!['30వ రాష్ట్రంగా దక్షిణ తెలంగాణ' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81402434867_625x300_0.jpg.webp?itok=vpFH6CoV)
'30వ రాష్ట్రంగా దక్షిణ తెలంగాణ'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్లో ఉత్తర తెలంగాణ ప్రాంతానికే అధిక ప్రాధాన్యమిచ్చారని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. దక్షిణ తెలంగాణకు అన్యాయం చేశారని విమర్శించారు. శనివారం హైదరాబాద్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. దక్షిణ తెలంగాణ మంత్రులను తన కేబినెట్లోకి తీసుకోకుండా కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు.
తెలంగాణలో ఓ ప్రాంతానికి అధిక ప్రాధాన్యమిచ్చి మరో ప్రాంతంపై నిర్లక్ష్యం ప్రదర్శించడం సబబు కాదని కేసీఆర్కు రేవంత్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దక్షిణ తెలంగాణ 30వ రాష్ట్రంగా ఏర్పడుతుందేమోనని సందేహం వ్యక్తం చేశారు.