsXe122tsm — Abdullah Neaz (@Neaz__Abdullah) February 15, 2024 రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా హ్యామిల్టన్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్ ఈ కళ్లు చెదిరే క్యాచ్కు వేదికైంది. మూడో రోజు ఆటలో కీగన్ పీటర్సన్ కొట్టిన షాట్ను ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్గా మలిచాడు. కాగా, పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. కఠినమైన పిచ్పై పర్యాటక సౌతాఫ్రికా.. న్యూజిలాండ్కు 267 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 227 పరుగులు చేయాలి. స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 242 ఆలౌట్ (డి స్వార్డ్ట్ 64, విలియమ్ రూర్కీ 4/59) న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 211 ఆలౌట్ (విలియమ్సన్ 43, డి పైడ్ట్ 5/89) సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 235 ఆలౌట్ (బెడింగ్హమ్ 110, విలియమ్ రూర్కీ 5/34) న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ 40/1 (టామ్ లాథమ్ 21 నాటౌట్, డి పైడ్ట్ 1/3) న్యూజిలాండ్ గెలవాలంటే 227 పరుగులు చేయాలి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. -
రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్-సౌతాఫ్రికా రెండో టెస్ట్
రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హ్యామిల్టన్ వేదికగా న్యూజిలాండ్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. కఠినమైన పిచ్పై పర్యాటక సౌతాఫ్రికా.. న్యూజిలాండ్కు 267 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. మూడో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా.. డెవాన్ కాన్వే (17) ఔటయ్యాడు. కాన్వే ఔటయ్యాక అంపైర్లు మూడో రోజు ఆటను ముగించారు. న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 227 పరుగులు చేయాలి. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో రేపు ఫలితం తేలడం ఖాయమని తెలుస్తుంది. అంతకుముందు బెడింగ్హమ్ (110) కెరీర్లో తొలి శతకంతో విజృంభించడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో 235 పరుగులు చేసి ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో బెడింగ్హమ్తో పాటు నీల్ బ్రాండ్ (34), కీగన్ పీటర్సన్ (43), హమ్జా (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. విలియమ్ రూర్కీ ఐదు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. దీనికి ముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 211 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. 43 పరుగులు చేసిన విలియమ్సన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్ డి పైడ్ట్ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 242 పరుగులకు ఆలౌటైంది. రుయాన్ డి స్కార్డ్ట్ (64) టాప్ స్కోరర్గా నిలిచాడు. కివీస్ పేసర్ విలియమ్ రూర్కీ నాలుగు వికెట్లతో రాణించాడు. కాగా, ఈ సిరీస్లో తొలి టెస్ట్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. క్రికెట్ సౌతాఫ్రికా.. న్యూజిలాండ్ పర్యటనకు ద్వితియ శ్రేణి జట్టును పంపించింది. -
టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించిన సౌతాఫ్రికా బౌలర్
సౌతాఫ్రికా వెటరన్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్లో 500 వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. ప్రపంచ క్రికెట్లో తాహిర్కు ముందు డ్వేన్ బ్రావో (624 వికెట్లు), రషీద ఖాన్ (556), సునీల్ నరైన్ (532) 500 వికెట్ల మార్కును తాకారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో రంగ్పూర్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న తాహిర్.. ఖుల్నా టైగర్స్తో నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో తాహిర్ ఐదు వికెట్ల ఘనత సాధించి, తన జట్టును ఒంటిచేత్తో గెలిచిపించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రంగ్పూర్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ (69), మెహిది హసన్ (60) అర్దసెంచరీలతో రాణించగా.. నురుల్ హసన్ (32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షకీబ్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఖుల్నా టైగర్స్ బౌలర్లలో లూక్ వుడ్ 3, నహిద్ రాణా, నసుమ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్.. ఇమ్రాన్ తాహిర్ (4-0-26-5), షకీబ్ అల్ హసన్ (3.2-0-30-2), మెహిది హసన్ (1/13), హసన్ మహమూద్ (1/29), జేమ్స్ నీషమ్ (1/5) ధాటికి 18.