spl poojas
-
అంబరాన్నంటిన పాండురంగడి రథోత్సవం
ఈడేపల్లి : పాండురంగస్వామి రధోత్సవ ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగుతోంది. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఊరేగింపు శనివారం ఉదయం వరకు పట్టణంలోని పురవీధుల్లో తిరుగుతొంది. స్వామి వారికి పెద్దఎత్తున మహిళలు ప్రత్యేక పూజలను చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, కౌన్సిలర్లు పల్లపాటి సుబ్రమణ్యం, కొట్టె వెంకట్రావు తదితరులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో జబర్దస్త్ బృందం
ఇంద్రకీలాద్రి: సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్... శనివారం దుర్గగుడికి వచ్చారు. జబర్దస్త్ టీం సభ్యులైన వీరంతా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయించున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య ప్రసాదాలను అందచేశారు. దర్శనానంతరం రాజగోపురం వద్దకు చేరుకున్న నటులతో పలువురు భక్తులు సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు.