standing committee elections
-
నేడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక
-
కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలు: అంబటి
సాక్షి, గుంటూరు: కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారారని.. కూటమి బలం ప్రకారం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేయకూడదన్నారు. ఎమ్మెల్యేలు సిగ్గు విడిచి కార్పొరేటర్లు ఇళ్లకి వెళ్లి ప్రలోభాలకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో కార్పొరేటర్కి యాభై లక్షలు ఇస్తామంటున్నారు. కార్పొరేటర్లను కొంటున్న విధానాన్ని ప్రజలు గమనించాలి. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని అంబటి మండిపడ్డారు.ప్రజాస్వామ్యానికి టీడీపీ విఘాతం: అప్పిరెడ్డివైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ, కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారని.. లక్షల రూపాయలు కార్పొరేటర్లకు వెదజల్లుతున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గిస్తున్నారు.. మా కార్పొరేటర్లు నిజాయితీగా వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగాలి’’ అని అప్పిరెడ్డి హితవు పలికారు.ప్రజాస్వామ్యానికి టీడీపీ తూట్లు: మనోహర్మేయర్ కావటి మనోహర్ మాట్లాడుతూ, ఆరు స్టాండింగ్ కమిటీ సభ్యులను గెలుచుకునే బలం మాకుంది. కేంద్ర మంత్రి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కూటమి బలం కేవలం పదకొండు సభ్యులు మాత్రమే. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘అనంత’ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా
సాక్షి, అనంతపురం: అనంతపురం మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటింది. ఐదుగురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మునిసిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం కాగా, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఐదు స్టాండింగ్ కమిటీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అనీల్ కుమార్ రెడ్డి, సుజాత, రహంతుల్లా, నాగవినూత, నర్సింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల స్క్రూటినీ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. -
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ (స్థాయీ సంఘం) ఎన్నిక బుధవారం జరిగింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 10 స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 9 నామినేషన్లు వేసి టీడీపీ ఓటమి పాలైంది. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీ స్టాండింగ్ కమిటీ అభ్యర్థికి అదనపు ఓట్లు వచ్చాయి. చదవండి: కేంద్రంతో కుస్తీ పడుతున్నాం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు -
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం
-
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం
విశాఖపట్టణం: గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం ముగిసింది. అనంతరం సాయంత్రం వరకు కౌంటింగ్ కొనసాగింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు 10 మంది విజయం సాధించారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలో 67 మంది కార్పొరేటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 57 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మంది ఉండగా, స్వతంత్రులు 4, ముగ్గురు టీడీపీ, బీజేపీ 1, జనసేన 1, సీపీఐ 1 కార్పొరేటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయంపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్ కాంగ్రెస పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా టీడీపీ ఉనికి కాపాడుకోవడానికి పోటీ చేసిందని విమర్శించారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని ఈ ఫలితాలతో రుజువైందన్నారు. పరిపాలన రాజధానికి గ్రేటర్ విశాఖ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. తమకు ఏ పార్టీలు పోటీనే కాదు అని స్పష్టం చేశారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసిన విశాఖ అభివృద్ధిని అడ్డుకోలేరని తెలిపారు. విశాఖలో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని పార్టీ నేతలు విమర్శించారు. గ్రేటర్ విశాఖలో గెలిచి మరోసారి సత్తా చాటామని.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తాము ఘన విజయం సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. -
మేయర్కు చెక్..!
→ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ → డిప్యూటీ మేయర్ వర్గం ఆధిపత్యం → ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ → ప్రశాంతంగా ముగిసిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అనంతపురం న్యూసిటీ : స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేయర్ స్వరూప వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. ఊహించిన విధంగానే మేయర్పై ఉన్న అసమ్మతిని కార్పొరేటర్లు ఓటుతో బుద్ధి చెప్పారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ మేయర్ గంపన్న వర్గం ఎన్నికల్లో ఆధిపత్యం సాధించడంతో ఇక మేయర్కు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది. నగరపాలక సంస్థలోని పింఛన్ గదిలో బుధవారం స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ వర్గం నటేష్ చౌదరి, విజయశ్రీ, లక్ష్మిరెడ్డి, మేయర్ వర్గం నుంచి రాజారావు, రెబెల్ కార్పొరేటర్ ఉమామహేశ్వర్ గెలుపొందారు. సజావుగా ఎన్నికలు : స్టాండింగ్ కమిటీ ఎన్నికలు సజావుగా జరిగాయి. కమిషనర్ చల్లా ఓబులేసు పర్యవేక్షణలోఉదయం 11 నుంచి 1 గంట వరకు ఎన్నికల పోలింగ్ జరిగింది. సాయంత్రం 4 గంటలకు ఓట్లను కమిషనర్ చల్లా ఓబులేసు లెక్కించారు. 50 డివిజన్లకుగానూ 11 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు బహిష్కరించగా, మేయర్, డిప్యూటీ మేయర్, 26వ డివిజన్ కార్పొరేటర్ ఆదినారాయణ ఎన్నికలకు గైర్హాజరయ్యారు. దీంతో మొత్తం 36 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో నటేష్ చౌదరికి 20, రాజారావుకు 20, విజయశ్రీ 19, లక్ష్మిరెడ్డి 19, ఉమామహేశ్వర్కు 18 ఓట్లతో మొదటి ఐదు స్థానాల్లో నిలిచి గెలుపొందారు. ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు గంగన హిమబిందు, గిరిజమ్మ, చింతకుంట సుశీలమ్మ, బోయ సరోజమ్మ, వెంకట్రమణమ్మ, బోయ పక్కీరమ్మ, జానకి, బాలాంజినేయులు, షుకూర్, గూడూరు మల్లికార్జున, సాకే పోతులయ్య స్టాండింగ్ కమిటీ ఎన్నికలను బíß ష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగన హిమబిందు, బోయగిరిజమ్మ, జానకి, షుకూర్ మాట్లాడుతూ పాలకవర్గం ప్రజల కనీస అవసరాలైన మంచినీరు, పారిశుద్ధ్యం, మురికి వాడల్లో నివసిస్తున్న పేద ప్రజల పింఛన్ అందించడంలో పాలకులు ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. పాలకవర్గంలో అవినీతి చోటు చేసుకోయిందని సాక్షాత్తు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్పారని గుర్తు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్టాండింగ్ కమిటీను ఎన్నుకుంటున్నారని ఆరోపించారు. అవినీతిని ప్రోత్సహించకూడదనే ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు. అనంతరం కమిషనర్ చల్లా ఓబులేసుకు వినతిపత్రం అందించి వెళ్లిపోయారు. మేయర్కు చెక్ : మేయర్ స్వరూపకు చెక్ పెట్టేందుకే ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ వర్గానికి కార్పొరేటర్లు ఓట్లేశారని ఆ పార్టీకు చెందిన నేతలే అంటున్నారు. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇష్టానుసారంగా అభివద్ధి పనులు చేపట్టారని, పలు డివిజన్లను విస్మరించడం కారణంగానే మేయర్కు వ్యతిరేకంగా ఓటేశారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి మేయర్ దూకుడుకు కళ్లెం వేయాలనే ఎన్నికల్లో ప్రే„ý కపాత్ర పోషించారన్న వాదనా ఉంది. నగరాభివద్ధికి కషి – స్టాండింగ్ కమిటీ సభ్యులు నగరాభివద్ధి కోసం కషి చేస్తామంటూ స్టాండింగ్ కమిటీ సభ్యులు లక్ష్మిరెడ్డి, విజయశ్రీ, ఉమామహేశ్వర్ తెలిపారు. సమస్యలపై పోరాడే వారినే కార్పొరేటర్లు గెలిపించారని, అందుకు కతజ్ఞతలు తెలిపారు.