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. టైగర్స్ బౌలర్లలో అలెక్స్ హేల్స్ (60) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాటర్లు కనీసం 20 పరుగులకు మించి చేయలేకపోయారు. -
Kruger National Park: ట్రైన్ రిసార్ట్
చుట్టూ పచ్చని పచ్చికబయళ్లు, వన్యప్రాణులు. నాలుగు అడుగులేస్తే మన కోసమే ప్రత్యేకంగా ఈతకొలను. ఇంకాస్త పక్కకెళితే ప్రకృతి రమణీయతను చూసేందుకు విడిగా వ్యూ డెక్కులు, మనం ఉన్నచోటు కిందే ఉరకలెత్తుతూ సాగే నది, సకల సౌకర్యాలతో సిద్ధంగా ఉన్న విలాసవంతమైన గది. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర జీవనానికి చిరునామాగా నిలిచే ఇలాంటి చోట కొంతకాలమైనా గడపాలని ఎంతో మంది ఆశ పడతారు. అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం ఒక రైలును సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది ఒక పాత వంతెనపై హోటల్గా మార్చారు. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా పేరొందిన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ వనంలో ఈ ‘ది ట్రైన్ ఆన్ ది బ్రిడ్జ్’ హోటల్ ఉంది. ఈ కదలని రైలు అరుదైన అనుభూతిని పంచుతుంది. ఇందులో పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలతో 31 సూట్లు సిద్ధంచేశారు. అన్ని రకాల వంటకాలతోపాటు స్థానిక రుచులనూ ఆస్వాదించవచ్చు. గైడ్ల సాయంతో అడవిలోకెళ్లి స్వేచ్ఛగా సింహం, చిరుతపులి, ఏనుగు, నీటిగుర్రం, అడవి బర్రెలను దగ్గర్నుంచి చూసిరావచ్చు. ఒక ట్విన్(జంట)రూమ్లో పర్యాటకులు ఒక రాత్రి గడపాలంటే ఒక మనిషికి దాదాపు రూ.44,000 రుసుము వసూలుచేస్తారు. 100 ఏళ్లకు పైబడిన ఈ వంతెనపై గతంలో స్టీమ్ రైళ్లు నడిచేవి. వారసత్వంగా నిలిచిన ఈ వన వంతెనను విభిన్నంగా వినియోగిద్దామని ఈ హోటల్కు రూపకల్పన చేశామని మోట్సామయీ టూరిజం గ్రూప్ సీఈవో జెరీ మబేనా చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎట్టకేలకు గెలిచిన సౌతాఫ్రికా.. 17వ ప్రయత్నంలో విజయం
మహిళల క్రికెట్లో తమపై ఆస్ట్రేలియా ఆథిపత్యానికి సౌతాఫ్రికా చెక్ పెట్టింది. వన్డేల్లో వరుసగా 16 మ్యాచ్ల్లో విజయం ఎరుగని ప్రొటీస్ జట్టు.. ఎట్టకేలకు 17వ ప్రయత్నంలో (ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 16 వన్డేల్లో ఓ మ్యాచ్ టై కాగా మిగతా మ్యాచ్లన్నీ ఆస్ట్రేలియానే గెలిచింది) విజయం సాధించగలిగింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 7) జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 80 పరుగుల తేడాతో గెలుపొందింది. 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. మారిజెన్ కప్ (75) అర్ధసెంచరీతో రాణించగా.. అన్నెక్ బోష్ (44), క్లో టైరాన్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షట్, ఆష్లే గార్డ్నర్ తలో రెండు వికెట్లు సాధించగా.. సదర్ల్యాండ్, కిమ్ గార్త్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. సఫారీ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 29.3 ఓవరల్లో 149 పరుగులకే చాపచుట్టేసింది. మారిజెన్ కెప్ 3, అయాండా హ్లుబీ, ఎలిజ్ మారి మార్క్స్, డి క్లెర్క్ తలో 2 వికెట్లు, క్లో టైరాన్ ఓ వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్లో పదో నంబర్ ప్లేయర్ కిమ్ గార్త్ (42 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచింది. గార్త్.. గార్డ్నర్ (35) సాయంతో ఈ ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఆసీస్ మరింత దారుణంగా ఓడేది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్ ఆసీస్ గెలువగా.. రెండో దాంట్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో వన్డే ఫిబ్రవరి 10న సిడ్నీలోనే జరుగనుంది. -
ఆహా.. ఏం ఆడార్రా మన కుర్రోళ్లు..!
-
శ్రమించి... ఛేదించి...
