south telangana
-
దక్షిణ తెలంగాణపై ఫోకస్.. బీజేపీ వ్యూహం ఏంటి?
తెలంగాణ కమలం పార్టీ గత ఎన్నికల్లో గెలిచింది హైదరాబాద్లోని గోషామహల్ సీటు ఒక్కటే. తాజా ఎన్నికల్లో 8 స్థానాల్లో పాగా వేసింది. ఉత్తర తెలంగాణలోనే 7 సీట్లు గెలిచింది. దక్షిణ తెలంగాణలో ఒక్కటి కూడా దక్కలేదు. మరి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పట్టు పెంచుకోవడానికి కాషాయ సేన ఏంచేయబోతోంది? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని గోషామహల్ నియోజకవర్గం ఒక్కటే బీజేపీ ఖాతాలో పడింది. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్ సీట్లు కూడా కాషాయ పార్టీ దక్కించుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రబాద్తో పాటు.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నామని కమలం పార్టీ భావించింది. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. నిర్మల్లో గెలిచిన ఏలేటి మహేశ్వరరెడ్డి మినహా మిగిలినవారంతా కొత్తవారే. మొత్తం మీద అనుకున్నన్ని స్థానాలు రాకపోయినా.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పట్టు తగ్గలేదని కమలం పార్టీ నాయకులు సంతోషంగానే ఉన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 మంది కార్పొరేటర్లను గెలుచుకుని గులాబీ పార్టీని దెబ్బతీశామని భావించిన బీజేపీకి..అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గతంలో గెలిచిన గోషామహల్ ఒక్కటే మిగిలింది. కార్పొరేటర్లను భారీగా గెలిచిన నియోజకవర్గాల్లో కూడా కమలం పార్టీ జెండా ఎగరేయలేకపోయింది. సికింద్రాబాద్ ఎంపీ సీటు గెలిచిన చోట కూడా అసెంబ్లీ సీట్లు దక్కలేదు. ఇక మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో కూడా బీజేపీకి ఊహించనంత ఎదురుదెబ్బ తగిలింది. మరో ఐదు నెలల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే వెంటనే దక్షిణ తెలంగాణ జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్ మీద గట్టిగా దృష్టి పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నలుగురు ఎంపీలు బీజేపీకి ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నాలుగుతో పాటుగా.. కనీసం మరో నాలుగైనా గెలుచుకోవాలని కమలం పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్న ఎంపీ సీట్లు కాపాడుకుంటూ.. హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పాగా వేయాలని కమలనాథులు ప్లాన్ వేస్తున్నారు. -
గోదావరి వరదకు అడ్డుకట్ట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయిని అయిన గోదావరి జలాలతో రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరందించే బృహత్తర ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. గోదావరిలో రాష్ట్రానికి ఉన్న నికర జలాల కేటాయింపులకు అనుగుణంగా ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగిరం చేసిన ప్రభుత్వం ఇక తన దృష్టంతా గోదావరి వరద జలాలపై పెట్టింది. ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలకు అడ్డుకట్ట వేసి వాటిని నీటి లోటుతో కొట్టుమిట్టాడుతున్న కరువు ప్రాంతాలైన దక్షిణ తెలంగాణ జిల్లాలకు పారించేలా వ్యూహం రచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనూ సమన్వయం చేసుకుంటూ, ఆ రాష్ట్ర సహకారంతో ఇరు రాష్ట్రాలకు లబ్ధి చేకూరేలా గోదావరి– కృష్ణా నదుల అనుసంధానం చేయాలని భావిస్తోంది. వరదను మళ్లిస్తేనే వరమాల... రాష్ట్రంలో ఇప్పటికే నిర్మితమవుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కొత్తవాటిని నిర్మించి.. మొత్తంగా 1.25 కోట్ల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా గోదావరి, కృష్ణా జలాల్లో లభ్యతగా ఉన్న నీటిలో గరిష్టం ఆయకట్టుకు మళ్లించే యత్నాలు చేస్తోంది. నిజానికి గోదావరిలో ఉమ్మడి రాష్ట్రానికి 1,486 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, ఇందులో తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉంది. అయితే ఇందులో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన శ్రీరాంసాగర్, సింగూ రు, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టుల కింద ఏటా వినియోగం సరాసరిన 470 టీఎంసీల మేర ఉంది. మరింత వాటా నీటిని వినియోగంలోకి తెచ్చేలా కాళేశ్వరం (180 టీఎంసీ), దేవాదుల (60), తుపాకులగూడెం (100), సీతారామ (60) వంటి ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. ఇవన్నీ వస్తే మరో 520 టీఎంసీల మేర నీరు వినియోగంలోకి రానుం ది. ఇందులో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది నుంచే కనిష్టంగా 120 నుంచి 150 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. నికర జలాల వినియోగం పోనూ గోదావరి నుంచి ప్రతిఏటా గరిష్టంగా 6వేల టీఎంసీలు, కనిష్టంగా 1,500 టీఎంసీల మేర నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఇందు లో గరిష్టంగా ఇంద్రావతిలోనూ 800 టీఎంసీలు, శబరిలో 550 టీఎంసీలు, ప్రాణహితలో 600 టీఎంసీల మేర నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోంది. వీటి లో గరిష్టంగా వెయ్యి టీఎంసీల నీటిని వినియోగంలోకి తెచ్చినా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సస్యశ్యామలం అవుతాయని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. గోదావరిలో వృథాగా పోతున్న జలాలను కృష్ణా బేసిన్లో నీటి లోటు ఉన్న నల్లగొండ, పాలమూరు జిల్లా లతో పాటు ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలించవచ్చని ఆయన చెబుతున్నారు. నిజానికి కృష్ణా బేసిన్లో ఇరు రాష్ట్రాలకు కలిపి 811 టీఎంసీలు ఉండగా ఇందులో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ప్రతి ఏటా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు లేకపోవడంతో ఇరు రాష్ట్రాలకు సమస్యలు ఎదురవుతున్నాయి. కృష్ణా బేసిన్లో తెలంగాణలో 90 లక్షల ఎకరాల సాగు చేయగల ఆయకట్టు ఉన్నా, ప్రస్తుతం కేవలం 15 లక్షల ఎకరాలకు మించి సాగవడం లేదు. ఈ నేపథ్యంలోనే గోదావరి వరద నీటిని కృష్ణా బేసిన్ ఆయకట్టుకు మళ్లించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. శ్రీశైలం, సాగర్కు గోదావరి జలాలు సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి కృష్ణా బేసిన్కు తరలించి అక్కడ నీటి కటకటతో కొట్టుమిట్టాడుతున్న ఆయకట్టుకు నీరివ్వాలన్నది సీఎం లక్ష్యం పెట్టుకున్నారు. దీని కోసం గోదావరి నీటిని నాగార్జునసాగర్కు తరలించే అంశంపై ఆయన ఫోకస్ పెట్టారు. ఆదివారం ఇరిగేషన్శాఖ ఇంజనీర్ల భేటీలోనూ ఇదే అంశంపై ఎక్కువ సేపు చర్చించారు. దుమ్ముగూడెం టెయిల్పాండ్, ఇంద్రావతి దిగువన ఉన్న తుపాకులగూడెం నుంచి లేక మరేదైనా పాయింట్ నుంచి సాగర్కు నీటిని తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. దీంతో పాటే శ్రీశైలంపై ఆధారపడిన ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కొరత లేకుండా గోదావరి జలాలను ఎలా అనుసంధానించవచ్చనే అంశాలపైనా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. వివిధ బేసిన్ల మధ్య నీటిని బదిలీ చేసి సమతుల్యత సాధించాలని, ఇరు రాష్ట్రాలు సస్యశ్యామలం అయ్యేలా భవిష్యత్ ప్రణాళికలు ఉండాలని మార్గదర్శనం చేశారు. సీఎం సూచించిన అంశాలపై ఈ నెల 28, 29 తేదీల్లో జరుగనున్న తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, అధికారుల స్థాయి భేటీలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. -
దక్షిణంపై టీఆర్ఎస్ ‘గురి’!
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల నాటికి విపక్షాలను నిర్వీర్యం చేసేలా.. దక్షిణ తెలంగాణ ప్రాంతంలోనూ పాగా వేసేలా అధికార టీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది. కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను ఆకర్షించడం ద్వారా విపక్షాల ఆత్మ విశ్వాసంపై దెబ్బకొట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఐదారు నెలలకే మొదలుపెట్టిన ‘ఆకర్ష్’వ్యూహాన్ని మరింత ముమ్మరం చేసేలా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకత్వం బలహీనంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. విపక్షాల్లో కొంచెం పేరున్న నాయకులెవరూ మిగలకుండా చేసి.. ఎన్నికల నాటికి వాటిని నైతికంగా బలహీనం చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. ప్రధాన నేతలంతా టార్గెట్! గత ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ స్థానాలు సాధించడంతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఎక్కువ సంఖ్యలో సీట్లు సాధించాయి. దాంతో ‘ఆకర్ష్’కు తెరతీసిన టీఆర్ఎస్ అధినేత.. పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో అన్ని పార్టీల సీనియర్లను, ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు మరింతగా దూకుడు పెంచారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం పరిధిలో టీఆర్ఎస్ కేవలం ఒక్క కొత్తగూడెం స్థానానికే పరిమితమైంది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఇందుకు పూర్తి భిన్నంగా అత్యధిక స్థానాలు సాధించాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్రావును టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి మంత్రివర్గంలోకీ తీసుకున్నారు. తరువాత కాలంలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ముగ్గురు ఎమ్మెల్యేలను, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఇక రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో ఉప ఎన్నికలు జరిగిన పాలేరు స్థానంలో టీఆర్ఎస్ గెలిచింది. ఉమ్మడి ఖమ్మంలో ప్రస్తుతానికి కాంగ్రెస్, టీడీపీలకు ఒక్కో ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు. ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టే వ్యూహం నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో ఇతర పార్టీల్లో ఉన్న ఎంపీ సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్రావు, రవీంద్రనాయక్తో పాటు జెడ్పీ చైర్మన్ బాలునాయక్ వంటి వారంతా టీఆర్ఎస్లో చేరారు. వీరితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో బలమైన ద్వితీయ శ్రేణి నాయకులను గులాబీ పార్టీలోకి చేర్చుకున్నారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వంటి సీనియర్లు మాత్రమే మిగిలారు. ఇక మహబూబ్నగర్ జిల్లాలోనూ టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి తీసుకున్నారు. ఇక్కడ మహబూబ్నగర్లో డీకే అరుణ, చిన్నారెడ్డి, సంపత్కుమార్, వంశీచంద్రెడ్డి తదితర నేతలే కాంగ్రెస్కు మిగిలారు. ఈ రెండు జిల్లాల్లోనూ కాంగ్రెస్ నేతలను దెబ్బకొట్టడానికి వారి నియోజకవర్గాల్లో బలంగా ఉన్న ఇతర సీనియర్లను, ద్వితీయ శ్రేణి నేతలకు గులాబీ కండువా కప్పారు. హైదరాబాద్, రంగారెడ్డిలపై ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో కీలకమైన గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డిలపైనా గులాబీ అధినేత ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్లో టీఆర్ఎస్కు గత ఎన్నికల్లో కేవలం ఒక్కసీటు మాత్రమే వచ్చింది. మిగతా సీట్లను విపక్షాలు దక్కించుకున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో టీఆర్ఎస్కు నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో విపక్షాల నుంచి నేతలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు సీనియర్లు, బలమైన నాయకులు లేరు. దాంతో ఆయా చోట్ల కాంగ్రెస్, టీడీపీల నుంచి బలమైన నేతలను చేర్చుకుంటున్నారు. ఈసారి సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి వ్యూహం పన్నుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో టీడీపీని ఉనికిలో కూడా లేకుండా చేసిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీలోని పలువురు ముఖ్యులను ఇప్పటికే టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. తాజాగా వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్కు బలమైన నాయకులు, కేడర్ ఉన్న నేతలు లేకుండా చేసేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. -
కొత్త నినాదం.. ‘జై దక్షిణ తెలంగాణ’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రంగారెడ్డి జెడ్పీ సమావేశంలో శనివారం కొత్త నినాదం పుట్టుకొచ్చింది. దక్షిణ తెలంగాణ జిల్లాల పట్ల ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష పాటిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు ‘జై దక్షిణ తెలంగాణ’ అని నినదించడం చర్చనీయాంశమైంది. ప్రాజెక్టుల అమలులో ద క్షిణ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని, సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ కోసం.. రంగారెడ్డి జిల్లా ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని నినాదాలు చేశారు. -
'30వ రాష్ట్రంగా దక్షిణ తెలంగాణ'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్లో ఉత్తర తెలంగాణ ప్రాంతానికే అధిక ప్రాధాన్యమిచ్చారని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. దక్షిణ తెలంగాణకు అన్యాయం చేశారని విమర్శించారు. శనివారం హైదరాబాద్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. దక్షిణ తెలంగాణ మంత్రులను తన కేబినెట్లోకి తీసుకోకుండా కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తెలంగాణలో ఓ ప్రాంతానికి అధిక ప్రాధాన్యమిచ్చి మరో ప్రాంతంపై నిర్లక్ష్యం ప్రదర్శించడం సబబు కాదని కేసీఆర్కు రేవంత్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దక్షిణ తెలంగాణ 30వ రాష్ట్రంగా ఏర్పడుతుందేమోనని సందేహం వ్యక్తం చేశారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
కేసీఆర్కు ఆ 'దక్షిణం' దక్కేనా..?