ఈ టోర్నీలో ఆడిన మ్యాచ్లన్నీ గెలిచిన యువ భారత జట్టుకు 245 లక్ష్యం సులువైందే! కానీ 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియాకు ఆ సులువైన లక్ష్యమే క్లిష్టంగా మారింది. ఈ దశలో కెప్టెన్ ఉదయ్ సహారణ్కు జతయిన సచిన్ దాస్ ఐదో వికెట్కు 171 పరుగులు జోడించడంతో ఓటమి కోరల్లోంచి బయటపడిన భారత్ ఈ మెగా టోర్నీ చరిత్రలో తొమ్మిదోసారి ఫైనల్ పోరుకు అర్హత పొందింది. బెనోని (దక్షిణాఫ్రికా): ఆరంభం నుంచి అండర్–19 ప్రపంచకప్లో అలవోకగా జైత్రయాత్ర చేస్తున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్కు సెమీస్లో అసాధారణ పోరాటం ఎదురైనా... అద్భుతమైన విజయంతో ఫైనల్ చేరింది. తొలి సెమీఫైనల్లో యువ భారత్ 2 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. ప్రిటోరియస్ (102 బంతుల్లో 76; 6 ఫోర్లు, 3 సిక్స్లు), రిచర్డ్ (100 బంతుల్లో 64; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. రాజ్ లింబాని 3; ముషీర్ ఖాన్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఉదయ్ (124 బంతుల్లో 81; 6 ఫోర్లు), సచిన్ దాస్ (95 బంతుల్లో 96; 11 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత పోరాటం చేశారు. సీన్ మార్చిన సచిన్ జట్టు ఖాతా తెరువక ముందే తొలి బంతికే ఆదర్శ్ సింగ్ (0), కాసేపటికే ముషీర్ ఖాన్ (4), అర్షిన్ (12), ప్రియాన్షు (5) పెవిలియన్ చేరారు. ఈ దశలో క్రీజులో ఉన్న కెప్టెన్ ఉదయ్కి సచిన్ దాస్ జతయ్యాడు. కెప్టెన్ నింపాదిగా ఆడుతుంటే అడపాదడపా బౌండరీలతో సచిన్ దాస్ లక్ష్యఛేదనకు అవసరమైన పరుగులు పేర్చాడు. అర్ధసెంచరీలతో ఇన్నింగ్స్ను గాడిన పెట్టారు. ఇద్దరు 30 ఓవర్లపాటు అసాధారణ పోరాటం చేశారు. 4 పరుగుల తేడాతో సచిన్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకోగా... హైదరాబాద్ ఆటగాళ్లు అరవెల్లి అవనీశ్ రావు (10), అభిషేక్ మురుగన్ (0) వికెట్లు పడటంతో ఉత్కంఠ పెరిగింది. ఈ దశలో రాజ్ లింబాని (4 బంతుల్లో 13 నాటౌట్; 1 సిక్స్, 1 ఫోర్) జట్టును విజయ తీరానికి చేర్చాడు. గురువారం ఆ్రస్టేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో నెగ్గిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో భారత్తో తలపడుతుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ప్రిటోరియస్ (సి) అభిõÙక్ (బి) ముషీర్ 76; స్టీవ్ స్టోల్క్ (సి) అవనీశ్ (బి) రాజ్ 14; టీగెర్ (బి) రాజ్ 0; రిచర్డ్ (సి) మొయిలా (బి) నమన్ 64; ఒలీవర్ (సి) సచిన్ (బి) ముషీర్ 22; మరయిస్ (సి) అభిషేక్ (బి) సౌమీ పాండే 3; జేమ్స్ (సి) అవనీశ్ (బి) రాజ్ 24; నార్టన్ నాటౌట్ 7; ట్రిస్టన్ నాటౌట్ 23; ఎక్స్ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–23, 2–46, 3–118, 4–163, 5–174, 6–214, 7–220. బౌలింగ్: రాజ్ లింబాని 9–0–60–3, నమన్ తివారి 8–0–52–1, అభిõÙక్ మురుగన్ 4–0–14–0, అర్షిన్ 2–0–10–0, సౌమీ పాండే 10–0–38–1, ముషీర్ 10–1–43–2, ప్రియాన్షు 7–1–25–0. భారత్ ఇన్నింగ్స్: ఆదర్శ్ (సి) ప్రిటోరియస్ (బి) మఫక 0; అర్షిన్ (సి) జేమ్స్ (బి) ట్రిస్టన్ 12; ముషీర్ (సి) జేమ్స్ (బి) ట్రిస్టన్ 4; ఉదయ్ (రనౌట్) 81; ప్రియాన్షు (సి) ప్రిటోరియస్ (బి) ట్రిస్టన్ 5; సచిన్ (సి) టీగెర్ (బి) మఫక 96; అవనీశ్ (సి) నార్టన్ (బి) మఫక 10; అభిషేక్ (రనౌట్) 0; రాజ్ (నాటౌట్) 13; నమన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 27; మొత్తం (48.5 ఓవర్లలో 8 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–0, 2–8, 3–25, 4–32, 5–203, 6–226, 7–227, 8–244. బౌలింగ్: మఫక 10–0–32–3, ట్రిస్టన్ 10–1–37–3, నార్టన్ 9–0–53–0, మొకినా 7.5–0–45–0, స్టోల్క్ 2–0–18–0, జేమ్స్ 8–0–44–0, వైట్హెడ్ 2–0–17–0. -
యువ భారత్ సంచలన విజయం.. వరల్డ్కప్ ఫైనల్లోకి ప్రవేశం
సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్కప్లో యువ భారత్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సౌతాఫ్రికాతో ఇవాళ (ఫిబ్రవరి 6) జరిగిన తొలి సెమీఫైనల్లో ఉదయ్ సహారన్ సేన సంచలన విజయం సాధించి, ఆతిథ్య జట్టుకు గుండెకోతను మిగిల్చింది. 245 పరుగుల లక్ష్య ఛేదనలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్ను సచిన్ దాస్ (95), కెప్టెన్ ఉదయ్ సహారన్ (81) చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడి గెలిపించారు. వీరు ఐదో వికెట్కు 171 పరుగులు జోడించి సౌతాఫ్రికా చేతల నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (76), రిచర్డ్ సెలెట్స్వేన్ (64) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఆఖర్లో ట్రిస్టన్ లూస్ (23 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడగా.. కెప్టెన్ జుయాన్ జేమ్స్ (24) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలరల్లో రాజ్ లింబాని 3, ముషీర్ ఖాన్ 2, నమన్ తివారి, సౌమీ పాండే తలో వికెట్ పడగొట్టారు. 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్కు తొలి బంతికే షాక్ తగిలింది. సౌతాఫ్రికా సంచలన పేసర్ మపాకా ఆదర్శ్ సింగ్ను తొలి బంతికే ఔట్ చేశాడు. ఆతర్వాత నాలుగో ఓవర్లో టీమిండియాకు అతి భారీ షాక్ తగిలింది. భీకర ఫామ్లో ఉన్న ముషీర్ ఖాన్ను (4) ట్రిస్టన్ లూస్ పెవిలియన్కు పంపాడు. ఆతర్వాత భారత్ 10, 12 ఓవర్లలో అర్షిన్ కులకర్ణి (12), ప్రియాన్షు మోలియా (5) వికెట్లు కోల్పోయింది. ట్రిస్టన్ లూసే వీరిద్దరి వికెట్లు పడగొట్టాడు. ఈ దశలో జతకట్టిన ఉదయ్ సహారన్, సచిన్ దాస్ జోడీ సౌతాఫ్రికా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని వారి నుంచి మ్యాచ్ లాగేసుకుంది. చివర్లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి కాస్త ఒత్తిడికి లోనైనప్పటికీ.. రాజ్ లింబానీ (13 నాటౌట్) బౌండరీ బాది టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్లోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 8న జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. -
వరుస సెంచరీలతో దూసుకుపోతున్న విలియమ్సన్.. పలు రికార్డులు బద్దలు
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్లో టాప్ రికార్డులన్నీ బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన కేన్.. తాజాగా మరిన్ని రికార్డులు నమోదు చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు (118, 109) చేసిన కేన్.. ఈ ఘనత (ట్విన్ సెంచరీలు) సాధించిన ఐదో న్యూజిలాండ్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. సెకెండ్ ఇన్నింగ్స్ సెంచరీతో టెస్ట్ సెంచరీల సంఖ్యను 31కి పెంచుకున్న కేన్.. అత్యధిక సెంచరీలు (అన్ని ఫార్మాట్లలో కలిపి 44 సెంచరీలు) చేసిన యాక్టివ్ ప్లేయర్స్ జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (80 సెంచరీలు) టాప్లో ఉండగా.. డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు), జో రూట్ (46), రోహిత్ శర్మ (46), స్టీవ్ స్మిత్ (44) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. కేన్ (44).. స్మిత్తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. తాజా సెంచరీతో కేన్ మరో రికార్డు కూడా సాధించాడు. టెస్ట్ల్లో అత్యంత వేగంగా 31 సెంచరీలు (170 ఇన్నింగ్స్ల్లో) పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో (165 ఇన్నింగ్స్ల్లో) ఉండగా.. స్టీవ్ స్మిత్, విలియమ్సన్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని ఆక్రమించాడు. కేన్ గత 10 ఇన్నింగ్స్ల్లో స్కోర్లు ఇలా ఉన్నాయి. 132, 1, 121*, 215, 104, 11, 13, 11, 118, 109. ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ప్రస్తుతం టెస్ట్ల్లో నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. కాగా, మౌంట్ మాంగనూయ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్లో న్యూజిలాండ్ గెలుపు దిశగా పయనిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 528 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మహా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో ప్రత్యర్ధి సౌతాఫ్రికా గెలవలేదు. కేన్ ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి న్యూజిలాండ్ గెలుపుకు పునాది వేయగా.. యువ ఆటగాడు రచిన్ రవీంద్ర తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (240) చేసి తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 511 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే కుప్పకూలింది. భారీ లీడ్తో సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న కివీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. -
అరంగేట్రంతోనే అదరగొట్టాడు!
దక్షిణాఫ్రికా తాత్కాలిక సారథి నీల్ బ్రాండ్ తన అంతర్జాతీయ అగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో సీనియర్ ఆటగాళ్ల గైర్హజరీలో సౌతాఫ్రికా జట్టును నీల్ బ్రాండ్ ముందుండి నడిపిస్తున్నాడు. దేశీవాళీ క్రికెట్లో అద్బుత ప్రదర్శన కనబరిచిన బ్రాండ్కు.. తన అరంగేట్ర సిరీస్లోనే సఫారీ జట్టు పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు. ఈ క్రమంలో మౌంట్ మాంగనుయ్ వేదికగా కివీస్తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో బ్రాండ్ 6 వికెట్లతో సత్తాచాటాడు. రచిన్ రవీంద్ర, డార్లీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వంటి కీలక వికెట్లను బ్రాండ్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో కివీస్ 511 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. 258/2 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన బ్లాక్ క్యాప్స్ అదనంగా 253 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ను ముగించింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(240) అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(118) సెంచరీతో సత్తాచాటాడు. -
రచిన్ రవీంద్ర విధ్వంసం.. ఏకంగా డబుల్ సెంచరీతో
మౌంట్ మాంగనుయ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర దుమ్మురేపుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. 340 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్తో డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కాగా రవీంద్ర తన తొలి సెంచరీనే ద్విశతకంగా మార్చాడు. ప్రస్తుతం రవీంద్ర 222 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 135 ఓవర్లు ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్లో కివీస్ 5 వికెట్ల నష్టానికి 437 పరుగలు చేసింది. క్రీజులో రవీంద్రతో పాటు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. అదే విధంగా మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కేన్ మామ(118) పరుగులు చేశాడు. కాగా గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్లోనూ రచిన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. What an incredible moment! After over 8 hours at the wicket, Rachin Ravindra has passed 200 runs - a historic double hundred 🔥👏@BLACKCAPS v South Africa: 1st Test | LIVE on DUKE and TVNZ+ pic.twitter.com/00Xlbjoirl — TVNZ+ (@TVNZ) February 5, 2024 -
సెంచరీలతో చెలరేగిన రవీంద్ర, కేన్ విలియమ్సన్.. తొలి రోజు కివీస్దే
మౌంట్ మౌన్గనూయ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆటలో న్యూజిలాండ్ అధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ మొదటి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీలతో చెలరేగారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే డేవాన్ కాన్వే(1), టామ్ లాథమ్(20) వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్కు అజేయంగా 221 పరుగులు జోడించారు. రవీంద్ర(118), కేన్ విలియమ్సన్(112) పరుగులతో క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డేన్ ప్యాటర్సన్, మోరెకి తలా వికెట్ సాధించారు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ కారణంగా ఈ సిరీస్కు ప్రోటీస్ సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. చదవండి: IND vs ENG: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. ప్రిన్స్ ఈజ్ బ్యాక్! సెంచరీతో చెలరేగిన శుబ్మన్ గిల్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
టీవీ రిమోట్ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..
‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
హాలీవుడ్ తెరపై ఓ సాహస యాత్ర
‘కాంగ్రెస్ గూండాల దాడి.. ఇదా రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం?’
గుర్తు పెట్టుకోలేనన్ని హామీలిచ్చి.. ఇప్పుడు గుర్తుకు రావడం లేదంటే ఎలా సార్! గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదంటారా!!
ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..
రాజమాత మాధవి రాజే సింధియా కన్నుమూత
లక్నోపై ఢిల్లీ గెలుపు.. ప్లే ఆఫ్స్లో రాజస్తాన్
మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..
తప్పక చదవండి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
Advertisement